7.4 శాతం వృద్ధిని సాధిస్తాం | India GDP to grow at 7.4 per cent says RBI Governor Shaktikanta Das | Sakshi
Sakshi News home page

7.4 శాతం వృద్ధిని సాధిస్తాం

Apr 17 2020 12:08 PM | Updated on Apr 17 2020 12:40 PM

India GDP to grow at 7.4 per cent  says RBI Governor Shaktikanta Das - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారి విస్తరణ ,  కట్టడికి లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడారు.  కరోనా కారణంగా ప్రపంచ మార్కెట్లన్నీ  సంక్షోభంలోకి జారుకుంటున్నాయి.  దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోన్న నేపథ్యంలో  ఆయన  కీలక విషయాలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై సమీక్షిస్తూ చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన ఆయన భారత్‌ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసిందన్నారు. అంతేకాదు  కరోనా సంక్షోభం ఉంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందని చెప్పారు.  2021-22 నాటికి  భారత్ 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. జీ-20 దేశాల్లో మెరుగ్గా ఉన్నాం. జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చాం. భారత్ 1.9 శాతం సానుకూల వృద్ధిని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  ఆర్థిక వ్యవస్థ మెరుగుపర్చడానికి ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. భారత్‌లో ఏప్రిల్ నెలలో ఆహార ధరలు ఏకంగా 2.4శాతం పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ఫిబ్రవరి 6 నుండి మార్చి 27 వరకు జిడిపిలో లిక్విడిటీ ఇంజెక్షన్ 3.2 శాతంగా ఉందన్నారు. (రివర్స్ రెపో రేటు పావు శాతం కోత)

ఇతర చర్యలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఆర్‌బీఐ లక్షలాది దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ (టిఎల్‌టిఆర్‌ఓ) ద్వారా అదనంగా రూ .50 వేల కోట్లు ఇస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా, నాబార్డ్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సిడ్బీ వంటి ఆర్థిక సంస్థలకు రూ .50 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని  ప్రకటించారు. తక్షణమే వీటిని అందించనున్నామన్నారు.  ఆర్బీఐ  చర్యల ఫలితంగా బ్యాంకింగ్ వ్యవస్థలో మిగులు ద్రవ్యత గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నుండి అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని ఆర్‌బీఐ పర్యవేక్షిస్తోందని పేర్కొన్న ఆయన, మార్చిలో ఎగుమతుల సంకోచం 34.6 శాతంగా ఉందని, 2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే చాలా తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మార్చిలో ఆటోమొబైల్ ఉత్పత్తి, అమ్మకాలు బాగా తగ్గాయని, విద్యుత్ డిమాండ్ బాగా పడిపోయిందని  శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఉటంకించారు. మరణం మధ్యలో జీవితం కొనసాగుతోంది. సత్యాసత్యాల మధ్యలో  మన మనుగడ  కొనసాగుతోంది. చీకటిని చీల్చుతూ వెలుగు రేఖ వస్తుందంటూ గాంధీజీ మాటలను గుర్తు చేసుకోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement