జెట్‌ ఎయిర్‌వేస్‌ టికెట్లపై 30% డిస్కౌంట్‌

Jet Airways offers discounts on 25 lakh seats in new sale - Sakshi

ముంబై: నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రైవేట్‌ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ తాజాగా విమాన టికెట్ల చార్జీలపై 30 శాతం మేర డిస్కౌంటు ప్రకటించింది. దేశీ, విదేశీ రూట్లలో 25 లక్షల సీట్లను ఈ ఆఫర్‌లో భాగంగా విక్రయిస్తోంది. మంగళవారం ప్రారంభమైన బుకింగ్స్‌ ఆరు రోజుల పాటు సాగుతాయని సంస్థ తెలిపింది.

అన్ని మాధ్యమాల ద్వారా సెప్టెంబర్‌ 7 దాకా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని, ఆ తర్వాత కంపెనీ వెబ్‌సైట్, మొబైల్స్‌ ద్వారా సెప్టెంబర్‌ 9 దాకా కొనుగోలు చేయొచ్చని వివరించింది. సెప్టెంబర్‌ 10 నుంచి చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. దేశీ రూట్లతో పాటు యూరప్, గల్ఫ్, దక్షిణాసియా దేశాల్లోని ప్రాంతాలకు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని జెట్‌ ఎయిర్‌వేస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌ శివకుమార్‌ తెలిపారు.   ఇండిగో, ఎయిర్‌ఏషియా మొదలైనవి ఇప్పటికే డిస్కౌంట్లు ప్రకటించడం తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top