జీఎస్‌టీ రిటర్నుల ఫైలింగ్‌ గడువు పెంపు 

GST increases deadline for returns - Sakshi

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టాలకు సంబంధించి అక్టోబర్‌ – డిసెంబర్‌ కాలానికి టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత) రిటర్న్స్‌ ఫైలింగ్‌కు గడువును కేంద్రం పెంచింది. 2019 జనవరి 31 వరకూ రిటర్న్స్‌ దాఖలు చేసుకోవచ్చని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

జీఎస్‌టీ కింద టీడీఎస్‌ ప్రొవిజన్స్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చాయి. సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) చట్టం ప్రకారం..రూ.2.5 లక్షలు దాటిన వస్తువులు, సేవల సరఫరాదారులకు చేసే చెల్లింపులపై నోటిఫైడ్‌ సంస్థలు 1% టీడీఎస్‌ను వసూ లు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర చట్టాల (ఎస్‌జీఎస్‌టీ) కింద మరో 1% పన్నునూ విధించాలి.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top