స్టాక్‌మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు | Huge Volataliry in Stockmarket Plunges Over 450 Points | Sakshi
Sakshi News home page

స్టాక్‌మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు

Mar 27 2019 2:24 PM | Updated on Mar 27 2019 2:24 PM

Huge Volataliry in Stockmarket Plunges Over 450 Points  - Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ మిడ్‌ సెషన్‌లో డే హై నుంచి దాదాపు 475 పాయింట్లు పతనమైంది. మళ్లీ అంతలోనే   భారీ నష్టాలనుంచి తేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 152 పాయింట్లునష్‌టపోయి 38,098 వద్ద,  నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 11449 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 38వేలకు ఎగువన, నిఫ్టీ 11500 స్థాయికి దిగువన ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ బ్యాంకు కూడా నష్టాల్లోకి జారుకుంది. వెంటనే తేరుకుని 30వేలఎగువన కొనసాగుతోంది. 

డెరివేటివ్‌ కౌంటర్‌ రేపటితో ముగియ నున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అమ్మకాలతో దాదాపు అన్ని సెక్టార్లు నెగిటివ్‌ జోన్‌లోకి  మళ్లి పోయాయి.  హెల్త్‌కేర్‌, ఎనర్జీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ , పవర్‌ ఇలా అన్నిసెక్టార్ల  షేర్లు నష్టపోతున్నాయి.  ముఖ్యంగా రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ భారీగా నష్టపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement