breaking news
returns
-
ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో
జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం 787-8 డ్రీమ్లైనర్ బోయింగ్ తీవ్ర విషాదాన్ని నింపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ ప్రాంతంలో కూలిపోవడంతో భోజనం తింటున్న విద్యార్థులు నలుగురు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ వార్త తెలియగానే, అహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ మానవత్వాన్ని చాటుకున్న వైనం నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటోంది. ఆయన ప్రదర్శించిన చొరవ, నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంటోందిఅహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ (56) విమానం కూలిపోయిన సమయంలో భారీ పేలుడు శబ్దాన్ని విని ఉలిక్కి పడ్డారు. అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. హా హా కారాలు వినపడుతున్నాయి. ఇది విన్న నరాజు పటేల్ వెంటనే స్పందించారు. తన వద్ద పనిచేస్తున్న సిబ్బందితో కలిసి ఆయన పరుగున ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ అప్పటికే అదుపు చేయలేని రీతిలో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. ఇంతలో సహాయ దళాలు అక్కడికి చేరుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్దిమందిలో రాజు, దట్టమైన పొగ, పెరుగుతున్న మంటలు, కేకలు, అరుపులు వినిపిస్తున్నా గందర గోళ పడలేదు. స్థానికులు ఇచ్చిన బట్టలు, చాపలను ఉపయోగించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమయం వృథా చేయకుండా, గాయపడ్డవారిని వీలైనంత వేగంగా అంబులెన్స్లలోకి ఎక్కించి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పటేల్ బృందం సేవలను చూసిన రెస్క్యూ అధికారులు, వారిని రాత్రి 9 గంటల వరకు సహాయక చర్యల్లో కొనసాగమని కోరడం గమనార్హం.అంతేకాదు సంఘటనా స్థలం శిథిలాల నుండి రూ. 60 వేల నగదు, 70 తులాల (బంగారం, హారాలు, గాజులు, మంగళసూత్రాలు, ఉంగరాలు, ) బంగారు ఆభరణాలను వెలికితీశారు. ఇంకా విదేశీ కరెన్సీ, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఐడి కార్డులు, వెండి వస్తువులను సేకరించి వాటిని జాగ్రత్తగా, నిజాయితీగా పోలీసులకు తిరిగి ఇచ్చారు.‘‘మొదటి 15 నుండి 20 నిమిషాల వరకు, తొందరగా దగ్గరికి చేరుకోలేకపోయాము. మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి, కానీ మొదటి అగ్నిమాపక దళం , 108 అంబులెన్స్లు వచ్చిన తర్వాత,సహాయం చేయడానికి ముందుకు సాగాం’’ అన్నారు రాజు. సమయానికి స్పందించడంతో పాటు, ఎంతో ధైర్య సాహసాన్ని ప్రదర్శించి ఆయన చేసిన సేవలతో పాటు తాను సేకరించిన వస్తువులను ఎంతో నిజాయితీగా అధికారులకు అప్పగించడం నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది.మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమైన రాజు పటేల్, బృందానికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఆపద సమయాల్లో ఆదుకున్నవాడే మానవుడు మహనీయుడు అని పేర్కొంటున్నారు. -
చెన్నై ఓపెన్ పునరాగమనం
చెన్నై: తమిళనాడు టెన్నిస్ అసోసియేషన్ (టీఎన్టీఏ) అధ్యక్షుడు, భారత మేటి ప్లేయర్ విజయ్ అమృత్రాజ్ కృషి ఫలించింది. మూడేళ్ల తర్వాత చెన్నై ఓపెన్ భారత టెన్నిస్లో పునరాగమనం చేయనుంది. ఈ అక్టోబర్లో టోర్నీ నిర్వహణకు మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఆమోదం తెలిపింది. అక్టోబర్ 27 నుంచి మెయిన్ డ్రా పోటీలు జరుగుతాయని టీఎన్టీఏ అధ్యక్షుడు విజయ్ అమృత్రాజ్ తెలిపారు. ‘మొత్తానికి మా ప్రయత్నాలు ఫలించాయి. చెన్నైలో మేటి అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీకి మార్గం సుగమమైంది. ఈ టోర్నీని తిరిగి నగరంలో నిర్వహించాలనే మా ప్రయత్నాలకు మొదటి నుంచి వెన్నంటే ఉండి సహకరించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి, తమిళనాడు స్పోర్ట్స్ అథారిటీకి కృతజ్ఞతలు’ అని విజయ్ అన్నారు. ప్రముఖ స్పోర్ట్స్ చానెల్ నెట్వర్క్ ఈ టోర్నీ మ్యాచ్లను ప్రసారం చేస్తుందన్నారు. చెన్నై అభిమానులు, భారత టెన్నిస్ ప్రియులు ఈ ఈవెంట్ను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. చివరి సారిగా చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టోర్నమెంట్ను 2022లో నిర్వహించారు. చెక్ రిపబ్లిక్ ప్లేయర్ లిండా ఫ్రువిత్రొవా సింగిల్స్ చాంపియన్గా నిలిచింది. -
రూ.3959 కోట్లు ఇన్వెస్ట్మెంట్.. రూ.36855 కోట్ల రాబడి
న్యూఢిల్లీ: నౌకరీ.కామ్ మాతృ సంస్థ ఇన్ఫో ఎడ్జ్ కొన్నేళ్లుగా స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రధానంగా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో, పీబీ ఫిన్టెక్ (పాలసీబజార్)లో పెట్టుబడులు భారీ రాబడి అందించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ సంజీవ్ బిక్చందానీ తాజాగా పేర్కొన్నారు.గతేడాది (2024–25) ఫలితాల విడుదల సందర్భంగా వాటాదారులకు రాసిన లేఖలో ఈ అంశాలను వివరించారు. 2007లో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లకు తెరతీసినట్లు తెలియజేశారు.వివిధ ప్లాట్ఫామ్లపై గత 15 ఏళ్ల కాలంలో రూ. 3,959 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలియజేశారు. ప్రస్తుతం వీటి అసలు విలువ దాదాపు 10 రెట్లు ఎగసి రూ. 36,855 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ప్రధానంగా జొమాటోలో రూ. 484 కోట్లు, పాలసీబజార్లో రూ. 591 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
నెలకు ₹5000 ఆదాతో రూ.8 లక్షలు చేతికి
ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత ఆదా చేయాలని చూస్తారు. అయితే డబ్బు సురక్షితంగా ఉంటాలంటే?, మంచి రాబడి పొందాలంటే?.. తప్పకుండా పోస్టాఫీస్ పథకాలలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇందులో ఒకటి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్'. ఈ స్కీమ్ ద్వారా ఎంత వడ్డీ వస్తుంది. ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు నెలకు 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 8 లక్షల రిటర్న్స్ పొందవచ్చు. ఎలా అంటే.. మీరు నెలకు రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే.. ఏడాదికి రూ. 60వేలు అవుతుంది. మీకు ఈ స్కీములో 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఇలా ఐదేళ్లు ఇన్వెస్ట్ చేస్తుంటే.. మీ మొత్తం రూ. 3లక్షలు అవుతుంది. దీనికి వడ్డీ కింద రూ. 56,830 లభిస్తాయి.మీరు ఈ స్కీమ్ కింద రూ. 5000.. పదేళ్లు ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి రూ.6 లక్షలు అవుతుంది. ఈ డిపాజిట్పై 6.7 శాతం వడ్డీ మొత్తం రూ. 2,54,272 అవుతుంది. దీని ప్రకారం 10 సంవత్సరాల కాలంలో మీ మొత్తం డిపాజిట్ చేసిన మొత్తం రూ. 8,54,272 అవుతుంది. ఇలా పదేళ్లలో రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తూ రూ. 8లక్షల కంటే ఎక్కువ పొందువచ్చు.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్గత సంవత్సరం 2023లో.. ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్పై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ పెరగడం వల్ల పెట్టుబడిదారులకు లభించే రిటర్న్స్ కూడా ఆశాజనకంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంది, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ వడ్డీ చివరి సవరణ 29 సెప్టెంబర్ 2023న జరిగింది.50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చుమీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడిని రూ.100 నుంచి ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు, కానీ మీరు ఈ వ్యవధి పూర్తయ్యేలోపు ఖాతాను మూసివేయాలనుకుంటే.. క్లోజ్ చేసుకోవచ్చు. ఇందులో లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ అకౌంట్ ఒక ఏడాది పాటు యాక్టివ్గా ఉన్న తరువాత.. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. దీనిపై వడ్డీ రేటు 2 శాతం కంటే ఎక్కువ. -
స్వల్పకాల పెట్టుబడికి దారేదీ?
ప్రతి వ్యక్తికి స్వల్పకాల, మధ్య కాల, దీర్ఘకాల లక్ష్యాలనేవి ఉంటాయి. వీటి ఆధారంగానే పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. అన్నింటికీ ఒకే అస్త్రం ఫలితాలనివ్వదు. ప్రతి పెట్టుబడిలోనూ రిస్క్ ఉంటుంది. ఇది తమకు ఎంత వరకు ఆమోదమో పరిశీలించిన తర్వాతే వాటిపై నిర్ణయానికి రావాలి. దీర్ఘకాలానికి ఈక్విటీలు అధిక రాబడులు ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మధ్య కాలిక లక్ష్యాలకు, ఈక్విటీ, డెట్తో కలయికతో ఉండే హైబ్రిడ్ ఫండ్స్ మెరుగైనవి. మరి స్వల్పకాల లక్ష్యాల మాటేమిటి? వీటి కోసం రిస్క్ తీసుకోవడం ఎంత మాత్రం సూచనీయం కాదు. స్వల్పకాలంలో రాబడి కంటే పెట్టుబడి రక్షణ కీలకం అవుతుంది. అదే సమయంలో ఎంతో కొంత రాబడి కూడా రావాలి. ఇందుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాలపై అవగాహన కల్పించే కథనం ఇది. స్వల్పకాలం అంటే..? నిజానికి స్వల్పకాలానికి ఇతమిత్థమైన నిర్వచనం లేదు. కొన్ని రోజుల నుంచి నెలల వరకు స్వల్పకాలం కిందకే వస్తుంది. ఏడాది, రెండేళ్లు కూడా స్వల్పకాలం కిందకే వస్తుంది. 3–5 ఏళ్ల కాలాన్ని మధ్యస్థంగా, 10 ఏళ్లు మించితే దీర్ఘకాలంగా పరిగణిస్తుంటారు. ముఖ్యంగా మూడేళ్ల కాలానికి ఈక్విటీలను పరిగణనలోకి తీసుకోకపోవడమే రిస్క్ పరంగా సానుకూలం. ఈక్విటీ పెట్టుబడులకు కనీసం ఐదేళ్లు అయినా ఉండాలన్నది నిపుణుల సూచన. గతంలో మాదిరిగా కాకుండా నేడు ఆర్థిక అస్థిరతలు పెరిగిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం అధికమయ్యాయి. వీటి ప్రభావం ఈక్విటీలపై ఎక్కువగా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలోనే ఈక్విటీల్లో మెరుగైన రాబడులు సాధ్యపడతాయి. మూడేళ్ల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఒకవేళ ఈక్విటీలు బేరిష్ లోకి వెళ్లిపోతే కోలుకునేందుకు ఎంత సమయం అయినా తీసుకోవచ్చు. అందుకుని ఇన్వెస్టర్లు ఈక్విటీలకు బదులు సంప్రదాయ డెట్ సాధనాలను స్వల్ప కాలం కోసం పరిశీలించొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీలు).. తాతల కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్న సాధనం. కానీ, నేడు అధిక రాబడుల కాంక్షతో చాలా మంది స్వల్పకాలానికీ ఈక్విటీల వైపు అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలానికి అధిక రాబడిని ఆశించడం సమంజసమే. అదే సమయంలో స్వల్ప కాల లక్ష్యాలకు తక్కువ రాబడిని ఇచ్చే రిస్క్ లేని ఎఫ్డీలను విస్మరించడం సరికాదు. ఫిక్స్డ్ డిపాజిట్తోపాటు, రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) అందరికీ అర్థమయ్యే సాధనాలు. ముఖ్యంగా ఎఫ్డీలపై రాబడి స్థిరంగా ఉంటుంది. అందుకని స్వల్పకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడి కోసం వీటిని నమ్ముకోవచ్చు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే.. అప్పుడు ఒకటికి మించిన బ్యాంకుల్లో ఎఫ్డీలు వేసుకోవాలి. ఒక బ్యాంక్లో గరిష్టంగా రూ.5 లక్షలు డిపాజిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక బ్యాంక్ సంక్షోభం పాలైతే ఒక డిపాజిట్దారునికి గరిష్టంగా రూ.5 లక్షల వరకే బీమా కింద లభిస్తుంది. స్వీప్ ఇన్ ఎఫ్డీని సైతం పరిశీలించొచ్చు. ఇది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు అనుబంధంగా ఉంటుంది. సేవింగ్స్ ఖాతాలో కనీస బ్యాలన్స్ను మించి నగదు చేరిన తర్వాత నిర్ణీత మొత్తం (రూ.1,000 అంతకుమించి) స్వీప్ ఇన్ డిపాజిట్గా మారుతుంది. సేవింగ్స్ ఖాతాలో బ్యాలన్స్పై వడ్డీ రేటు 3–4 శాతం మించదు. అదే స్వీప్ ఇన్లో అయితే 5–6 శాతం వరకు (డిపాజిట్ ఉంచిన కాలాన్ని బట్టి) లభిస్తుంది. డిపాజిట్ రూపంలోకి మారినా కానీ, అవసరమైనప్పుడు వెంటనే ఆ మొత్తాన్ని ఏటీఎం నుంచి అయినా ఉపసంహరించుకోవచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లను సైతం పరిశీలించొచ్చు. కార్పొరేట్ ఎఫ్డీలు (కంపెనీలు నిధుల కోసం జారీ చేసేవి), ఎన్బీఎఫ్సీ సంస్థల ఎఫ్డీలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వీటిలో డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. అందుకే ఈ డిపాజిట్లలో రాబడి ఎక్కువగా ఉంటుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలను సైతం పరిశీలించొచ్చు. వీటిలో రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ ఆర్బీఐ డిపాజిట్ గ్యారంటీ పథకం పరిధిలోకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు కూడా వస్తాయి. కనుక రూ.5 లక్షల డిపాజిట్ వరకు ఢోకా ఉండదు. ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రూ.5 లక్షలు మించకుండా డిపాజిట్ చేసుకోవచ్చు. పెట్టుబడి ఉద్దేశం? పెట్టుబడిని కాపాడుకోవం, అదే సమయంలో కొంత రాబడిని సమకూర్చుకోవడం స్వల్పకాల పెట్టుబడుల ఉద్దేశంగా ఉండాలి. స్వల్పకాల పెట్టుబడుల కోసం అధిక రాబడులను ఇచ్చే విభాగాలను అస్సలు పరిగణనలోకి తీసుకోకూడదు. అధిక రాబడుల చరిత్ర కలిగిన ఈక్విటీల్లో స్వల్పకాలంలో పెట్టుబడికి సైతం రిస్క్ ఏర్పడుతుంది. దీర్ఘకాలంలోనే అలాంటి సాధనాల్లో రిస్క్ ను అధిగమించి రాబడులు సమకూర్చుకోగలరు. ఎఫ్డీలపై టీడీఎస్.. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడి ఒక ఆర్థి క సంవత్సరంలో రూ.40,000 మించితే (60 ఏళ్లలోపు వారికి), ఆ మొత్తంపై బ్యాంక్లు 10 శాతం టీడీఎస్ మినహాయిస్తాయి. 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000 మించితే అప్పుడు టీడీఎస్ అమలవుతుంది. కానీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు టీడీఎస్ వర్తించదు. టీడీఎస్ వద్దనుకునే వారు ఎఫ్డీలకు బదులు డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎఫ్డీల కంటే ఇతర డెట్ ఫండ్స్లోనే పన్ను అనంతరం రాబడి కాస్తంత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ను గత రాబడుల ఆధారంగా ఎంపిక చేసుకోవడం సరైన విధానం కాదు. తమ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలంగా ఉండే ఫండ్స్ను, అది కూడా వాటి పెట్టుబడుల పోర్ట్ఫోలియో చూసిన తర్వాత ఎంపిక చేసుకోవాలి. తిరిగి ఫలానా సమయంలో పెట్టుబడిని వెనక్కి తీసుకుంటానన్న స్పష్టత ఉన్న వారికి ఎఫ్డీలు మెరుగైనవి. ఎంత రాబడి వస్తుందో పెట్టుబడి సమయంలోనే తెలుసుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడిని ఎప్పుడు వెనక్కి తీసుకోవాలన్న విషయంలో స్పష్టత లోపించినట్టయితే, అప్పుడు ఓవర్నైట్ ఫండ్స్ లేదా లిక్విడ్ ఫండ్స్ లేదా బ్యాంక్ స్వీప్ ఇన్ ఎఫ్డీ ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలానికి సైతం.. డెట్ సాధనాలు కేవలం స్వల్పకాల పెట్టుబడులకే అనుకోవడం పొరపాటు. దీర్ఘకాల లక్ష్యాల విషయంలోనూ ఎవరైనా 100 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవడం సరికాదు. కాల వ్యవధి, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా అసెట్ అలోకేషన్ విధానాన్ని (వివిధ సాధనాల మధ్య కేటాయింపులు) రూపొందించుకోవాలన్నది నిపుణుల సూచన. 10–20 ఏళ్లకు మించిన కాలానికి ఒకరు తమ పెట్టుబడుల్లో 70 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. మిగిలిన 30 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారానికి సైతం 5–10 శాతం మేర కేటాయింపులు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ వయసు పెరుగుతూ, లక్ష్యానికి చేరువవుతున్న క్రమంలో ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటూ, డెట్లో పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్లాలి. దీని ద్వారా రిస్క్ ను అధిగమించొచ్చు. లాభాలపై పన్ను డెట్ సాధనం ఏదైనా సరే పెట్టుబడిపై వచ్చే లాభం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఎంత కాలం పాటు ఇన్వెస్ట్ చేశారన్న అంశంతో సంబంధం లేదు. పెట్టుబడిని విక్రయించగా వచ్చిన లాభం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్ ఆదాయానికి కలుస్తుంది. నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మాదిరి మూడేళ్లు నిండిన పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన లాభంపై ఇండెక్సేషన్ ప్రయోజనం ఇప్పుడు లేదు. ఓవర్నైట్ ఫండ్స్... డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇవి అతి తక్కువ రిస్క్ కలిగినవి. కొన్ని రోజుల పాటు పెట్టుబడికి ఓవర్నైట్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. వీటిలో వార్షిక రాబడి సుమారుగా 5 శాతం ఉంటుంది. కేవలం ఒక రోజులో గడువు తీరే సెక్యూరిటీల్లో ఓవర్నైట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. కేవలం ఒక రోజు వ్యవధిలోనే ఈ పెట్టుబడిని నగదుగా మార్చుకోవచ్చు. ఎక్కువ లిక్విడిటీతో ఉంటాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల సవరణల ప్రభావం వీటిపై ఉంటుంది. ఏరోజుకారోజు ఇవి గడువు తీరిపోతుంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు రోజువారీగా సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనుక వడ్డీ రేట్ల మార్పు ప్రభావం ఈ పెట్టుబడులపై వెంటనే అమల్లోకి వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. ఆర్బీఐ రివర్స్ రెపో రేట్లను తగ్గించినప్పుడు వీటి రాబడులు కొంత వరకు ప్రభావితమవుతాయి. మనీ మార్కెట్ ఫండ్స్ ఏడాది వరకు కాల వ్యవధి తీరే సెక్యూరిటీల్లో (సర్టీఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, కమర్షియల్ బిల్లులు, ట్రెజరీ బిల్లులు) ఇవి పెట్టుబడులు పెడుతుంటాయి. అధిక లిక్విడిటీకి తోడు మెరుగైన రాబడిని ఇచ్చే విధంగా వీటి పనితీరు ఉంటుంది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కంటే వీటిలో కాస్త అధిక రాబడి ఉంటుంది. గడిచిన ఏడాది కాలంలో ఇవి సగటున 7.59 శాతం రాబడిని ఇచ్చాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏడాదికి మించి పెట్టుబడి కొనసాగించేట్టు అయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఇవి ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాల్లో (ధరల వ్యత్యాసం) పెట్టుబడులు పెడుతుంటాయి. గడిచిన ఏడాది కాలంలో (అక్టోబర్ నాటికి) ఆర్బిట్రేజ్ ఫండ్స్ సగటున 6.5–8 శాతం మధ్య రాబడులు ఇచ్చాయి. కానీ, మార్కెట్ అస్థిరతల్లో ఇవి తక్కువ రాబడులు, కొన్ని సందర్భాల్లో ప్రతికూల రాబడులు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఏడాదికి మించిన కాలానికే వీటిని పరిశీలించాలి. అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ఈ పథకాలు 3–6 నెలల్లో గడువు తీరే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇతర డెట్ పథకాలతో పోల్చినప్పుడు కాస్త సురక్షితమైనవి. అదే సమయంలో ఓవర్నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ కంటే వీటిలో కొంచెం రిస్క్ ఉంటుంది. అంతేకాదు, ఫండ్ మేనేజర్ తక్కువ రేటింగ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే, డిఫాల్ట్ రిస్క్ కూడా ఎదురుకావచ్చు. కనుక, పెట్టుబడికి ముందు వాటి పోర్ట్ఫోలియోలోని సెక్యూరిటీలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. అధిక రేటింగ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసిన పథకాలనే ఎంపిక చేసుకోవడం సూచనీయం. ఇవి ఏడాది కాలంలో సగటున 7.5 శాతం మేర రాబడులు ఇచ్చాయి. లిక్విడ్ ఫండ్స్... కొన్ని నెలల పాటు పెట్టుబడులకు లిక్విడ్ ఫండ్స్ కూడా అనుకూలమే. అధిక నాణ్యతతో కూడిన డెట్ సెక్యూరిటీల్లో లిక్విడ్ ఫండ్ మేనేజర్లు పెట్టుబడులు పెడతారు. ఒక్కో డెట్ ఇన్స్ట్రుమెంట్ మెచ్యూరిటీ 91 రోజులకు మించకుండా ఉంటుంది. కావాల్సినప్పుడు వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. కొన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టంట్ రిఫండ్ సదుపాయాన్ని (రూ.50 వేల వరకు) అందిస్తున్నాయి. అంటే ఆ మేరకు వెంటనే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. లేదంటే విక్రయించిన మరుసటి రోజున బ్యాంక్ ఖాతాకు ఈ మొత్తం అందుతుంది. వడ్డీ రేట్ల మార్పుల రిస్క్ వీటిపైనా ఉంటుంది. ఓవర్నైట్ ఫండ్స్తో పోలి్చతే రిస్క్ కాస్తంత ఎక్కువ. వీటిల్లో రాబడులు పెట్టుబడి కాలాన్ని బట్టి 5–6.5 శాతం మధ్య ఉంటాయి. స్వల్పకాలానికి 5 శాతం వరకు ఆశించొచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మిడ్క్యాప్లో మెరుగైన రాబడి
ఈక్విటీల్లో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలని భావించే వారు లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్కు పోర్ట్ఫోలియోలో చోటు కల్పించుకోవచ్చు. తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ విభాగానికి ఎంత కేటాయింపులన్నవి తేల్చుకోవాలి. లార్జ్క్యాప్తో పోల్చిచూసినప్పుడు కొంత రిస్క్ అధికంగా ఉన్నప్పటికీ 10–20 ఏళ్ల కాలంలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ అధిక రాబడులు ఇవ్వగలవు. మిడ్క్యాప్ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీస్ ఒకటి. దీర్ఘకాల లక్ష్యాల కోసం రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నవారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. మిడ్క్యాప్తోపాటు లార్జ్క్యాప్ పెట్టుబడులకూ ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది.రాబడులు ఈ పథకం దీర్ఘకాల పనితీరును గమనించినట్టయితే రాబడులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 38 శాతానికి పైగా ఉన్నాయంటే పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఐదేళ్లలో 27 శాతం, ఏడేళ్లలో 18.47 శాతం, పదేళ్లలో 18.84 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చి.. మిడ్క్యాప్ విభాగంలోని మెరుగైన పథకాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఏడాది, ఏడేళ్లు, పదేళ్ల కాలాల్లో బెంచ్మార్క్ సూచీ ‘బీఎస్ఈ 150 మిడ్క్యాప్ టీఆర్ఐ’ కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. 2007 మే నెలలో ఈ పథకం మొదలు కాగా, నాటి నుంచి చూస్తే వార్షిక సగటు రాబడి 15.75 శాతంగా ఉంది. ఈ పథకంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ (ఎక్స్పెన్స్ రేషియో) 1.43 శాతంగా ఉంది.పెట్టుబడుల విధానం కనీసం 65 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులను మిడ్క్యాప్ కంపెనీలకు కేటాయించడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఈ పథకం నష్టాలను పరిమితం చేసింది. ఆ తర్వాతి ర్యాలీల్లో మెరుగైన రాబడులను ఇచ్చింది. వృద్ధికి అవకాశం ఉండి, అంతగా వెలుగులోకి రాని పటిష్టమైన కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పోర్ట్ఫోలియోలో వ్యాల్యూ స్టాక్స్కు ప్రాధాన్యం ఇస్తుంది. మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడమే కాదు.. తగిన రాబడులు ఇచ్చే వరకు ఆ పెట్టుబడులు కొనసాగిస్తుంటుంది.ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 50,627 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 96 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ పెట్టుబడులు 0.21 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 3.7 శాతంగా ఉన్నాయి. ఈక్విటీల్లో 40 శాతం మేర లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. 58 శాతం పెట్టుబడులను మిడ్క్యాప్లకు కేటాయించింది. స్మాల్క్యాప్ పెట్టుబడులు 1.44 శాతంగా ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో 66 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్–10 కంపెనీల్లో పెట్టుబడులు 29 శాతంగా ఉన్నాయి. పోర్ట్ఫోలియో కాన్సంట్రేషన్ తక్కువ అని అర్థమవుతోంది. పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 78 శాతం పెట్టుబడులు ఈ రంగాల కంపెనీల్లోనే ఉన్నాయి.టాప్ ఈక్విటీ హోల్డింగ్స్కంపెనీ పెట్టుబడులు శాతంపర్సిస్టెంట్ సిస్టమ్స్ 4.16 ఒరాకిల్ ఫిన్ 3.51 ఎంఫసిస్ 3.31 ఒబెరాయ్ రియల్టీ 3.11 ఫోర్టిస్ హల్త్కేర్ 3.05 ఇప్కా ల్యాబ్ 3.01 కోరమాండల్ 2.49 పీఐ ఇండస్ట్రీస్ 2.39 సోలార్ ఇండస్ట్రీస్ 2.23 సుప్రీమ్ ఇండస్ట్రీస్ 2.19 -
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అమెరికాకు తిరిగి వచ్చేయండి
న్యూయార్క్: అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే.. శీతాకాల సెలవులకు స్వదేశాలకు వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాకు తిరిగి వచ్చేయాలని పలు యూనివర్సిటీలు సూచించాయి. ప్రవేశాల నిషిద్ధం, విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి జనవరి 20కి ముందే తిరిగి వచ్చేయాలని భారతీయ విద్యార్థులను పలు వర్సిటీలు హెచ్చరించాయి. వలసదారులను అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యధికంగా వెనక్కి పంపిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సూచన జారీచేశాయి. చెల్లుబాటయ్యే వీసా, ఇతర ప్రయాణ పత్రాలు సక్రమంగా ఉన్న భారతీయ విద్యార్థులకు వచ్చే నష్టమేమీ లేకున్నా.. అవకాశం తీసుకోవద్దని హెచ్చరించాయి. అమెరికా వర్సిటీల్లో చదువున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత విద్యార్థులే అధికం కావడం గమనార్హం. 2023–24 కాలంలో భారత విద్యార్థులు చైనాను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని ఆశ్రయించారు. అమెరికా వర్సిటీల్లో 3.3 లక్షల భారతీయ విద్యార్థులు ఉండగా.. చైనా విద్యార్థులు 2.7 లక్షల మంది ఉన్నారు. సాధారణంగా అయితే నూతన సంవత్సర వేడుకల తర్వాత వారం రోజులకు తరగతులు ప్రారంభమవుతాయని, ట్రంప్ వైఖరిని దృష్టిలో పెట్టుకొని ఈసారి జనవరి 2 నుంచే తరగతులు మొదలుపెడుతున్నారని ఒక విద్యార్థి తెలిపారు. జనవరి మొదటి వారాంతం తర్వాత రావడం రిస్క్ అవుతుందని ప్రొఫెసర్లు చెప్పినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అమెరికాకు తిరిగి వెళ్లాలని తమపై ఒత్తిడి ఉందని తెలిపారు. అమెరికాకు ఎప్పుడు తిరిగి రావాలనే విషయంలో సందేహాలను తీర్చడానికి యేల్ యూనివర్సిటీ అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. అమెరికాకు వెళ్లడానికి జనవరి 10న రిటర్న్ టికెట్ను బుక్ చేసుకున్నానని, అయితే మసాచుసెట్స్ యూనివర్సిటీ సూచన మేరకు రూ.35 వేలు అదనంగా పెట్టి.. తిరిగివెళ్లే తేదీని ముందుకు జరిపానని ఎస్.సర్సన్ అనే విద్యార్థి తెలిపారు. నిబంధనలు కఠినతరం కావచ్చని, నిశిత పరిశీలన, తనిఖీలు ముమ్మరం కావచ్చని తమ ప్రొఫెసర్లు చెప్పారని వెల్లడించారు. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకొనే బదులు.. ముందుగా అమెరికాకు తిరిగి రావడమే ఉత్తమమని వెస్లెయాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. -
వచ్చే ఏడాదిలోనూ పసిడిలో రాబడులు
న్యూఢిల్లీ: సంవత్ 2081లోనూ (వచ్చే ఏడాది కాలంలో) బంగారం, వెండి ఇన్వెస్టర్లకు రాబడులు కురిపించనున్నాయి!. దేశ ఆర్థిక వ్యవస్థలో సానుకూల వృద్ధికి తోడు, అనిశి్చతుల్లో సురక్షిత సాధనంగా ఉన్న గుర్తింపు బంగారంలో ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంవత్ 2080లో నిఫ్టీ 25 శాతం పెరగ్గా, బంగారం 30 శాతం రాబడులను ఇచ్చింది. ‘‘సంవత్ 2081 బంగారానికి అనుకూలంగా ఉంటుంది. కనీసం 10 శాతం రాబడులు ఇవ్వొచ్చు. దిగుమతి సుంకాల తగ్గింపు ప్రభావంతో కొనుగోళ్లు ఇదే మాదిరి కొనసాగితే గరిష్టంగా 15–18% రాబడులకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ దిగుమతులపై సుంకాలు పెంచితే బంగారం పనితీరు 15 శాతాన్ని మించొచ్చు. స్థిరమైన వడ్డీ రేట్ల వాతావరణం సైతం బంగారం ఎగువవైపు ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. సంవత్ 2080లో వెండి ధర 40% ర్యాలీ చేసిందని, రాబడుల్లో స్థిరమైన ధోరణి కొనసాగుతుందని అన్నారు. -
జీఎస్టీ రిటర్న్లో మార్పులు.. వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్స్
వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ రిటర్న్లకు సంబంధించి నిబంధనలలో మార్పులు రానున్నాయి. ఇందులో భాగంగా 2025 ప్రారంభం నుండి జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేసిన గడువు తేదీ నుండి మూడు సంవత్సరాల తర్వాత నెలవారీ, వార్షిక జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయలేరు.గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ (జీఎస్టీఎన్) తాజాగా జరిగిన సంప్రదింపులలో ఈ విషయాన్ని తెలిపింది. జీఎస్టీ అమ్మకాల రిటర్న్లతో పాటు, బకాయిల చెల్లింపు, వార్షిక రిటర్న్లు, టీసీఎస్ వసూలుకు సంబంధించిన రిటర్న్లకు కొత్త నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. అంటే రిటర్న్ల సమర్పణ గడువు తేదీ నుండి మూడేళ్ల వ్యవధి ముగిసిన తర్వాత రిటర్న్ దాఖలు చేయడంపై నిషేధం ఉంటుంది.“ఈ మార్పు వచ్చే ఏడాది (2025) ప్రారంభం నుండి జీఎస్టీ పోర్టల్లో అమలులోకి రాబోతోంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిచూసుకోవాలి. ఇంకా ఎవరైనా జీఎస్టీ రిటర్న్లను దాఖలు చేయకపోతే వీలైనంత త్వరగా దాఖలు చేయాలి" అని జీఎస్టీఎన్ సూచించింది.సకాలంలో జీఎస్టీ దాఖలును పూర్తి చేయడం, డేటా విశ్వసనీయతను పెంచడం, ఫైల్ చేయని రిటర్న్ల 'బ్యాక్లాగ్'ను సమర్థవంతంగా తగ్గించడం లక్ష్యంగా జీఎస్టీఎన్ కొత్త మార్పులు ప్రవేశపెడుతోంది. రిటర్న్లను ఆలస్యంగా దాఖలు చేసే వ్యవధిని పరిమితం చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిపోల్చుకుని, సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. -
బిజినెస్ సైకిల్ ఫండ్స్ భేష్..
న్యూఢిల్లీ: పెట్టుబడుల ప్రపంచంలో బిజినెస్ సైకిల్ మ్యూచువల్ ఫండ్స్కి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. విస్తృత మార్కెట్తో పోలిస్తే ఇవి మెరుగ్గా రాబడులు అందిస్తుండటం ఇందుకు కారణం. గత ఏడాది వ్యవధిలో ఈ ఫండ్స్ 56 శాతం వరకు రాబడులు ఇచ్చినట్లు పరిశ్రమ గణాంకాల్లో వెల్లడైంది. వీటి ప్రకారం హెచ్ఎస్బీసీ, మహీంద్రా మాన్యులైఫ్, క్వాంట్ మొదలైన ఫండ్ హౌస్ల స్కీములు 50 శాతం పైగా రాబడులు అందించాయి. ఇదే వ్యవధిలో నిఫ్టీ 500 టీఆర్ఐ సూచీ 35.11 శాతం రాబడులు అందించింది. ఈ నేపథ్యంలో బిజినెస్ సైకిల్ ఫండ్స్పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోందని ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలిపారు. నిర్దిష్ట ఆర్థిక, మార్కెట్ పరిస్థితుల్లో రాణించే రంగాలకు చెందిన స్టాక్స్ని గుర్తించి, ఇన్వెస్ట్ చేసేందుకు బిజినెస్ సైకిల్ ఫండ్స్ ప్రయతి్నస్తాయి. ఆర్థిక వ్యవస్థలో మాంద్యం, రికవరీ తొలినాళ్లు, వృద్ధి మధ్య దశ, చివరి దశ వంటి పరిస్థితులను బట్టి వివిధ రంగాల్లో పెట్టుబడులను మారుస్తుంటాయి. ఉదాహరణకు మాంద్యం దశలో యుటిలిటీస్, ఫార్మా వంటి డిఫెన్సివ్ రంగాలు మెరుగ్గా రాణించగలవు. అయితే వృద్ధి ప్రారంభమయ్యే తొలినాళ్లలో ఆటోమొబైల్స్, ఫైనాన్షియల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలకు చెందిన స్టాక్స్ లాభపడే అవకాశాలు ఉంటాయి. ఇలా వ్యూహాత్మకంగా వివిధ రంగాల్లో పెట్టుబడులను అటూ–ఇటూ మారుస్తుండటమనేది ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్వల్ప సమయంలో అధిక రాబడులు అందిస్తుండటంతో బిజినెస్ సైకిల్ ఫండ్స్పై ఆసక్తి పెరుగుతోందని ఎప్సిలాన్ గ్రూప్లో భాగమైన మల్టీ ఆర్క్ వెల్త్ ఏవీపీ సిద్ధార్థ్ ఆలోక్ తెలిపారు. పరిస్థితులను బట్టి వివిధ సెక్టోరల్ ఫండ్స్కి మారేందుకు, ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లను పట్టుకునేందుకు వ్యక్తిగతంగా పరిశోధిస్తూ, అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చునే భారాన్ని ఈ ఫండ్స్ తగ్గిస్తాయని విస్డమ్ ఎడ్జ్ ఇన్వెస్ట్మెంట్స్ వ్యవస్థాపకుడు భావేష్ దమానియా తెలిపారు. అయితే, సాధారణంగా థీమ్యాటిక్ ఫండ్స్ పనితీరును లెక్కగట్టేందుకు కనీసం అయిదేళ్ల పాటైనా కార్యకలాపాలు ఉండాలని, ఇవన్నీ ఈ మధ్యే వచ్చాయి కాబట్టి ఇటీవలి కాలంలో పనితీరుపైనే ఆధారపడటం సరికాకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.16 ఫండ్స్..ప్రస్తుతం దేశీయంగా 16 బిజినెస్ సైకిల్ ఫండ్స్ ఉండగా, 10 ఫండ్స్కి ఏడాది పైగా ట్రాక్ రికార్డు ఉంది. వీటిలో ఒక్కటి మినహా మిగతా అన్నీ కూడా గత 12 నెలల్లో నిఫ్టీ 500 టీఆర్ఐకి మించిన రాబడులు అందించాయి. పరిశ్రమ డేటా ప్రకారం 10 ఫండ్స్ సగటున 42 శాతం రాబడి అందించాయి. గత ఏడాది వ్యవధిలో అక్టోబర్ 17 వరకు.. హెచ్ఎస్బీసీ బిజినెస్ సైకిల్స్ ఫండ్ 56.3 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 56.17 శాతం, క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 50.8 శాతం రాబడులు అందించాయి.మరిన్ని విశేషాలు..అధిక రాబడులు అందించిన వాటిలో బరోడా బీఎన్పీ పారిబా బిజినెస్ సైకిల్ ఫండ్ (44.58 శాతం రాబడి), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ (42.27 శాతం), టాటా బిజినెస్ సైకిల్ ఫండ్ (41.26 శాతం), కోటక్ బిజినెస్ సైకిల్ ఫండ్ (40.03 శాతం), యాక్సిస్ బిజినెస్ సైకిల్ ఫండ్ (39.02 శాతం), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ (36.33 శాతం), హెచ్డీఎఫ్సీ బిజినెస్ సైకిల్ ఫండ్ (31.97 శాతం) ఉన్నాయి. →గత ఆరు నెలల వ్యవధిలో హెచ్ఎస్బీసీ బిజినెస్ సైకిల్స్ ఫండ్ 26.72 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 20.88 శాతం, క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 17.7 శాతం రిటర్న్లు ఇచ్చాయి. ఇదే వ్యవధిలో నిఫ్టీ 500 టీఆర్ఐ ఇండెక్స్ 15.2 శాతమే రాబడినిచి్చంది. మిగతా ఏడు ఫండ్స్ 13 శాతం నుంచి 23 శాతం వరకు రిటర్నులు ఇచ్చాయి. -
ఈక్విటీ రాబడులపై పన్ను సున్నా!
కొన్నేళ్ల క్రితం విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలు పెడితే మన ఈక్విటీలు బేల చూపు చూసేవి. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మిన మేర ఇనిస్టిట్యూషన్స్, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. మన దేశ ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం గతంతో పోలి్చతే గణనీయంగా పెరిగిందని చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. నేరుగా స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాతి నుంచి ఈక్విటీ మార్కెట్ మంచి బుల్ ర్యాలీ చేయడం.. ఎంతో మంది ఇన్వెస్టర్లు అటు వైపు అడుగులు వేసేలా చేసింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో క్రమానుగత పెట్టుబడుల (సిప్) ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. తమ భవిష్యత్ ఆరి్థక లక్ష్యాల్లో ఈక్విటీలకు చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈక్విటీ రాబడులపై పన్ను బాధ్యతను ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా అర్థం చేసుకోవాలి. 2024–25 బడ్జెట్లో ఈక్విటీ లాభాలపై స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును కేంద్ర సర్కారు పెంచేసింది. ఈ భారం సాధ్యమైన మేర తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్ల ముందు పలు మార్గాలున్నాయి. వాటి గురించి వివరించే కథనమే ఇది. ఆదాయపన్ను చట్టంలో ఇటీవలి మార్పుల అనంతరం స్వల్పకాల లాభాలపై 20 శాతం, దీర్ఘకాల లాభాలపై 12.5 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండకుండా విక్రయించిన స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై వచ్చే లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్టీసీజీ) అవుతుంది. దీనిపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది పూర్తయిన అనంతరం విక్రయించినప్పుడు వచి్చన లాభం దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) కిందకు వస్తుంది. ఎల్టీసీజీ ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించకపోతే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం ఎల్టీసీజీ చెల్లించాల్సి ఉంటుంది. పన్ను తగ్గించుకునే మార్గాలు..ఈక్విటీల్లో స్వల్పకాల మూలధన లాభాలపై (ఎస్టీసీజీ) 20 శాతం పన్ను చెల్లించాల్సిందే. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి వెసులుబాట్లు లేవు. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే మూలధన లాభాలపై పన్ను భారం లేకుండా చూసుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మార్గాలున్నాయి. ముఖ్యంగా ఈక్విటీలు మూడేళ్లు అంతకుమించిన కాలానికే అనుకూలం. మూడేళ్లలోపు పెట్టుబడులకు ఈక్విటీలు సూచనీయం కాదు. ఎందుకంటే స్వల్పకాలంలో ఈక్విటీలు స్థూల ఆరి్థక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధాన నిర్ణయాలు తదితర ఎన్నో అంశాల ఆధారంగా అస్థిరతలకు లోనవుతూ ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలంలో ఈ అస్థిరతలను అధిగమించి స్టాక్స్ ర్యాలీ చేస్తుంటాయి. కనుక స్వల్పకాలంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు భరోసా ఉంటుంది. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు తమ మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసమే ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా అధిక రాబడులకు తోడు, ఆ మొత్తంపై పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి అవకాశాలుంటాయి.ట్యాక్స్ హార్వెస్టింగ్ఒక ఆరి్థక సంవత్సరంలో ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు కనుక, ఏటా తమ పెట్టుబడులపై ఈ మేరకు లాభాలను స్వీకరించడం ట్యాక్స్ హార్వెస్టింగ్ అవుతుంది. తిరిగి అంతే మొత్తాన్ని మళ్లీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు 2023 సెపె్టంబర్ 1న స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్లో రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. 2024 సెపె్టంబర్ 1 నాటికి ఈ విలువ 12 శాతం రాబడి అంచనా ప్రకారం రూ.6,75,305 అవుతుంది. ఇందులో లాభం రూ.75,305. రూ.1.25లక్షల వరకు లాభం ఉన్నా పన్ను లేదు కనుక, ఈ మొత్తాన్ని విక్రయించి తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి పన్ను భారం పడదు. ఇలా ఏటా రూ.1.25లక్షల మేరకు దీర్ఘకాలిక మూలధన లాభాన్ని స్వీకరిస్తూ.. తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ఒక మార్గం. ఇల్లు కొనడం.. ఈక్విటీ దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేకుండా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ మార్గం చూపిస్తోంది. ఈ సెక్షన్ కింద గరిష్ట ప్రయోజనం రూ.10 కోట్లు. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన మొత్తం రూ.10 కోట్ల వరకు ఉంటే, దీనిపై భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు ఆ మొత్తంతో ఒక నివాస గృహం కొనుగోలు చేస్తే సరి. ఇలా చేయడం వల్ల ఎలాంటి పన్ను లేకుండా సెక్షన్ 54ఎఫ్ కింద పూర్తి ప్రయోజనం పొందొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలే (హెచ్యూఎఫ్) ఈ ప్రయోజనానికి అర్హులు. దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడులే అని కాదు, ప్లాట్, వాణిజ్య భవనం, బంగారం, ట్రేడ్ మార్క్లు, పేటెంట్లు, మెషినరీ సైతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తాయి. వీటిపైనా ఇదే ప్రయోజనం పొందొచ్చు. బాండ్లు సెక్షన్ 80ఈసీ కింద ఈక్విటీ దీర్ఘకాల మూలధన లాభాలను క్యాపిటల్ గెయిన్స్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఆర్ఈసీ, ఎన్హెచ్ఏఐ తదితర ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో పెట్టుబడులపై రాబడి 6 శాతం వరకు ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించిన తేదీ నుంచి ఆరు నెలలు దాటకుండా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తేనే ప్రయోజనం లభిస్తుంది. గరిష్టంగా రూ.50 లక్షల పెట్టుబడులకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన మొత్తం రూ.50 లక్షలకు మించి ఉంటే, అదనపు మొత్తంపై నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఐదేళ్లలోపు వాటిని విక్రయిస్తే.. గతంలో పొందిన పన్ను ప్రయోజనం కోల్పోతారు. అంటే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ బాండ్లపై ఐదేళ్లలోపు రుణం పొందినా ఈ ప్రయోజనం కోల్పోతారు.షరతులు ఉన్నాయ్... దీర్ఘకాల ఈక్విటీ మూలధన లాభాలపై సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించే తేదీకి ఏడాది ముందు కాలంలో లేదా విక్రయించిన తేదీ నుంచి తర్వాతి రెండేళ్లలోపు నివాస అవసరాలకు వినియోగించే ఇల్లు (పాతది లేదా కొత్తది) కొనుగోలు చేయాలి. ఇల్లు నిరి్మంచుకునేట్టు అయితే దీర్ఘకాల క్యాపిటల్ అసెట్స్ విక్రయించిన నాటి నుంచి మూడేళ్ల వరకు వ్యవధి ఉంటుంది. మూలధన లాభాలే కాకుండా, విక్రయించినప్పుడు వచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంత మొత్తంతోనే ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణంపై వెచి్చస్తే, అప్పుడు మిగిలిన మూలధన లాభాలపై నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఇంటి కొనుగోలుకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ ధీర్ఘకాల పెట్టుబడులు విక్రయించగా వచ్చిన మొత్తం రెండిళ్ల కొనుగోలుపై వెచ్చిస్తే.. ఒక ఇంటిపై చేసిన వ్యయాన్నే సెక్షన్54ఎఫ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే, ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించే నాటికి ఒక ఇంటిని మించి కలిగి ఉండకూడదు. రెండో ఇంటిని జాయింట్లో కలిగి ఉన్నా అర్హత కోల్పోయినట్టే. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులను విక్రయించినప్పుడు పన్ను మినహాయింపు కోసం ఇంటిపై వెచ్చించాలని చెప్పుకున్నాం. అయితే, విక్రయించిన ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేసే నాటికి ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచడం సాధ్యపడలేదు అనుకుందాం. అలాంటప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ కింద ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత దీని నుంచి ఉపసంహరించుకుని నిబంధనలకు అనుగుణంగా నిరీ్ణత కాలం లోపు ఇంటి కోసం వెచి్చంచి, పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిరీ్ణత కాలంలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచలేకపోయారని అనుకుందాం. అటువంటప్పుడు ఆ మొత్తాన్ని క్రితం ఆరి్థక సంవత్సరానికి సంబంధించి ఎల్టీసీజీగా చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.సరైన నిర్ణయమేనా?మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లాభాలపై పన్ను తప్పించుకునేందుకు సెక్షన్ 54ఎఫ్ను వినియోగించుకుని ఇంటిపై ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా..? అంటే, అందరికీ కాకపోవచ్చన్నదే సమాధానం. పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం, రిటైర్మెంట్ తదితర లక్ష్యాల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, పన్ను మినహాయింపు కోసం తీసుకెళ్లి ఇంటిపై వెచి్చంచడం సరైనది అనిపించుకోదు. కనుక ఈ విషయంలో ఇన్వెస్టర్లు అందరికీ ఒక్కటే సలహా నప్పదు. సొంతిల్లు సమకూర్చుకోవాలని కోరుకునే వారికి సెక్షన్ 54ఎఫ్ మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే, పన్ను మినహాయింపు కోసం ఇంటిపై ఇన్వెస్ట్ చేసి వృద్ధాప్యంలో ఆ ఇంటిని రివర్స్ మార్ట్గేజ్ కోసం వినియోగించుకునే ఆలోచన ఉన్న వారికి కూడా 54ఎఫ్ ప్రయోజనం అనుకూలమే.నష్టాలతో భర్తీ..ఈక్విటీల్లో మూలధన లాభాలపై పన్ను తగ్గించుకునేందుకు.. మూలధన నష్టాలతో భర్తీ చేసుకోవడం మరో ఆప్షన్. ఏడాదికి మించని ఈక్విటీ పెట్టుబడులు విక్రయించగా వచ్చిన స్వల్పకాల మూలధన నష్టాన్ని.. తిరిగి స్వల్పకాల మూలధన లాభం లేదా దీర్ఘకాల మూలధన లాభంలో సర్దుబాటు చేసుకోవచ్చు. ఇలా సర్దుబాటు చేయగా మిగిలిన మొత్తంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా సర్దుబాటు చేసుకున్న తర్వాత కూడా నష్టం మిగిలి ఉంటే దాన్ని అప్పటి నుంచి తదుపరి ఎనిమిదేళ్లపాటు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. పన్ను రిటర్నులు దాఖలు చేయడం ద్వారానే ఇందుకు అవకాశం ఉంటుంది. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాన్ని.. కేవలం దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
బలమైన రాబడుల చరిత్ర
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో రిస్క్ ఎక్కువ. కానీ, దీర్ఘకాలం పాటు (పదేళ్లు అంతకుమించి) సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బలమైన రాబడులు సొంతం చేసుకోవచ్చు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు కనుక మధ్యలో మార్కెట్ల పతనంతో కలత చెందాల్సిన పని ఉండదు. అప్పుడు మీ పెట్టుబడితో ఎక్కువ యూనిట్లు సమకూరుతాయి. కేవలం దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే వారికే ఇవి అనుకూలం. స్వల్పకాలం కోసం ఇవి అనుకూలం కాదు. వీటిల్లో అస్థిరతులు, రిస్క్ ఎక్కువ. కనుక రాబడుల కోసం రిస్క్ తీసుకునే ధోరణి ఉన్న వారు తమ పోర్ట్ఫోలియోలో వీటిని చేర్చుకోవచ్చు. స్మాల్క్యాప్ విభాగంలో దీర్ఘకాలంలో నిప్పన్ ఇండియా స్మాల్క్యాప్ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.రాబడులునిప్పన్ ఇండియా స్మాల్క్యాప్ డైరెక్ట్ ప్లాన్లో గడిచిన ఏడాది కాలంలో రాబడి 50 శాతంగా ఉంది. అంటే పెట్టుబడిని ఏడాదిలోనే 50 శాతం వృద్ధి చేసింది. మూడేళ్ల కాలంలోనూ ఏటా 32 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఇక ఐదేళ్లలో చూసుకుంటే ఏటా 38 శాతం, ఏడేళ్లలో 26 శాతం, పదేళ్లలో 25 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ఈ పథకంలో డైరెక్ట్ ప్లాన్ 2013 జనవరిలో ప్రారంభమైంది. రెగ్యులర్ ప్లాన్ అయితే 2010లోనే మొదలైంది. రెగ్యులర్ ప్లాన్లోనూ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఏటా 23 శాతం మేర రాబడి వచి్చంది. ఈ పథకంలో సిప్ ద్వారా ప్రతీ నెలా రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇన్వెస్ట్ చేసిన తర్వాత కనీసం రూ.100 నుంచి (ఎస్డబ్ల్యూపీ) వెనక్కి తీసుకోవచ్చు.పెట్టుబడుల విధానం..స్మాల్ క్యాప్ పథకం కనుక పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని చిన్న కంపెనీలకే కేటాయిస్తుంది. కానీ, పోర్ట్ఫోలియో చూస్తే అలా అనిపించదు. మొత్తం పెట్టుబడుల్లో 32 శాతమే స్మాల్క్యాప్లో కనిపిస్తాయి. రిస్క్ను తగ్గించడం కోసం ఫండ్ మేనేజర్లు ఈ విధానం అనుసరిస్తున్నారు. పైగా ఈ పథకం ఎంపిక చేసుకునే స్టాక్స్ అన్నీ దాదాపుగా భవిష్యత్తులో మిడ్, లార్జ్క్యాప్గా అవతరించే సామర్థ్యాలున్నవే. ఈ పథకం పెట్టుబడుల చరిత్రను గమనిస్తే ఇలాంటివి పదుల సంఖ్యలో కనిపిస్తాయి. భవిష్యత్తులో మల్టీబ్యాగర్ కాగల కంపెనీలను గుర్తించడంలో ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.61,000 కోట్లున్నాయి. ఇందులో 95.99 శాతం మేర ఈక్విటీలకు కేటాయించింది. మార్కెట్ల కరెక్షన్లో పెట్టుబడుల కోసం 4 శా తం నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లో లార్జ్క్యాప్ కంపెనీల్లో 17 శాతం మిడ్క్యాప్ కంపెనీల్లో 50.57 శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి. స్మాల్క్యాప్ కంపెనీల్లో 32.56 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఇండస్ట్రియల్స్ కంపెనీలకు అత్యధికంగా 25 శాతం కేటాయించింది. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 15 శాతం, మెటీరియల్స్ కంపెనీలకు 14.47 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషినరీ కంపెనీలకు 13.74 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
రిస్క్ తక్కువ.. మెరుగైన రాబడి
పెట్టుబడులపై మెరుగైన రాబడులు అందరూ కోరుకుంటారు. కానీ, అస్థిరతల రిస్క్ను ఎదుర్కొనే గుండె ధైర్యం అందరికీ ఉండకపోవచ్చు. రిస్క్ తక్కువగా ఉండాలి, అదే సమయంలో అచ్చమైన డెట్తో పోల్చితే కాస్త మెరుగైన రాబడి కోరుకునే వారికి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. ఈ విభాగంలో నమ్మకమైన పనితీరు చూపిస్తున్న కొన్ని పథకాల్లో పరాగ్ పారిఖ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ఒకటి. మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. బాండ్ల పట్ల బుల్లిష్ ధోరణితో ఉన్న వారికి కూడా ఈ విభాగం అనుకూలం.రాబడులుఈ పథకం ఏడాది కాలంలో 16.6 శాతం రాబడిని అందించింది. మూడేళ్లలో ఏటా11.49 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. 2021 మే నెలలో ఇది ప్రారంభమైంది. అంటే ఈ పథకానికి మూడేళ్ల చరిత్రే ఉంది. అయినప్పటికీ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు పనితీరు కంటే ఈ పథకమే మెరుగ్గా పనిచేసినట్టు తెలుస్తోంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగంలో వార్షిక రాబడి 13.91 శాతంగా ఉంటే, మూడేళ్లలో వార్షిక రాబడి 8.59 శాతంగానే ఉండడం గమనించొచ్చు.పెట్టుబడుల విధానంకన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ సాధారణంగా ఈక్విటీలకు 25–30 శాతం వరకు (పరిస్థితులు, అవకాశాలు) పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. డెట్లో 70 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కానీ పరాగ్ పారిఖ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్మాత్రం నేరుగా ఈక్విటీల్లో 15 శాతం వరకే ఇన్వెస్ట్ చేస్తుంది. మరో 10–15 శాతం వరకు ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాల్లో పెట్టుబడులు పెడుతుంటుంది.పరాగ్ పారిఖ్ మ్యూచువల్ ఫండ్ సాధారణంగా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. రాబడుల కోసం అధిక రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపదు. ఈ పథకమనే కాకుండా ఈ సంస్థకు చెందిన అన్ని విభాగాల్లోనూ ఇదే విధానం అంతర్లీనంగా కొనసాగుతుంటుంది. అందులో ఇది కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ కనుక రిస్క్ ఇంకా తక్కువనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈక్విటీ కేటాయింపులను గమనించినట్టయితే ఎక్కువ పెట్టుబడులు డివిడెండ్ దండిగా పంపిణీ చేసే బ్లూచిప్ కంపెనీల్లోనే ఉన్నాయి. డివిడెండ్ స్టాక్స్లో అస్థిరతలు తక్కువగా ఉంటాయి. పోర్ట్ఫోలియోఈ పథకం నిర్వహణలో రూ.2,197 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 14.28 శాతం మేర ఈక్విట్లీలో ఇన్వెస్ట్ చేసింది. 75.71 శాతం డెట్ సాధనాలకు కేటాయించింది. రియల్ ఎస్టేట్ సాధానాల్లో 6.88 శాతం పెట్టుబడులు పెట్టింది. 3.13 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే ఈ నగదును ఉపయోగించి మెరుగైన అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 62 శాతం లార్జ్క్యాప్లోనే ఉన్నాయి. 32 శాతం మేర మిడ్క్యాప్లో, 6.18 శాతం మేర స్మాల్క్యాప్లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్ఫోలియోలో 14 స్టాక్స్ ఉన్నాయి. డెట్ పెట్టుబడులు గమనిస్తే 56 శాతం ఎస్వోవీ (సావరీన్ డెట్) రేటెడ్ పత్రాలు, 18.59 శాతం ఏఏఏ రేటెడ్ ఫండ్స్లోనే ఉండడం గమనించొచ్చు. అంటే డెట్లోనూ 74 శాతం పెట్టుబడులను రిస్క్ చాలా తక్కువ ఉన్న వాటినే ఎంపిక చేసుకుంది. -
ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
ముంబై: ఈక్విటీ మార్కెట్లో రాబడులు వచ్చే మూడేళ్ల కాలంలో క్రితం మూడేళ్ల స్థాయిలో మాదిరి గొప్పగా ఉండకపోవచ్చని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది. కాకపోతే వచ్చే మూడేళ్లలో ఈక్విటీ రాబడులు గౌరవనీయ స్థాయిలో, ఇతర పెట్టుబడి సాధనాల కంటే మెరుగ్గా ఉండొచ్చని ఈ సంస్థ ఈక్విటీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఆర్ జానకీరామన్ చెప్పారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నుంచి కొత్తగా మలీ్టక్యాప్ ఫండ్ (ఎన్ఎఫ్వో)ను ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈక్విటీ సూచీలు ఆల్టైమ్ గరిష్ట స్థాయిలకు చేరి, అధిక వ్యాల్యూషన్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో జానకీరామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్ వృద్ధి దశ ఆరంభంలో ఉన్నందునే మార్కెట్ విలువలు అధికంగా ఉన్నట్టు, మరో ఐదేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చన్నారు. ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్లపై (ఐపీవో) స్పందిస్తూ.. అదనంగా వచ్చే పెట్టుబడుల ప్రవాహాన్ని సర్దుబాటు చేసుకునేందుకు కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలు వేదిక కాగలవన్నారు. గడిచిన కొన్నేళ్లలో కంపెనీల వృద్ధి కంటే ఈక్విటీ రాబడులే అధికంగా ఉన్నాయని, కనుక దీనికి విరుద్ధమైన పరిస్థితికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. లార్జ్క్యాప్ స్టాక్స్కు కేటాయించిన పెట్టుబడులు రిస్్కను అధిగమించేందుకు తోడ్పడతాయన్నారు. ఈ సంస్థ నిర్వహణలోని ఆస్తుల్లో సగం మేర మిడ్క్యాప్, స్మాల్క్యాప్ కంపెనీల్లోనే ఉండడం గమనార్హం. భారత్ మరింత వృద్ధి చెందేకొద్దీ మిడ్, స్మాల్క్యాప్ విభాగంలో మరిన్ని కంపెనీలు మెరుగ్గా రాణించడాన్ని చూస్తామంటూ.. ఈ విభాగం పట్ల ఇన్వెస్టర్ల ప్రాధాన్యాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. రూ.లక్ష కోట్ల మైలురాయి తమ నిర్వహణలోని ఆస్తుల విలువ మొదటిసారి రూ.లక్ష కోట్లను అధిగమించినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ప్రెసిడెంట్ అవినాష్ సత్వాలేకర్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి చివరికి 15వ అతిపెద్ద అస్సెట్ మేనేజర్గా ఉన్నట్టు చెప్పారు. ఈ త్రైమాసికంలోనే పలు ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాలను ప్రారంభించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మలీ్టక్యాప్ ఫండ్ ఎన్ఎఫ్వో ఈ నెల 8న ప్రారంభమై, 22 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
‘‘మన్ కీ బాత్ రిటర్న్స్’’.. 111వ ఎపిసోడ్ ఎప్పుడంటే..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ రేడియో సందేశ కార్యక్రమం మన్ కీ బాత్ మళ్లీ ప్రారంభమవనుంది. జూన్ 30న 111వ ఎపిసోడ్తో ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతుందని ప్రధాని స్వయంగా వెల్లడించారు. ‘మన్కీ బాత్’ కార్యక్రమంపై ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ‘మన్ కీ బాత్’కార్యక్రమానికి బ్రేక్ పడింది. ‘కొన్ని నెలల విరామం తర్వాత ‘మన్ కీ బాత్’మళ్లీ ప్రారంభమవనుందని చెప్పడం సంతోషంగా ఉంది. జూన్ 30న 111వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇందుకు మీ ఆలోచనలు, సూచనలను పంచుకోవాలని కోరుతున్నా. మై గవ్ ఓపెన్ ఫోరమ్, నమో యాప్ లేదా 1800 11 7800 ఫోన్ నంబర్ ద్వారా అభిప్రాయాలను పంచుకోవాలి’అని ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రధాని మోదీ కోరారు. కాగా, ప్రతి నెల చివరి ఆదివారంలో వచ్చే ‘మన్ కీ బాత్’110వ ఎపిసోడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రసారం అయ్యింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. -
హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ నుంచి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ఫండ్
హెచ్డీఎఫ్సీ మ్యుచువల్ ఫండ్ సంస్థ తాజాగా హెచ్డీఎఫ్సీ రియల్టీ ఇండెక్స్ ఫండ్ను ఆవిష్కరించింది. ఈ ఎన్ఎఫ్వో మార్చి 21తో ముగుస్తుంది. గత 6–7 ఏళ్లుగా లిస్టెడ్ రియల్టీ కంపెనీల ఫండమెంటల్స్, లాభదాయకత మెరుగుపడ్డాయి. రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, హాస్పిటాలిటీ, సెజ్ ప్రాజెక్టుల వ్యాప్తంగా దీర్ఘకాలిక వృద్ధికి రియల్టీ రంగానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ను ప్రతిబింబించే ఈ ఓపెన్ ఎండెడ్ స్కీములో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉండగలదని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ నవ్నీత్ మునోత్ తెలిపారు. -
పెట్టుబడులు తిరిగివ్వాలని స్టార్టప్లు భావించడం లేదు
న్యూఢిల్లీ: మదుపుదారుల నుంచి తీసుకున్న పెట్టుబడులను తిరిగి ఇచ్చేయడం తమ బాధ్యతని అంకుర సంస్థల వ్యవస్థాపకులు భావించడం లేదని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్లలో గవర్నెన్స్ లోపాలు, వేల్యుయేషన్లు పడిపోతుండటం మొదలైన వాటన్నింటికీ ఇదే కారణమని వారు చెబుతున్నారు. బైజూస్, భారత్పే వంటి టాప్ స్టార్టప్స్ వ్యవస్థాపకులకు, ఇన్వెస్టర్లకు మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో పలువురు మదుపుదారులు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘వ్యవస్థాపకులు తాము తీసుకున్న పెట్టుబడులను బాధ్యతగా తిరిగి ఇచ్చేయాలని భావించకపోతుండటమే కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, వేల్యుయేషన్ల పతనానికి దారి తీస్తోంది‘ అని 100ఎక్స్డాట్వీసీ వ్యవస్థాపకుడు యజ్ఞేష్ సంఘ్రాజ్కా తెలిపారు. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల సమస్యలు చాలా కాలంగా ఉన్నవేనని, ఇవి స్టార్టప్లకే పరిమితం కాకుండా సాధారణంగా లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీల్లోనూ కనిపిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, లాభాలు, వృద్ధిపై అత్యుత్సాహం చూపించే క్రమంలో స్టార్టప్లు కీలకమైన గవర్నెన్స్, నిబంధనల పాటింపు వంటి ప్రక్రియలను ఒకోసారి విస్మరిస్తుంటాయని సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చైర్మన్ సంజయ్ నాయర్ చెప్పారు. వ్యవస్థాపకులు లాభాలపై దృష్టి పెట్టాలి కానీ గవర్నెన్స్ను పట్టించుకోవడం మానేయకూడదు అని ఆయన సూచించారు. ప్రతి స్టార్టప్ .. కస్టమర్ల కోసం టెక్నాలజీని తయారు చేయడంపైనే పూర్తిగా దృష్టి పెడుతుందే తప్ప తమ సంస్థలో అంతర్గతంగా పాటించాల్సిన వాటికోసం టెక్నాలజీని రూపొందించుకోవడంపై అంతగా శ్రద్ధ చూపించదని యూనికస్ కన్సల్టెక్ సహ వ్యవస్థాపకుడు సందీప్ ఖేతాన్ తెలిపారు. అయితే, దేశీయంగా 95 శాతం స్టార్టప్లు నిజాయితీగా, నిబంధనలను పాటించే విధంగానే ఉంటున్నాయని ఇన్ఫోఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ అభిప్రాయపడ్డారు. -
రెండు దశాబ్దాల ఎదురుచూపు ఫలించింది: అంతలోనే ట్విస్ట్
కొంగట్టుకు తిరుగుతూ కబుర్లు చెప్పే బిడ్డ కళ్లముందునుంచి అదృశ్యమైతే, ఆ వేదన వర్ణనాతీతం. ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియక ఆ తల్లిపేగు అల్లాడిపోతుంది. కానీ రెండుదశాబ్దాల తరువాత ‘అమ్మా’ అంటూ తిరిగొస్తే.. కలో మాయో తెలియని అయోమయంలో అకస్మాత్తుగా కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఎన్డీవీటీ కథనం ప్రకారం ఢిల్లీలో నివసించే రతీపాల్ సింగ్, భానుమతి కుమారుడు పింకు. పింకు 2002లో దాదాపు పదకొండేళ్ల వయస్సులో తండ్రితో చిన్న తగాదాపడటంతో తల్లి మందలించింది. అంతే క్షణికావేశంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కొడుకు కోసం ఎంతవెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఎప్పటికైనా రాకపోతాడా అనే ఆశతో జీవిస్తున్నారు. వారి ఆశలు ఫలించి 22 ఏళ్ల తరువాత అమేథిలోని తన అమేథీలోని ఖరౌలిగ్రామానికి వచ్చాడు పింకు. అతణిని గుర్తించిన స్థానికులు, బంధువులు ఢిల్లీలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పరుగున పరుగున వచ్చి కన్నవాళ్లు పింకూ శరీరంపై ఉన్న మచ్చను చూసి పింకూని గుర్తుపట్టారు. ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సన్యాసిలా మారిపోయిన తమ కుమారుడి పరిస్థితి చూసి ఆవేదనకు లోనయ్యారు. ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి సంపన్నమైన రాజ్యాన్ని విడిచిపెట్టి సన్యాసిగా మారిన రాజు లాంటి జానపద కథలు చెబుతూ ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాటన చేస్తూ కాలం గడిపాడు. చివరికి పుట్టిన ఊరును, కన్నతల్లిని వెతుక్కుంటూ వచ్చాడు. కన్నతల్లి గుండెలు పగిలే మరో ట్విస్ట్ ఏంటంటే.. తల్లిదండ్రులను ఓదార్చుతూనే, మళ్లీ తాను వెళ్లిపోవాలని తేల్చి చెప్పాడు పింకూ. వారు ఎంత మొర పెట్టుకున్నా వినకుండా, మీతో కలిసి జీవించలేనంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. అంతేకాదు ఒక సన్యాసిగా తప్పనిసరిగా తల్లి నుండి భిక్షను స్వీకరించే కర్మను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు చెప్పాడు. ఈ పరిణామంతో వారు ఆవేదనలో మునిగిపోయారు. అయితే తమ కుమారుడికి చెందిన మతపరమైన విభాగం పింకూని విడిచిపెట్టడానికి రూ.11 లక్షలు అడుగుతోందని పింకు తండ్రి ఆరోపించాడు. రూ.11లు కూడా లేని తాము సొమ్ము ఎక్కడనుంచి తేవాలంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #Delhi | Boy, who went missing 22 years ago, returns to mother as a monk. Read here: https://t.co/YWDMh5u9aT pic.twitter.com/HQeEA78XCY — NDTV (@ndtv) February 7, 2024 -
2024–25 ఐటీఆర్ల నోటిఫై
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి దాఖలు చేయాల్సిన రిటర్నుల పత్రాలు.. ఐటీఆర్ 2, 3, 5ను నోటిఫై చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సీబీడీటీ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు సులభంగా రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా రిటర్నుల పత్రాల్లో మార్పులు చేశారు. రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. -
ప్రియుని కోసం పాక్ వెళ్లిన అంజూ తిరిగొచ్చింది!
జైపూర్: ప్రియుని కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ తిరిగి స్వదేశానికి వచ్చింది. వాఘా సరిహద్దు దాటి భారత్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దర్యాప్తు బృందాల అదుపులో ఉంది. విచారణ అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. ప్రియుడు నస్రుల్లా కోసం గత జులైలో అంజూ పాకిస్థాన్కు వెళ్లింది. అంజూ రాజస్థాన్ బివాండీకి చెందిన మహిళ. భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్బుక్లో పరిచయమైన పాక్ వ్యక్తి నస్రుల్లాను ప్రేమించింది. అతని కోసం గత జులైలో భారత్ సరిహద్దు దాటి ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్కి వెళ్లింది. అయితే.. తన స్నేహితున్ని కలుసుకోవడానికి మాత్రమే వెళ్లానని తెలిపిన అంజూ.. ఆ మరుసటి రోజే అతనితో వివాహం చేసుకుంది. అంజూ నుంచి ఫాతిమాగా పేరు మార్చుకుని ఇస్లాం స్వీకరించింది. జైపూర్ మాత్రమే వెళ్తున్నట్లు, మరో రెండు రోజుల్లో వెచ్చేస్తానని అప్పట్లో తనతో చెప్పినట్లు అంజూ భర్త అరవింద్ తెలిపారు. అప్పటి నుంచి అంజూతో వాట్సాప్లో టచ్లోనే ఉన్నట్లు వెల్లడించారు. అంజూ, నస్రుల్లాల స్నేహం గురించి తనకు ముందే తెలుసని చెప్పారు. అంజూ ఎప్పటికైనా భారత్ తిరిగివస్తుందని తనకు ముందే తెలుసని అన్నారు. అరవింద్ను వివాహం చేసుకున్న తర్వాత ఇరువురు క్రిస్టియన్ స్వీకరించారు. ఇదీ చదవండి: కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం.. అమిత్ షా కీలక ప్రకటన -
బ్రోకింగ్ స్టాక్స్ మారథాన్
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలోఈక్విటీల వైపు వస్తుండడంతో బ్రోకింగ్ స్టాక్స్ గడిచిన కొన్నేళ్లలో మంచి రాబడులు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా కరోనా సమయంలో వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్లో కొత్త ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపు అడుగులు వేసేలా చేశాయని చెప్పుకోవాలి. దీంతో ట్రేడింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. కరోనా వైరస్ సమసిపోయి, ఇంటి నుంచే పని విధానం కూడా కనుమరుగు అవుతున్నప్పటికీ, మరోవైపు ఈక్విటీ మార్కెట్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ట్రేడింగ్ పరిమాణం గణనీయంగా నమోదవుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఏంజెల్ వన్, 5పైసా క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, చాయిస్ ఇంటర్నేషనల్ స్టాక్స్ ర్యాలీ రిటైల్ ఇన్వెస్టర్ల జోరుకు నిదర్శంగా చెప్పుకోవచ్చు. ఏంజెల్ వన్ స్టాక్ ఏడాది కాలంలో 90 శాతం రాబడులను ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ 77 శాతం పెరిగింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సైతం 21 శాతం రాబడిని ఇచి్చంది. లిస్టెడ్ బ్రోకరేజీ సంస్థల విలువ వృద్ధి వెనుక రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని ప్రధానంగా చెప్పుకోవాలని ట్రేడ్బుల్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ భవీక్ పాటిల్ తెలిపారు. డీమ్యాట్ ఖాతాల్లో భారీ వృద్ధి కరోనా తర్వాత డీమ్యాట్ ఖాతాల్లో గణనీయ వృద్ధి కనిపించింది. అంతేకాదు భవిష్యత్తులోనూ వీటి పెరుగుదల కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది బ్రోకరేజీ పరిశ్రమకు అనుకూలమని, టెక్నాలజీలో వచి్చన పురోగతి నేపథ్యంలో బ్రోకరేజీ సంస్థలు మరింత మంది క్లయింట్లకు సేవలు అందించగలవని స్టాక్స్బాక్స్ సీఈవో వంశీ కృష్ట పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లో కనిపించిన నిరంతరాయ ర్యాలీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించినట్టు చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి డీమ్యాట్ ఖాతాల సంఖ్య 13.22 కోట్లకు చేరింది. వీటిల్లో అధిక శాతం గడిచిన 11 నెలల కాలంలో ప్రారంభమైనవే కావడం గమనించొచ్చు. ఒకవైపు స్టాక్ మార్కెట్ ర్యాలీకితోడు, మరోవైపు ఐపీవోల బంపర్ లిస్టింగ్ మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితాలూ అనుకూలమే సెపె్టంబర్ త్రైమాసికంలో బ్రోకరేజీ కంపెనీలు మంచి సానుకూలతలను చూసినట్టు ఎం.స్టాక్ (మిరే అస్సెట్) రిటైల్ స్ట్రాటజీ హెడ్ ధర్మేంద్ర లోహర్ చెప్పారు. సూచీలు సెప్టెంబర్లో ఆల్టైమ్ గరిష్టాలకు చేరుకోవడం, ఐపీవో ఇష్యూలు పెరగడాన్ని ప్రస్తావించారు. ‘‘సంప్రదాయ, బ్యాంక్ బ్రోకర్లు ఎక్కువగా లబ్ధి పొందారు. ఎందుకంటే వీరి ఆదాయం ప్రధానంగా ఈక్విటీల నుంచే ఉంటుంది. ఇది ఆయా సంస్థల లాభాలు, ఆదాయం వృద్ధికి దారితీశాయి’’అని ధర్మేంద్ర లోహర్ తెలిపారు. ‘‘కరోనా తర్వాత డీమ్యాట్ ఖాతాలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఎఫ్అండ్వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం కూడా పెరిగింది. దీంతో గడిచిన కొన్నేళ్లలో బ్రోకరేజీ సంస్థల ఆదాయం గణనీయంగా పెరిగేందుకు దోహదపడింది’’అని స్టాక్స్బాక్స్ కృష్ణ చెప్పారు. ఏంజెల్ వన్ సెపె్టంబర్ త్రైమాసికంలో 42 శాతం అధికంగా రూ.305 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుంది. ఒకే త్రైమాసికంలో అత్యధికంగా 21 లక్షల మంది క్లయింట్లకు పెంచుకుంది. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ లాభం సైతం 52 శాతం పెరిగింది. -
బొగ్గు బ్లాకులను ఎవరూ వాపసు చేయలేదు..
న్యూఢిల్లీ: అనుమతుల్లో జాప్యం కారణంగా వాణిజ్య, క్యాప్టివ్ బొగ్గు గనులను కొన్ని సంస్థలు వాపసు చేస్తున్నాయన్న వార్తలను కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా ఖండించారు. బొగ్గు బ్లాకులను పొందిన సంస్థలేవీ తిరిగి ఇచ్చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఆయా బ్లాకుల్లో పనులు ప్రణాళికకు అనుగుణంగానే సాగుతున్నాయని, తదనుగుణంగా ఉత్పత్తి కూడా ఉంటుందని పేర్కొన్నారు. పలు పనులు చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి సాధారణంగా బొగ్గు గని అందుబాటులోకి రావడానికి సుమారు 51 నెలలు పడుతుందని మీనా చెప్పారు. వేలంలో గనులు దక్కించుకున్న సంస్థలకు సత్వరం క్లియరెన్సులను ఇచ్చేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పర్యావరణ శాఖతో బొగ్గు శాఖ కలిసి పని చేస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో.. కమర్షియల్, క్యాప్టివ్ (సంస్థలు తమ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు తీసుకునే గనులు) గనుల వాటా 14 శాతంగా ఉంటోందని చెప్పారు. 152 వాణిజ్య, క్యాప్టివ్ గనులు ఉండగా.. ప్రస్తుతం 51 గనుల్లో ఉత్పత్తి జరుగుతోందన్నారు. తదుపరి విడత కింద నవంబర్ 15కి కాస్త అటూ ఇటూగా మరో 40 కొత్త బ్లాకులను వేలం వేయనున్నట్లు మీనా పేర్కొన్నారు. అటు కోల్ ఇండియా రెండు అనుబంధ సంస్థల (బీసీసీఎల్, సీఎంపీడీఐ) లిస్టింగ్పై ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని మీనా చెప్పారు. కోల్ ఇండియా పనితీరు బాగుందని, గత ఏడాది వ్యవధిలో కంపెనీ మార్కెట్ క్యాప్ 26 శాతం పెరిగిందని వివరించారు. బీసీసీఎల్, సీఎంపీడీఐలను ఒకదాని తర్వాత ఒకటిగా లిస్టింగ్ చేయనున్నట్లు ఆగస్టులో షేర్హోల్డర్ల వార్షిక సమావేశంలో కంపెనీ ప్రకటించింది. -
ఆదాయపన్ను రిటర్నుల్లో గణనీయ పెరుగుదల
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య ఎనిమిదేళ్ల కాలంలో 90 శాతం పెరిగిందని, 2021–22 అసెస్మెంట్ సంవత్సరంలో (2020–21 ఆర్థిక సంవత్సరానికి) 6.37 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. వ్యక్తులు జారీ చేసే రిటర్నులు 2013– 14 అసెస్మెంట్ సంవత్సరానికి 3.36 కోట్లుగా ఉంటే, అది 2021–22 నాటికి 6.37 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. 2023–24 అసెస్మెంట్ సంవత్సరం (2022–23 ఆర్థిక సంవత్సరం)లోనూ 7.41 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్టు తెలిపింది. ఇందులో మొదటిసారి ఐటీఆర్లు దాఖలు చేసిన వారు 53 లక్షల మంది ఉన్నట్టు పేర్కొంది. ముఖ్యంగా రూ.5–10 లక్షల ఆదాయం వర్గం వారి రిటర్నులు.. 2013–14 అసెస్మెంట్ సంవత్సరం నుంచి 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి 295 శాతం పెరిగాయి. రూ.10–25 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారి రిటర్నులు 291 శాతం పెరిగాయి. ఈ వివరాలను ఆదాయపన్ను శాఖ అత్యున్నత నిర్ణయ విభాగం సీబీడీటీ ప్రకటించింది. రూ.5 లక్షల్లోపు ఆదాయం కలిగి రిటర్నులు వేసే వారి సంఖ్య 2.62 కోట్ల నుంచి 3.47 కోట్లకు పెరిగింది. స్థూల ఆదాయం పరంగా టాప్ 1 శాతం పరిధిలోని పన్ను రిటర్నులు వేసే వారు 15.9 శాతం నుంచి 14.6 శాతానికి తగ్గారు. దిగువ నుంచి 25 శాతం ఆదాయం కలిగిన వారి రిటర్నులు 8.3 శాతం నుంచి 8.4 శాతానికి పెరిగాయి. ఇక మధ్యస్థ ఆదాయం కలిగిన 74 శాతం గ్రూప్ పరిధిలోని పన్ను చెల్లింపుదారుల రిటర్నులు 75.8 శాతం నుంచి 77 శాతానికి పెరిగాయి. మధ్య తరగతి వాసుల రిటర్నులు ప్రధానంగా పెరిగినట్టు తెలుస్తోంది. -
212 మంది భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: హమాస్ మిలిటెంట్ల దాడులతో రణరంగంగా మారిన ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. దాదాపు 212 మందితో టెల్ అవివ్ నుంచి బయలుదేరిన మొదటి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. వీరిలో చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. విమానంలో వచ్చిన భారతీయులకు ఎయిర్పోర్టులో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వారికి స్వాగతం పలికారు. కరచాలనం చేశారు. ఇజ్రాయెల్లో తమకు ఎదురైన భయానక అనుభవాలను భారతీయులు పంచుకున్నారు. సైరన్ల మోతతో నిద్రలేచేవాళ్లమని, ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపామని, షెల్టర్లలో తలదాచుకున్నామని శశ్వంత్ సింగ్ అనే వ్యక్తి చెప్పాడు. ఆయన తన భార్యతో కలిసి ఢిల్లీకి చేరుకున్నాడు. తమను క్షేమంగా స్వదేశానికి చేర్చిన భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. ఇజ్రాయెల్లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వెస్ట్బ్యాంకు, గాజాలోనూ కొందరు భారతీయులు నివసిస్తున్నారు. ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా రెండో విమానం శుక్రవారం సాయంత్రం టెల్ అవివ్ నుంచి బయలుదేరింది. శనివారం భారత్కు చేరుకోనుంది. ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న భారతీయులు -
తక్కువ రిస్క్.. మెరుగైన రాబడులకు వ్యాల్యూ ఫండ్స్
రిస్క్ తక్కువగా ఉండాలి.. అదే సమయంలో మెరుగైన రాబడులు కావాలని కోరుకునే వారు వ్యాల్యూ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. వ్యాల్యూ ఫండ్స్ అన్నవి ఒక కంపెనీ వ్యాపారం, మార్కెట్ వాటా, ఆర్థిక బలాలు ఇలా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత వాస్తవ విలువ కంటే షేరు ధరలు తక్కువగా లభిస్తున్న సమయంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్లు వ్యాల్యూఫండ్స్లో దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి ఇవి దీర్ఘకాలంలోనే ఎన్నో రెట్ల ప్రతిఫలాన్ని ఇస్తుంటాయి. స్వల్పకాలంలో గణనీయమైన లేదా మెరుగైన రాబడులను వీటిల్లో ఆశించడం సమంజసం కాదు. పనితీరు ఈ పథకం 2005లో మొదలైంది. అప్పటి నుంచి చూస్తే వార్షికంగా ఇచ్చిన ప్రతిఫలం 16 శాతంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 61 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో 29 శాతం, ఐదేళ్లలో 17.5 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 18 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. వ్యాల్యూ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోలిస్తే నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్లో రాబడులు 2–3 శాతం అధికంగా ఉన్నాయి. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.5575 కోట్ల పెట్టుబడులున్నాయి. ఈక్విటీ ఫండ్స్లో దీర్ఘకాల రాబడులు 12 శాతానికి పైన ఉంటే మెరుగైన పనితీరుగా పరిగణనలోకి తీసుకోవచ్చు. 18 శాతానికి పైన ఉంటే అద్భుతమైన పనితీరుగా చెబుతారు. పెట్టుబడుల విధానం స్మాల్, మిడ్, లార్జ్క్యాప్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆకర్షణీయమైన విలువల వద్ద లభించే స్టాక్స్ను ఈ పథకం గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. కాకపోతే లార్జ్క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేస్తుంది. ప్రస్తుతానికి తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 4 శాతాన్ని నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉండగా.. 96 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. లార్జ్క్యాప్లో ప్రస్తుతానికి 64 శాతానికి పైగా పెట్టుబడులున్నాయి. మిడ్క్యాప్లో 29 శాతం, స్మాల్క్యాప్ స్టాక్స్లో 7 శాతానికి పైనే పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీల్లో తీవ్ర అస్థిరతలు కనిపించిన సందర్భంలో పెట్టుబడులను తగ్గించుకుకోవడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2020 మార్చి నుంచి జూన్ మధ్య ఈ విధానాన్నే పాటించింది. ఆ సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకున్న ఈ పథకం.. ఆ తర్వాతి కాలంలో తిరిగి ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ బాటలో నడుస్తున్న తరుణంలో కేటాయింపులను పెంచింది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్ఫోలియోలో మొత్తం 72 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. 32 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీలకు 9 శాతం, నిర్మాణ రంగ కంపెనీలకు 8 శాతం, టెక్నాలజీ కంపెనీలకూ 8 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్ చేరి..
భోపాల్: మధ్యప్రదేశ్లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అనుచరుడు సమందర్ పటేల్ కాంగ్రెస్లో చేరారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు. తన అనుచరులతో కలిసి సమందర్ కాంగ్రెస్లో శుక్రవారం చేరారు. 'కాంగ్రెస్ పార్టీ భావాజాలంపై ఇష్టంతోనే సమందర్ చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజాయితీ నచ్చే ఇక్కడి వచ్చారు. ఇదే నిజాన్ని ప్రజలకు కూడా చెబుతారు. 2018లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. కానీ బీజేపీ కుట్రలు పన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా అయ్యారు. బీజేపీ అధికారంలో నేరాలు, మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. శివరాజ్ ప్రభుత్వానికి ప్రజలు స్వస్తి పలకాలని అనుకుంటున్నారు.' అని కమల్ నాథ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తిరిగిరావడంపై సమందర్ పటేల్ ఆనందం వ్యక్తం చేశారు. సింధియా సహచరులు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగివెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలో కాంగ్రెస్ తరుపున శివపురి జిల్లాకు అధ్యక్షునిగా పనిచేసిన బైజ్నాథ్ సింగ్ యాదవ్ కూడా సింధియాను వదిలి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. సింధియా మరో అనుచరుడు రాకేశ్ గుప్తా కూడా ఇటీవలే బీజేపీని వదలి కాంగ్రెస్లో చేరారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదీ చదవండి: మణిపూర్లో జీ20 సదస్సును జరపండి.. కేంద్రానికి అఖిలేష్ కౌంటర్.. -
రెట్టింపు స్థాయిలో రిటర్నుల దాఖలు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ రిటర్నులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల కాలంలో గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో దాఖలయ్యాయి. ఆడిటింగ్ అవసరం లేని రిటర్నుల దాఖలుకు (వ్యక్తులు) గడువు జూలై 31తో ముగిసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొత్తం 1.36 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ఇక రిటర్నుల దాఖలుకు చివరి నెల జూలైలో మొత్తం 5.41 కోట్ల రిటర్నులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ నుంచి జూలై 31 నాటికి 6.77 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. 2022లో ఏప్రిల్–జూన్ మధ్య ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్లో 70.34 లక్షల రిటర్నులు దాఖలు కాగా, 2023 ఏప్రిల్–జూన్ మధ్య 1.36 కోట్ల రిటర్నులు నమోదయ్యాయి. ఈ ఏడాది అధిక సంఖ్యలో రిటర్నులు దాఖలు కావడానికి సోషల్ మీడియా ప్రచారం, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా రిటర్నులు దాఖలు చేసేలా ప్రోత్సహించడమేనని ఆదాయపన్ను శాఖ తెలిపింది. పెరిగిన కోటీశ్వరులు రూ.కోటికి పైన ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2022 మార్చితో ముగిసిన రెండేళ్ల కాలంలో రెట్టింపై 1.69 లక్షలకు చేరింది. 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో మొత్తం 1,69,890 మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో రూ.కోటికి పైన ఆదాయం చూపించారు. 2021–22 అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) రిటర్నుల్లో రూ.కోటికి పైన ఆదాయం పేర్కొన్న వారు 1,14,446 మంది ఉన్నారు. 2020–21 అసెస్మెంట్ సంవత్సరంలో వీరి సంఖ్య 81,653గానే ఉంది. 2022–23 ఏవైలో వ్యక్తులు, కంపెనీలు, ట్రస్ట్లు, సంస్థలు ఇలా అన్ని వర్గాలూ కలసి రూ.కోటికి పైన ఆదాయం వెల్లడించిన వారి సంఖ్య 2.69 లక్షలుగా ఉంది. 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. 2021–22లో ఏవైలో 7.14 కోట్లు, 2020–21 ఏవైలో 7.39 కోట్ల చొప్పున రిటర్నులు వచ్చాయి. -
ఐటీ రిటర్న్స్..తెలంగాణ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐటీ రిటర్నులు అదరగొడుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ వర్గాలు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య (ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు)లో 25 శాతం వృద్ధి నమోదు అయ్యింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారు 21,58,703 మంది కాగా, 2022–23లో ఈ సంఖ్య 26,92,185కు చేరింది. అంటే నాలుగేళ్లలో 5.34 లక్షల మంది ఐటీ రిటర్నీలు పెరిగారన్న మాట. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్, హరియాణాలో 20 శాతానికి కొంచెం అటూ ఇటుగా పన్ను చెల్లింపుదారులు పెరిగారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు కలిపినా 15 శాతమే. కానీ మన రాష్ట్రంలో మాత్రం గత నాలుగేళ్లలో 25 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం గమనార్హం. అయితే తెలంగాణ కంటే ఎక్కువమంది పన్ను చెల్లింపుదారులున్న రాష్ట్రాలు కూడా పదికి పైగానే ఉన్నాయి. ఇందులో దక్షిణాదికి చెందిన కర్ణాటక, తమిళనాడు ఉన్నా..జనాభాతో పోలిస్తే అవి తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాలు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలను కలిపితే ఐటీ రిటర్నీల సంఖ్య దక్షిణాదిలోనే ఎక్కువగా 48.5 లక్షలు దాటడం గమనార్హం. కాగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మహారాష్ట్రలో 1.13 కోట్ల మంది రిటర్నీలు ఉన్నారు. పన్ను చెల్లింపుదారులు కోటి దాటిన ఏకైక రాష్ట్రం కూడా ఇదే. ఆ తర్వాత గుజరాత్, యూపీ, రాజస్తాన్ రాష్ట్రాలున్నాయి. దేశవ్యాప్తంగా 7,40,09,046 మంది రిటర్నీలు దేశంలోనే రిటర్నీలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరం. ఇక్కడ కేవలం 7,371 మంది మాత్రమే ఏటా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ 3,808 మంది మాత్రమే పన్నులు చెల్లిస్తుండగా, నాలుగేళ్లలో 3,500 మంది పెరిగారు. కేంద్ర పాలిత రాష్ట్రమైన లక్షద్వీప్లో గత నాలుగేళ్లతో పోల్చుకుంటే రిటర్నీల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 2019–20లో 4,760 మంది రిటర్నులు దాఖలు చేయగా, 2022–23లో 4,454 మంది మాత్రమే తమ ఆదాయ వివరాలను సమర్పించారు. కనీసం లక్ష మంది కూడా రిటర్నులు దాఖలు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, డామన్ డయ్యూ, దాద్రా నాగర్హవేలి, అరుణాచల్ప్రదేశ్, అండమాన్ దీవులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 2022–23లో 7,40,09,046గా నమోదయింది. (నోట్: ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారందరూ పన్ను చెల్లింపుదారులు కాదు. ఇక చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే పన్ను చెల్లించని వారు కూడా రిటర్నులు దాఖలు చేస్తారు. మరోవైపు దాదాపుగా అదే సంఖ్యలో పన్ను చెల్లిస్తున్నా కొందరు రిటర్నులు దాఖలు చేయలేరు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చే రిటర్నీల వివరాలనే పన్ను చెల్లింపు దారుల వివరాలుగా పరిగణించవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు) -
మెరుగైన రాబడులకు హైబ్రీడ్ వ్యూహం..
ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాలు వారెన్ బఫెట్ కావచ్చు.. హోవార్డ్ మార్క్స్ కావచ్చు.. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులు అందుకునేందుకు అధిక అవకాశాలు ఉంటాయని చెబుతారు. ఈ విషయంలో హైబ్రీడ్ ఫండ్స్కి మెరుగైన రికార్డు ఉంది. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్ను గుర్తించి, ఇన్వెస్ట్ చేయడంలో ఇవి బాగా రాణిస్తున్నాయి. రిసు్కలకు తగ్గట్లుగా హైబ్రీడ్ వ్యూహాలు మంచి రాబడులు అందించగలుగుతున్నాయి. హైబ్రీడ్ ఫండ్స్లో ప్రధానంగా అయిదు రకాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్ధ్యాలను బట్టి వీటిని పరిశీలించవచ్చు. అవేంటంటే.. ► కన్జర్వేటివ్ హైబ్రీడ్: ఈ ఫండ్స్ 10–25 శాతం ఈక్విటీల్లోను, మిగతా 75–90 శాతం మొత్తాన్ని డెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్నవారు, డెట్కు ప్రాధాన్యం ఇస్తూనే కాస్త అధిక రాబడుల కోసం ఈక్విటీల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేయదల్చుకున్నవారికి ఇవి అనువైనవిగా ఉంటాయి. ► అగ్రెసివ్ హైబ్రీడ్: ఈ కేటగిరీ స్కీముల కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో, మిగతా 20–35 శాతాన్ని డెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్కు సామర్ధ్యాలు ఉన్న ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవి. ► బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్: ఈ ఫండ్స్లో అసెట్స్కు కేటాయింపులు డైనమిక్గా మారుతుంటాయి. కాబట్టి మార్కెట్ పరిస్థితులను బట్టి పోర్ట్ఫోలియోలోని 0–100 శాతం మొత్తాన్ని పూర్తిగా ఈక్విటీల్లోనైనా లేదా డెట్లోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక మోస్తరు రిస్కు సామరŠాధ్యలు ఉన్నవారికి ఇవి అనువైనవి. ► మలీ్ట–అసెట్ అలొకేషన్: ఈ కేటగిరీ ఫండ్లు ఈక్విటీ, డెట్, బంగారం/వెండి, రీట్స్, ఇని్వట్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ అసెట్స్ అన్నీ పరస్పరం సంబంధం లేకుండా వివిధ రకాలైనవి కావడం వల్ల తగు విధమైన డైవర్సిఫికేషన్ వీలవుతుంది. రాబడులూ మెరుగ్గా ఉండగలవు. ఉదాహరణకు గతేడాది బెంచ్మార్క్ రాబడులు 5.8 శాతం స్థాయిలో ఉండగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మలీ్ట–అసెట్ ఫండ్ గతేడాది 16.8 శాతం రాబడులు ఇచి్చంది. ► ఈక్విటీ సేవింగ్స్: ఈ ఫండ్స్ ఈక్విటీ, తత్సంబంధ సాధనాల్లో 65 శాతం వరకు, డెట్లో 10 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ విభాగంలో చాలా మటుకు ఫండ్స్ డెరివేటివ్స్ను ఉపయోగిస్తాయి. తద్వారా రిస్కును తగ్గించడంపై దృష్టి పెడతాయి. ఇన్వెస్టర్లకు డెట్కన్నా మెరుగ్గా, ఈక్విటీ కన్నా కాస్త తక్కువగా రాబడులను అందించేందుకు ఈ తరహా ఫండ్స్ ప్రయతి్నస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్న వారు వీటిని పరిశీలించవచ్చు. మలీ్ట–అసెట్ విధానం పాటిస్తాయి కాబట్టి ఓపికగా ఉండే ఇన్వెస్టర్లకు రిసు్కలకు తగినట్లుగా మెరుగైన రాబడులను అందించేందుకు హైబ్రీడ్ ఫండ్స్ ప్రయతి్నస్తాయి. -
తక్కువ రిస్క్.. మంచి రాబడి - ఉందిగా సరైన మార్గం!
మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడులకు తక్కువ రిస్క్ను ఆశించే వారు, దీర్ఘకాలంలో సంప్రదాయ ఎఫ్డీలు, పోస్టాఫీసు పథకాల కంటే కాస్తంత అధికరాబడులు కోరుకునే వారు హైబ్రిడ్ ఈక్విటీ పథకాలను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఎస్బీఐ హైబ్రిడ్ ఈక్విటీ కూడా ఒకటి. ఈ పథకం ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. రాబడి మాత్రం అచ్చమైన డెట్ సాధనాలకు మించి ఉంటుంది. అదే సమయంలో అచ్చమైన ఈక్విటీ పథకం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ పథకం కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో పెడుతుంది. బుల్ మార్కెట్లో, బేర్ మార్కెట్లోనూ పనితీరు పరంగా ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రాబడులు ఈ పథకం రాబడులు గడచిన ఏడాది కాలంలో 14.52 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో చూసుకుంటే సగటున ఏటా 17.74 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఐదేళ్ల కాలంలో వార్షికంగా 11.70 శాతం, ఏడేళ్లలోనూ ఏటా 11.55 శాతం, పదేళ్లలో 14.37 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఉంది. 1995 డిసెంబర్ 31న ఈ పథకం ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 15.43 శాతంగా ఉన్నాయి. డెట్తో కూడిన పెట్టుబడులు కనుక దీర్ఘకాలంలో వార్షిక రాబడి 11–12 శాతం చొప్పున ఉంటే మెరుగైనదిగా పరిగణించొచ్చు. అచ్చమైన ఈక్విటీ కాకుండా, ఈక్విటీ–డెట్ కలయికతో కూడిన సాధనాల్లో దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేద్దామని అనుకునే వారు ఈ విభాగాన్ని పరిశీలించొచ్చు. ఇంతకంటే అధిక రాబడి కోరుకునే వారికి అచ్చమైన ఈక్విటీ పథకాలే సూచనీయం. (ఇదీ చదవండి: గతంలో టెస్లాను భారత్ తిరస్కరించింది అందుకేనా?) పెట్టుబడుల విధానం ఈ పథకం పెట్టుబడుల కేటాయింపు సమయోచితంగా ఉంటుంది. ఆటుపోట్ల సమయాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ను తగ్గించుకుని నగదు నిల్వలు పెంచుకుంటుంది. 2011 మార్కెట్ కరెక్షన్లో, 2015, 2020 ఒడిదుడుకుల సమయాల్లో ఈక్విటీలకు ఎక్స్పోజర్ తగ్గించుకోవడం వల్ల ఈ పథకంలో నష్టాలు పరిమితం అయ్యాయి. 2014 బాండ్ మార్కెట్ ర్యాలీ ప్రయోజనాలను సైతం పొందింది. ఈ విధమైన వ్యూహాలతో నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు తీసుకొచ్చేలా పథకం పరిశోధనా బృందం పనిచేస్తుంటుంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.58వేల కోట్లకు పైనే పెట్టుబడులు ఉన్నాయి. వీటిల్లో 75.80 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించింది. డెట్ పెట్టుబడులు 18.72 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాలకు కూడా ఒక శాతం లోపు కేటాయించగా, 4.61 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 78 శాతం పెట్టుబడులు లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీలకు 21 శాతం కేటాయింపులు చేసింది. స్మాల్క్యాప్ కంపెనీల్లో కేవలం 0.73 శాతమే ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఈక్విటీల్లోనూ రిస్క్ను తగ్గించే విధంగా కేటాయింపులు ఉన్నాయి. 18.72 శాతం డెట్ కేటాయింపుల్లోనూ అధిక క్రెడిట్ రేటింగ్ కలిగిన సాధనాల్లోనే 14 శాతానికి పైన పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో మొత్తం 36 స్టాక్స్ ఉన్నాయి. ఈక్విటీల్లో అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 28 శాతం కేటాయింపులు చేయగా, సేవల రంగ కంపెనీలకు 7 శాతానికి పైన కేటాయించింది. హెల్త్కేర్లో 6 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 6 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
ఆకర్షణీయంగా ఆల్టర్నేటివ్ ఫండ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలకు దేశీయంగా డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు దీటుగా, కొన్నిసార్లు అంతకు మించిన రాబడులు అందిస్తూ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) ఆకట్టుకుంటున్నాయి. దీంతో వీటిలో పెట్టుబడులపై దేశీ ఇన్వెస్టర్లలోనూ ఆసక్తి పెరుగుతోంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం దాదాపు రెండేళ్ల క్రితం వరకు రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న ఏఐఎఫ్ల నిధులు గతేడాది ఆఖరు నాటికి రూ. 7 లక్షల కోట్లకు చేరాయి. రాబోయే రోజుల్లో ఇది 4–5 రెట్లు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ. 40 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ స్థాయికి చేరవచ్చని లెక్క వేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం దాకా ఎక్కువగా విదేశాల నుంచి పెట్టుబడులు వస్తుండగా ప్రస్తుతం 80– 90% నిధులు దేశీయంగా సమీకరించినవే ఉంటున్నాయి. అత్యంత సంపన్నులతో పాటు ఒక మోస్త రు ఇన్వెస్టర్లు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మూడు రకాలు: ఈక్విటీలు, బాండ్లు, రియల్టీ వంటి సంప్రదాయ సాధనాలకే పరిమితం కాకుండా ఇతరత్రా మరిన్ని ప్రత్యామ్నాయ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను అందుకోవాలనుకునే ఇన్వెస్టర్ల కోసం ఉద్దేశించినవి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు. సంప్రదాయ ఫండ్స్తో పోలిస్తే భిన్నమైన వ్యూహాలతో, విభిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను ఆర్జించడం వీటి లక్ష్యం. రిస్కులు ఉన్నప్పటికీ దానికి తగ్గట్లుగా మరింత రాబడులు పొందేందుకు అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా మూడు కేటగిరీల కింద దాదాపు 4,000 పైచిలుకు ఏఐఎఫ్లు ఉన్నాయి. ఏఐఎఫ్ల్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. కేటగిరీ 1 తరహా ఏఐఎఫ్లు ప్రధానంగా స్టార్టప్లు, చిన్న .. మధ్య తరహా సంస్థలు లేదా లాభదాయకమైనవిగా ప్రభుత్వం పరిగణించే రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక రెండో కేటగిరీ ఫండ్లో ప్రైవేట్ ఈక్విటీ, డెట్ ఫండ్స్ లాంటివి ఉంటాయి. మూడో కేటగిరీలో హెడ్జ్ ఫండ్స్, స్వల్పకాలికంగా రాబడులు అందించే ఉద్దేశంతో ఏర్పాటయ్యే ఫండ్స్ మొదలైనవి ఉంటాయి. తొలి రెండు కేటగిరీల్లోని ఏఐఎఫ్ స్కీములు క్లోజ్ ఎండెడ్గా ఉంటాయి. కాల వ్యవధి పరిమితి కనీసం మూడేళ్లుగా ఉంటుంది. మూడో కేటరిగీ ఫండ్లు ఓపెన్ ఎండెడ్ లేదా క్లోజ్ ఎండెడ్గానైనా ఉండొచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ఏఐఎఫ్ బెంచ్మార్క్ నివేదిక ప్రకారం మూడో కేటగిరీ ఏఐఎఫ్లు కాల వ్యవధిని బట్టి 10 శాతం నుంచి 23 శాతం వరకు రాబడులు ఇచ్చాయి. టెక్నాలజీతో అధిక రాబడులకు ఆస్కారం.. సరైన వ్యూహాలు పాటిస్తే ఏఐఎఫ్ల ద్వారా మార్కెట్కు మించి రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉందని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్స్బజార్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) భూపాల్ నానావత్ తెలిపారు. ‘‘దాదాపు రూ. 3,900 కోట్ల ఫండ్స్ నిర్వహిస్తున్నాం. కొత్తగా మరో రూ. 1,000 కోట్ల ఫండ్కి నిధులను సమీకరిస్తున్నాం. ఏఐఎఫ్ 3 కేటగిరీ కింద లిస్టెడ్ కంపెనీల్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము. అల్గోరిథమ్ల వంటి అధునాతన సాంకేతికతలతో, రోబోటిక్ సిస్టమ్లతో రిస్కులను సమర్ధంగా ఎదుర్కొనే వ్యూహాలను అమలుపర్చడం ద్వారా ఇన్వెస్టర్లకు అధిక రాబడులను అందిస్తున్నాం. దీనితో 30 శాతం పైగా రాబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది’’ అని ఆయన వివరించారు. వీటిలో రూ. కోటి నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చని, హెడ్జ్ ఫండ్స్ కేటగిరీ కింద షేర్లు, బాండ్లు, డెరివేటివ్లు, కమోడిటీలు వంటి విస్తృత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని తెలిపారు. ఫిక్సిడ్ డిపాజిట్లు, మార్కెట్లకు మించిన రాబడులు అందించే సాధనాలేవీ లేవంటూ ఇన్వెస్టర్లలో నెలకొన్న అపోహలను తొలగించేందుకు, ఏఐఎఫ్లు వంటి సాధనాలపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామని నానావత్ చెప్పారు. - భూపాల్ నానావత్, షేర్స్బజార్ ఎండీ -
ఫండ్ రివ్యూ: ఈ ఫండ్తో రిస్క్ తక్కువ.. మెరుగైన రాబడులు
ఈక్విటీలు ఇటీవల రెండు నెలల కాలంలో ర్యాలీ చేసి ఆల్టైమ్ గరిష్ట స్థాయి సమీపానికి చేరుకున్నాయి. ఈ సమయంలో మార్కెట్లోకి ప్రవేశించడం రిస్క్గా ఇన్వెస్టర్లు భావించొచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే అని కాదు, ఏ సమయంలో అయినా పెట్టుబడులు పెట్టుకునేందుకు అనుకూలమైన విభాగమే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు, స్థూల ఆర్థిక అంశాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య కేటాయింపులు మారుస్తూ, రిస్క్ తగ్గించి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా ఇవి పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ టాప్ పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం 16 ఏళ్ల స్థిరమైన రాబడుల చరిత్రతో బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగంలో మెరుగైన స్థానంలో ఉంది. స్టాక్స్, బాండ్స్, డెరివేటివ్స్ (హెడ్జింగ్) మధ్య కేటాయింపులు మారుస్తూ, తక్కువ రిస్క్తో స్థిరమైన రాబడులు అందిస్తోంది. ఈ పథకం పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 13.5 శాతం చొప్పున రాబడులు అందించింది. అదే ఐదేళ్ల కాలంలో రాబడులు చూస్తే ఏటా 11 శాతానికి పైనే ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 15 శాతానికి పైనే ఉన్నాయి. ఏడాది కాలంలో 13.72 శాతం రాబడి తెచ్చి పెట్టింది. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో రాబడుల పరంగా ఈ పథకం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగం సగటు రాబడుల కంటే మెరుగైన పనితీరు చూపించింది. 2–3 శాతం అధిక రాబడులు అందించింది. ఈ కాలంలో ఈక్విటీ కేటాయింపులు 49 శాతంగానే ఉన్నాయి. అయినా కానీ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంతో మెరుగైన రాబడులు అందించడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. క్రిసిల్ హైబ్రిడ్ 50ప్లస్50 మోడరేట్ ఇండెక్స్ను మూడు, ఐదేళ్ల కాలం రాబడుల పరంగా ఈ పథకం అధిగమించింది. బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వారు అచ్చమైన ఈక్విటీ పథకాల కంటే తక్కువగా, అదే సమయంలో డెట్ కంటే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు. అంటే ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు వీటితో సొంతం అవుతాయి. ఈ పథకంలో పదేళ్ల కాలంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎక్స్ఐఆర్ఆర్ రాబడి వార్షికంగా 11.95 శాతం చొప్పున ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్ఫోలియో సెబీ నిబంధనల ప్రకారం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీ, డెట్లో ఎందులో అయినా సున్నా నుంచి నూరు శాతం వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంటే పెట్టుబడుల విషయంలో వీటికి పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈక్విటీ, డెట్ విభాగాలకు కేటాయింపులు చేసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్కు కష్టమైన పనే. ఆ పనిని ఈ పథకం చేసి పెడుతుంది. ఈక్విటీ, డెట్ మధ్య మార్పులు చేర్పులు చేస్తూ ఈ పథకం దీర్ఘకాలంలో సమర్థవంతమైన, విశ్వసనీయమైన పనితీరు చూపిస్తోంది. స్టాక్స్ అధిక విలువలకు చేరాయా? లేక చౌకగా ఉన్నాయా? అన్నది నిర్ణయించుకునేందుకు తనదైన నమూనాను ఈ పథకం అనుసరిస్తుంది. 2020 మార్చిలో సెన్సెక్స్ గణనీయంగా పడిపోయినప్పుడు నికర ఈక్విటీ పెట్టుబడులను 73.7 శాతానికి పెంచుకుంది. ఆ తర్వాత మార్కెట్ ర్యాలీ చేయడంతో 2021 నవంబర్ నాటికి ఈక్విటీ పెట్టుబడులను 30 శాతానికి తగ్గించుకుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.46,534 కోట్ల పెట్టుబడులు ఉంటే, అందులో ఈక్విటీ కేటాయింపులు 40.9 శాతంగా, డెట్ కేటాయింపులు 24 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాల్లో 32.54 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ రిస్క్ను దాదాపు తగ్గించేందుకు 91 శాతం మేర లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. మిడ్క్యాప్నకు 8.52 శాతం కేటాయింపులు చేసింది. డెట్ విభాగంలోనూ అధిక నాణ్యత కలిగిన ఏఏఏ, ఏఏప్లస్ బాండ్లకే కేటాయింపులు ఎక్కువ చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ 5.94 ఐసీఐసీఐ బ్యాంక్ 5 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.85 ఇన్ఫోసిస్ 3.66 టీవీఎస్ మోటార్ 2.81 మారుతి సుజుకీ 2.57 హెచ్డీఎఫ్సీ 2.44 భారతీ ఎయిర్టెల్ 2.44 ఎస్బీఐ 2.31 యాక్సిస్ బ్యాంక్ 1.88 -
ఈక్విటీల్లో ఫండ్స్ పెట్టుబడులు రూ.2,400 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మే నెలలో ఈక్విటీల్లో కొనుగోళ్ల బాట పట్టాయి. ఏప్రిల్ నెలలో నికరంగా రూ.4,553 కోట్లను ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) వెనక్కి తీసుకోగా, మే నెలలో రూ.2,446 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడం, జీడీపీ వృద్ధి బలంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు చెబుతున్నారు. మే నెలలో ఈక్విటీ పెట్టుబడుల విషయంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు), దేశీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మధ్య చాలా అంతరం నెలకొంది. ఎఫ్పీఐలు ఏకంగా రూ.43,838 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, మ్యూచువల్ ఫండ్స్ రూ.2,446 కోట్ల పెట్టుబడులకే పరిమితమైనట్టు సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్లోనూ ఎఫ్పీఐలు భారత ఈక్విటీల్లో రూ.11,631 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఈ తాత్కాలిక మార్పు ఈక్విటీలకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు భావిస్తున్నారు. ‘‘స్థిరమైన జీడీపీ వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, ఇన్వెస్టర్కు అనుకూలమైన విధానాలు మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు తోడ్పడ్డాయి. ఎఫ్పీఐలు, మ్యూచువల్ ఫండ్స్ ఒకరికొకరు సమతుల్యంగా వ్యవహరించారు. ఎఫ్పీఐలు విక్రయించినప్పుడు దేశీ ఇనిస్టిట్యూషన్స్ (మ్యూచువల్ ఫండ్స్ సహా) కొనుగోళ్లకు ముందుకు వచ్చాయి’’అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ఎఫ్పీఐలు, దేశీ ఇనిస్టిట్యూషన్స్ మధ్య వైరుధ్యం ఉన్నప్పటికీ గడిచిన 11 నెలలుగా మార్కెట్లు మొత్తం మీద సానుకూలంగా ట్రేడ్ అవుతుండడం గమనార్హం. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగమనంపై ఆందోళనలు నెలకొనగా, దీర్ఘకాలంలో భారత్కు మెరుగైన వృద్ధి అవకాశాలు ఉన్న విషయాన్ని ఎప్సిలాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్రావు గుర్తు చేశారు. -
సూచీలకు మళ్లీ లాభాలు
ముంబై: ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత దేశీయ స్టాక్ సూచీలకు గురువారం మళ్లీ లాభాలొచ్చాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ దఫా చివరిది కావచ్చంటూ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన కమిటి నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల విడుదలైన దేశీయ కార్పొరేట్ మార్చి త్రైమాసిక ఫలితాలు మెప్పించాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1% వరకు బలపడి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 65 పాయింట్లు పెరిగి 61,258 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 605 పాయింట్లు ర్యాలీ చేసి 61,797 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 556 పాయింట్ల లాభంతో 61,749 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 177 పాయింట్లు దూసుకెళ్లి 18,267 గరిష్టాన్ని తాకింది. చివరికి 166 పాయింట్లు బలపడి 18,256 వద్ద నిలిచింది. విస్తృత స్థాయి మార్కెట్లో ఒక్క ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.83%, 0.82% చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1415 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.442 కోట్ల షేర్లను కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం విలువ రూ.2.21 లక్షల కోట్లు పెరిగి 275.13 లక్షల కోట్లకు చేరింది. ఆసియాలో షాంఘై, హాంగ్కాంగ్ సూచీలు లాభపడగా., కొరియా ఇండెక్స్ నష్టపోయింది. ఈసీబీ పావుశాతం వడ్డీరేట్ల పెంపుతో యూరప్ మార్కెట్లు 0.50 – 1% క్షీణించాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీస్ ‘బై’ రేటింగ్తో ఫుడ్ డెలీవరీ దిగ్గజం జొమాటో షేరు 3% పైగా లాభపడి రూ.65.63 వద్ద స్థిరపడింది. ► మార్చి త్రైమాసికంలో నికరలాభం 13% బజాజ్ కన్జూమర్ కేర్ షేరు నాలుగుశాతం పెరిగి రూ.172 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో పదిశాతం దూసుకెళ్లి రూ.182 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ► అంచనాలకు మించి మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించడంతో ఏబీబీ షేరు ఐదున్నర శాతం బలపడి రూ.3,646 వద్ద స్థిరపడింది. -
రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. గరిష్ట రాబడులు ఎలా?
నా వయసు 38 ఏళ్లు. కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్నాను. 40 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవాలన్నది నా ప్రణాళిక. కనుక రిటైర్మెంట్ కోసం ఎంత ఫండ్ కావాలో తెలుసుకుందామంటే ఆన్లైన్లో ఎన్నో రిటైర్మెంట్ కాలిక్యులేటర్లు ఉన్నాయి. వీటిల్లో కచ్చితమైన నంబర్లు చూపించేది ఏదైనా ఉందా? – విష్ణు నివాస్ ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. ద్రవ్యోల్బణం మీ జీవన వ్యయాలను పెంచుతుంది. రిటైర్మెంట్కు ఎంత కావాలనే విషయాన్ని ఇదే క్లిష్టంగా మార్చేస్తుంది. ఇందుకోసం ఓ ఆచరణాత్మక సూత్రాన్ని అనుసరించొచ్చు. ప్రస్తుతం వార్షిక వ్యయాలు ఎంత? ఈ మొత్తానికి ఏటా 6 శాతం ద్రవ్యోల్బణాన్ని రిటైర్మెట్ పీరియడ్ వరకు కలపాలి. రిటైర్మెంట్ తర్వాత జీవించి ఉండే కాలంతో (అంచనా) దీన్ని హెచ్చించాలి. ఉదాహరణకు ప్రస్తుతం మీకు నెలవారీ ఖర్చులు రూ.50వేలు ఉన్నాయనుకుంటే, ఏడాదికి రూ.6 లక్షలు అవుతుంది. పదేళ్లలో రిటైర్ అవుతారు. ఈ పదేళ్ల కాలానికి 6 శాతం ద్రవ్యోల్బణం కలిపి చూస్తే ప్రస్తుతం ఉన్న వార్షిక జీవన వ్యయం రూ.6 లక్షలు కాస్తా, పదేళ్ల తర్వాత 10.74 లక్షలకు పెరుగుతుంది. మీరు 48 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుని, 80 ఏళ్ల వరకు జీవించి ఉంటారని అనుకుంటే, అప్పుడు రిటైర్మెంట్ తర్వాత 32 ఏళ్ల జీవన కాలం ఉంటుంది. 32 ఏళ్లను వార్షిక జీవన వ్యయం 10.74 లక్షలతో లెక్కిస్తే అప్పుడు రూ.3.44 కోట్లు అవుతుంది. ఈ మొత్తం రిటైర్మెంట్ ఫండ్గా కావాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే ఈ మొత్తం సమకూరుతుంది. దీర్ఘకాలం లక్ష్యాలకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డెట్ ఆధారిత సాధనాలైన ప్రావిడెంట్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్లు తగినవి కావు. నేను రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. గరిష్ట రాబడులు రాబట్టుకోవడం ఎలా? – కేశవ్ జాదవ్ సంపద వృద్ధి చెందడానికి పెట్టుబడి ఒక మార్గం. ఒక ఇన్వెస్టర్గా మీ లక్ష్యం గరిష్ట రాబడి ఒక్కటే కాకూడదు. దీనికి బదులు మెరుగైన రాబడుల కోసం పెట్టుబడుల విషయంలో కొన్ని టిప్స్ అనుసరించొచ్చు. ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. కేవలం రాబడి కోణంలోనే పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకుంటే అది నష్టానికి దారితీయవచ్చు. అందుకుని ప్రతీ పెట్టుబడి ఆప్షన్కు ముందు సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో అధిక రాబడులు ఇవ్వగలవు. కానీ అది ఖచ్చితం అని చెప్పలేం. పైగా అస్థిరతలు ఎక్కువ. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మార్కెట్లు కరెక్షన్కు లోనై ఉంటే అప్పుడు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకుని స్వల్పకాలానికి ఈ తరహా రిస్క్ను అధిగమించేందుకు డెట్ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ పెట్టుబడులు ఐదేళ్లు, అంతకుమించిన కాలానికి ఉండాలి. ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఫండ్ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిప్ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల స్వల్ప కాలంలో పెట్టుబడులపై మార్కెట్ కరెక్షన్ల ప్రభావాన్ని అధిగమించొచ్చు. చివరిగా అస్సెట్ అలోకేషన్ను పాటించాలి. డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, వాటిని ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా డెట్, ఈక్విటీ కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలి. ధీరేంద్ర కుమార్ - సీఈఓ, వ్యాల్యూ రీసర్చ్ -
రిటర్నులు సమర్పించడంతోనే అయిపోదు.. తర్వాత ఏం చేయాలంటే?
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధిం ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేసే సమయం వచ్చేసింది. సాధారణంగా జూలై 31లోపు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్నో వివరాలను సిద్ధం చేసుకోవాలి. ఆదాయం, పెట్టుబడులు, గృహ రుణం చెల్లింపులు, అద్దె చెల్లింపులు, ఈపీఎఫ్, పీపీఎఫ్, బీమా ప్రీమియం చెల్లింపులు, మూలధన లాభాలు అన్నింటినీ ఒక పేపర్పై రాసి పెట్టుకుంటే రిటర్నులను సులభంగా దాఖలు చేయవచ్చు. పాత, కొత్త విధానాల్లో ఏది అనుకూలమో కూడా మదింపు వేసుకోవాలి. అయితే, రిటర్నులు సమర్పించడంతోనే పని పూర్తయినట్టు అనుకోవద్దు. రిటర్నులు దాఖలు తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేసేదే ఈ కథనం. రిటర్నులు ధ్రువీకరణ రిటర్నులు దాఖలు చేసిన ప్రతి ఒక్కరూ వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అప్పుడే రిటర్నులు విజయవంతంగా సమర్పించినట్టు అవుతుంది. ధ్రువీకరించకపోతే అవి మదింపునకు వెళ్లవన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. రిటర్నులు చెల్లుబాటు కూడా కావు. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత వాటిని ధ్రువీకరించేందుకు 120 రోజుల గడువు ఉంటుంది. ఆలోపు ఎప్పుడైనా చేయవచ్చు. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత వచ్చే అక్నాలెడ్జ్మెంట్ కాపీని ప్రింట్ తీసుకుని, దానిపై సంతకం చేసి లేదంటే ఇన్కమ్ట్యాక్స్ వెబ్సైట్ నుంచి ఫామ్ 5ను డౌన్లోడ్ చేసుకుని బెంగళరులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ చేయవచ్చు. కొరియర్ ద్వారా చేయకూడదు. ఆన్లైన్లోనూ వెరిఫై చేయవచ్చు. పోస్ట్ ద్వారా పంపించడం కంటే ఇది ఎంతో సులభ విధానం. నెట్బ్యాంకింగ్ అకౌంట్ లేదంటే ఆధార్ ఆధారిత ఓటీపీ లేదా డీమ్యాట్ అకౌంట్ ద్వారా చేసేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో ఏది ఎంపిక చేసుకుంటే ఆ రూపంలో మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఆదాయపన్ను శాఖ పోర్టల్పై నమోదు చేయడం ద్వారా రిటర్నులను వెరిఫై చేయవచ్చు. వెరిఫికేషన్కు సంబంధించి ఎలక్ట్రానిక్ కోడ్ను బ్యాంకు ఏటీఎంల ద్వారా కూడా పొందొచ్చు. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ సేవలను అందిస్తున్నాయి. ఏటీఎంలో డెబిట్ కార్డును స్వైప్ చేసి, పిన్ నంబర్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ‘జనరేట్ ఈవీసీ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్’ను ఎంపిక చేసుకోవాలి. ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులై, పాన్ నంబర్ ఇచ్చి ఉన్న వారికే ఇది సాధ్యపడుతుంది. ఒకవేళ ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 44ఏబీ కింద పుస్తకాలను ఆడిట్ చేయించుకోవాల్సిన వారు రిటర్నులు దాఖలు చేసిన వెంటనే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ద్వారా వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వ్యక్తులు రిటర్నులు వేసి, 120 రోజులు అయినా వాటిని వెరిఫై చేయలేదనుకుంటే.. అప్పుడు కండోనేషన్ ఆఫ్ డిలే సర్వీస్ రిక్వెస్ట్ సమర్పించాలి. తగిన కారణాన్ని పేర్కొనాలి. ఆదాయపన్ను శాఖ కండోనేషన్ రిక్వెస్ట్ను ఆమోదిస్తే అప్పుడు రిటర్నులను వెరిఫై చేయవచ్చు. లేదంటే రిటర్నులు దాఖలు చేయనట్టుగానే ఆదాయపన్ను శాఖ పరిగణిస్తుంది. తిరిగి రిటర్నులను దాఖలు చేయాల్సిందే. లేట్ ఫీజు చెల్లించి దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే, దానిపై వడ్డీ కూడా పడుతుంది. తప్పులు దొర్లితే? ఆదాయ పన్ను రిటర్నులను గడువులోపు సమర్పించిన వారు, అందులో తప్పులు దొర్లితే సవరించిన రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. దాఖలు చేసిన రిటర్నులు ఇంకా ప్రాసెస్ చేయకపోతే రివైజ్డ్ రిటర్నులు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సవరించిన రిటర్నులు దాఖలు చేయడానికి ప్రత్యేకమైన ప్రక్రియ అంటూ ఏదీ లేదు. ఈఫైలింగ్ పోర్టల్కు వెళ్లి ‘రివైజ్డ్ రిటర్న్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తాజా రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియనే అనుసరించాల్సి ఉంటుంది. సవరించిన రిటర్నుల పత్రంలో మొదటిసారి దాఖలు చేసిన అసలు రిటర్నుల అక్నాలెడ్జ్మెంట్ నంబర్, డేట్ కూడా ఇవ్వాలి. అసెస్మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందు వరకు రివైజ్డ్ రిటర్నులు సమర్పించొచ్చు. పన్ను చెల్లింపుదారు దాఖలు చేసిన రిటర్నుల పత్రాన్ని ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసినట్టయితే సెక్షన్ 143 (1) కింద ఇంటిమేషన్ పంపిస్తుంది. ఇది వచ్చిన తర్వాత రివైజ్డ్ రిటర్నులు వేయడానికి అనుమతి ఉండదు. ఆలస్యపు రిటర్నులు దాఖలు చేయడానికి తుది గడువు అసెస్మెంట్ సంవత్సరంగా గుర్తించాలి. రిటర్నులు దాఖలు చేసి, దాన్ని ఆదాయపన్ను శాఖ ఇంకా ప్రాసెస్ చేయనట్టయితే గడువులోపు ఎన్ని సార్లు అయినా సవరణలు దాఖలు చేసుకోవచ్చు. ఈ విషయంలో పరిమితి లేదు. ఒక్కసారి సవరించిన రిటర్నులు సమర్పించగానే, ముందు దాఖలు చేసినది చెల్లకుండా పోతుంది. తాజా రిటర్నుల పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అవకాశం ఉంది కదా అని చాలా పర్యాయాలు సవరించిన రిటర్నులు సమర్పిస్తే అది పన్ను శాఖ అధికారుల దృష్టిలో పడుతుంది. దాంతో ప్రత్యేక స్క్రూటినీ చేయవచ్చు. ముఖ్యంగా సవరించిన రిటర్నుల్లో పెద్ద మార్పులు ఉంటే తప్పకుండా విస్తృత పరిశీలన ఉంటుంది. మొదటిసారి దాఖలు చేసిన పత్రాల మాదిరిగానే, సవరించిన రిటర్నులనూ వెరిఫై చేయడం మర్చిపోవద్దు. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోండి. రిఫండ్ల సంగతి ఇదీ.. దాఖలు చేసిన రిటర్నుల్లో ఎలాంటి తప్పులు లేకపోతే అప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు. ఒకవేళ చెల్లించాల్సిన మొత్తానికంటే అదనంగా పన్ను చెల్లింనట్టయితే అప్పుడు రిఫండ్ కోరడం ఒక్కటే మార్గం. యూజర్లు ఆదాయ పన్ను శాఖ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత డ్యాష్బోర్డులో ఇది కనిపిస్తుంది. పన్ను చెల్లింపుదారులు ఎన్ఎస్డీఎల్ పోర్టల్లోనూ పాన్ నంబర్ సమర్పించడం ద్వారా దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫేస్లెస్ ప్రాసెసింగ్ నడుస్తోంది. రిఫండ్లు పన్ను చెల్లింపుదారు బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి. ఇంటిమేషన్ అందుకున్న 15 రోజుల్లోగా ఇది సాధ్యపడుతుంది. బ్యాంకు వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల రిఫండ్లు నిలిపోతుంటాయి. అకౌంట్ నంబర్ లేదా ఐఎఫ్ఎస్సీ నంబర్లో తప్పులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా దీన్ని చెక్ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారుడికి రావాల్సిన రిఫండ్లు ఆలస్యం అయితే ఒక్కో నెలకు అర శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తారు. టీడీఎస్ లేదా టీసీఎస్ రూపంలో పన్నును మినహాయించి ఉంటే లేదా ముందస్తు పన్ను చెల్లించి ఉండి, చివర్లో పన్ను బాధ్యత తగ్గడం వల్ల వెనక్కి తిరిగి రావాల్సి ఉంటే.. అప్పుడు ఏప్రిల్ 1 నుంచి చెల్లించే నాటి వరకు వడ్డీ కూడా లభిస్తుంది. ఐటీఆర్లను గడువు తర్వాత దాఖలు చేసిన వారు, ఆ తేదీ నుంచే రిఫండ్పై వడ్డీ చెల్లింపులకు అర్హులవుతారు. రిఫండ్పై వచ్చే వడ్డీ సంబంధిత ఆర్థిక సంవత్సరం అదనపు ఆదాయం కింద చపించాలి. సరిపోలేకపోతే..? దాఖలు చేసిన రిటర్నుల్లో వివరాల ఆధారంగా చెల్లించాల్సిన పన్నులో వ్యత్యాసం ఉంటే, ఆదాయపన్ను శాఖ పంపించే 143 (1) ఇంటిమేషన్లో ఆ వివరాలు ఉంటాయి. పన్ను లెక్కల్లో పొరపాట్లు ఉంటే, అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటే, ఆదాయపన్ను శాఖ ఈ ఇంటిమేషన్లో పేర్కొంటుంది. ఆదాయపన్ను శాఖ వివరాలతో, పన్ను లెక్కలతో ఏకీభవిస్తే అప్పుడు పన్ను చెల్లింపుదారు ఆ మేరకు అదనపు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో పన్ను మినహాయింపులు పేర్కొనడం మర్చిపోయినా.. పన్ను అదనంగా చెల్లించాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. లేదంటే ఆదాయ పన్ను శాఖ అసెసింగ్ ఆఫీసర్ అయినా పొరపాటు పడొచ్చు. లేదా ఎర్రర్ చోటు చేసుకోవచ్చు. అప్పుడు యూజర్ రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ సమర్పించాలి. అంటే దాన్ని సరిదిద్దాలని కోరడం. ఇంటిమేషన్ పంపించిన నాటి నుంచి నాలుగేళ్ల వ్యవధిలో ఎప్పుడైనా కానీ దీన్ని దాఖలు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ గుర్తించిన వాటితో మీరు ఏకీభవించకపోవచ్చు. లేదా మీరు పేర్కొన్న వివరాల పరంగానూ ఆదాయపన్ను శాఖ లేవనెత్తిన తాజా డిమాండ్ సమ్మతం కాకపోయినా రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయవచ్చు. ఇలా దాఖలు చేసిన నాటి నుంచి ఆరు నెలల్లోపు ఆదాయపన్ను శాఖ స్పందిస్తుంది. పన్ను చెల్లింపుదారులు సాధారణంగా నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్ట్లు సమర్పించొచ్చు. పన్ను చెల్లింపుదారు తనవైపు నుంచి అన్ని రకాల వివరాలు సమర్పించినప్పటికీ, పన్ను శాఖ ఏదైనా సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోనట్టయితే అప్పుడు ‘రీ ప్రాసెస్ ద రిటర్న్’ను ఎంపిక చేసుకోవాలి. టీడీఎస్/టీసీఎస్ లేదా ఐటీ చలాన్లలో దిద్దుబాటు చేయాల్సి ఉంటే అప్పుడు ‘ట్యాక్స్ క్రెడిట్ మిస్వ్యచ్ కరెక్షన్’ రిక్వెస్ట్ను ఎంపిక చేసుకోవాలి. సెక్షన్ 234సీ కింద వడ్డీ లెక్కలను సరిదిద్దాల్సి ఉంటే ‘అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ 234సీ ఇంటరెస్ట్’ను ఎంపిక చేసుకోవాలి. వాస్తవ రిటర్నుల్లో ఇతర వివరాలను సరిదిద్దాలంటే అప్పుడు ‘రిటర్న్ డేటా కరెక్షన్’ను ఎంపిక చేసుకోవాలి. -
జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్
న్యూఢిల్లీ: అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా చైనాలో తిరిగి ప్రత్యక్షమయ్యాడు. దాదాపు ఏడాదిన్నర తరువాత చైనా కుబేరుడు జాక్ మా స్వదేశంలో అడుగుపెట్టారు. తన సొంత నగరం హాంగ్జౌలోతాను స్థాపించిన పాఠశాలను సందర్శించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ సోమవారం నివేదించింది. ఈ సందర్బంగా పాఠశాల విద్య, చాట్జీపీటీ సాంకేతికత గురించి చర్చించినట్లు పేర్కొంది. ఒకపుడు ఇంగ్లీష్ టీచర్ కేడా అయిన జాక్ మా హాంకాంగ్లో కొద్దిసేపు స్నేహితులతో ముచ్చటించాడని ఆ తరువాత ఆర్ట్ బాసెల్ను సందర్శించాడని కూడా నివేదించింది. ఈ వార్తలతో అలీబాబా షేర్లు 4శాతానికి పైగా పెరిగా పుంజుకున్నాయి. మరోవైపు జాక్మా, రాకతో రెండు సంవత్సరాల రెగ్యులేటరీ ఆంక్షలతో కునారిల్లిన దేశంలోని ప్రైవేట్ బిజినెస్ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా మూడేళ్ల కోవిడ్ సంక్షోభంతో అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి నాయకుల ప్రయత్నాలకు తోడు తాజాగా మా ప్రత్యక్షంకావడం ప్రైవేట్ రంగ పునరుజ్జీవనం పట్ల ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేస్తోందని భావిస్తున్నారు. ఇ-కామర్స్ దిగ్గజం సొంత నగరమైన హాంగ్జౌలో ఇతర అలీబాబా వ్యవస్థాపకులతో కలిసి 2017లో స్థాపించారు. అలీబాబా గ్రూప్ స్థాపనతో దేశంలోనే టాప్ బిలియనీర్గా అవతరించిన జాక్మా, అనూహ్యంగా అక్కడి ప్రభుత్వాన్ని, రెగ్యులేటరీని బహిరంగంగా విమర్శించి 2020లో ఇబ్బందుల్లో పడ్డాడు. జాక్మాకు చెందిన కంపెనీలపై వరుసగా దాడులతో ఆర్థికపరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అధికారు. ఈ పరిణామాల నేపథ్యంలోఅలీబాబా, యాంట్ గ్రూప్ తీవ్రంగా నష్టపోయాయి. దీంతో 2021 చివర్లో చైనాను వీడారు. అయితే అపుడపుడూ జపాన్, స్పెయిన్, ఆస్ట్రేలియా, థాయ్లాండ్లో కనిపించి వార్తల్లో నిలుస్తూ వచ్చారు. మరోవైపు జాక్మాను దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రెసిడెంట్ జి జిన్పింగ్కు సన్నిహిత మిత్రుడైన లీ ప్రయత్నాల వల్లే మా తిరిగి వచ్చాడా లేదా అనేది స్పష్టత లేదు. అయితే తమ ప్రభుత్వం బీజింగ్ అన్ని సంస్థలను సమానంగా చూస్తుందని ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించ నుందని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
2023–24 సంవత్సరం ఐటీఆర్ల నోటిఫై
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (అసెస్మెంట్ సంవత్సరం 2023–24) ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను (ఐటీఆర్లు) ఆదాయపన్ను శాఖ అత్యున్నత విభాగమైన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. వీటిల్లో తమకు వర్తించే ఐటీఆర్ను పన్ను చెల్లింపుదారులు దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తులు, నిపుణులు, వ్యాపారస్థులు ఇలా వివిధ విభాగాల్లోని వారికి మొత్తం ఆరు రకాల ఐటీఆర్లు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వీటిల్లో పెద్దగా మార్పులు చేయలేదు. ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 6 వరకు, ఐటీఆర్ – వీ (వెరిఫికేషన్ ఫామ్), ఐటీఆర్ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ నోటిఫై చేసిన వాటిల్లో ఉన్నాయి. ఈ పత్రాల ఆధారంగా రిటర్నుల దాఖలుకు సన్నద్ధమయ్యేందుకు పన్ను చెల్లింపుదారులకు తగినంత సమయం ఉంటుంది. ఏటా మార్చి లేదా ఏప్రిల్లో ఐటీఆర్లను నోటిఫై చేస్తుండగా, ఈ ఏడాది ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఐటీఆర్–1లో సెక్షన్ 139(1) కింద వెల్లడించాల్సి వివరాల్లో మార్పులు చేశారు. -
గో డిజిట్ ఐపీవోకు బ్రేక్
సాక్షి, ముంబై: ప్రయివేట్ రంగ బీమా సంస్థ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీవో ప్రణాళికలకు సెబీ చెక్ పెట్టింది. ప్రాస్పెక్టస్ను తిప్పి పంపింది. దీంతో అవసరమైన తాజా సమాచారాన్ని జత చేస్తూ ముసాయిదా పత్రాలను తిరిగి దాఖలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. వెరసి కెనడియన్ కంపెనీ ఫెయిర్ఫాక్స్ గ్రూప్నకు పెట్టుబడులున్న గో డిజిట్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కంపెనీ 2022 ఆగస్ట్లో సెబీకి తొలుత ప్రాస్పెక్టస్ను సమర్పించింది. వీటి ప్రకారం ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 10.94 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, ఆయన భార్య, నటి అనుష్క శర్మకు వాటాలున్న సంగతి తెలిసిందే. కంపెనీ మోటార్, ట్రావెల్, హెల్త్, ప్రాపర్టీ తదితర పలు బీమా ప్రొడక్టులను ఆఫర్ చేస్తోంది. -
Viral: కట్నంగా రూపాయి చాలు.. 11 లక్షలు, బంగారు ఆభరణాలు వెనక్కి
ముజఫర్నగర్: కట్నంగా ముట్టజెప్పిన రూ.11 లక్షలు, బంగారు ఆభరణాలను వద్దంటూ వెనక్కిచ్చి ఆదర్శంగా నిలిచాడో యువకుడు. కేవలం రూ.1 కట్నం తీసుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో రెవెన్యూ అధికారిగా పనిచేసే సౌరభ్ చౌహాన్కు లఖాన్ గ్రామం ఓ మాజీ జవాను కూతురుతో శుక్రవారం పెళ్లయింది. వరకట్నం కింద వధువు తల్లిదండ్రులు రూ.11 లక్షల కట్నం, ఆభరణాలు ఇవ్వగా కట్నం అక్కర్లేదంటూ తిరిగిచ్చేశాడు. ‘‘మీ దీవెనగా జ్ఞాపకం పెట్టుకుంటా’నంటూ వారినుంచి కేవలం ఒక్క రూపాయి తీసుకున్నాడు. దాంతో ఆహూ తులు సౌరభ్పై అక్షింతలతోపాటు ప్రశంస జల్లులు కూడా కురిపించారు. సమాజంలో మంచి మార్పు కోసం ముందడుగు వేశాడంటూ మెచ్చుకున్నారు. -
ఎయిర్పాడ్స్ మిస్, స్మార్ట్ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?
బెంగళూరు:బెంగళూరుకు చెందిన యువతి ఆటోలో తన ఖరీదైన ఎయిర్పాడ్లను మర్చిపోయింది. ఆగండాగండి.. అయ్యో...అని అపుడే మీరు ఫిక్స్ అయిపోకండి..టెక్నాలజీపై అవగాహన ఉన్న ఆటో డ్రైవర్ చేసిన పని గురించి తెలుసుకుంటే.. శభాష్ అంటారు. టెక్ సిటీ బెంగళూరులో స్మార్ట్ అండ్ టెక్సావీ ఆటో డ్రైవర్ చేసిన పని ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. (ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్! మీరు అంతేనా?తస్మాత్ జాగ్రత్త!) సరే.. సూటిగా విషయంలోకి వచ్చేస్తే...షిడికా అనే యువతి ఆఫీసుకు వెళ్లే హడావిడిలో తన ఎయిర్పాడ్లను పనికి వెళుతుండగా ఆటోలో మర్చిపోయింది. కానీ కేవలం అరగంటలో తన విలువైన గ్యాడ్జెట్ దొరకడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. దీంతో ఈ విషయాన్నిఆమె ట్విటర్లో షేర్ చేశారు. దీంతో పోస్ట్కి వేలకొద్దీ లైక్స్, కామెంట్స్ వచ్చాయి. జయహో ఆటో డ్రైవర్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. (స్పోర్టీ లుక్లో 2023 కవాసాకి నింజా 650 బైక్: ధర తెలిస్తే షాకే!) ఆటోలో ఖరీదైన గ్యాడ్జెట్ ఎయిర్పాడ్స్ను గుర్తించిన ఆటో డ్రైవర్ దాని కనెక్ట్ చేసి, ఆమె పేరు ఉంటో కనుకున్నాడు. తనకు పేమెంట్ చేసిన ఫోన్పే ద్వారా నంబరు తెలుసుకుని ఆమెను డ్రాప్ చేసిన ప్లేస్కొచ్చి, అక్కడి బసెక్యూరిటీకి వాటిని హ్యాండోవర్ చేయడంతో కథ సుఖాంతమైందన్నమాట. Lost my AirPods while traveling in an auto. Half an hour later this auto driver who dropped me at WeWork showed up at the entrance & gave it back to security. Apparently, he connected the AirPods to find the owner's name & used his PhonePe transactions to reach me. @peakbengaluru — Shidika Ubr (@shidika_ubr) November 15, 2022 Auto drivers are more tech enthusiasts then engineers or what ?? ( Especially in Bangalore) 😂 — Dibyadyoti Sarkar (@dibyadyoti_) November 15, 2022 -
ఆకాశ ఎయిర్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి,ముంబై: ఇటీవల విమాన సర్వీసులను ప్రారంభించిన ఆకాశ ఎయిర్ తృటిలో భారీ ప్రమాదంనుంచి తప్పించు కుంది. ముంబై నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆకాసా ఎయిర్ ఫ్లైట్ QP 1103 క్యాబిన్లో దుర్వాసన రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. తమ విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందనీ ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అకాసా ఎయిర్ ప్రతినిధి తెలిపారు. ఆకాశ ఎయిర్ అక్టోబర్ 14 శుక్రవారం ముంబై-బెంగళూరు విమానంలో పక్షి ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. దుర్వాసన వస్తోందని ఫిర్యాదులు రావడంతో సిబ్బంది అప్రత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి, తనిఖీలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణీకులందరూ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దివంగత బిలియనీర్ రాకేష్ ఝన్ఝన్వాలా అకాసా ఎయిర్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 7న 60 రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్ దూబే ఇటీవల మీడియాకు తెలిపారు. రెండు నెలలక్రితం తొలుత ముంబై నుంచి అహ్మదాబాద్కు, ఆ తరువాత చెన్నై, కొచ్చి, బెంగళూరుకు విమాన సేవలందిస్తోంది ఆకాశ ఎయిర్. -
10 మల్టీ బేగర్స్.. ఏకంగా 6700 శాతం రిటర్న్స్
దలాల్ స్ట్రీట్లో పెట్టుబడులుపెట్టి లాభాలనుఆర్జించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కంపెనీ వ్యూహాలు, వృద్ది, భవిష్యత్తు ప్రణాళికలు, ఫండ మెండల్స్, తాజా మార్కెట్ ట్రెండ్ లాంటి విషయాలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. అలా అన్ని మెళకువలను ఒంట పట్టించుకొని కోట్లు గడించాడు 29 ఏళ్ల మద్రాస్ ఐఐటీ పోస్ట్ గ్రాడ్యుయేట్. తాజాగా ముంబైకి చెందిన నిఖిల్ గంగిల్ (29) ఐఐటీ మద్రాస్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. గత ఐదేళ్లలో కనీసం 10 మల్టీ బ్యాగర్లను గుర్తించి భారీ లాభాలను గడించాడు. తనదైన పరిశీలన, నైపుణ్యంతో ఆకర్షణీయమైన లాభాలను తన ఖాతాలో వేసుకున్నాడు. బిజినెస్ టుడేతో జరిగిన ఇంటరాక్షన్లో యువ పెట్టుబడిదారుడు తన సక్సెస్జర్నీని పంచు కున్నాడు. స్టాక్ పికింగ్ అనేది ఒక చక్కటి కళ, అయితే సహనం పోర్ట్ఫోలియోను ఎంచుకుంటే ఫ్యూచర్ అద్భుతంగా మారిపోతుంది అంటాడు. సవాకా బిజినెస్ మెషీన్స్ వంటి స్టాక్లు తనకు 68 రెట్లు లేదా 6,700 శాతం రాబడిని అందించాయని చెప్పారు. అలాగే మేఘమణి ఫినెకెమ్ (15 రెట్లు), టాటా పవర్ (6.5 రెట్లు), టాటా మోటార్స్ (6.5 రెట్లు), GNA యాక్సిస్ (5.8 రెట్లు), రామ్కో సిస్టమ్ (5 సార్లు), నవ (4.7 రెట్లు), మారథాన్ నెక్స్ట్జెన్ రియాల్టీ (4.7 రెట్లు), తేజస్ నెట్వర్క్స్ (4.5 రెట్లు) ఫీమ్ ఇండస్ట్రీస్ 4 రెట్ల లాభాలను తెచ్చిపెట్టాయి. కొన్నేళ్ల ప్రయత్నాలు, వైఫల్యాల తరువాతపెట్టుబడి వ్యూహాన్ని అభివృద్ధి చేసుకుని భారీ లాభాలను తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పటికీ ఈ షేర్లలో కొన్నింటిని హోల్డ్ చేస్తున్నాడు. పెట్టుబడి వ్యూహంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, సినిమాలు చూడటం, ప్రయాణాలు, పాడటం కూడా ఇష్టపడే తాను తక్కువపెట్టుబడితో అద్భుతమైన లాభాలనిచ్చి బిజినెస్ను ఇష్టపడతాడట. ప్రతి బిజినెస్కు అప్ అండ్ డౌన్ ఉంటుంది. కానీ సరియైన ధరకోసం వేచి ఉంటానని చెప్పాడు. మూలధనంపై రాబడి (రిటన్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీడ్) అనే సొంత ర్యాంకింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. తాను ఎంపిక చేసిన స్టాక్స్ టాప్ 3లో ఉన్నాయంటూ సంతోషాన్ని ప్రకటించాడు. ఐఐటీ మద్రాస్లో ఎం-టెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నిఖిల్ పుస్తకాలు చదవడం బాగా ఇష్టపడే గాంగిల్ ఇటీవల వారెన్ బఫెట్ లాగా పెట్టుబడికి 7 రహస్యాలు పుస్తకం చదివానని చెప్పాడు. ఇంకా ది లిటిల్ బుక్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్ (క్రిస్టోఫర్ హెచ్ బ్రౌన్) మాస్టరింగ్ ది మార్కెట్ సైకిల్ (హోవార్డ్ మార్క్స్) ది లిటిల్ బుక్ దట్ బీట్స్ ది మార్కెట్- (జోయెల్ గ్రీన్బ్లాట్) బుక్స్కూడా తనకు ఉపయోగపడ్డాయని చెప్పాడు గాంగిలి విజయ రహస్యాలు, ఇన్వెస్టర్లకు సందేశాలు ♦ మొదటి రోజు నుండీ వాల్యూ ఇన్వెస్టర్గా ఉండాలి. ♦ మొదటి నుంచి దూర దృష్టి ఉండాలి. ♦ లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్మెంట్ లక్క్ష్యంతో పెట్టుబడులుపెట్టాలి. ♦ కనీసం 5-8 సంవత్సరాలు ఎదురుచూస్తే ఓపిక ఉండాలి. ♦ వాల్యూ ఇన్వెస్టర్గా వృద్ధిని తక్కువ అంచనా వేయకూడదు ♦ గ్రోత్ ఇన్వెస్టర్గా వాల్యూని తక్కువ అంచనా వేయకూడదు. ♦ వీలైనన్ని బిజినెస్ పుస్తకాలు, విశ్లేషణలు చదవాలి ♦ ప్రతీ షేరును విశ్లేషించి.. కరెక్ట్ ధర కోసం వేచి చూడాలి ♦ వాల్యుయేషన్ , సైకిల్ ఆధారంగా ఒక స్టాక్ను అండర్వాల్యూడ్ , ఓవర్వాల్యూడ్ అనేది నిర్వచించుకుంటా. ♦ దాన్నే నేను కనిష్ట అంతర్గత విలువ , గరిష్ట అంతర్గత విలువ. ♦ స్టాక్ ‘మిన్ ఇంట్రిన్సిక్ వాల్యూ’కి వచ్చినప్పుడు కొంటాను , అది ‘మాక్స్ ఇంట్రిన్సిక్ వాల్యూ’ని టచ్ చేసినపుడు అమ్మేస్తా -
జమ్మూకాశ్మీర్ లో మళ్ళీ సినీ వినోదం
-
స్పైస్జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి
న్యూఢిల్లీ: బడ్జెట్ ఎయిర్లైన్ స్పైస్జెట్కు చెందిన విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ-నాసిక్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా మధ్యలోనే వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. బోయింగ్ 737 స్పైస్జెట్ విమానంలో గురువారం ఉదయం సమస్య ఏర్పడింది. వెంటనే స్పందించిన సిబ్బంది విమానాన్ని తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశాన్ని డీజీసీఏ పరిశీలిస్తోంది. ఢిల్లీ ఇందిరాగాంధీఅంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్కు బయలుదేరిన స్పైస్జెట్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా నగరానికి మధ్యలో తిరిగి వచ్చిందని డీజీసీఏ అధికారి తెలిపారు. కాగా అధిక ఇంధన ధరలు,రూపాయి క్షీణత మధ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్జెట్ విమానాలు ఇబ్బందుల్లో పడిన ఘటనలు గతంలో కూడా వరుసగా చోటు చేసుకన్నాయి. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థకు షో-కాజ్ నోటీసు జారీచేయడం, ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎనిమిది వారాల పాటు గరిష్టంగా 50శాతం విమానాలను మాత్రమే రన్ చేయాలని జూలై 27న ఆదేశించిన సంగతి తెలిసిందే. -
స్టాక్స్లో ఈపీఎఫ్వో మరిన్ని పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సొమ్ములో ఈక్విటీ వాటా పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈక్విటీ వాటా పెంచడం వల్ల మరిన్ని రాబడులకు అవకాశం ఉంటుంది. అప్పుడు సభ్యులకు మెరుగైన రాబడి రేటు ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఈపీఎఫ్ నిధిలో ఈక్విటీ వాటాను 25 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను ఈపీఎఫ్వో పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ తన మొత్తం నిర్వహణ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతమే కేటాయిస్తోంది. ఈక్విటీలకు మరిన్ని పెట్టుబడులు కేటాయించడం వల్ల డెట్ సాధనాల్లో రాబడుల అంతరాన్ని పూడ్చుకోవచ్చని ఈపీఎఫ్వో ఆలోచనగా ఉంది. రాబడుల లక్ష్యాలను చేరుకోలేకపోతున్న దృష్ట్యా ఈక్విటీల వాటా పెంచడం ద్వారా ఆ సమస్యను అధిగమించొచ్చన్న అభిప్రాయం ఉంది. ఈపీఎఫ్వోకు చెందిన ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ రెండు వారాల క్రితమే సమావేశమైంది. ఈ అంశంపై చర్చించి ఈక్విటీల వాటాను 25 శాతం పెంచేందుకు సిఫారసు చేసింది. ఒకే విడత కాకుండా తొలుత 15 శాతం నుంచి 20 శాతానికి ఈక్విటీ పెట్టుబడులను తీసుకెళతారు. అక్కడి నుంచి 25 శాతానికి పెంచుతారు. ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ సిఫారసుపై జూన్ చివరి వారంలో జరిగే ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సీబీటీ దీనికి ఆమోదం తెలిపితే దాన్ని తుది ఆమోదం కోసం కేంద్ర కార్మిక శాఖకు, కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
ఆర్థిక భద్రతా అవసరమే..
చిన్న వయసు.. ఉరకలెత్తే ఉత్సాహం, మంచి ఆరోగ్యం.. ఇవన్నీ భవిష్యత్తును గుర్తు చేయవు. ఏరోజుకారోజు హాయిగా గడిచిపోతుంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే కొన్ని మంచి అలవాట్లకు చోటు కల్పిస్తే.. జీవితాంతం ఆర్థిక భద్రతకు ఢోకా లేకుండా చూసుకోవచ్చు. రేపటి రోజు కోసం మీ ప్రణాళికలో కొంత చోటు కల్పిస్తే చాలు. అందులో ఉండే మ్యాజిక్ ఆ తర్వాత తెలిసొస్తుంది. అందుకే అంటారు వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోమని..! రిటైర్మెంట్ కోసం రూ.కోటి కావాలంటే.. నెలకు రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు. 25 సంవత్సరాల వయసులో మొదలు పెట్టి, ఏటా 12 శాతం రాబడులు వచ్చేట్టు చూసుకున్నా.. ఈ మొత్తం సమకూరుతుంది. కానీ, 15 ఏళ్లు ఆలస్యం చేసి 45లో మొదలు పెట్టారనుకోండి అప్పుడు రూ.కోటి కోసం నెలకు రూ.21,000 ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సిప్ ఆరంభం.. తివారి (30) సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఐదేళ్ల క్రితమే అంటే 25 ఏళ్ల వయసు నుంచే మ్యూచువల్ ఫండ్స్లో ప్రతీ నెలా రూ.2,000 చొప్పున మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత వెసులుబాటు లేకపోవడంతో సిప్ ఆపేశాడు. కానీ, అప్పటి వరకు చేసిన పెట్టుబడిని అలాగే ఉంచేశాడు. ఒకరోజు ఏజెంట్ కాల్ చేసి.. రూ.72,000 పెట్టుబడి రూ.1.8 లక్షలు అయినట్టు చెప్పడంతో ఆశ్చర్యపోవడం తివారీ వంతు అయింది. ఎవరో ఫ్రెండ్ చెబితే సిప్ మొదలు పెట్టిన తివారీ.. అంత నిధిని చూసేసరికి పెట్టుబడి ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నాడు. పెట్టుబడి చిన్నదైనా క్రమం తప్పకుండా కొనసాగించడం వల్ల వచ్చే ప్రతిఫలం ఇలా ఉంటుంది. రాబడి రుచి తెలిసిన తర్వాత ఎవరైనా పెట్టుబడి పెట్టకుండా ఉంటారా? అందుకే తివారీ మళ్లీ సిప్ మొదలు పెట్టడమే కాదు.. ఈ విడత రూ.2,000 చొప్పున రెండు పథకాల్లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్జించే ప్రతి ఒక్కరూ తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా వెంటనే సిప్ ఆరంభించాలి. సిప్ అన్నది ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తం పెట్టుబడిగా వెళ్లిపోతుంది. క్రమశిక్షణతో పెట్టుబడికి సిప్ వీలు కల్పిస్తుంది. సిప్ అనగానే ఏ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి? అన్న సందేహం వస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం లార్జ్క్యాప్ విభాగానికి 50–60%, మిడ్ స్మాల్క్యాప్ విభాగానికి 20–30%, డెట్ విభాగానికి 10–20% కేటాయింపులు చేసుకోవచ్చు. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. అలాగే, మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని పథకాలు ఉండాలన్నది నిర్ణ యించుకోవాలి. సిప్ పెట్టుబడులు సైతం మార్కెట్ ప్రతికూలతల్లో నష్టాలను చూపిస్తాయి. అయినా నిరాశ చెందకుండా ఓపికతో పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొన సాగించాలి. పీపీఎఫ్ ఖాతా డెట్ సాధనాల్లో ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) మెరుగైన ఎంపిక. మూడు రకాల ప్రయోజనాలు దీన్నుంచి అందుకోవచ్చు. మొదట ఏటా రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులపై వచ్చే వడ్డీ రాబడిపైనా పన్ను ఉండదు. గడువు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకునే మొత్తంపైనా పన్ను లేదు. ప్రస్తుతం ఇందులో చేసే పెట్టుబడులపై 7.1 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రతీ నెలా 12,500 చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో 22,50,000 ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. రాబడి ప్రస్తుత 7.1 శాతం ప్రకారం రూ.16,94,599 వస్తుంది. భవిష్యత్తులో ఈ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత ఐదేళ్ల చొప్పున గడువు పొడిగించుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఖాతాను క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏటా కొంత చొప్పున ఉపసంహరించుకోవచ్చు. బ్యాలన్స్పై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఏడేళ్ల తర్వాత నుంచి ఇందులో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. రుణ సదుపాయానికి కూడా వీలుంది. పీపీఎఫ్ సొమ్మును కోర్టులు కూడా జప్తు చేయడానికి ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ తమపై ఆధారపడిన వారు ఉంటే (తల్లిదండ్రులు లేదా భార్యా, పిల్లలు) తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ, ఏదేనీ కారణంతో మరణం సంభవిస్తే పాలసీలో ఎంపిక చేసుకున్న మేరకు పరిహారాన్ని బీమా సంస్థ కుటుంబ సభ్యులకు అందిస్తుంది. టర్మ్ కవరేజీ అన్నది తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ ఇచ్చే అచ్చమైన బీమా సాధనం. ఇందులో పెట్టుబడి కలసి ఉండదు. కట్టిన ప్రీమియం జీవించి ఉంటే వెనక్కి రాదు. మరణించిన సందర్భాల్లోనే ఈ పాలసీ నుంచి పరిహారం అందుకోగలరు. కనుక తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్నే తీసుకోవాలి. టర్మ్ ప్లాన్ అన్నది 30 ఏళ్లలోపు తీసుకోవడమే మంచిది. తమపై ఆధారపడిన వారు ఎవరూ లేకపోతే, ఇంకా వివాహం చేసుకోకపోతే.. ముందుగానే తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఆలస్యం చేయడం వల్ల ప్రీమియం పెరిగిపోతుంది. ఈలోపు ఏవైనా ఆరోగ్య సమస్యలు బయటపడితే ప్రీమియం భారం మరింత పెరుగుతుంది. మంచి చెల్లింపుల చరిత్ర కలిగిన కంపెనీల మధ్య టర్మ్ ప్రీమియం వ్యత్యాసాన్ని పరిశీలించి.. ఆకర్షణీయమైన ప్లాన్ను ఎంపిక చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. భారీ బిల్లుతో ఆర్థికంగా కుదేలవుతున్న వారు ఎందరో ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఇదే కనిపించింది. అందుకే ప్రతి ఒక్కరికి హెల్త్ కవరేజీ తప్పకుండా ఉండాల్సిందే. అందుకే హెల్త్ ప్లాన్ను ఆరోగ్యంపై పెట్టుబడిగా చెబుతారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వైద్య బిల్లుల భారాన్ని తప్పించుకోవచ్చు. పొదుపు, పెట్టుబడులు క్షేమంగా ఉంటాయి. హెల్త్ ప్లాన్ లేకపోతే పెట్టుబడులు కరిగిపోతాయి. లేదంటే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. వైద్య చికిత్సల వ్యయాలు ఎంతో ఖరీదుగా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటేటా చార్జీలు పెరుగుతూనే పోతున్నాయి. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాకుండా.. కుటుంబ సభ్యులు అందరికీ కవరేజీ తగినంత ఉండేలా చూసుకోవాలి. అరకొర కవరేజీతో తీసుకుంటే అవసరాలు తీరకపోవచ్చు. ఒక అంచనా ప్రకారం మధ్యతరగతి ప్రజల్లో 90 శాతానికి పైగా హెల్త్ కవరేజీ లేదు. ఉన్నా తగినంత కవరేజీ లేదు. ముఖ్యంగా చిన్న వయసులో వ్యాధుల రిస్క్ అంతగా ఉండదు. 40 ఏళ్లు దాటిన తర్వాత నుంచి ఈ రిస్క్ పెరుగుతుంది. యుక్త వయసులో మంచి ఆరోగ్యాన్ని చూసి హెల్త్ ఇన్సూరెన్స్ను ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఒక్కసారి ఆరోగ్య సమస్యలు వెలుగు చూసిన తర్వాత బీమా తీసుకోవాలంటే ప్రీమియం భారం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కనుక బీమా ఏదైనా కానీయండి ముందుగానే తీసుకోవాలి. ప్రీమియం తప్పకుండా చెల్లిస్తూ వెళ్లాలి. వైద్య బీమా తీసుకునే వారు 10 ఏళ్ల తర్వాత వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే ప్రతీ పదేళ్లకు కవరేజీని సమీక్షించుకుని పెంచుకోవాలి. రుణాలకు దూరం విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా రుణాలు తీసుకోవడం నష్టానికి దారితీస్తుంది. మీ చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అప్పటికే రుణాలు తీసుకుని ఉంటే వాటిని తీర్చడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాల మీద రుణాలు తీసుకుని చెల్లింపులు కష్టమైతే.. క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో ముఖ్యమైన రుణాలకు సమస్యలు ఏర్పడొచ్చు. జీవితంలో లాభదాయకమైన రుణం ఏదైనా ఉందంటే అది గృహ రుణమే. పన్ను ప్రయోజాలను పరిగణనలోకి తీసుకుంటే గృహ రుణం ఒక్కదానిని పరిశీలించొచ్చు. అలాగే, అవసరానికి పిల్లల ఉన్నత విద్య కోసం రుణ బాట కూడా పట్టొచ్చు. వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ రుణాలన్నవి విలువను తగ్గించేవి. వీటికి దూరంగా ఉండాలి. రుణ చెల్లింపులు నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని మించకూడదన్నది ప్రాథమిక సూత్రం. ద్రవ్యోల్బణానికి చోటు సగటు ద్రవ్యోల్బణం 7 శాతం ఉంటుందని అనుకుంటే నేటి రూ.లక్ష విలువ కాస్తా.. 30 ఏళ్ల తర్వాత రూ.13,000 అవుతుంది. అంటే నేడు రూ.లక్షకు లభించే ఏదేనీ సేవ కోసం 30 ఏళ్ల తర్వాత ఏడున్నర రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకనే భవిష్యత్తుకు ప్లాన్ చేసుకునే సమయంలో ద్రవ్యోల్బణానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. భవిష్యత్తులో పిల్లల విద్య, వివాహం, రిటైర్మెంట్ అవసరాలకు ఎంత కావాలన్నది నిర్ణయించుకునే ముందు ద్రవ్యోల్బణ రేటును అంచనాల్లోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని పొదుపు విలువ పెంచుకోవాలంటే.. పెట్టుబడులపై దీర్ఘకాలంలో సగటు రాబడి రేటు 14 శాతం అయినా వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని నిపుణుల సూచన. ఈపీఎఫ్ నిధికి ప్రాముఖ్యత ఉద్యోగం మారినప్పుడు, ముఖ్యమైన అవసరాలకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నుంచి ఉపసంహరించుకోవడం చాలా మంది చేసే పని. గతంలో అంటే సంస్థను మారినప్పుడల్లా, పాత ఖాతాను బదలాయించుకోవడం తలనొప్పిగా భావించి దాన్ని మూసేసేవారు. సంస్థను మారిప్పుడల్లా కొత్త ఖాతాను తెరిచేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సల్ ఖాతా నంబర్ విధానం అమల్లోకి వచ్చింది కనుక ఈ ఇబ్బందులు తొలగిపోయాయి. సంస్థను మారినా పాత ఖాతాను బ్యాలన్స్ సహా బదలాయించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా అవసరమైనప్పుడల్లా ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేస్తుండడం వల్ల పెద్ద నిధిని సమకూర్చుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఇంటి నిర్మాణానికి, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు.. మరే ఇతర మార్గం లేనప్పుడు ఈపీఎఫ్ నిధిని పరిశీలించొచ్చు. అంతేకానీ, ఇతరత్రా అవసరాలకు భవిష్య నిధిని కదపకపోవడమే సూచనీయం. దీనివల్ల ఉద్యోగ విరమణ సమయంలో కాంపౌండింగ్ మహిమతో మంచి నిధిని అందుకోవచ్చు. కాంపౌండింగ్ పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయవద్దు, ఆలస్యం చేయవద్దు. వాయిదా వేయడం వల్ల కాంపౌండింగ్ మ్యాజిక్ను కోల్పోవాల్సి వస్తుంది. కాంపౌండింగ్ పెట్టుబడిని మరింతగా వృద్ధి చేస్తుంది. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. అప్పుడు పెట్టుబడి 9 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడి ప్రకారం అంచనా వేస్తే 15 ఏళ్లకు రూ.20 లక్షలు అవుతుంది. దీన్ని మరింత కాలం కొనసాగిస్తూ వెళితే అప్పుడు రాబడికి రాబడి కలుస్తూ పెద్ద మొత్తం సమకూరుతుంది. పొదుపు/పెట్టుబడి పొదుపునే పెట్టుబడిగా భావించే వారు కూడా ఉన్నారు. బ్యాంకు ఖాతాలో ఉంచినా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా దాన్ని పెట్టుబడిగా పరిగణించడం మెరుగైన ఆర్థిక జీవనానికి మార్గం కానే కాదు. ఎందుకంటే సేవింగ్స్ ఖాతాలో బ్యాలన్స్పై వచ్చే వడ్డీ రాబడి 3 శాతమే. ఇది ద్రవ్యోల్బణం రేటులో సగం. కరెన్సీ విలువను హరించే మేరకు రాబడి కూడా ఇవ్వనిది పెట్టుబడి సాధనం ఎలా అవుతుంది.? అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేటు 6.5 శాతం మించి లేదు. ఇది కూడా ద్రవ్యోల్బణం రేటుకు సమానమే. పైగా ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఆదాయం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్లో రిస్క్ తీసుకుంటే రాబడి రేటు 8 శాతం అందుకోవచ్చు. ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ రాబడి ఇవ్వని ఏదీ కూడా పెట్టుబడి సాధనం కాబోదు. అందుకనే సంపాదనలో ఆదా చేసిన మొత్తాన్ని మంచి రాబడినిచ్చే సాధనంలో పెట్టినప్పుడే పెట్టుబడి అవుతుంది. అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైనవి. 20–30 ఏళ్ల కాలంలో వీటిల్లో రాబడి 12–18 శాతం మధ్య ఉంటుందని ఆశించొచ్చు. -
Russia-Ukraine War: చెర్నోబిల్ను వీడిన రష్యా ఆర్మీ
ప్రమాదకరంగా మారిన చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ నుంచి రష్యా సేనలు వైదొలిగాయని ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఎనెర్గోఆటం తెలిపింది. ఉక్రెయిన్పై ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధం ప్రారంభించిన రష్యా సేనలు చెర్నోబిల్ను స్వాధీనం చేసుకోవడంతో ప్రపంచ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 1986 నుంచి మూసివేసి ఉన్న ఈ ప్లాంట్ వెలుపల తవ్విన గుంతల నుంచి ప్రమాదకర స్థాయిలో అణుధార్మికత వెలువడటంతో ఆ ప్రాంతం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా సేనలు తెలిపాయని ఎనెర్గోఆటం పేర్కొంది. చెర్నోబిల్కు సంబంధించి తాజాగా తమకు ఎటువంటి సమాచారం అందలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది. త్వరలోనే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోస్సి తెలిపారు. మారియుపోల్ నగరంపై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. నగరంలో చిక్కుకుపోయిన పౌరులను తీసుకు వచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం పంపించిన 45 బస్సుల కాన్వాయ్ను రష్యా ఆర్మీ అడ్డుకుంది. మారియుపోల్లో పౌరుల కోసం 14 టన్నుల ఆహారం, మందులతో వెళ్లిన వాహనాలను కూడా రష్యా సైన్యం అడ్డుకున్నట్లు సమాచారం. బెల్గోరాడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ హెలికాప్టర్ గన్షిప్పులు దాడి చేయడంతో చమురు డిపో మంటల్లో చిక్కుకుందని ఆ ప్రాంత గవర్నర్ ఆరోపించారు. ఉక్రెయిన్–రష్యా చర్చలు పునఃప్రారంభం ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి చర్చలు వీడియో లింక్ ద్వారా శుక్రవారం పునఃప్రారంభమయ్యా యి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయం సైతం ధ్రువీకరించింది. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చివరిసారిగా మూడు రోజుల క్రితం టర్కీలో చర్చలు జరిగాయి. డోన్బాస్, క్రిమియాపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చర్చల్లో రష్యా ప్రతినిధి మెడిన్స్కీ చెప్పారు. -
ఇన్వెస్టర్లూ.. వీటి సంగతి చూడరూ.!
ఏదైనా ఒక విభాగంలో పెట్టుబడిని లక్ష్యం, కాల వ్యవధి, రంగం పనితీరు ఇలా ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. పెట్టుబడిదారులు తమ లక్ష్యాలకు అనుకూలమైన ఉత్పత్తులపై దృష్టి సారించాలి. మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఇన్వెస్టర్లకు లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ విభాగంలో పరిమిత రిస్క్తో పెట్టుబడులకు వీలు కల్పిస్తాయి. కనుక చక్కని ఏకైక పెట్టుబడి పరిష్కారంగా ఇవి పనిచేస్తాయి. తమ పెట్టుబడులను గణనీయంగా వృద్ధి చేసే సాధనాలను ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో భాగం చేసుకోవడం ద్వారానే గరిష్ట ప్రయోజనాన్ని సొంతం చేసుకోగలరు. విదేశీ పెట్టుబడులకు చోటు నూతన, వినూత్నమైన పెట్టుబడుల అవకాశాలు మన మార్కెట్లలోనూ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలపైనా ఇన్వెస్టర్లు ఒకసారి దృష్టి సారించాలి. ముఖ్యంగా అధిక రిస్క్ తీసుకునే వారు విదేశీ పెట్టుబడులకు చోటివ్వాలి. వర్ధమాన, అభివృద్ధి చెందిన మార్కెట్లలో దీర్ధకాలంలో గణనీయమైన సంపదను సృష్టించుకోవచ్చు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ తదితర సాధనాల ద్వారా ఇన్వెస్టర్లు ఆయా అవకాశాల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. అత్యవసరాల కోసం పెట్టుబడి జీవితంలో దేన్నీ ఊహించలేమని కరోనా మహమ్మారి అతిపెద్ద పాఠం నేర్పించింది. ఈ తరహా పరిస్థితులను మనం ‘సన్నద్ధత’ ద్వారానే అధిగమించగలం. అందుకని అత్యవసర నిధిపై పెట్టుబడి పెట్టడం ఎంతో ముఖ్యం. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆ నిధిని వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం ఓవర్నైట్ ఫండ్, లిక్విడ్ ఫండ్, లో డ్యురేషన్ డెట్ ఫండ్స్, లేదా ఫ్లోటర్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. నాణ్యతకు ప్రాధాన్యం పెట్టుబడుల సాధనాల నాణ్యతపైనా దృష్టి పెట్టాలి. మంచి వ్యాల్యూషన్లు, దీర్ఘకాలంలో రాబడులను ఇచ్చే విధంగా పెట్టుబడులు ఉండాలి. ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నట్టు అన్ని కంపెనీలు లేదా అన్ని రంగాల్లో ఎప్పుడూ అదే మాదిరి ప్రదర్శన, రాబడులను ఉండవని తెలుసుకోవాలి. ప్రీమియం వ్యాల్యూషన్లతో ఎక్కువ కాలంపాటు కొనసాగలేవు. కనుక దీర్ఘకాల పెట్టుబడుల్లో నాణ్యతకు పెద్ద పీట వేయాలి. నూతన సంవత్సరం ప్రారంభమైందని చెప్పి తమ పోర్ట్ఫోలియోను సమూలంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఏర్పడకపోవచ్చు. కాకపోతే పునఃసమీక్ష అన్నది మంచి విధానం. భవిష్యత్తులో రాబడులను ఇచ్చే విధంగా పోర్ట్ఫోలియో ఉందా, లేదా అన్నది సరిచూసుకోవడం ఇక్కడ కీలకమని గుర్తించాలి. రిస్క్ కొద్దీ రాబడులు అనుభవం ఉన్న పెట్టుబడిదారులు రిస్క్ను, రాబడులను అర్థం చేసుకోగలరు. కానీ, అవగాహన లేని ఇన్వెస్టర్లు ‘రిస్క్’ అంటే ఏంటో నష్టాల రూపంలో చూడాల్సి వస్తుంది. కనుక ఇన్వెస్టర్లు రిస్క్ను అర్థం చేసుకునేందుకు వారి పోర్ట్ఫోలియోను సూక్ష్మంగా విడదీసి చూడాలి. తమ అవసరాలకు అనుగుణంగా రీబ్యాలన్స్ (మార్పులు చేర్పులు)చేసుకోవాలి. రిస్క్కు అనుగుణంగా రాబడులను సర్దుబాటు చేసుకోవాలి. ప్యాసివ్ పెట్టుబడి అవకాశాలు ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పట్ల భారతీయ ఇన్వెస్టర్లలోనూ క్రమంగా ఆదరణ పెరుగుతోంది. వైవిధ్యమైన పోర్ట్ఫోలియో నిర్మాణానికి ఇవి వీలు కల్పించడమే కాకుండా.. ఇండెక్స్కు అనుగుణంగా వెయిటేజీ, రాబడులకు చోటిస్తున్నాయి. ఫండ్ మేనేజర్ వైపు నుంచి పక్షపాత ఆధారిత లోపాలను అధిగమించే ఉత్పత్తులు ఇవి. ఈటీఎఫ్లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ రూపంలో ప్యాసివ్ పెట్టుబడులు చేసుకోవచ్చు. ఇండెక్స్కే పరిమితం అయ్యే ఉత్పత్తులు ఇవి ఎంతమాత్రం కాబోవు. థీమ్యాటిక్, రంగాల వారీ ఫండ్స్లోనూ ఇవి అంకురిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు రాబడులపై భరోసా ఉంటుంది. లక్ష్యాల సమీక్ష గడిచిన రెండేళ్లలో ఎన్నో మార్పులు సంభవించాయి. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలు మారిపోయాయి. కనుక ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల లక్ష్యాలను కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా సమీక్షించుకోవాలి. వివాహం తర్వాత బాధ్యత పెరిగి రీబ్యాలన్స్ అవసరం ఏర్పడవచ్చు. లేదంటే ఉన్నత విద్యకు సంబంధించిన ప్రాధాన్యతలు మారిపోయి ఉండొచ్చు. వీటికి అనుగుణంగా మీ పెట్టుబడుల లక్ష్యాల్లోనూ మార్పులు చేసుకోవాలి. మార్కెట్లో నూతన అవకాశాల కోసం చూస్తూ ఉండొచ్చు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా తమ పోర్ట్ఫోలియో నిర్మాణంపై తప్పకుండా దృష్టి సారించాలి. గడిచిన రెండేళ్లలో.. ముఖ్యంగా కరోనా ప్రవేశం తర్వాత ప్రతీ ఒక్కరికీ ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వ్యాపార విధానాలు, నమూనాలను మార్చుకోవాల్సి వచ్చింది. టెక్నాలజీని అక్కున చేర్చుకోవాల్సి వచ్చింది. నూతనతరం టెక్నాలజీ ఆధారిత కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్ పట్ల ఇన్వెస్టర్ల వైఖరిలోనూ మార్పు వచ్చింది. 2022 అయినా స్థిరత్వాన్ని, సానుకూల పరిస్థితులను తీసుకురావాలని ఆశిద్దాం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు (హెల్త్ చెకప్) చేయించుకోవాలన్నది వైద్యుల సూచన. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్ఫోలియోను నిర్ణీత కాలానికోసారి సమీక్షించుకోవాలన్నది (వెల్త్ చెక్) ఆర్థిక సలహాదారులు ఇచ్చే సలహా. నూతన సంవత్సరం ఆరంభం ఇందుకు అనుకూల సందర్భంగా చూడాలి. గత సంవత్సరంలో రాబడులు ఏ మేరకు సమకూరాయి, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల తీరు వీటన్నింటినీ పరిశీలించుకుని అస్సెట్ అలోకేషన్ను అమల్లో పెట్టాలి. మార్కెట్ అవకాశాలను సొంతం చేసుకునే విధంగా విధానాన్ని రూపొందించుకుని అమల్లో పెట్టాలి. – రాఘవ్ అయ్యంగార్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, యాక్సిస్ ఏఎంసీ -
Multibagger: పెట్టుబడి లక్ష.. లాభం రూ.4 కోట్లు.. ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట
షేర్ మార్కెట్ అనగానే సెన్సెక్స్ 30, నిఫ్టీ 50 సూచీల కదలికపైనే అందరు దృష్టి సారిస్తారు. మార్కెట్లో బ్లూచిప్ కేటగిరలో ఉన్న బిగ్ కంపెనీల పనితీరు, ఆయా కంపెనీల్లో షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తిని ఈ సూచీలు పట్టి చూపుతాయి. కానీ మార్కెట్లో అనామకంగా స్మాల్ క్యాప్ కేటగిరిలో ఉన్న అనేక స్టాక్స్ ఊహించని లాభాలను అందిస్తాయి. మార్కెట్పై సరైన విశ్లేషణ చేసి ఈ కంపెనీల స్టాక్స్ కొంటే లాభల పంట పండటం కాదు కుంభవృష్టి కురుస్తుంది. ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్ స్టాక్ మార్కెట్లో స్మాల్క్యాప కేటగిరిలో లిస్టయిన కంపెనీల్లో ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్ ఒకటి. రెండేళ్ల క్రితం వరకు ఈ కంపెనీ గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. కానీ ఈ రోజు ఈ కంపెనీ షేర్లు అందించిన లాభాలు చూసి మార్కెట్ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. అనతి కాలంలో సంక్షోభ సమయంలో భారీ లాభాలు అందించిన షేర్లుగా అందరి నోళ్లలో ఫ్లోమిక్ గ్లోబల్ పేరు నానుతోంది. రెండేళ్ల కిందట ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్ కంపెపీ 2019 మార్చి 28న మార్కెట్లో లిస్టయ్యింది. ఆ సమయంలో ఆ కంపెనీ షేరు విలువ కేవలం 35 పైసలు మాత్రమే. స్మాల్క్యాప్ కేటగిరిలో ఉన్న ఈ కంపెనీ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపించిన వారు చాలా అరుదు అనే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కరోనా సంక్షోభం లాక్డౌన్ ఎఫెక్ట్తో ఈ కంపెనీ షేర్లలో పెరుగుదల కనిపించలేదు. గతేడాది నవంబరు మొదటి వారంలో ఈ కంపెనీ షేరు విలువ కేవలం రూ.1.14గా నమోదు అయ్యింది. ఇలా పట్టుకున్నారు సాధారణంగా మార్కెట్లో బ్లూ చిప్ కంపెనీల షేర్ల ధర ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో వీటి ధర కూడా ఎక్కువగా ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. స్మాల్క్యాప్ షేర్లు ఇందుకు విరుద్దంగా తక్కువ ధరకే లభిస్తుంటాయి. అయితే తెలివైన ఇన్వెస్టర్లు మంచి ఫలితాలు సాధించే స్మాల్క్యాప్ కంపెనీలను ఇట్టే పట్టుకుంటారు. ఏడాదిలో ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్ కంపెనీ షేరు విలువ 25 పైసల నుంచి రూ.1.14కి చేరుకుంది. అంటే ఇంచుమించు మూడు వందల శాతం వృద్ధి నమోదు చేసింది. దీంతో మంచి వృద్ది కనబరుస్తూ తక్కువ ధరకే లభిస్తున్న ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్పై ఇన్వెస్టర్లు ఫోకస్ చేయడం మొదలు పెట్టారు. అంచనాలను మించి ఇన్వెస్టర్లు ఫ్లోమిక్ లాజిస్టిక్ షేర్లపై ఆసక్తి చూపించడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి క్రమంగా షేర్ల ధర పెరుగుతూ 2021 జులైకి వచ్చే సరికి రూ.12.24 పైసులకు చేరుకుంది. ఇన్వెస్టర్లకు రూపాయికి పది రూపాయల లాభం ఇచ్చిన షేరుగా మార్కెట్లో గుర్తింపు పొందింది. అంతే ఇక అక్కడి నుంచి ఆకాశమే హద్దుగా ఈ కంపెనీ షేర్లు పెరుగుతూ వస్తున్నాయి. నవంబరు 13న ఈ కంపెనీ షేర్లు రూ.143.25గా ట్రేడవుతోంది. కేవలం ఆరు నెలల్లో కంపెనీ షేర్లు 1,779 శాతం వృద్ధిని నమోదు చేశాయి. లాభాలే లాభాలు నవంబరు మొదటి వారంలో ఈ కంపెనీ షేర్లు రూ.1.22లుగా ఉండగా నేడు రూ.143.25గా ఉంది. అంటే ఏడాది కిందట ఈ కంపెనీ షేర్లపై లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఏడాది తిరిగే సరికి దాదాపు కోటిన్నర రూపాయల రిటర్న్లు వచ్చినట్టయ్యింది. ఆరు నెలల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారు సైతం కనిస్టంగా కోటి రూపాయల వరకు లాభం కళ్ల జూశారు. ఇక అక్టోబరు 27న అయితే ఈ కంపెనీ ఆల్టైం హై ధర రూ.216ని టచ్ చేసింది. ఆ రోజు షేర్లు అమ్ముకున్నవారికి అయితే ఏకంగా లక్షకు రెండు కోట్ల రూపాయల వరకు రిటర్నులు వచ్చాయి. ఇక రెండేళ్ల క్రితం కంపెనీ ఆరంభంలో లక్ష పెట్టుబడి పెట్టిన వారికి అయితే ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకు పైగా రిటర్న్స్ వచ్చాయి. చదవండి:మదుపరులపై కాసుల వర్షం కురిపించిన స్టాక్స్! -
షార్ట్డ్యురేషన్ ఫండ్స్లో రాబడులు ఎలా ఉంటాయి?
ఇటీవలి సమీక్షలో ఆర్బీఐ సర్దుబాటు విధానాన్నే కొనసాగిస్తూ నిర్ణయించింది. కీలక రేట్లలోనూ మార్పులు చేయలేదు. రేట్ల పెంపు 2022లోనే ఉండొచ్చన్న అంచనాలున్నాయి. కనుక భవిష్యత్తు రేట్ల విషయమై అనిశ్చితి ఉన్న సమయంలో.. మూడేళ్లకాలం కోసం ఇన్వెస్టర్లు డెట్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఏఏఏ రేటెడ్ డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసే పథకాలను ఎంపిక చేసుకోవడం సురక్షితం. ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్ షార్ట్ టర్మ్ ప్లాన్ (ఐడీఎఫ్సీ ఎస్టీఎఫ్), కోటక్ బాండ్ షార్ట్ టర్మ్ ప్లాన్ (కోటక్ ఎస్టీఎఫ్) రెండూ ఈ విభాగంలో నాణ్యమైన పేపర్లలో ఇన్వెస్ట్ చేస్తూ మెరుగైన పనితీరును చూపిస్తున్నాయి. పెట్టుబడుల విధానం షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ సాధారణంగా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లు అయిన కార్పొరేట్ బాండ్లు, డిబెంచర్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సాధారణంగా వీటి కాల వ్యవధులు 1–3 ఏళ్ల మధ్య ఉంటుంది. అంటే దీర్ఘకాలం సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవు. ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయమే రాబడి అవుతుంది. ఇలా తక్కువ కాల వ్యవధి కలిగి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. సమీప కాలంలో వడ్డీ రేట్లు పెరిగితే ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు ఆ మేరకు ప్రయోజనం అందుకోవచ్చు. అదే మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఫండ్స్ కొంచెం ఎక్కువ కాలంతో కూడిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాయి కనుక.. వాటిల్లో వెంటనే ప్రయోజనం ఉండదు. అందుకే స్వల్పకాలానికి షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ప్రస్తుత పరిస్థితుల్లో అనుకూలం. రాబడులు.. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ విభాగం కంటే ఐడీఎఫ్సీ ఎస్టీఎఫ్, కోటక్ ఎస్టీఎఫ్ మెరుగైన పనితీరును చూపిస్తున్నాయి. కనీసం ఐదేళ్లకు పైగా పనిచేస్తూ.. రూ.300 కోట్లకు పైగా నిర్వహణ ఆస్తులున్న పథకాలతో పోలిస్తే ఈ రెండు పథకాలు మెరుగ్గా ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 7.6 శాతంగా ఉంటే.. ఐడీఎఫ్సీ ఎస్టీఎఫ్, కోటక్ ఎస్టీఎఫ్ మాత్రం 7.9 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టాయి. ఇక మూడేళ్ల కాలంలో ఈ విభాగం సగటు వార్షిక రాబడి 7.2 శాతంగాను, ఐదేళ్లలో 7.4 శాతం చొప్పున ఉండగా.. కోటక్ ఎస్టీఎఫ్, ఐడీఎఫ్సీ ఎస్టీఎఫ్ సగటున మూడేళ్లలో 7.6 శాతం, ఐదేళ్లలో 7.9 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించాయి. రాబడులను చూసేవారు ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విభాగంలో అధిక రాబడులను అందించే ఇతర పథకాలు కూడా ఉన్నాయి. కానీ, వాటితో పోలిస్తే ఈ రెండు పథకాలు పెట్టుబడుల పరంగా నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుసుకోవచ్చు. ఏఏఏ రెటెడ్ పేపర్లను ఎక్కువ భద్రతకు భరోసాగా చూడొచ్చు. పోర్ట్ఫోలియో.. ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్ ఎస్టీఎఫ్ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.12,700 కోట్ల పెట్టుబడులున్నాయి. వీటిల్లో 94 శాతం ఏఏఏ రేటెడ్ పత్రాల్లోనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అదే విధంగా కోటక్ ఎస్టీఎఫ్ 95 శాతం పెట్టుబడులను ఏఏఏ రేటెడ్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడనే కాదు.. గత పెట్టుబడులను పరిశీలించినా కానీ ఏఏఏ రేటెడ్ సాధనాల్లో ఈ రెండు పథకాలు సగటున 90 శాతం, అంతకుపైనే నిర్వహిస్తున్నాయి. ఐడీఎఫ్సీ ఎస్టీఎఫ్ పోర్ట్ఫోలియోలోని డెట్ సాధనాల సగటు మెచ్యూరిటీ (గడువు తీరే కాలం) 2.1 సంవత్సరాలుగా ఉంటుంది. కోటక్ ఎస్టీఎఫ్ మాత్రం రిస్క్ను వైవిధ్యం చేసేందుకు వీలుగా.. భిన్న కాల వ్యవధులతో కూడిన డెట్ సాధనాలను ఎంపిక చేసుకుంటోంది. కనుక ఈ పథకం పోర్ట్ఫోలియో సగటు మెచ్యూరిటీ 1.4 నుంచి 3.9 సంవత్సరాల మధ్య గత ఐదేళ్లలో ఉంది. ఈ రెండు పథకాలు 2021 ఏప్రిల్ నుంచి జీ–సెక్యూరిటీల్లో పెట్టుబడులను పెంచుకుంటున్నాయి. స్వల్ప కాలం కోసం (2–3 ఏళ్లు) ఇన్వెస్టర్లు ఈ పథకాలను పరిశీలించొచ్చు. చదవండి : ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు -
మహేశ్ బాబు బ్యాక్ టూ హైదరాబాద్
గోవాలో ‘సర్కారువారి పాట’ షెడ్యూల్ ముగిసింది. మహేశ్బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయిక. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ గోవాలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ బుధవారంతో ముగిసింది. ఈ గోవా షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్సెస్ను షూట్ చేశారు. ఓ యాక్షన్ సీక్వెన్స్తో మొదలైన గోవా షెడ్యూల్ మరో యాక్షన్ సీక్వెన్స్తో పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి : ఎస్... అవన్నీ వదంతులే! ‘బంగార్రాజు’ మూవీ షూటింగ్ స్టార్ చేసిన అక్కినేని హీరోలు -
'ప్రభాస్' ఇటలీ ట్రిప్ వెనుక కారణం అదేనా?
Prabhas reached to Hyderabad : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఇటీవలె ఇటలీ ట్రిప్ ముగించుకున్న ఆయన బుధవారం హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రభాస్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కళ్లజోడు సహా తలను బినీతో కంప్లీట్గా కవర్ చేసుకున్న ప్రభాస్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. అయితే ఆయన ఇటలీ ట్రిప్ రాధేశ్యామ్ షూటింగ్ కోసమా లేక వెకేషన్ ట్రిప్పా అన్నదానిపై స్పష్టత లేదు. రాధాకృష్ణ దర్శకత్వంతో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్కు జోడీగా పూజా హెగ్డే నటించింది. పిరియాడికల్ ప్రేమకథ తెరకెక్కుతున్న ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 23న హైదరాబాద్లో ఆరంభమై, ఆగస్టు 5 వరకు జరుగుతుందని సమాచారం. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ విడుదల కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో 'సలార్', దర్శకుడు ఓంరౌత్ తో 'ఆదిపురుష్' భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు నాగ్ అశ్విన్తో పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
ఈ పొరపాట్లు చేయొద్దు.. ఫారం 16ని చెక్ చేయండి
ఐటీ రిటర్నులు వేస్తున్నాం.. పన్నులు కట్టేస్తున్నాం కదా అని మనలో మనం సంబరపడుతుంటాము. కానీ కొన్ని తప్పులు కూడా చేస్తుంటాం. ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో బైటపడ్డ నిజాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనం చేసే తప్పుల గురించి తెలుసుకుందాం.. ► ఒక ఉద్యోగి ఒక సంవత్సరకాలంలో రెండు చోట్ల ఉద్యోగం చేసినప్పుడు .. ఇద్దరూ ఫారం 16 జారీ చేసి ఉంటారు. ఇద్దరూ స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ ఇస్తారు. ఇద్దరూ సెక్షన్ 80సి మినహాయింపులూ ఇస్తారు. కానీ ఉద్యోగి ఎన్ని ఉద్యోగాలు చేసినా ఒకసారే మినహాయింపు వస్తుంది. రెండు సార్లు రాదు. స్టేట్మెంట్ తయారు చేసినప్పుడు ఆదాయంలో మార్పు రాదు. కానీ మినహాయింపులు, సగానికి తగ్గుతాయి. ఫలితంగా పన్నుభారం పెరుగుతుంది. ఈ విషయం అర్థం కాక పన్ను భారం పెరిగిపోయిందో అని ఆందోళన .. కాస్సేపు బాధ .. కాస్సేపు బెంగ వస్తాయి. ఇవన్నీ సర్దుకునే సరికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఫారం 16ని చెక్ చేయండి. ఇటువంటి పరిస్థితి ఏర్పడితే సరిదిద్దుకోండి. ► కొన్ని ఆదాయాలను పరిగణనలోకి తీసుకోరు. బ్యాంకు డిపాజిట్ మీద వడ్డీ, సేవింగ్స్ ఖాతాలో జమయ్యే వడ్డీ, ఆన్సర్ పేపర్లు దిద్దితే వచ్చే డబ్బు, ఇన్విజిలేషన్ వల్ల వచ్చే డబ్బు, నగదు రూపంలో వచ్చే ట్యూషన్ ఫీజులు, ఇంటద్దెలు, గార్డియన్గా పిల్లలకు వచ్చిన ఆదాయం, జీవిత భాగస్వామికి వచ్చే ఆదాయం.. ఇవన్నీ చూపించాలి. ఎటువంటి రిస్కు తీసుకోవద్దు. ► పన్ను భారం ఉండని ఆదాయాన్ని.. అంటే.. మినహాయింపు లభించే ఆదాయాలను కూడా రిటర్నులో డిక్లేర్ చేయాలి. ఇలా చేయడం వల్ల పన్ను భారం ఉండదు. భవిష్యత్తులో ‘‘సోర్స్’’ వివరణ ఇచ్చినప్పుడు ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ► బ్యాంకుల మీద వచ్చే వడ్డీ కేవలం 10 శాతం టీడీఎస్కి గురి అవుతుంది. మీ నికర ఆదాయంపై 10 శాతం, 20 శాతం లేదా 30 శాతం వర్తించవచ్చు. 20 శాతం, 30 శాతం రేటు పడినప్పుడు వడ్డీ మీద టీడీఎస్ సరిపోదు. పది శాతం పన్ను పడుతుంది. అలా తెలియగానే ఎంతో బాధ.. ఏదో తప్పు జరిగిందని ఆవేదన, ఆలోచన వస్తాయి. మిగతా మొత్తం చెల్లించక్కర్లేదు అనుకోవడం తప్పు. ► నికర ఆదాయం నిర్దేశించిన పరిమితి దాటితే స్థూల పన్ను భారంలో 10 శాతం సర్చార్జి పడుతుంది. సర్చార్జి మీద 4 శాతం సెస్సు అదనం. ముందుగా ఏ ఆదాయానికి ఆ ఆదాయం విడిగా లెక్కించి, అజాగ్రత్త వలన నికర ఆదాయం తక్కువగా అనిపించి సర్చార్జీని పరిగణనలోకి తీసుకోరు. కానీ అన్నీ కలిపేసరికి నికర ఆదాయం కోటి రూపాయలు దాటితే సర్చార్జి కరెంటు షాకులాగా తగులుతుంది. తప్పు .. తప్పని తేలకపోతే ఫర్వాలేదు. కానీ తేలితే మళ్లీ బెంగ.. భయం.. పైగా పన్నూ తప్పదు. కాబట్టి ఇలా ఎన్నో తప్పులు దొర్లవచ్చు. కనుక తస్మాత్ జాగ్రత్త వహించండి. -
తాలిబన్లు పట్టు బిగిస్తే భారత్కు ఎన్నో సవాళ్లు
అమెరికా దళాలు ఇంకా పూర్తిగా వెనక్కి మళ్లనే లేదు అఫ్గాన్లో తాలిబన్లు చెలరేగి దాడులకు దిగుతున్నారు కీలకమైన ప్రాంతాల్లో పట్టు బిగుస్తున్నారు పాక్ సహకారంతో రెచ్చిపోతారని భారత్ ఆందోళన చెందుతోంది తాలిబన్ల పట్టు పెరిగితే భారత్కు ఎదురయ్యే సవాళ్లేంటి ? అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి మళ్లుతూ ఉండడంతో తాలిబన్లు తిరిగి తమ పట్టు పెంచుకుంటున్నారు. ఏకంగా 85% భూభాగం తమ అధీనంలోనే ఉందని ప్రకటించుకున్నారు. ఆగస్టు 31నాటికల్లా అమెరికా దళాలు వెనక్కి పూర్తిగా వెళ్లిపోతే పరిస్థితులు ఎలా మారుతాయోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. భౌగోళికంగా భారత్కు అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన అఫ్గాన్పై తాలిబన్లు పట్టు బిగిస్తే మన దేశానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అఫ్గానిస్తాన్లో 398 జిల్లాలు ఉన్నాయి. ఇరవై ఏళ్ల క్రితమే అందులో 193 జిల్లాల్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. 130 జిల్లాల్లో తాలిబన్లు, అఫ్గాన్ ఆర్మీ మధ్య ఘర్షణ జరుగుతోంది. కేవలం 75 జిల్లాలు మాత్రమే ప్రస్తుత ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. తాలిబన్లను ఎంతవరకు అఫ్గాన్ ప్రభుత్వం నిలువరిస్తుందనేది సందేహమే. భారత్కు ఎదురయ్యే సవాళ్లు ∙అఫ్గానిస్తాన్ తాలిబన్ల అధీనంలోకి వెళ్లిపోతే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం భారత్కు అతి పెద్ద సవాల్గా మారుతుంది. సహజంగానే తాలిబన్లు, పాకిస్తాన్ ఒకరికొకరు సహకారం అందించుకుంటారు. దీంతో పరిస్థితులన్నీ పాక్కి అనుకూలంగా మారే అవకాశం ఉంది. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతాయన్న ఆందోళన నెలకొంది. హింసతో రగిలిపోతున్న అఫ్గాన్లో శాంతి స్థాపన కోసం చాలా ఏళ్లుగా భారత్ కృషి చేస్తోంది. ఆ దేశానికి అండగా ఉంటూ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు అవన్నీ కాపాడుకోవడం మన దేశానికి మరో గట్టి సవాల్గా మారుతుంది. గత కొద్ది ఏళ్లలో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భారత్ అఫ్గాన్లో 2,200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. గత ఏడాదే కేంద్ర ప్రభుత్వం మరో రూ.600 కోట్లు పెడతామని ప్రకటించింది. మన దేశానికి చెందిన ఇంజనీర్లు 3 వేల మందికిపైగా అక్కడ అభివృద్ధి పనుల్లో ఉన్నారు. కానీ తాలిబన్లు మళ్లీ రెచ్చిపోతే భారత్ పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. భారతీయుల ప్రాణాలు ముప్పులో పడే అవకాశం ఉంది. ∙అఫ్గాన్పై పట్టు నిలుపుకోవడం కూడా మరో సవాలే. భారత్కి పొరుగుదేశమైన అఫ్గాన్ వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగింది. వాస్తవానికి ఆ దేశంలో సహజ వనరులు, సారవంతమైన నేలలు, చమురు, యురేనియం వంటి సహజ నిక్షిప్తాలు ఏమీ లేకపోయినప్పటికీ భౌగోళికంగా అత్యంత కీలకమైనది. ఆసియాలోని వాణిజ్య రవాణాకు అఫ్గానే కేంద్రంగా ఉంది. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్డు ప్రణాళికలో అఫ్గాన్ చాలా ముఖ్యమైనది. అందుకే చైనా అఫ్గాన్పై పట్టు పెంచుకోవాలని భావిస్తుంది. పాకిస్తాన్ అండతో డ్రాగన్ దేశం అఫ్గాన్ నుంచి లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తుంది. దీంతో చైనా, పాక్ చేసే కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కోవడం భారత్కు అతి పెద్ద సవాల్ విసురుతుంది. అమెరికా ఎందుకు వెనక్కి మళ్లుతోంది ? అమెరికాపై సెప్టెంబర్ 11, 2001 దాడుల తర్వాత అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అఫ్గాన్లో తలదాచుకున్నాడన్న సమాచారంతో అగ్రరాజ్యం తన బలగాలను పంపింది. ఈ 20 ఏళ్లలోనూ దాదాపుగా 2 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. కానీ హఠాత్తుగా వెనక్కి మళ్లాలని నిర్ణయించింది. గత ఏడాది దోహాలో అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బలగాలను ఉపసంహరిస్తోంది. అమెరికా అధీనంలో ఉన్న ప్రాంతాల్లో అల్ఖైదా కార్యకలాపాలు కొనసాగించకూడదన్న ఒకే ఒక్క షరతుతో అమెరికా వెనక్కి వెళ్లిపోతోంది. దశాబ్దాల క్రితం సోవియెట్ యూనియన్ను బలహీనపరచడానికి తాలిబన్లను అమెరికాయే పెంచి పోషించింది. వారికి క్షిపణుల్ని కూడా సరఫరా చేసింది. ఆ తర్వాత తమ దేశంపైనే ఉగ్రవాదులు దాడులు జరపడంతో ఉలిక్కిపడి స్వప్రయోజనాల కోసం తాలిబన్లను నిలువరించింది. ఇప్పుడు మళ్లీ తమకి లబ్ధి చేకూరే నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను ముప్పులోకి నెట్టేస్తోంది. ఇప్పటికే తాలిబన్లు జరిపే దాడులతో వందలాది మంది అఫ్గాన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. తాలిబన్ల క్రూరత్వం చూడకుండా పెరిగిన యువతీయువకుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. మధ్య ఆసియాలోకి ప్రవేశిస్తారని రష్యా ఆందోళన చెందుతూ ఉంటే, ఇరాన్ తమ దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని భయపడుతోంది. ఎవరీ తాలిబన్లు 1990 తొలినాళ్లలో అఫ్గానిస్తాన్ నుంచి సోవియెట్ దళాలు వెనక్కి మళ్లాక ఉత్తర పాకిస్తాన్ ప్రాంతంలో ఆదివాసీల హక్కుల కోసం తాలిబన్ల ఉద్యమం మొదలైంది. అతివాద సున్నీ మతాన్ని బోధించే మత సంస్థల్లో తాలిబన్లు తొలుత పట్టు బిగించారు. ఈ సంస్థలకు సౌదీ అరేబియా నుంచి విరాళాలు వచ్చేవి. అలా నెమ్మది నెమ్మదిగా అఫ్గాన్పై పట్టు బిగించి 1995లో పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అవినీతి నిర్మూలన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, తమ అదీనంలో ఉన్న ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగు పరచడం వంటి పనులతో మొదట్లో తాలిబన్లకు ప్రజాదరణ లభించింది. అదే సమయంలో కఠినమైన శిక్షల్ని విధించడం, నేరస్తుల్ని బహిరంగంగా ఉరి తీయడం, మహిళలు సినిమాలు చూడకూడదని, చదువుకోకూడదని విధించిన ఆంక్షలు వారిపై వ్యతిరేకత పెంచాయి. ఇప్పుడు మళ్లీ తాలిబన్లు వస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన అఫ్గాన్ మహిళల్లో కూడా నెలకొంది. తాలిబన్లు మళ్లీ పట్టు బిగిస్తే అఫ్గాన్లో అంతర్యుద్ధం నెలకొని ప్రపంచ దేశాలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనన్న చర్చ కూడా జరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చెన్నై చేరుకున్న రజనీకాంత్.. అభిమానుల ఘన స్వాగతం
సూపర్స్టార్ రజనీకాంత్ శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు. వైద్య పరీక్షల కోసం జూన్ 19న భార్య లతా రజనీకాంత్తో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ మయో క్లినికల్ ఆస్పత్రిలో రజనీకాంత్కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించడంతో ఆయన తిరిగి చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారికి అభివందంనం చేసిన తలైవా అనంతరం తన కారులో ఇంటికి చేరుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తైంది. నవంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, కీర్తిసురేష్లతో పాటు మీనా, ఖుష్బు, సూరి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. Thalaivar Returns🔥😍😍😍💖💖💖#Annaatthe #AnnaattheDeepavali #AnnaattheFLSoon #AnnaattheFirstLook #Thalaivar #SuperstarRajinikanth #Rajinikanth pic.twitter.com/PfGZKG4oOr — Vijay Andrews (@vijayandrewsj) July 8, 2021 -
జీఎస్టీతో తగ్గిన పన్నుల భారం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో 66 కోట్లకు పైగా జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయని.. పన్ను రేట్లు తగ్గడంతో నిబంధనలను పాటించే వారు పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బహుళ పన్నుల విధానం స్థానంలో జీఎస్టీని కేంద్రం 2017 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పెట్రోలియం, లిక్కర్ తదితర కొన్ని మినహా అధిక శాతం వస్తు, సేవలను జీఎస్టీలో భాగం చేశారు. 1.3 కోట్ల పన్ను చెల్లింపుదారులు ‘‘వినియోగదారు, పన్ను చెల్లింపుదారులకూ జీఎస్టీ అనుకూలమైనదని నిరూపణ అయింది. జీఎస్టీకి పూర్వం అధిక పన్నుల రేట్లు నిబంధనల అమలు విషయంలో నిరుత్సాహకరంగా ఉండేవి. ప్రతీ రాష్ట్రం భిన్నమైన పన్ను రేటును వసూలు చేసేది. దీంతో అసమర్థత, వ్యయాలకు దారితీసింది. జీఎస్టీ æవిధానంలో తక్కువ రేట్ల కారణంగా పన్ను నిబంధనలను పాటించేవారి సంఖ్య క్రమంగా పెరిగింది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ ట్విట్టర్పై పేర్కొంది. ఒక కంపెనీ వ్యాపారం చేయడం కోసం కరోనాకు ముందు నాటి విధానంలో కనీసం 495 భిన్నమైన పత్రాలను దాఖలు చేయాల్సి వచ్చేదంటూ.. జీఎస్టీలో ఇది 12కు తగ్గినట్టు వివరించింది. జీఎస్టీ కింద నాలుగు రకాల రేట్లు అమలవుతుండడం తెలిసిందే. నిత్యావసరాలపై 5 శాతం, విలాసవంతం, సమాజానికి చేటు చేసేవాటిపై 28 శాతం పన్ను అమలు చేస్తుండగా.. మిగిలిన వస్తు, సేవలపై 12, 18 శాతం పన్ను అమలవుతోంది. వీరికి పన్ను భారం తక్కువ వార్షికంగా రూ.40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న (విక్రయాల ఆదాయం) వ్యాపారాలు, పరిశ్రమలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. అలాగే వార్షికంగా రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్నవి కాంపోజిషన్ పథకాన్ని ఎంపిక చేసుకుని టర్నోవర్పై 1 శాతం జీఎస్టీ చెల్లిస్తే చాలు. సేవల వ్యాపారం నిర్వహించే సంస్థలకు వార్షికంగా రూ.20 లక్షల వరకు టర్నోవర్ ఉంటే జీఎస్టీ వర్తించదు. రూ.50లక్షల వరకు టర్నోవర్ ఉన్న సేవల సంస్థలు కాంపోజిషన్ స్కీమ్ కింద 6 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. 54,439 మందికి అభినందనలు జీఎస్టీ 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ విధానం విజయవంతం కావడంలో భాగమైన పన్ను చెల్లింపుదారులను గౌరవించాలని నిర్ణయించాం. సకాలంలో రిటర్నులను దాఖలు చేయడమే కాకుండా, గణనీయమైన పన్ను చెల్లింపులు చేసిన వారిని గుర్తించేందుకు పరోక్ష పన్నులు, కస్టమ్స్ విభాగం (సీబీఐసీ) డేటా అన్లిటిక్స్ (సమాచార విశ్లేషణ)ను చేపట్టింది. ఇందులో భాగంగా 54,439 మంది పన్ను చెల్లింపుదారులను గుర్తించింది. ఇందులో 88 శాతానికి పైగా ఎంఎస్ఎంఈలే ఉన్నాయి. సూక్ష్మ పరిశ్రమలు 36 శాతం, చిన్న తరహా పరిశ్రమలు 41 శాతం, మధ్య తరహా పరిశ్రమలు 11 శాతం చొప్పున ఎంపికైన వాటిల్లో ఉన్నాయి. వీటిని అభినందిస్తూ సర్టిఫికేట్లను సీబీఐసీ ఇవ్వనుంది. – కేంద్ర ఆర్థిక శాఖ మైలురాయి భారత ఆర్థిక ముఖచిత్రంలో జీఎస్టీ ఒక మైలురాయి. జీఎస్టీ పన్నుల సంఖ్యను తగ్గించింది. నిబంధనల అమలు భారాన్ని, సామాన్యునిపై మొత్తం మీద పన్ను భారాన్ని తగ్గించింది. పారదర్శక, నిబంధనల అమలు, పన్ను వసూలు గణనీయంగా పెరిగింది. – నరేంద్రమోదీ, ప్రధానమంత్రి -
రిస్క్ తక్కువతో రాబడులు
ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటేనే రిస్క్ అధికం. కాకపోతే ఈక్విటీల్లో లార్జ్క్యాప్ స్టాక్స్.. మార్కెట్ పతనాల్లో ఇతర స్టాక్స్తో పోలిస్తే కాస్త బలంగా నిలబడతాయి. అందుకే ఇతర స్టాక్స్తో పోలిస్తే లార్జ్క్యాప్ స్టాక్స్లో రిస్క్ కాస్త తక్కువ. అదే సమయంలో డెట్ ఫండ్స్లోనూ (క్రెడిట్రిస్క్ ఫండ్స్ మినహా) రిస్క్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈ రెండింటిలోనూ పెట్టుబడులు పెట్టేవే హైబ్రిడ్ ఫండ్స్. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ కూ డా ఒకటి. ఈ రెండు విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టే అవకాశం ఈ పథకం రూపంలో లభిస్తుంది. పెట్టుబడుల విధానం హైబ్రిడ్ ఫండ్స్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ విభాగాల్లోనూ పెట్టుబడుల సమతూకాన్ని మారుస్తుంటాయి. కంపెనీల వ్యాల్యూషన్లు, మార్కెట్లలో అస్థిరతలకు తగినట్టు అవసరమైతే ఈక్విటీ పెట్టుబడులు పెంచుకోవడం, తగ్గించుకోవడం చేస్తుంటాయి. కానీ, ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ వెసులుబాటు అంతగా ఉండదు. ఈ పథకం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ విభాగం కిందకు వస్తుంది. అంటే పెట్టుబడి అవకాశాల లభ్యతకు అనుగుణంగా 65 నుంచి 80 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించే స్వేచ్ఛను కలిగి ఉంటుంది. అదే విధంగా 20–35 శాతం వరకు డెట్కు కేటాయిస్తుంది. కొంత రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నవారు, దీర్ఘకాలం పాటు (ఐదేళ్లకు మించి) ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. పెట్టుబడుల విషయంలో ఈ ఫండ్.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ స్టాక్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26.42 శాతం పెట్టుబడులు ఈ రంగ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 13 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 10 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. రాబడులు: ఈ పథకం 2015 జూలైలో ప్రారంభమైంది. పోటీ పథకాలతో పోలిస్తే ఇప్పటి వరకు మంచి పనితీరే చూపించింది. ఈ ఫండ్ గడిచిన ఏడాది కాలంలో 10.2 శాతం రాబడులను అందించింది. కానీ ఇదే కాలంలో ఈ విభాగం సగటు రాబడులు 8.5 శాతంగానే ఉన్నాయి. ఇక గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం 9.8 శాతం, ఐదేళ్లలో 9.5 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. పథకం ఆరంభం నుంచి చూస్తే రాబడులు వార్షికంగా 10.67 శాతం చొప్పున ఉన్నాయి. అన్ని కాలాల్లోనూ అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగం రాబడులతో పోలిస్తే ఈ పథకం పనితీరు ముందంజలో ఉంది. ముఖ్యంగా ఈ పథకం పోర్ట్ఫోలియోలో అధిక నాణ్యత కలిగిన (ఏఏఏ) డెట్ పెట్టుబడులు ఉండడాన్ని గమనించాలి. అలాగే, ఈక్విటీ పెట్టుబడుల్లోనూ ఎక్కువ భాగాన్ని లార్జ్క్యాప్ కంపెనీలకే కేటాయించింది. ఈ పథకం దాదాపు ఎక్కువ సందర్భాల్లో ఈక్విటీలకు 70 నుంచి 75 శాతం వరకే కేటాయిస్తూ వస్తోంది. ప్రస్తుతానికి ఈక్విటీ కేటాయింపులు 78 శాతంగా ఉండగా, డెట్లో 13.4 శాతం పెట్టుబడులు, నగదు సమానాల్లో 8 శాతం వరకు కలిగి ఉంది. ఈక్విటీ పోర్ట్ఫోలియోలో 56 స్టాక్స్ ఉన్నాయి. -మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ - 7.49 శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు - 6.79 శాతం ఇన్ఫోసిస్ - 4.99 శాతం ఐసీఐసీఐ బ్యాంకు 4.68 శాతం టీసీఎస్ 4.29శాతం యాక్సిస్ బ్యాంకు 3.38 శాతం ఎస్బీఐ 2.53 శాతం ఐటీసీ 2.30 శాతం హెచ్యూఎల్ 2.15 ఎల్అండ్టీ 2.14 -
విద్యుత్తు బిల్లు రూ.లక్ష దాటితే రిటర్న్లు!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ వర్గాలు దాఖలు చేయాల్సిన రిటర్నుల పత్రాలను (ఐటీఆర్ ఫామ్) నోటిఫై చేసింది. సహజ్ (ఐటీఆర్–1), ఐటీఆర్–2, ఐటీఆర్–3, సుగమ్ (ఐటీఆర్–4), ఐటీఆర్–5, ఐటీఆర్–6, ఐటీఆర్–7 నోటిఫై చేసిన వాటిల్లో ఉన్నాయి. అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను వీటిల్లో తెలియజేయాల్సి ఉంటుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది. కరెంటు ఖాతాలో డిపాజిట్లు రూ.కోటికి మించి ఉంటే, విదేశీ ప్రయాణం కోసం రూ.2 లక్షలకు మించి ఖర్చు చేసి ఉంటే, విద్యుత్తు బిల్లు రూ.లక్షకు మించితే రిటర్నుల్లో తెలియజేయాల్సి ఉంటుంది. -
అటు రాబడి... ఇటు భద్రత
వడ్డీ రేట్లు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబడుల కోసం నూరు శాతం రిస్క్ తీసుకోవడం సూచనీయం కాదు. రాబడులు తక్కువే ఉన్నా ప్రతి ఒక్కరి పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో డెట్ సాధనాలకూ(స్థిరాదాయ పథకాలు) తప్పకుండా చోటు ఉండాలి. ఈక్విటీలు దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ.. గడిచిన మూడేళ్ల కాలంలో చూసుకుంటే అధిక శాతం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రాబడులు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక డెట్ సాధనాలను ఎంత మాత్రం విస్మరించలేము. మరి డెట్ విభాగంలో పెట్టుబడులకు ఏది ఉత్తమమైన ఎంపిక? అన్న సందిగ్ధత ఉంటే.. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఆ విషయమై స్పష్టత వస్తుంది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్పై ఎస్బీఐ 5.70 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు (వృద్ధులకు) 6.50 శాతంగా ఉంది. 20 శాతం పన్ను శ్లాబులో ఉన్న వృద్ధులకు నికరంగా మిగిలే రాబడి 5.15 శాతం కాగా, ఇతరులకు ఇది 4.51 శాతంగా ఉంది. అదే 30 శాతం శ్లాబు పరిధిలో ఉన్న వృద్ధులకు నికర రాబడి 4.47 శాతం అయితే, ఇతరులకు 3.92 శాతం రాబడి లభిస్తుంది. పన్ను రేటు సెస్సులతో కలిపి గణించడం జరిగింది. పన్ను ప్రయోజనాలు: సెక్షన్ 80సీ ప్రయోజనం లేదు. అందుకునే రాబడి కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. అనుకూలం: ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డిపాజిట్ను రద్దు చేసుకుని వెనక్కి తీసేసుకోవచ్చు. ప్రతికూలం: అధిక పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను చెల్లించగా మిగిలేది చాలా తక్కువే. ఎవరికి అనుకూలం?: కోరుకున్నప్పుడు వెంటనే డబ్బులు తీసుకునే వీలుండాలని అనుకునేవారికి. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులు పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐలో పన్ను ఆదా ఎఫ్డీని పరిగణనలోకి తీసుకుంటే వృద్ధులకు 6.50 శాతం, ఇతరులకు 5.70 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. సెక్షన్ 80సీ ప్రయోజనాన్ని వినియోగించుకుంటే 20 శాతం పన్ను పరిధిలోని వృద్ధులకు నికర రాబడి 6.50 శాతంగాను, ఇతరులకు 5.70 శాతంగాను ఉంటుంది. పన్ను ప్రయోజనం: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. రాబడిపై పన్ను పడుతుంది. అనుకూలం: సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా ప్రయోజనం. ప్రతికూలం: ఐదేళ్ల లాకిన్తో వస్తుంది. కనుక ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని వెనక్కి తీసుకునే వీలుంటుంది. ఎవరికి అనుకూలం?: పన్ను ఆదా కోసం బ్యాంకుల్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాననే వారికి. నోట్: చిన్న బ్యాంకులు అధిక రాబడులను ఆఫర్ చేస్తున్నాయి. రిస్క్ తీసుకునే వారు వాటిని పరిశీలించొచ్చు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుతం వడ్డీ రేటు 7.60 శాతం. పెట్టుబడులపై సెక్షన్ 80సీ పన్ను ప్రయోజనాన్ని వినియోగించుకుంటే 20 శాతం, 30 శాతం పన్ను పరిధిలోని వారికి నికర రాబడి 7.60 శాతంగానే ఉంటుంది. పన్ను ప్రయోజనాలు: ఈ పథకంలో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. రాబడిపై పన్ను పడుతుంది. అనుకూలం: అధిక వడ్డీ రేటు, ఎటువంటి రిస్క్ లేకపోవడం. పరిమితులు: గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట తల్లిదండ్రులు మాత్రమే ఈ ఖాతాను తెరిచేందుకు ఉంటుంది. ఒక ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునే పరిమితి ఉంటుంది. కుమార్తె విద్యా, వివాహ అవసరాలకు ఉపయోగపడుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రస్తుత రేటు 7.10 శాతం. పన్ను ప్రయోజనాలు: పెట్టుబడులకు సెక్షన్ 80సీ ప్రయోజనాలు వర్తిస్తాయి. రాబడిపైనా పన్ను ఉండదు. అనుకూలతలు: పన్ను లేని అధిక రాబడి రేటు. రిస్క్ ఉండదు. పరిమితులు: 15 ఏళ్ల పథకం. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోగలరు. రాబడులు: సెక్షన్ 80సీ పన్ను ఆదాను కలిపి చూసుకుంటే 20% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి రేటు 8.96 శాతం, 30% పన్ను పరిధిలోని వారికి ఇది 10.32 శాతం. ఎవరికి?: పన్ను పరిధిలోని వ్యక్తుల దీర్ఘకాల అవసరాలకు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటు 7.40%. 20% పన్ను పరిధిలోని వారికి 5.86%, 30% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి రేటు 5.09 శాతంగాను ఉంటుంది. సెక్షన్ 80సీ ప్రయోజనాన్ని వినియోగిం చుకుంటే 20 % పన్ను శ్లాబులోని వారికి నికర రాబడి రేటు 7.40%గానే ఉంటుంది. పన్ను ప్రయోజనం: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో చేసే పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను ఆదా పొందొచ్చు. వడ్డీ ఆదాయం మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. అనుకూలం: అధిక వడ్డీ రేటుతోపాటు రిస్క్ అస్సలు ఉండదు. పరిమితులు: 60 ఏళ్లు పైబడిన వారికే పరిమితం. గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షల వరకే. ఐదేళ్ల లాకిన్ అమలవుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ఇందులో ఆఫర్ చేస్తున్న ప్రస్తుత వడ్డీ రేటు 6.80%. పన్ను ప్రయోజనాలు: సెక్షన్ 80సీ పన్ను ఆదాకు అర్హత ఉంది. వడ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. అనుకూలం: ఎటువంటి రిస్క్ లేకపోవడం. ప్రతికూలం: ఐదేళ్ల లాకిన్ అమలవుతుంది. రాబడులు: 20% పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను నికర రాబడి 5.39 శాతం. 30% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి 4.68 %. ఎవరికి?: రిస్క్ వద్దనుకునే వారు పరిశీలించదగినది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో రిస్క్ లేని రెండు విభాగాలు లిక్విడ్ ఫండ్స్, ఓవర్నైట్ ఫండ్స్ను తీసుకుంటే.. లిక్విడ్ ఫండ్స్లో రాబడులు వార్షికంగా 5.58% వరకు ఉంటాయి. ఓవర్నైట్ ఫండ్స్లో 4.70% వరకు ఉండొచ్చు. పన్ను ప్రయోజనాలు: ఇందులో పెట్టుబడులకు, రాబడులు ఎటువంటి పన్ను ప్రయోజనాల్లేవు. అనుకూలతలు: ఎటువంటి లాకిన్ ఉండదు. అవసరమైనప్పుడు వేగంగా ఉపసంహరించుకోవచ్చు. ప్రతికూలతలు: భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబడులు ఇంకా తగ్గొచ్చు. ఎవరికి?: అధిక లిక్విడిటీ కోరుకునే వారికి. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్కు అనుబంధంగా ఇన్వెస్ట్ చేసుకునే వీలున్న సాధనం. ఇందులో 2018–19లో అమల్లో ఉన్న రేటు 8.65 శాతం. పన్ను ప్రయోజనాలు: ఇందులో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. రాబడిపైనా పన్ను ఉండదు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 20 శాతం శ్లాబులోని వారికి నికర రాబడి రేటు 10.92 శాతంగాను, 30 శాతం పన్ను పరిధిలోని వారికి 12.57 శాతంగాను ఉంటుంది. అనుకూలతలు: మార్కెట్ కంటే అధిక రాబడులు ఇందులో ఉంటున్నాయి. పరిమితులు: ఈపీఎఫ్ పరిధిలో ఉన్న వారికే ఇది పరిమితం. అలాగే, ఉపసంహరణలకు పరిమితులు ఉన్నాయి. ఎవరికి?: రిస్క్ రహితంగా దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలని అనుకునే వారికి. ఐదేళ్ల కంపెనీ డిపాజిట్ కంపెనీలు తమ అవసరాల కోసం వివిధ మార్గాల్లో నిధులను సమీకరిస్తుంటాయి. ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, ఎన్బీఎఫ్సీలు డిపాజిట్ల రూపంలో నిధులు సేకరిస్తుంటాయి. వీటిల్లో హెచ్డీఎఫ్సీ ఆఫర్ చేస్తున్న డిపాజిట్పై వడ్డీ రేటు పెద్దలకు 7.55 శాతం, ఇతరులకు 7.30 శాతంగా ఉంది. 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వృద్ధులకు నికరంగా వచ్చే రాబడి 5.98 శాతం.. ఇతరులకు 5.78%. 30% పన్ను పరిధిలోని వృద్ధులకు నికరంగా అందే రాబడి 5.19%, ఇతరులకు 5.02 శాతంగా ఉంటుంది. పన్ను ప్రయోజనాలు: పన్ను ప్రయోజనాలు కంపెనీల డిపాజిట్లపై ఉండవు. అనుకూలతలు: బ్యాంకు ఎఫ్డీల కంటే అధిక వడ్డీ రేటు లభిస్తుంది. ప్రతికూలతలు: అధిక రిస్క్ ఉంటుంది. ముందస్తుగా డబ్బులను వెనక్కి తీసుకోవాలంటే నియంత్రణలు ఉంటాయి. ఎవరికి?: అధిక రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి. ఏఏఏ రేటింగ్ కలిగిన సంస్థల డిపాజిట్లనే పరిశీలించడం మంచిది. -
పైలట్ కు కరోనా : విమానం వెనక్కి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరోసారి కరోనా షాక్ తగిలింది. ఎయిరిండియా పైలట్ ఒకరు కరోనా బారిన పడటంతో మధ్యలోనే వెనుదిరగాల్సి వచ్చింది. మాస్కో నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమాన పైలట్ వైరస్ బారిన పడినట్లు గ్రౌండ్ టీమ్ గ్రహించడంతో విమానం తిరిగి ఢిల్లీకి చేరింది. ఢిల్లీ నుంచి ఉజ్బెకిస్తాన్ మీదుగా మాస్కోకు బయలు దేరిన ఎయిర్బస్ ఎ-320 నియో (వీటీ-ఎక్స్ఆర్)విమానం ప్రయాణీకులు లేకుండానే శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి తిరిగి వచ్చిందని అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం సిబ్బందిని క్వారంటైన్ కు తరలించనున్నామన్నారు. అలాగే మరో విమానాన్ని మాస్కో పంపించనున్నామని చెప్పారు. మరోవైపు ఈ ప్రయాణానికి సంబంధించి జరిపిన ముందస్తు పరీక్షల ఫలితాన్ని తనిఖీ బృందం తప్పుగా (పాజిటివ్ రిపోర్టును నెగిటివ్ గా) చదివినట్టు సమాచారం. రెండోసారి క్రాస్ చెక్ చేస్తుండగా అసలు విషయం బయటపడడంతో అప్రమత్తమయ్యారు.(కరోనా: 92 విమానాలను రద్దుచేసిన ఎయిరిండియా) కరోనావైరస్ను నియంత్రించటానికి తొలుత మార్చి 25న లాక్డౌన్ విధించినప్పటి నుంచీ దేశంలో అన్ని రవాణా సదుపాయాలతో పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు. అయితే లాక్డౌన్ ఆంక్షల సడలింపులతో రెండు నెలల విరామం తర్వాత దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించింది ఎయిరిండియా. మే 25 నుంచి మూడింట ఒకవంతు మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి లాంటి ఆంక్షలు, నిబంధనలతో గత వారం పరిమితంగా విమాన సేవలకు ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీ-లుధియానా విమానంలో ప్రయాణించిన ఎయిరిండియా భద్రతా సిబ్బంది ఒకరికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. (కరోనాపై ఆందోళన అవసరం లేదు: ఢిల్లీ సీఎం) -
స్టాక్స్లో నష్టపోకూడదంటే..?
సంపద కూడబెట్టుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అందులో ఈక్విటీలది అగ్ర తాంబూలం. మార్కెట్ పతనాలే మంచి పెట్టుబడి అవకాశాలను తెచ్చిపెడతాయి. గతంలో భారీ పతనాలు ఎన్నో వచ్చి వెళ్లాయి. ఈక్విటీ మార్కెట్లు పడి లేచిన బంతి మాదిరిగా ఆ పతనాల నుంచి నూతన శిఖరాలకు చేరడాన్ని చూశాం. ప్రపంచ ఆర్థిక మాంద్యం 2008లో మన ఈక్విటీ మార్కెట్లను 50 శాతానికి పైగా పడవేయగా, ఆ తర్వాత కాలంలో మార్కెట్లు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఇప్పుడు కరోనా వైరస్ మార్కెట్ను ముంచేస్తోంది. షేర్లు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఇప్పటికే సూచీలు 30 శాతానికి పైగా నష్టపోయాయి. ‘అందరూ ఎగబడి కొంటుంటే ఆ సమయంలో జాగ్రత్త పడాలి.. అందరు భయంతో అమ్మకాలు సాగిస్తుంటే అప్పుడు ఆశతో కొనుగోలు చేయాలన్నది’ వారెన్ బఫెట్ నమ్మే సూత్రం. ఇప్పుడు దీన్ని అనుసరించే సమయం ఆసన్నమైంది. అయితే, ఈక్విటీల్లో రాబడులు తెచ్చుకోవాలంటే కరెక్షన్లో షేర్లను తక్కువ ధరల వద్ద కొనుగోలు చేయడం ఒక్కటే కాదు.. ఆ షేర్లు నాణ్యమైన కంపెనీలవి అయి ఉండాలి. భవిష్యత్తు ఉన్నవి కావాలి. అంటే చేసే పెట్టుబడుల్లో తప్పటడుగులకు చోటు లేకుండా చూసుకోవాలి. ఈక్విటీ రాబడులకు తగిన విషయ పరిజ్ఞానం, అధ్యయనం అవసరం. కేవలం కొన్ని తప్పులు పెట్టుబడి మొత్తాన్ని హరించేస్తాయి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారిలో చాలా మంది కనీసం ప్రాథమిక సూత్రాలను కూడా పాటించకుండా సాగిపోతుంటారు. తమ రిస్క్ స్థాయిలను తెలుసుకోకుండా రాబడుల కాంక్షతో దూకుడుగా వెళ్లి చేతులు కాల్చుకుంటుంటారు. కానీ, ఏదైనా కోల్పోవడం అంత సులభం కాదు రాబట్టుకోవడం. ఇదే సూత్రం ఈక్విటీలకూ వర్తిస్తుంది. ఈక్విటీల పట్ల సరైన అవగాహన లేకుండా, భారీ నష్టాలను మూటగట్టుకుంటే.. ఆ తర్వాత పెట్టుబడులపై ఈ ప్రభావం కచ్చితంగా పడుతుంది. అందుకే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ను కాపాడుకుంటూ, దీర్ఘకాలంలో రాబడులు పోగేసుకోవాలంటే కొన్ని తప్పులకూ దూరంగా ఉండాలి. ఆ వివరాలను డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఏవీపీ అమిత్ గ్రోవర్ వెల్లడించారు. సమయం ఎంచకూడదు ఈక్విటీ పెట్టుబడులకు సమయం నిర్దేశించుకోవడం సరైనది కాదు. ఇటాలియన్ ఆర్థికవేత్త పారెటో పరిశోధన 80–20 సూత్రాన్ని సూచిస్తోంది. ఉదాహరణకు కంపెనీల ఉత్పత్తుల్లో 20 శాతం ఉత్పత్తుల నుంచి 80 శాతం ఆదాయం వస్తుంటుంది. అలాగే, ఓ కంపెనీ లాభాలకు 20 శాతం ఉద్యోగుల పాత్రే ఎక్కువగా ఉంటుంది. అలాగే, 20 శాతం ప్రయత్నాలు మన విజయాల్లో 80 శాతం పాత్ర పోషిస్తాయి. పారెటో రూపొందించిన సూత్రం ఈక్విటీలకు కూడా అమలవుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ రాబడుల్లో 80 శాతం కేవలం 20 శాతం సమయంలోనే వస్తుంటాయి. కానీ, ఈ 20 శాతం సమయం ఎప్పుడన్నది ఊహించడం అసాధ్యం. ఎంతో ఓపికగా, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్మెంట్ను కొనసా గించేలా ఉండాలి. అప్పుడే ఆ 20 శాతం సమయంలోకి అడుగుపెట్టి మంచి రాబడులు పొందే అవకాశం లభిస్తుంది. కొంత కాలం పాటు పెట్టుబడులను కొనసాగించి, రాబడుల సమయం వచ్చే వరకు వేచి చూడలేక నిరాశతో వెనక్కి తీసేసుకుంటే.. ఆ విలువైన రాబడుల అవకాశాన్ని కోల్పోయినట్టే. వైవిధ్యం లేకపోవడం క్రికెట్లో ప్రతీ బాల్కు ఆరు పరుగులు (సిక్సర్) నమోదు చేయడం సాధ్యం కాదన్న విషయం బ్యాట్స్మెన్కు తప్పకుండా తెలిసి ఉంటుంది. ఆరు పరుగులు, నాలుగు, రెండు పరుగులు, ఒక పరుగు ఇలా అన్నీ సమకూర్చుకుంటేనే సెంచరీ మార్కు సాధ్యపడుతుంది. పెట్టుబడి కూడా అంతే. గత 40 ఏళ్ల స్టాక్ మార్కెట్ చరిత్రను తిరగేస్తే 100 రెట్లు పెరిగిన కంపెనీలు ఎన్నో కనిపిస్తాయి. తమ తమ రంగాల్లో దిగ్గజాలుగా అవతరించినవీ ఉన్నాయి. మరోవైపు దివాలా తీసిన కంపెనీలూ కనిపిస్తాయి. కానీ, ఇన్వెస్టర్లకు ఇలా ఎన్నో రెట్లు లాభాలను ఇచ్చిన మల్టీబ్యాగర్ కథనాలే ఆసక్తి కలిగిస్తాయి. వైఫల్య కథనాలను పట్టించుకోకుండా.. మల్టీబ్యాగర్ ఆకాంక్షతో కేవలం కొన్ని స్టాక్స్లోనే తమ పెట్టుబడులు అన్నింటినీ కుమ్మరించేస్తుంటారు. కానీ, ఇది ఎంతో రిస్క్తో కూడిన వ్యాపారం. తమ పెట్టుబడులు, కాల వ్యవధికి అనుగుణంగా తగినంత వైవిధ్యంతో కూడిన స్టాక్ పోర్ట్ఫోలియోను ఏర్పాటు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అధిక రాబడులు పొందడంతోపాటు ఒక్కో స్టాక్ వారీ రిస్క్ కూడా తక్కువ అవుతుంది. తగినంత అధ్యయనం లేకుండా.. ఓ విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటే ఎన్నో నెలల పాటు అధ్యయనం చేస్తుంటారు. ఏ ఏ ప్రాంతాలను చుట్టి రావాలి, అక్కడ ఉండే వసతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఖర్చులు ఇలా అన్నింటిపైనా అవగాహన కోసం ఎంతో మందిని విచారిస్తాం. ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలన్నా ఇదే స్థాయిలో సమయాన్ని వెచ్చిస్తుంటారు. కానీ, భవిష్యత్తు కోసం ఉద్దేశించి పెట్టుబడులు పెట్టే ముందు తగినంత అధ్యయనం లేకపోతే ఎలా..? కంపెనీ వాటాలను కొనుగోలు చేస్తున్నారంటే.. ఆయా కంపెనీల వ్యాపారం, యాజమాన్యం, ఆర్థిక పరిస్థితులు, ఆ కంపెనీ పనిచేసే రంగం, దేశ ఆర్థిక పరిస్థితి ఇలా ఎన్నో అంశాలను అర్థం చేసుకోవాలి. అదృష్టం కలిసివస్తే స్టాక్స్ ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లకు తమ సామర్థ్యంపై నమ్మకం మరింత బలపడుతుంది. నిజానికి బుల్ మార్కెట్లో అన్ని స్టాక్స్ ర్యాలీ చేస్తుంటాయి. దాంతో తమ నైపుణ్యాలు, అదృష్టం మధ్య వ్యత్యాసం వారికి అర్థం కాదు. కానీ, ఆటుపోట్లు బయటపడినప్పుడే అసలు విషయం బయటపడుతుందని విఖ్యాత స్టాక్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పే మాట ఇక్కడ గమనార్హం. భరించలేనంత రిస్క్ ఈక్విటీ మార్కెట్లు ఎక్కువగా ఆటుపోట్లతో కూడి ఉంటాయి. స్వల్పకాలంలోనే స్టాక్స్లో లేదా సూచీల్లో 10–20% నష్టాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం వచ్చిన 2008, హర్షద్ మెహతా స్కామ్ వెలుగుచూసిన 1990ల్లో అయితే స్టాక్ మార్కెట్లు 50 శాతానికి పైగా నష్టపోయాయి. సాధారణ మార్కెట్ పరిస్థితులను అనుసరించి ఎక్కువ మంది పోర్ట్ఫోలియో నిర్మాణం చేసుకుంటుంటారు. కానీ, మార్కెట్ పతనాల్లో పెట్టుబడి హరించుకుపోకుండా ఉండాలంటే రిస్క్ నిర్వహణ జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే విధంగా జవానులు ఎలా తర్ఫీదు అయితే పొందుతారో.. ఇన్వెస్టర్లు సైతం అత్యంత ప్రతికూల పరిస్థితులనూ నెగ్గుకొచ్చే విధంగా పోర్ట్ఫోలియో నిర్మాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాబడుల కోసం పరుగు రాబడుల కోసం పరుగెత్తడం కాకుండా, పెట్టుబడులకు సంబంధించి నిర్దేశిత ప్రక్రియను పాటించడం ఎంతో అవసరం. ఎలుకకు ఏదో ఒక ఆహారాన్ని వేసి బంధించినట్టుగానే.. మనల్ని బుట్టలో వేయాలంటే అందుకు ఆకర్షణీయమైన హామీలు గుప్పిస్తే సరి. స్కామర్లు భారీ రాబడులను ఎరగా చూపుతుంటారు. వీటికి ఆకర్షితులైన వారు ఎలుకల మాదిరే వాటిల్లో చిక్కుకుంటారు. రాబడులు అన్నవి కంటికి కనిపించేవి. కానీ, రిస్క్ కనిపించని రూపంలో ఉంటుంది. గత నాలుగు ఐపీవోలు లిస్టింగ్లో 10 శాతం పైనే రాబడులు ఇచ్చాయనుకుంటే.. ఐదో ఐపీవో కూడా లిస్టింగ్లో ఇదే విధమైన రాబడులు ఇస్తుందని భావించడం సురక్షితమేనా..? ఇన్వెస్టింగ్ విధానాన్ని అర్థం చేసుకోవడం వల్ల స్టాక్ పెరుగుదల, పతనాల్లో నిశ్చింతగా ఉండే బలాన్నిస్తుంది. తద్వారా దీర్ఘకాలం పాటు సౌకర్యంగా వాటిల్లో కొనసాగగలరు. స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్మెంట్ 40 ఏళ్లలో సెన్సెక్స్ (1979–2019) ప్రయాణాన్నే పరిశీలిస్తే.. మీరు ఏడాది కాలం కోసం ఇన్వెస్ట్ చేస్తే 33 శాతం కేసుల్లో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అదే ఐదేళ్ల కాల వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే అవకాశాలు 8 శాతమే. అదే 10 ఏళ్ల కాలం కోసం ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే అవకాశాలు 3 శాతమే. 15 ఏళ్ల కాల వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే ప్రమాదం సున్నా. 40 ఏళ్ల కాలంలో సెన్సెక్స్ పనితీరు ఆధారంగా అంచనాలు ఇవి. అమెజాన్ చైర్మన్, సీఈవో జెఫ్ బెజోస్ ఒకసారి వారెన్ బఫెట్ను.. ‘మీ పెట్టుబడుల సిద్ధాంతం చాలా సులభంగా ఉంటుంది. కానీ, ప్రతి ఒక్కరూ దీన్ని ఎందుకు అనుసరించరు?’ అని ప్రశ్నించారు. ‘‘ఎందుకంటే ఎవరూ కూడా నిదానంగా ధనవంతులు కావాలని కోరుకోరు’’ అంటూ బఫెట్ బదులిచ్చారు. అంటే చాలా వేగంగా రాబడులు పోగేసుకోవాలనే ఆకాంక్షే తప్పటడుగులకు దారితీస్తుందని గ్రహించాలి. విలువకు విలువ ఇవ్వకపోవడం.. ధర అన్నది చెల్లించేది.. కానీ, విలువ అన్నది మీరు పొందేది. మార్కెట్లు అన్నవి ఉత్సాహం, నిరాశావాదం మధ్య చలిస్తుంటాయి. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కంటే.. వదంతులు, ఊహాజనితాల ఆధారంగానే ఎక్కువగా చలించడం ఉంటుంది. దీంతో తాము కొనుగోలు చేస్తున్న వాటి విలువను పరిశీలించకుండా, ఈ విధమైన కథనాలపై ఆధారపడి అడుగులు వేయవద్దు. భవిష్యత్తు రాబడులు అన్నవి మీ కొనుగోలు ధరపైనే ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి. కనుక మీరు ఓ స్టాక్లోకి ప్రవేశించే ధర చాలా అధిక స్థాయిలో ఉంటే భవిష్యత్తు రాబడులు తక్కువగా ఉండడం లేదా ప్రతికూలంగా ఉండడం జరగొచ్చు. కనుక అసలు విలువను గుర్తించడం నేర్చుకోవాలి. తగిన అవగాహన లేకుండా... ఇన్వెస్టింగ్ అనేది ప్రత్యేకమైన ఉద్యోగమే. ఫైనాన్స్, అకౌంటింగ్, వ్యాల్యూషన్లు వీటన్నింటిని అర్థం చేసుకోగలిగి ఉండాలి. యాజమాన్యం గురించి తెలుసుకోవాలి. ఆ కంపెనీ పనిచేస్తున్న విభాగం/రంగం గురించి తగినంత అవగాహన ఉండాలి. మార్కెట్ ఆటుపోట్లను అధిగమించే ప్రశాంతత అవసరం. ఎంతో అనుభవం, సమయం, శక్తి పెట్టుబడులకు అవసరం. అందుకే దీన్ని పార్ట్ టైమ్ కాకుండా పూర్తికాలపు ఉద్యోగంగా పేర్కొంటారు. కనుక అంత సమయం వెచ్చించలేని వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను నిపుణులు నిర్వహిస్తుంటారు. పైగా పెట్టుబడుల్లో తగినంత వైవిధ్యం కూడా ఉంటుంది. దీంతో తక్కువ ఖర్చుకే తగినంత వైవిధ్యాన్ని ఫండ్స్ ద్వారా పొందొచ్చు. -
ఈక్విటీ ఫండ్స్ ఏ రేంజ్ రాబడులనిస్తాయి?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే రాబడులు ఏ రేంజ్లో వస్తాయి? –హిమబిందు, విజయవాడ దీర్ఘకాలం పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులే పొందవచ్చు. అయితే ఏ శాతం రేంజ్లో రాబడులు వస్తాయో అంచనా వేయడం కష్టం. మన ఇన్వెస్ట్మెంట్స్ మీద ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పొందాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడమే మంచి మార్గం. గతంలో మన దేశంలో వడ్డీరేట్లు 9–13 శాతం రేంజ్లో ఉండేవి. అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు 18–20 శాతం రేంజ్లో ఉండేవి. ఇప్పుడు ఈ రాబడులు కనిష్టంగా 7–8 శాతానికి తగ్గాయి. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్ రాబడులు 8–9.50 శాతం రేంజ్లో ఉన్నాయి. ఫండ్ పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్గా ఉన్నప్పటికీ, ఈ ఫండ్ నిర్వహణ చాలా సులభం. దీంతో పోల్చితే ఈక్విటీ ఫండ్స్ నిర్వహణ కొంచెం క్లిష్టమైనది. కాబట్టి వీటికి వ్యయాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వ్యయాలు ఎక్కువగా ఉన్నా, ఇండెక్స్ ఫండ్స్తో పోల్చితే ఈక్విటీ ఫండ్స్ అధిక రాబడులనే ఇస్తాయి. ద్రవ్యోల్బణం 4 శాతం రేంజ్లో ఉన్నప్పుడు ఈక్విటీ రాబడులు 12 శాతం మేర ఉంటాయని చెప్పవచ్చు. పిల్లల పై చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ అవసరాల కోసం నిధి ఏర్పాటు తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడమే మంచి మదుపు మార్గమని చెప్పవచ్చు. నాకు ఇటీవలనే ఒక పాప పుట్టింది. ఆమెను డాక్టర్ చేయాలన్నది నా కల. ఇప్పటి నుంచి నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఈ మొత్తాన్ని స్మాల్క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? లేకుంటే వేరే ఇతర ఫండ్స్లో మదుపు చేయమంటారా ? –ఆనంద్, కర్నూలు మీరు తీసుకున్నది మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు. మీరు 18–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలరు. ఇంత దీర్ఘకాలం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే, కనీసం రెండు మూడేళ్లకొకసారైనా మీరు ఈ ఫండ్ పనితీరును మదింపు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు, లేదా మూడేళ్ల కాలంలో ఈ ఫండ్ పనితీరు ఎలా ఉంది ? ఫండ్ మేనేజర్ మారారా ?ఇతర ఫండ్స్ దీనికి మించిన రాబడులను ఇస్తున్నాయా?తదితర అంశాలను మీరు మదింపు చేయాల్సి ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ విషయంలో అత్యంత కీలకమైనది ఫండ్ మేనేజర్ నిర్వహణ. స్మాల్ క్యాప్ ఫండ్స్ పనితీరు దాదాపు 80 శాతం ఫండ్ మేనేజర్ తీరుపైననే అధారపడి ఉంటుంది. అదే లార్జ్ క్యాప్ ఫండ్స్లో అయితే ఆ ఫండ్ పనితీరుపై ఫండ్ మేనేజర్ ప్రభావం 40 శాతమే ఉంటుంది. లార్జ్ క్యాప్ కంపెనీలు వందలోపే ఉంటాయి. ఈ ఫండ్ మేనేజర్ ఈ వంద కంపెనీలను గమనిస్తే సరిపోతుంది. కానీ స్మాల్ క్యాప్ కంపెనీలు వందలాదిగా ఉంటాయి. ఒక స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్ కనీసం 2,000 కంపెనీలను గమనించాల్సి ఉంటుంది. ఏతావాతా లార్జ్ క్యాప్ ఫండ్ మేనేజర్ కంటే స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్కు అధిక బాధ్యత ఉంటుంది. అందుకని స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ విషయాలన్నీ కూలంకషంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి. నేను ఇటీవలనే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరయ్యాను. నాకు ఎలాంటి అప్పులు లేవు. పిల్లల బాధ్యతలన్నీ తీరిపోయాయి. నాకు వచ్చే పెన్షన్ నా ఖర్చులన్నింటికీ సరిపోతుంది. ఇప్పటికే రూ.3 లక్షల మేర అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్నాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఎలా ఇన్వెస్ట్ చేయాలి ? ఎంత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి? పుత్తడిలో ఎంత పెట్టాలి ? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కు ఎంత కేటాయించాలి? –వెంకటాచలం, హైదరాబాద్ నా దృష్టిలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తి కాదు. ఇతర ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ ఒక మార్గమని నా అభిప్రాయం. కొంత మొత్తాన్ని ఈక్విటీ, మరికొంత మొత్తాన్ని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఇదే మొదటిసారైతే, ముందుగా బ్యాలన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోండి. ఇక పుత్తడి విషయానికొస్తే, ఇది దీర్ఘకాల ఆస్తి కాదు. దీంట్లో పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు. కాదూ, కూడదు బంగారంలో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాల్సిందేనని మీరు అనుకుంటే, సావరిన్ గోల్డ్ బాండ్స్(ఎస్జీబీ)లో ఇన్వెస్ట్ చేయండి. భారత్లో పుత్తడిలో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న అత్యుత్తమ మార్గం ఇదే. ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే, మీకు వార్షికంగా 2.5 శాతం వడ్డీ గ్యారంటీగా వస్తుంది. ధరలు పెరిగితే ఆ వృద్ధి అదనం. ఈ బాండ్ రిడంప్షన్ సమయంలో మీరు పొందే మూలధన లాభాలపై పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లో 10–20 శాతం మించకుండా పుత్తడి పెట్టుడులు ఉండేలా చూసుకోండి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో కూడా కొంత డిపాజిట్ చేయవచ్చు. -
పన్ను ఆదాకు చక్కని పథకం
పెట్టుబడులపై అధిక రాబడులను పొందే అవకాశం.. అదే సమయంలో సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా.. ఈ ప్రయోజనాలు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల నుంచి పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో మంచి పనితీరు చూపిస్తున్న టాప్ పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ కూడా ఒకటి. ఈఎల్ఎస్ఎల్ పథకాల్లో చేసే పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే ఆ లోపు వాటిని వెనక్కి తీసుకు నే అవకాశం ఉండదు. దీర్ఘకాల లక్ష్యాల కోసం, పిల్లల ఉన్నత చదువుల కోసం, రిటైర్మెంట్ కోసం ఈ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. రాబడులు..: ఈ పథకం 2015 డిసెంబర్లో ప్రారంభం అయింది. నాటి నుంచి నేటి వరకు మెరుగైన రాబడులనే ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 13.1 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షిక రాబడులు 17.7 శాతంగా ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్ఈ 200 టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఆన్ ఇండెక్స్) రాబడులు ఏడాదిలో కేవలం 9 శాతంగా, మూడేళ్లలో వార్షికంగా 14.1 శాతంగానే ఉండడం గమనార్హం. ప్రారంభించిన రోజు నుంచి చూస్తే ఇప్పటి వరకు సగటున వార్షికంగా 18.69 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి రూ.1.65 లక్షలు సమకూరేది. 2016, 2017లో పన్ను ఆదా విభాగం సగటు రాబడులను మించి పనితీరు చూపించిన ఈ పథకం, 2018 మార్కెట్ కరెక్షన్ సమయంలో నష్టాలను పరిమితం చేసింది. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో నష్టాలు సగటున 6 శాతంగా ఉండగా, మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ పథకంలో నష్టాలు 2.3 శాతానికే పరిమితమయ్యాయి. పెట్టుబడుల విధానం..: 2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 99 శాతం పెట్టుబడులకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ ఉంది. నగదు నిల్వలు కేవలం ఒక శాతం లోపునే ఉన్నాయి. ఈ పథకం బ్యాంకింగ్ రంగానికి పెద్ద పీట వేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలోని స్టాక్స్లో 37 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత 12 శాతం మేర ఎనర్జీ రంగంలో, ఎఫ్ఎంసీజీలో 10 శాతం, హెల్త్కేర్లో 8 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. కన్స్ట్రక్షన్, టెక్నాలజీ రంగ స్టాక్స్లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ విలువ పరంగా ఎటువంటి స్టాక్స్లో అయినా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈఎల్ఎస్ఎస్ పథకాలకు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం పోర్ట్ఫోలియోలో మొత్తం 54 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్క్యాప్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం భారీ లార్జ్క్యాప్, లార్జ్క్యాప్ కంపెనీల్లో 70% వరకు పెట్టుబడులు కలిగి ఉంది. మిడ్క్యాప్ 25%, స్మాల్ క్యాప్నకు 5 శాతం వరకు పెట్టుబడులు కేటాయించింది. -
భారత్ బాండ్.. ఇన్వెస్ట్ చేస్తున్నారా?
భారత్ బాండ్ ఈటీఎఫ్.. నూతన మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 12న ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. రిస్క్ లేకుండా బ్యాంకు డిపాజిట్ల స్థాయిలో రాబడులు కోరుకునే వారు ఇష్యూను పరిశీలించొచ్చు. ఈ ఇష్యూ ద్వారా కనీసం రూ.7,000 కోట్ల వరకు సమీకరించాలన్నది ప్రణాళిక. దేశంలో తొలి కార్పొరేట్ బాండ్ ఫండ్ ఇదే అవుతుంది. ఈ ఇష్యూకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటే, అప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా? లేదా? అన్నది ఇన్వెస్టర్లు సులభంగా నిర్ణయించుకోగలరు. ఆ వివరాలు అందించే ‘ప్రాఫిట్’ కథనమే ఇది. ∙ భారత్ బాండ్ ఈటీఎఫ్ను కేంద్రం తీసుకురావడం వెనుక లక్ష్యాలను పరిశీలిస్తే.. దేశీయ డెట్ మార్కెట్లో లిక్విడిటీని మరింత పెంచడం ఒకటి. రిటైల్ ఇన్వెస్టర్లు సులభంగా పాలు పంచుకునేలా చేయడం రెండోది. తక్కువ ఖర్చుకే బాండ్ ఈటీఎఫ్ను అందించడం.. ప్రభుత్వరంగ సంస్థలు తమ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులను కొంచెం తక్కువ రేటుకే పొందే మార్గం కల్పించడం మరొకటి. ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లు ప్యాసివ్ (క్రియాశీలకం కాని) పనితీరుతో కూడినవి. అవి ఒక ఇండెక్స్ను అనుసరిస్తుంటాయి. రాబడులు కూడా ఆ ఇండెక్స్కు అనుగుణంగానే ఉంటాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్కు సంబంధించి భారత్ బాండ్ ఇండెక్స్– ఏప్రిల్ 2023, భారత్ బాండ్ ఇండెక్స్ – ఏప్రిల్ 2030 సూచీలను ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఈటీఎఫ్లకు భారత్ బాండ్ ఈటీఎఫ్కు మధ్య వ్యత్యాసం.. భారత్ బాండ్ ఈటీఎఫ్ నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లతో కూడి ఉండడమే. మిగతాదంతా ఇతర ఈటీఎఫ్ల్లో మాదిరే ఉంటుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ మూడేళ్లు (ఏప్రిల్ 2023), పదేళ్లు (ఏప్రిల్ 2030) కాల వ్యవధితో రెండు రకాలుగా ఉంటుంది. కాల వ్యవధి తీరిన తర్వాత అసలు పెట్టుబడి, ఆ మొత్తంపై వడ్డీ రాబడి చెల్లిస్తారు. ఇందులో కేవలం గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది. రాబడులను ఎప్పటికప్పుడు చెల్లించే డివిడెండ్ ఆప్షన్ లేదు. ఎడెల్వీజ్ ఏఎంసీ ఈ ఈటీఎఫ్ నిర్వహణను చూస్తోంది. ఇది ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ కనుక ఇష్యూ ఈ నెల 20న ముగిసినప్పటికీ.. తర్వాత స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో ట్రేడవుతుంటాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ చేయనున్నారు. లిస్ట్ అయిన తర్వాత యూనిట్ల రూపంలో కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. కనుక ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారు లావాదేవీలకు అర్హులు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక యూనిట్ (రూ.1,000) నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ.2 లక్షల వరకే పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ‘భారత్బాండ్ డాట్ ఇన్’ పోర్టల్కు వెళ్లి ఎన్ఎఫ్వో ఆఫర్ పత్రాన్ని పొందొచ్చు. దీనిని సమీపంలోని ఎడెల్వీజ్ కార్యాలయంలో సమర్పించడం ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇష్యూ సైజు మూడేళ్ల ఈటీఎఫ్ రూపంలో కనీసం రూ.3,000 కోట్లు, స్పందనను బట్టి అదనంగా మరో రూ.2,000 కోట్లు సమీకరించాలన్నది ప్రణాళిక. అలాగే, పదేళ్ల ఈటీఎఫ్ ద్వారా కనీసం రూ.4,000 కోట్లు, స్పందన అధికంగా ఉంటే మరో రూ.2,000 కోట్ల వరకు సమీకరించనున్నారు. భద్రత ఎక్కువే... భారత్ బాండ్ ఈటీఎఫ్ కచ్చితంగా ఏఏఏ రేటింగ్ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీల డెట్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనుక భద్రతకు ఢోకా ఉండదు. ఏఏఏ రేటింగ్ తిరిగి చెల్లింపుల విషయంలో అధిక భద్రతను సూచిస్తుంది. అంటే క్రెడిట్ రిస్క్ చాలా చాలా తక్కువ. పైగా భారత్ బాండ్ ఈటీఎఫ్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది. కనుక పెట్టుబడులకు ఎటువంటి రిస్క్ ఉండదు. పన్ను ఎంతో తక్కువ మూడేళ్లకు పైగా పెట్టుబడులను కొనసాగిస్తే, ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే పన్ను ఎంతో తక్కువ. ఇన్వెస్టర్ల రిస్క్ ప్రొఫైల్కు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. కన్జర్వేటివ్ (రిస్క్ తీసుకోని) ఇన్వెస్టర్లు 20–22 శాతం పెట్టుబడులను భారత్ బాండ్ ఈటీఎఫ్కు కేటాయించుకోవచ్చు. ఏఏఏ రేటింగ్ రాబడులు, రిస్క్ లేని సాధనం. – పవన్ అగర్వాల్, ప్రైవేటు వెల్త్ (ఇండియా నివేష్) ఎండీ అన్ని విధాలా అనుకూలం అత్యంత చౌక బాండ్ ఫండ్ ఇది. çఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే బయటకు వచ్చేందుకు మూడేళ్లు ఆగాల్సి ఉంటుంది. కానీ, ఈ ఫండ్ విషయంలో ఎక్సే్ఛంజ్ల్లో రోజువారీగా లిక్విడిటీ ఉంటుంది. రాబడులు, పన్ను, లిక్విడిటీ ఇలా అన్ని అంశాల్లోనూ సంప్రదాయ మ్యూచువల్ ఫండ్తో పోలిస్తే దీనికి ఎక్కువ మార్క్లు పడతాయి. – నితిన్ జైన్, ఎడెల్వీజ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో రాబడులు/చార్జీలు ఈటీఎఫ్లకు నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లుగా నిర్ణయించారు. కనుక వీటిల్లో రాబడులను సుమారుగా ఊహించొచ్చు. భారత్ బాండ్ ఈటీఎఫ్ ఎన్ఎఫ్వో డాక్యుమెంట్ ప్రకారం.. ఎన్ఎఫ్వో సమయంలో ఇన్వెస్ట్ చేసి కాల వ్యవధి పూర్తయ్యే వరకు ఈటీఎఫ్లో కొనసాగితే అప్పుడు.. 2023 ఈటీఎఫ్లో వార్షిక రాబడులు 6.59 శాతం, 2030 ఈటీఎఫ్లో వార్షిక రాబడులు 7.52 శాతం వరకు ఉంటాయి. ఈ రాబడులు గ్యారంటీ కావు. కేవలం సూచనీయమైనవి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో రాబడులకు ఎప్పుడూ హామీ ఉండదు. సూచిత రాబడులను రోజువారీగా ఎడెల్వీజ్ ఏఎంసీ వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. ఇందులో ఎక్స్పెన్స్ రేషియో (పెట్టుబడులపై వసూలు చేసే నిర్వహణ చార్జీ) కేవలం 0.0005 శాతమే. దేశంలో అత్యంత చౌక మ్యూచువల్ ఫండ్ ఇది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత చౌక చార్జీలతో కూడిన డెట్ ఫండ్ కూడా అవుతుంది. డెట్ ఫండ్స్లో రాబడులు తక్కువగా ఉంటాయి కనుక ఎక్స్పెన్స్ రేషియో చాలా కీలక పాత్రే పోషిస్తుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ చార్జీల పరంగా ఎంతో చౌక కనుక నికర రాబడులు మెరుగ్గా ఉంటాయి. ఈటీఎఫ్లపై రాబడులు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇవే కాల పరిమితుల డిపాజిట్లపై ఆఫర్ చేస్తున్న రేట్ల స్థాయిలోనే ఉంటాయని భావించొచ్చు. ఇక ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 30 రోజుల్లోపు వైదొలిగితే అప్పుడు 0.10 శాతం ఎగ్జిట్లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. లిక్విడిటీ... ఒక సాధనంలో పెట్టుబడి, రాబడులతోపాటు అవసరమైన సందర్భాల్లో వేగంగా వాటిని నగదుగా మార్చుకునే సౌలభ్యం (లిక్విడిటీ) ఉండాలి. అప్పుడే అది ఇన్వెస్టర్లకు సౌకర్యంగా అనిపిస్తుంది. ఎక్కువ మంది ఎఫ్డీల్లో ఇన్వెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణాల్లో లిక్విడిటీ కూడా ఒకటి. మన దేశంలో చాలా వరకు డెట్ ఈటీఎఫ్ల్లో ట్రేడింగ్ స్వల్పంగానే ఉంటోంది. అయితే, పెద్ద సైజు ఈటీఎఫ్ల్లో ట్రేడింగ్ యాక్టివిటీ చురుగ్గానే ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు భారత్ బాండ్ ఈటీఎఫ్ రూ.7,000 కోట్లకుపైనే సమీకరించనున్న దృష్ట్యా లిక్విడిటీ తగినంత ఉంటుందని ఆశించొ చ్చు. పైగా భారత్ బాండ్ ఈటీఎఫ్లలో తగినంత లిక్విడిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎడెల్వీజ్ ఏఎంసీ చెబుతోంది. ఇందు కోసం పలువురు మార్కెట్ మేకర్లను నియమించనున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. వీరు తగినంత లిక్విడిటీతోపాటు ధర సహేతుకంగా ఉండేలా చూస్తారు. మార్కెట్ మేకర్ల కోసం రూ.20 కోట్లను వెచ్చించేందుకు ఏఎంసీలకు అనుమతి ఉంది. పైగా ఇందులో రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చిన్న మొత్తం కావడంతో లిక్విడిటీ మెరుగ్గానే ఉంటుందని అంచనా. వాస్తవంగా లిక్విడిటీ ఏ మేరకు అన్నది ఈటీఎఫ్ లిస్ట్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఎడెల్వీజ్ ఏఎంసీ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్) రకాన్ని కూడా తీసుకురానుంది. ఇది భారత్ బాండ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసే డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వారికి లిక్విడిటీ పరంగా ఇబ్బందేమీ ఉండదు. ఇతర డెట్ ఫండ్ పథకాల మాదిరే అవసరమైనప్పుడు విక్రయించి పెట్టుబడులు వెనక్కి తీసేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ లేని వారు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అనుకూలమేనా..? డెట్ ఫండ్ విభాగంలో సంక్షోభాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో అధిక క్వాలిటీ పోర్ట్ఫోలియోతో, ఊహించతగ్గ రాబడులతో, తక్కువ ఖర్చుతో కూడిన భారత్ బాండ్ ఈటీఎఫ్ అనుకూలమే. నిర్ణీత కాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించొచ్చు. మూడేళ్లతో పోలిస్తే పదేళ్ల ఈటీఎఫ్లో తొలినాళ్లలో రేట్ల పరంగా అస్థిరత కొంత ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పదేళ్ల కాలంలో వడ్డీ రేట్ల పరంగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, పదేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ కొనసాగించే వారు ఆందోళన చెందక్కర్లేదు. తక్కువ క్రెడిట్ రిస్క్, అతి తక్కువ నిర్వహణ చార్జీలతో కూడిన కార్పొరేట్ డెట్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు ఇది అవకాశం కల్పిస్తోంది. కొనుగోలు చేసి పూర్తి కాలం పాటు కొనసాగితే వడ్డీ రేట్ల రిస్క్ కూడా ఉండదు. రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లు, పదవీ విరమణ చేసిన వారు, భారత్ బాండ్ ఈటీఎఫ్ల కాల వ్యవధి వరకు కొనసాగేవారు పెట్టుబడులను పరిశీలించొచ్చు. ముఖ్యంగా పెట్టుబడుల్లో వైవిధ్యానికి ఇది ఉపకరిస్తుంది. పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి ఒకే విభాగంలో (ఈక్విటీ లేదా రియల్టీ) ఇన్వెస్ట్ చేయడం రిస్క్ కోణంలో సూచనీయం కాదు. డెట్లోనూ కొంత ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకో వాలన్నది నిపుణుల మాట. అందుకోసం భారత్ బాండ్ ఈటీఎఫ్ను పరిశీలించొచ్చు. తమ పెట్టుబడుల్లో 10–20 శాతం మేర భారత్ బాండ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను ప్రయోజనాలు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మూడేళ్ల పాటు కొనసాగితే, ద్రవ్యోల్బణ ప్రభావ మినహాయింపు (ఇండెక్సేషన్)ను పొందే అవకాశం ఉంటుంది. మూడేళ్లపైన మూలధన రాబడులపై 20 శాతం పన్ను అమలవుతుంది. అంటే మూలధన రాబడుల నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించిన తర్వాతే 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి వ్యక్తిగత ఆదాయంలో కలసి, నిర్ణీత శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రాబడి ఎఫ్డీల స్థాయిలో ఉన్నా కానీ, పన్ను ఆదా పరంగా బాండ్ ఈటీఎఫ్ అదనపు ప్రయోజనం. ప్రారంభంలో ఇన్వెస్ట్ చేసిన వారికి మూడేళ్ల ఈటీఎఫ్పై నాలుగేళ్ల ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని అందిస్తున్నారు. దీంతో పన్ను అనంతర రాబడులు అధికంగా ఉంటాయని ఆశించొచ్చు. మూడేళ్ల బాండ్ ఈటీఎఫ్లో పన్ను అనంతరం రాబడులు 6.3%, పదేళ్ల ఈటీఎఫ్లో పన్ను అనంతర రాబడులు 7 శాతంగా ఉంటాయని అంచనా. పారదర్శకత రోజువారీగా పోర్ట్ఫోలియో, ఇండికేటివ్ రిటర్నులు (సూచిత రాబడులు) ఎంత మేర అన్న వివరాలను ఎడెల్వీజ్ ఏఎంసీ తన వెబ్సైట్లో ప్రదర్శించనుంది. అదే సంప్రదాయ డెట్ ఫండ్స్ నెలకోసారి మాత్రమే పోర్ట్ఫోలియో వివరాలను వెల్లడిస్తున్నాయి. వీటితో పోలిస్తే భారత్ బాండ్ ఈటీఎఫ్లో పారదర్శకత ఎక్కువే. -
ఆఖరి నిముషంలో ఈ తప్పులొద్దు
పన్ను ఆదా కోసం... పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు, యులిప్లు, ఈఎల్ఎస్ఎస్లు... వీటిల్లో ఏది అన్న ఎంపిక అంత సులభం కాదు. మార్చి 31తో పన్ను ఆదా కోసం పెట్టుబడులకు గడువు ముగిసిపోతోంది. ఈ స్వల్ప వ్యవధిలోనే పన్ను ఆదా కోసం ఎంత మేర ఇన్వెస్ట్ చేయాలి, అదే సమయంలో మీరు ఆశించే రాబడులు ఏ పథకంలో వచ్చే అవకాశం ఉంది వంటి అంశాల ఆధారంగా పెట్టుబడి సాధనాలను ఎంచుకోవడం క్లిష్టమైనదే. ప్రస్తుతానికి మీకు పన్ను ఆదా చేయాలి, అదే సమయంలో దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు తెచ్చిపెట్టాలి... అప్పుడే మీరు ఎంచుకున్న సాధనం మీకోసం పనిచేసినట్టు అవుతుంది. ఒకటికి మించిన సాధనాలు ఉన్న నేపథ్యంలో కాస్త ముందే మీ ఆదాయం, మీ రిస్క్, మీ రాబడులు, మీ లక్ష్యానికి ఉన్న కాలం ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రణాళిక డిజైన్ చేసుకోవాలి. ముందు నుంచే ఓ పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలని ఆర్థిక నిపుణుల సలహా. ఇన్వెస్టర్లు ముందస్తు ప్రణాళిక లేకుండా, చివరి నిమిషాల్లో చేసే పెట్టుబడుల్లో పొరపాట్లు చేస్తుంటారు. సంపద సృష్టికి ఇవి విఘ్నాలుగా మారకుండా చూసుకోవాలంటే... వీటిని ఫాలో అయిపోతే బెటర్... ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక లేకుండా... ఆర్థిక లక్ష్యాలు, ప్రాధాన్యతలు వ్యక్తికీ, వ్యక్తికీ వేర్వేరుగా ఉంటాయి. వీటికి అనుగుణంగా పెట్టుబడి మొత్తం, అనువైన పన్ను సాధనాలను ఎంచుకోవాలి. కొన్ని పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనాన్ని కల్పించేది ప్రజల్ని పొదుపు, మదుపుల దిశగా ప్రోత్సహించేందుకే. ముం దు మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకున్న తర్వాత, వాటిని చేరుకునేందుకు ఉపయోగపడే సాధనాలను ఎంపిక చేసు కుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. అందుకే పెట్టుబడుల ప్రణాళిక అన్నది చాలా జాగ్రత్తగా చేసుకోవా ల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తుంటా రు. ఇందులో విఫలమైతే అంచనాలు కూడా తప్పుతాయని మరువద్దు. ఆలస్యం చేయకుండా... ఆర్థిక సంవత్సరం చివరి వరకు పన్ను ఆదా పెట్టుబడుల కోసం వేచి చూడొద్దు. ఎందుకంటే పెట్టుబడి నిర్ణయాలను ఆఖరి సమయంలో హడావుడిగా తీసుకుంటే పెద్ద తప్పులకు దారితీయవచ్చు. ‘‘గడువు సమీపిస్తున్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ ఆరాటపడాల్సి వస్తుంది. సరైన సమయం లేకపోవడంతో వారు తమ లక్ష్యాలు, రిస్క్ను విశ్లేషించి, తగిన సాధనాన్ని ఎంచుకోవడం సాధ్యం కాదు’’ అని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్ హెడ్ లవ్కుమార్ తెలిపారు. సరైన సాధనం ఎంచుకోకపోతే... మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు సరిపడని ఏ పెట్టుబడి అయినా మీ ఆర్థిక భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. ఇక సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా కోసం ఎంపిక చేసుకున్న సాధనంలో, గడువు తీరిన తర్వాత వచ్చే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉంటే అది నష్టాన్ని కలిగిస్తుంది. మీరు పొదుపు చేసిన దానితో పోలిస్తే భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. అత్యవసర నిధి జోలికెళ్లొద్దు... ఇక పన్ను ఆదా సాధనాల కోసం చేతుల్లో తగినంత లేక అత్యవసరాల కోసం పక్కన పెట్టిన నిధిని వాడుకునేవారూ ఉన్నారు. ఇలా చేస్తే గనుక ఆ తర్వాత ప్రాణావసరం ఎదురైతే చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పన్ను ఆదా పథకాలన్నీ కూడా దీర్ఘకాలానికి ఉద్దేశించినవే. పైగా వీటిల్లో పెట్టుబడులకు మూడేళ్లు, ఆపైనే లాకిన్ పీరియడ్ కూడా ఉంటుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో నిధుల కొరత ఏర్పడుతుంది. దీంతో రుణాలను ఆశ్రయించాల్సి రావచ్చు. ఇదే జరిగితే మీ ఆర్థిక ప్రణాళిక మరింత ఒత్తిడిలోకి వెళ్లినట్టే అవుతుంది. తొందరపాటుతో అధిక రిస్క్ ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా చేసుకోవాలన్న తొం దర్లో మీ స్థాయికి మించిన రిస్క్ ఉండే సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి... అప్పుడు మీ పెట్టుబడిలో గణనీయ మొత్తాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మార్కె ట్ అస్థిరతల భయంతో లాకిన్ తీరిన వెంటనే పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే ఇదే జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఒకేసారి... రిస్కీ సాధనంలో ఏక మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల, క్రమానుగత పెట్టుబడులతో పోలిస్తే మరింత రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. ఈక్విటీ మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఒకేసారి కాకుండా సిప్ రూపంలో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. దీనివల్ల కొనుగోలు ధర యావరేజ్ అవుతుంది. దీంతో రిస్క్ తగ్గుతుంది. ఇక సమయం లేక, ఆర్థిక సంవత్సరం చివరి మాసంలో ఉంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం తప్ప మరో పరిష్కారం లేదు. గతమూ కొలమానమే పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత పథకాలు అంతకుముందు కాలంలో ఏ విధంగా రాబడులు ఇచ్చాయన్న అధ్యయనం తప్పకుండా చేయాలి. అలా చూసినప్పుడు మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపడే పథకాలను ఎంచుకోవడం సాధ్యపడుతుంది. అంతేకాదు రిస్క్ను కూడా తగ్గించుకున్న వారవుతారు. అయితే, మ్యూచువల్ ఫండ్స్ పథకాల గత పనితీరు ఓ అంచనా కోసమే గానీ, వాటిపైనే పూర్తిగా ఆధారపడడం కూడా సరికాదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఓ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకునే ముందు మార్కెట్ పతనాల్లో సంబంధిత ఫండ్ మేనేజర్ ఏ విధంగా వ్యవహరించారు, అదే సమయంలో మార్కెట్ ర్యాలీల్లో ఎంత మేర ఆల్ఫా రిటర్నులు తీసుకొచ్చారన్నది పరిశీలించడం మంచిదేనని లవ్కుమార్ తెలిపారు. డైవర్సిఫికేషన్ లేకుండా... ఇక పన్ను ఆదా కోసమని మొత్తం పెట్టుబడులన్నింటినీ ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయడం కూడా సరైనది కాదు. ఉదాహరణకు సెక్షన్80సీ కింద రూ.1.5 లక్షల మొత్తాన్ని ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువగా తీసుకున్నట్టు అవుతుంది. దీనికంటే ప్రతీ సాధనంలోని సదుపాయాలను పరిశీలించి భిన్న సాధనాలతో కూడిన వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఇక ఈఎల్ఎస్ఎస్ పథకాల విషయంలో గ్రోత్ ఆప్షన్కు బదులు డివిడెండ్ ఆప్షన్ను ఎంచుకోవడం దీర్ఘకాలంలో సంపద సృష్టికి విరుద్ధమని, అలాగే, క్లోజ్ ఎండెడ్ పథకాలు కూడా సూచనీయం కాదన్నది నిపుణుల విశ్లేషణ. సమీక్ష మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరగొచ్చు... లేదా ఆదాయం పెరగొచ్చు... ఇటువంటి మార్పులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక కూడా మారాలి. అలా కాకుండా పాత ప్రణాళికనే పాటిస్తుండడం వల్ల చాలా ఆర్థిక లక్ష్యాలకు దూరంగా ఉండిపోవాల్సి రావచ్చు. పర్యవేక్షణ పెట్టుబడులు పెట్టేయడంతో పనైపోదు. మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాలి. మీ లక్ష్యాలను చేరుకునే దిశగానే వాటి రాబడులు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. వాటి పనితీరు ఆధారంగా అవసరమైతే అదనంగా పెట్టుబడి పెంచుకోవడం లేదా ఉన్న వాటిల్లో తొలగింపులు చేసుకోవాల్సి ఉంటుంది. ‘‘తప్పులను తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్లు ఓపిక వహించాలి. అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్నా సరే. ఇతరులను అనుసరించొద్దు. భావోద్వేగాలతో కూడిన ఇన్వెస్టింగ్ నష్టాలకు దారితీస్తుంది’’ అని లవ్కుమార్ సూచించారు. ‘‘ఎక్కువ మంది ఈఎల్ఎస్ఎస్ పథకాల విషయంలో చేసే తప్పిదం జనవరి/ఫిబ్రవరి వరకు వేచి ఉండడమే. హెచ్ఆర్ విభాగం అడిగిన తర్వాతే పన్ను ఆదా పథకాల గురించి అన్వేషణ మొదలవుతుంది. చక్కని ప్రణాళికతో కూడిన సిప్... చివరి నిమిషాల్లో ఇబ్బందులను తప్పించడంతోపాటు మంచి రాబడులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది’’ – ప్రసన్న పాఠక్, టారస్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫండ్ మేనేజర్ -
మనమైతే ఇలా చేయగలిగే వాళ్లమా..?!
గాంధీనగర్ : రోడ్డు మీద ఓ పది రూపాయలు కనిపిస్తేనే.. ఎవరి కంటా పడకుండా చటక్కున తీసుకుంటాము. అలాంటిది రోడ్డుపై పడి ఉన్న బ్యాగులో ఒకటీ రెండూ కాదు.. ఏకంగా రూ.10 లక్షలుంటే ఎవరైనా ఏం చేస్తారు? ఎవరూ గమనించకముందే ఆ నగదు తీసుకుని అక్కడ నుంచి ఉడాయిస్తాము. కానీ గుజరాత్ సూరత్కు చెందిన ఈ సేల్స్మ్యాన్ మాత్రం నిజాయతీగా ఆ డబ్బును సొంతదారుకే ఇచ్చేశాడు. వివరాలు.. సూరత్లోని ఉమ్రా ప్రాంతానికి చెందిన దిలీప్ పొద్దార్ ఓ దుస్తుల దుకాణంలో సేల్మ్యాన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతడు ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఒక బ్యాగు పడి ఉండటం కనిపించింది. దానిని తెరిచి చూడగా రూ.10 లక్షల విలువైన 2వేల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే ఆయన తన దుకాణం యజమానికి ఫోన్ చేసి, విషయం తెలిపాడు. ఆయన సలహా మేరకు ఆ డబ్బును తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ యజమాని పోలీసులకు ఈ విషయం చేరవేశారు. వివరాలను బట్టి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి, నగదు సొంతదారును గుర్తించి, అతనికి కబురు పంపించారు. స్టేషన్కు చేరుకున్న ఆ వ్యక్తి తనపేరు బయటకు వెల్లడించవద్దని చెబుతూ.. పొద్దార్ నిజాయతీకి మెచ్చి రూ.లక్ష అందజేశారు. పొద్దార్కు దుకాణం యజమాని హృదయ్ మరో రూ.లక్ష అందజేశాడు. 10 లక్షలను నగలు కొనేందుకు తీసుకువస్తుండగానే పోగొట్టుకున్నట్లు తెలిపారు. -
సేల్స్మ్యాన్ నిజాయతీ!
సూరత్: రోడ్డుపై పడి ఉన్న బ్యాగులో ఒకటీ రెండూ కాదు.. ఏకంగా రూ.10 లక్షలుంటే ఎవరైనా ఏం చేస్తారు? గుజరాత్లోని సూరత్కు చెందిన ఈ సేల్స్మ్యాన్ మాత్రం నిజాయతీగా ఆ డబ్బును సొంతదారుకే ఇచ్చేశాడు. సూరత్లోని ఉమ్రా ప్రాంతానికి చెందిన దిలీప్ పొద్దార్ ఓ దుస్తుల దుకాణంలో సేల్మ్యాన్గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి అతడు ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఒక బ్యాగు పడి ఉండటం కనిపించింది. దానిని తెరిచి చూడగా రూ.10 లక్షల విలువైన 2వేల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే ఆయన తన దుకాణం యజమానికి ఫోన్ చేసి, విషయం తెలిపాడు. ఆయన సలహా మేరకు ఆ డబ్బును తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ యజమాని పోలీసులకు ఈ విషయం చేరవేశారు. వివరాలను బట్టి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి, నగదు సొంతదారును గుర్తించి, అతనికి కబురు పంపించారు. స్టేషన్కు చేరుకున్న ఆ వ్యక్తి తనపేరు బయటకు వెల్లడించవద్దని చెబుతూ.. పొద్దార్ నిజాయతీకి మెచ్చి రూ.లక్ష అందజేశారు. పొద్దార్కు దుకాణం యజమాని హృదయ్ మరో రూ.లక్ష అందజేశాడు. 10 లక్షలను నగలు కొనేందుకు తీసుకువస్తుండగానే పోగొట్టుకున్నారని తెలిపారు. -
జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ గడువు పెంపు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టాలకు సంబంధించి అక్టోబర్ – డిసెంబర్ కాలానికి టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) రిటర్న్స్ ఫైలింగ్కు గడువును కేంద్రం పెంచింది. 2019 జనవరి 31 వరకూ రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎస్టీ కింద టీడీఎస్ ప్రొవిజన్స్ ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చాయి. సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) చట్టం ప్రకారం..రూ.2.5 లక్షలు దాటిన వస్తువులు, సేవల సరఫరాదారులకు చేసే చెల్లింపులపై నోటిఫైడ్ సంస్థలు 1% టీడీఎస్ను వసూ లు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర చట్టాల (ఎస్జీఎస్టీ) కింద మరో 1% పన్నునూ విధించాలి. -
తిరిగి బాధ్యతల్లోకి జైట్లీ!
ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా అరుణ్జైట్లీ తిరిగి గురువారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన నార్త్బ్లాక్లోని తన కార్యాలయంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు గంటపాటు నిర్వహించిన సమావేశంలో వ్యయ కార్యదర్శి ఏఎన్ ఝా, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 100 రోజుల తర్వాత... కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నేపథ్యంలో ఏప్రిల్ ప్రారంభం నుంచీ ఆయన ఆర్థికశాఖ కార్యాలయానికి రాలేదు. మే 14వ తేదీన 65 సంవత్సరాల జైట్లీకి ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరిగింది. అటు కొద్దిరోజుల తర్వాత అప్పుడప్పుడూ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ట్వీట్స్ చేస్తున్నప్పటికీ, తాత్కాలికంగా ఆ బాధ్యతలను రైల్వే, బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయెల్ నిర్వహించారు. పోర్ట్ఫోలియో లేనప్పటికీ క్యాబినెట్ మంత్రిగానే ఆయన కొనసాగినందువల్ల, ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టగానే జైట్లీ తిరిగి పదవీ ప్రమాణం చేయాల్సిన పని ఉండదు. ప్రధాని నరేంద్రమోదీ సూచనల మేరకు ఆర్థిక శాఖను జైట్లీకి కేటాయిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక ఉత్తర్వు జారీ అయిందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఉదయం 11 గంటలకు సిబ్బందితో జైట్లీ వైట్ టాటా సఫారీలో నార్త్బ్లాక్కు చేరుకున్నారు. సీనియర్ సహచరులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
మిడ్క్యాప్లో మంచి ట్రాక్ రికార్డు
మిడ్ క్యాప్ విభాగం రిస్క్ అధికంగా ఉన్నా, దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చే సామర్థ్యం కలది. ఈ విభాగంలో కాస్తంత భద్రత, అదే సమ యంలో స్థిరమైన రాబడులను అందించే పథకాల్లో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ కూడా ఒకటి. కనీసం ఐదేళ్లు, ఆపై కాల వ్యవధి కోసం, మెరుగైన రాబడులను ఆశించే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఈ పథకం ప్రారంభించి 25 ఏళ్లు అయింది. ఇప్పటికీ అప్పటి నుంచి చూసుకుంటే రాబడులు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. రాబడులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సగటున వార్షిక రాబడులు 20 శాతంగా ఉన్నాయి. ఎక్కువగా ఒకే స్టాక్, ఒకటే రంగంపై ఆధారపడకుండా, పెట్టుబడుల వికేంద్రీకరణ ద్వారా రిస్క్ను సాధ్యమైనంత వరకు తగ్గించడం ఈ పథకం పనితీరులో ఒకటిగా గమనించొచ్చు. ముఖ్యంగా రిస్క్ను తగ్గించేందుకు కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ను కూడా పోర్ట్ఫోలియోకు యాడ్ చేస్తుంటుంది. అదే సమయంలో, లార్జ్క్యాప్లో పెట్టుబడులను 15 శాతం మించనీయదు. మిడ్క్యాప్ విభాగంలో ఇన్వెస్ట్ చేసేవారికి ఓ మంచి ఎంపికగా, పనితీరు పరంగా మెరుగైన స్థానంలో ఉంది. నంబర్ 1 స్థానంలో లేకపోవచ్చు కానీ, మిడ్క్యాప్ విభాగం సగటు రాబడులకు మించిన పనితీరు ఈ పథకం సొంతం. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో చూసుకుంటే ప్రామాణిక సూచీ నిఫ్టీ 500 కంటే ఈ పథకం పనితీరు ఎగువనే ఉంది. మూడేళ్ల కాలంలో బెంచ్ మార్క్ కంటే 2 శాతం, ఐదేళ్ల కాలంలో చూస్తే బెంచ్ మార్క్ కంటే 9 శాతం, పదేళ్ల కాలంలో 8 శాతం అధిక రాబడులను ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ అందించింది. గత పదేళ్ల కాలంలో ఈ పథకం పోటీ పథకాలైన ఎస్బీఐ మిడ్క్యాప్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మిడ్క్యాప్, ఆదిత్య బిర్లా సన్లైఫ్ మిడ్క్యాప్ కంటే పనితీరులో ముందుంది. పోర్ట్ఫోలియో విడిగా ఒక్కో స్టాక్లో పెట్టుబడులను 3–4 శాతం మించనీయకుండా ఫండ్ మేనేజర్లు జాగ్రత్త తీసుకుంటారు. పోర్ట్ఫోలియో 50–60 స్టాక్స్తో ఉండటాన్ని గమనించొచ్చు. మార్కెట్ ర్యాలీ సమయాల్లో ఈ పథకం రాబడులు కూడా మెరుగ్గానే ఉండటం, అలాగే కరెక్షన్లో పతనాన్ని పరిమితం చేసే విధంగా పోర్ట్ఫోలియో విధానాన్ని కొనసాగిస్తోంది. మార్కెట్లలో ఆటుపోట్లు పెరిగితే 7–9 శాతం మేర నగదు, డెట్ విభాగంలో పెట్టుబడులను ఉంచేస్తుంది. ఎక్కువ పెట్టుబడులను బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్లో పెట్టడాన్ని గమనించొచ్చు. అయినప్పటికీ ఈ విభాగంలో నాణ్యమైన స్టాక్స్గా పేరొందిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు, ఈక్విటాస్ హోల్డింగ్స్, సిటీ యూనియన్ బ్యాంకులనే ఎంచుకుంది. గడిచిన ఏడాది కాలంలో ఆటో యాన్సిలరీ, పారిశ్రామిక ఉత్పత్తుల రంగాలకు చెందిన కంపెనీల్లో ఎక్స్పోజర్ పెంచుకుంది. అలాగే, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్లోనూ పెట్టబడులను పెంచుకుంది. కానీ, ఇదే సమయంలో ఐటీ స్టాక్స్లో ఎక్స్పోజర్ తగ్గించుకోవడం గమనార్హం. ఈ రంగంలో కొంత మందగమనమే దీనికి కారణం. -
వ్యాపారస్తులకు రిటర్ను ఫారంలు..
గత సంచికలో వేతనజీవుల రిటర్నుల విషయంలో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. అదే విధంగా ఈ రోజు వ్యాపారస్తుల రిటర్నులకు సంబంధించిన కీలక అంశాల గురించి తెలుసుకుందాం. వ్యాపారస్తులకు వర్తించే ప్రధానమైన ఫారాలు రెండు ఉంటాయి. అవి ఐటీఆర్ 3, ఐటీఆర్4. ఐటీఆర్ 3.. ♦ వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబం ఈ ఫారం వేయవచ్చు. ♦ వ్యాపారం మీద ఆదాయంతో పాటు ఇతర ఆదాయాలు అంటే జీతం, ఇంటద్దె, మూలధన లాభాలు మొదలైనవి ఉన్నవారు కూడా దీన్ని వేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని ఆదాయాలు ఉన్నవారు ఈ ఫారంలోనే ఆదాయాన్ని డిక్లేర్ చేయాలి. ♦ ఈ–ఫైలింగ్ కంపల్సరీ. మినహాయింపు లేదు. ♦ డిజిటల్ సంతకం తప్పనిసరి కాదు. ♦ కొంత మందికి ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉండి.. వాటి మీద ఆదాయం అందుకుంటూ ఉండవచ్చు. దీనితో పాటు వ్యాపారం మీద ఆదాయం ఉన్నట్లయితే.. ఈ ఫారం వాడాలి. ♦ ఇంటి మీద ఆదాయంలో నష్టం వచ్చినవాళ్లు, అలాంటి నష్టాన్ని సర్దుబాటు కాకుండా తర్వాత సంవత్సరాలకు బదిలీ చేసుకోవాల్సిన వాళ్లు (క్యారీ ఫార్వర్డ్) ఈ ఫారం ద్వారా రిటర్నులు వేయాలి. ♦ వ్యవసాయ ఆదాయం రూ. 5,000 దాటినవాళ్లు కూడా దీన్ని ఉపయోగించాలి. ♦ అలాగే మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటినవాళ్లు కూడా ఈ ఫారం ద్వారా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ♦ లాటరీలో గెలిచిన వారు, గుర్రపు పందేలలో లాభం వచ్చిన వారు.. అలాగే ఇతర ఆదాయంలో ‘నష్టం’ వచ్చిన వారు దీన్ని వేయొచ్చు. ♦ మూలధన లాభాలు లేదా నష్టాలు వచ్చిన వారు వేయొచ్చు. ♦ భాగస్వామ్యంలో వడ్డీ, జీతం, లాభంలో వాటాలు ఉన్న వారు ఫారం 3ని ఉపయోగించాలి. ♦ విదేశాల నుంచి ఆదాయం, ఆస్తులు, ఇతరత్రాలు ఉన్నవాళ్లు వేయొచ్చు. ♦ స్వంతంగా ఆదాయం డిక్లేర్ చేద్దామనుకున్న వాళ్లూ వేయొచ్చు. ♦ నష్టాలను రాబోయే సంవత్సరంలో సర్దుబాటు చేసుకోవాలనుకునే వారూ వేయొచ్చు. ఐటీఆర్ 4 ఫారం.. ♦ వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబం ఈ ఫారం వేయొచ్చు. ♦ వ్యాపారంలో లెక్కలతో నిమిత్తం లేకుండా లేక వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కొంత శాతాన్ని లాభంగా డిక్లేర్ చేసే విధానాన్ని ‘ఊహాజనిత ఆధారం’గా వ్యవహరిస్తారు. దీనికి కూడా ఈ ఫారంను ఉపయోగించవచ్చు. ♦ ఈ–ఫైలింగ్ తప్పనిసరి. ♦ 80 యేళ్లు దాటినవారికి, రూ. 5 లక్షల లోపు ఆదాయం గలవారికి మాత్రం తప్పనిసరి కాదు. ♦ ‘ఊహాజనిత ఆధారం’గా లెక్కించిన ఆదా యంతో పాటు జీతం, ఇంటి మీద ఆదాయం, ఇతర ఆదాయం ఉన్నవారు దీన్ని వేయొచ్చు. ♦ ఆదాయం రూ. 50,00,000 దాటినవారు ఈ ఫారం వేయొచ్చు. ♦ ఈ ఫారం వేసేవాళ్లు బుక్స్ రాయనక్కర్లేదు. ♦ టర్నోవరు రూ. 2 కోట్లు దాటిన వాళ్లు ఈ ఫారం ద్వారా రిటర్నులు వేయరాదు. ♦ 44 అఈ, 44 అఉ ప్రకారం ఈ పన్నులను లెక్కించవచ్చు. ♦ 44 అఈ ప్రకారం ఆదాయాన్ని టర్నోవరులో 8 శాతం కన్నా ఎక్కువ డిక్లేర్ చేయొచ్చు. ♦ 44 అఉ ప్రకారం రవాణా చేసే వాహనాలకైతే.. బండికి ఇంత ఆదాయమని నిర్దేశించారు. నెలకి ఒక్కో బండికి రూ.7,500కన్నా ఎక్కువ డిక్లేర్ చేసుకోవచ్చు. చివరగా.. ఈ–వెరిఫికేషన్ గతంలో చెప్పిన విధంగా చేయొచ్చు. ఏదేని కారణం వలన ఈ–వెరిఫై చేయకపోతే అక్నాలెడ్జ్మెంట్ని బెంగళూరు పంపవలసి ఉంటుంది. -
పన్ను ఎగవేతకు ‘త్రైమాసిక’ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: పన్ను కట్టకుండా ఎగ్గొట్టే సౌకర్యం ఉంటే... ఆ ఆలోచన వస్తే కొందరు వ్యాపారులకు పండుగే. అదే బడా కంపెనీలయితే ఎగ్గొట్టేది కూడా భారీగా ఉంటుంది కాబట్టి వ్యూహాలు రచించి మరీ పన్ను ఎగవేతకు పాల్పడుతుంటారు. పన్ను ఎగ్గొట్టే వారి సంఖ్య చాలా తక్కువే అయినా ఆ ఎగవేత విలువ మాత్రం కోట్లలో ఉంటుంది. ఆ కోట్ల రూపాయలు మిగుల్చుకునేందుకే కొన్ని బడా ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, జువెలరీ కంపెనీలు ‘త్రైమాసిక’వ్యూహాన్ని ఎంచుకున్నాయి. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు మూడు నెలల పన్ను రిటర్నులు దాఖలు చేయకుండా మిన్నకున్నాయి. ఆ.. ఎవరు చూస్తారులే.. చూసినా ఏమవుతుందిలే అనే భరోసాతో జీఎస్టీ డీలర్లు పన్నిన వ్యూహాన్ని హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు శోధించి మరీ ఛేదించారు. రూ.110 కోట్లను వారం రోజుల్లో ప్రభుత్వానికి జమ చేశారు. అసలేం జరిగిందంటే...! వాస్తవానికి, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) గత ఏడాది జూలై1 నుంచి అమల్లోకి వచ్చింది. అంతకు ముందు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ఉండేది. అయితే, జీఎస్టీ అమల్లోకి రావడానికి సరిగ్గా మూడు నెలల ముందే ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. కొత్త ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్, మే, జూన్ నెలల మొదటి త్రైమాసికం తర్వాత జీఎస్టీ అమల్లోకి వచ్చింది. సరిగ్గా ఈ త్రైమాసికాన్నే బడా వ్యాపారులు అదనుగా తీసుకున్నారు. ఎలాగూ పాత ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేయడంతో పాటు కొత్త విధానం అమల్లోకి వచ్చిన ఆరు నెలల వరకు ఎలాంటి ఒత్తిడులు ఉండవనే ముందస్తు వ్యూహంతో జీఎస్టీ అమల్లోకి రావడానికి మూడు నెలల ముందు కట్టాల్సిన పన్నును ఎగవేశారు. ఈ మూడు నెలలకు సంబంధించి రిటర్నులు దాఖలు చేయకుండా, జీఎస్టీ అమల్లోకి వచ్చాక జూలై నెల నుంచి రిటర్నులు దాఖలు చేశారు. మూడు నెలల రిటర్న్లు రాకపోవడంపై ఆరా 2017 సంవత్సరానికి గాను ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను బడా కంపెనీల నుంచి ఎలాంటి రిటర్నులు రాకపోవడంపై హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు దృష్టి సారించారు. ఆ కంపెనీల ట్రాక్ షీట్ను పరిశీలించగా, ప్రతి ఏటా ఆ మూడు నెలల్లో రూ.కోటి కన్నా ఎక్కువే సదరు కంపెనీలు పన్ను చెల్లించాయని, జీఎస్టీ అమల్లోకి రావడానికి మూడు నెలల ముందు మాత్రం రిటర్నులు దాఖలు చేయలేదని తేలింది. దీంతో రూ.కోటి కన్నా ఎక్కువ పన్ను చెల్లించిన 100 సంస్థలకు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ జీఎస్టీ అధికారులు. దీంతో కంగుతిన్న ఆ సంస్థలు మళ్లీ రిటర్నుల బాట పట్టాయి. నోటీసులిచ్చిన వారం రోజుల్లో దాదాపు 75 సంస్థలు రూ.110 కోట్ల వరకు పన్ను చెల్లించాయి. మిగిలిన సంస్థల ప్రతినిధులు కూడా జీఎస్టీ అధికారులను సంప్రదించి కొంత సమయం తీసుకుని పన్ను చెల్లించేందుకు సిద్ధపడటం గమనార్హం. ఇందులో గాయత్రి ప్రాజెక్ట్స్, ఐవీఆర్సీఎల్, కొసిన్ లిమిటెడ్, ఆర్వీ అసోసియేట్స్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ లాంటి సంస్థలున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరిన్ని కంపెనీలపై దృష్టి సారించామని, రిటర్నులు దాఖలు చేయని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని జీఎస్టీ అధికారులు చెపుతున్నారు. ఈ నెల 31లోగా పన్ను రిటర్నులు దాఖలు చేయాలని, లేదంటే పన్ను చెల్లించాల్సిన మొత్తాన్ని బట్టి నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి, బడా సంస్థలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే. -
డీలర్ల డిలే..!
ప్రతి వ్యాపారి తాము జరిపే లావాదేవీల వివరాలను(రిటన్స్) నిర్దేశిత గడువులోపు సమర్పించాల్సి ఉంటుంది. అయితే డివిజన్లో చాలా మంది వ్యాపారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభంలో వ్యాపారులకు పూర్తిస్థాయిలో అవగాహన లేదనే ఉద్దేశంతో ప్రభుత్వపరంగా కొంత చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చి ఆరునెలలు గడిచిపోతుండటం, ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటి నుంచి వెంటపడకపోతే మార్చి నెలాఖరు నాటికి బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉందనే ఆలోచన వాణిజ్య పన్నుల శాఖ అధికారుల్లో మొదలైంది. దీంతో సక్రమంగా రిటర్నులు సమర్పించని వారి లిస్టు తయారీ చేసి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. చిత్తూరు కార్పొరేషన్: జీఎస్టీ నిబంధనల ప్రకారం ఒక కోటి లోపు వార్షిక వ్యాపారం (టర్నోవర్) ఉన్నవారు కాంపోజిషన్ పథకం కిందికి వస్తారు. ఇతర రాష్ట్రాలకు సరుకులు రవాణా చేసేవారు, ఈ–కామర్స్ లావాదేవీలు నిర్వహించేవారు, రూ.2.5 లక్షల పనిచేసే కాం ట్రాక్టర్లు తదితరుల విషయంలో వార్షిక టర్నోవర్ ఎంతున్నా రెగ్యులర్ డీలర్గానే పరిగణనలోకి తీసుకుంటారు. రిటర్నుల దాఖలులో మీనమేషాలు.. కాంపోజిషన్ పథకం కిందకు వచ్చే వ్యాపారులు మూడు నెలలకు బకసారి చొప్పున జీఎస్టీ–4 పేరుతో రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంది. రెగ్యులర్ డీలర్లు అయితే ప్రతినెలా జరిగిన వ్యాపార లావాదేవీలను పేర్కొంటూ మరుసటి నెల 21వ తేదీలోగా 3బీ పేరుతో రిటర్నులు నమోదు చేయాల్సి ఉంది. రెండు విభాగాల వ్యాపారులూ రిటర్నులను ఆన్లైన్లో సమర్పించాలి. అయితే రెండు కేటగిరీలకు చెందిన వ్యాపారుల్లో అత్యధిక శాతం మంది నిర్దేశించిన గడువులోగా రిటర్నులు దాఖలు చేయకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. నవంబరు నెల వరకు జరిపిన లావాదేవీలను డిసెంబర్ 15లోగా సమర్పించాల్సి ఉన్నా, ఇంకా 25 శాతం వ్యాపారులు మీనవేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాలో మొత్తం 23,561 మంది డీలర్లు ఉన్నారు. ఇందులో జీఎస్టీ పరిధిలో 17,223 మంది, కాంపోజిషన్ పరిధిలో 6,388 మంది వస్తారు. కొత్త చట్టం వచ్చి ఆరునెలలు గడిచినా వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో, సరిదిద్దాలని పన్నులశాఖ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. తొలిదశలో రెగ్యులర్ డీలర్ల విషయంలో ఒత్తిడి పెంచాలని తర్వాత కాంపోజిషన్ డీలర్ల విషయంలో ఒత్తిడి పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు. కాంపోజిషన్ డీలర్ల పరంగా 6,388 మంది ఉండగా, అందులో ఎంత మంది ఐటీసీ తీసుకుంటున్నారనే విషయం అధికారుల వద్ద అందుబాటులో లేదు. జీఎస్టీ చట్టం ప్రకారం నిర్దేశించిన గడువులోగా రిటర్నులు సమర్పించని వ్యాపారులపై రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఒకేసారి జరిమానాలకు వెళ్లకుండా తొలుత నోటీసులు జారీచేసి, కొంత గడువు ఇచ్చిన తర్వాత జరిమానా విధించాలని అధికారులు భావిస్తున్నారు. 1 నుంచి ఈ వేబిల్లు అమలు.. ఫిబ్రవరి 1 నుంచి ఈ–వేబిల్లు అమలు అవుతుంది. ప్రసుత్తం ట్రయిల్ రన్లో ఉంది. సకాలంలో రిట్నర్నులు ఫైల్ చేయని డీలర్లకు నోటీసులు అందిస్తున్నాం. గడువు దాటిన తర్వాత ఆన్లైన్లో ఆటోమేటిక్గా జరిమానా పడుతుంది. రిట్నర్నులు ఫైల్ చేయకపోతే జరిమానా విధిస్తాం.– ఓంకార్రెడ్డి, జేసీ, వాణిజ్యపన్నుల శాఖ. -
నగల దుకాణంలో ఐటీ శాఖ తనిఖీలు
చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని ఓ ప్రముఖ బంగారపు నగల దుకాణంలో ఐటీ శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఉదయం పది గంటల నుంచి దుకాణం షట్టర్ మూసివేసి సోదాలు జరిపారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న130 దుకాణలపై అధికారులు ఏకకాలంలో దాడులు చేసినట్లు తెలిసింది. చిత్తూరులోని దుకాణంలో తమిళనాడు అధికారులు సోదాలు చేశారు. అమ్మకం, కొనుగోళ్ల ఇన్వాయిస్లు, ట్యాక్స్ రిట్నర్న్ వంటి కీలక పత్రాలు పరిశీలించారు. దీంతో నగరంలోని చిన్నచిన్న బంగారపు దుకాణదారులు అప్రమతమై కొన్ని దుకాణాలను మూసివేశారు. సాయంత్రం వరకు ఐటీ అధికారులు సోదాలు చేస్తుండటంతో నగరంలోని పలు నగల దుకాణదారుల్లో అలజడి మొదలైంది. -
జీఎస్టీ రిటర్న్స్లో తప్పులు దిద్దుకోవచ్చు!
న్యూఢిల్లీ: వ్యాపారులు జీఎస్టీకి సంబంధించి నెలవారీ వేసే రిటర్న్స్ ‘జీఎస్టీఆర్–3బీ’లో తప్పులు సరిదిద్దుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. దీంతో వారు తొలుత లెక్కించిన జీఎస్టీలో గనక తప్పొప్పులుంటే వాటిని సరిదిద్దుకుని మళ్లీ రిటర్న్ దాఖలు చేయటానికి వీలవుతుంది. ఇలా దిద్దటం వల్ల పెనాల్టీ పడుతుందన్న భయం కూడా ఉండదు. ఇలా సరిదిద్దుకోవటం ద్వారా సరైన ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కూడా కలుగుతుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక వ్యాపారులకు పన్ను చెల్లింపులను సరిగ్గా లెక్కించటం కష్టతరమయ్యింది. దీంతో పరిశ్రమ వర్గాలు నిబంధనలను సరళం చేయాలని డిమాండ్ చేశాయి. తాజా నిబంధనల సరళీకరణ వల్ల జీఎస్టీ రిటర్న్స్ ఫామ్లో మార్పులు చేర్పులు కోరుకుంటున్న వ్యాపారులకు ఉపశమనం కలుగుతుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ అభిషేక్ జైన్ తెలిపారు. -
జీఎస్టీ రిటర్న్స్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: జీఎస్టీఆర్–1 తుది సేల్స్ రిటర్న్స్ను దాఖలు చేసేందుకు గడువును కేంద్ర ప్రభుత్వం పది రోజులు పొడిగించింది. జనవరి 10 దాకా దీన్ని పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రూ.1.5 కోట్ల దాకా టర్నోవరున్న వ్యాపార సంస్థలు జూలై–సెప్టెంబర్ కాలానికి సంబంధించిన జీఎస్టీఆర్–1ను జనవరి 10లోగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ గడువు డిసెంబర్ 31. ఇక రూ. 1.5 కోటి పైబడిన టర్నోవర్ గల సంస్థలు కూడా జూలై–నవంబర్ కాలానికి సంబంధించి జనవరి 10లోగా ఫైల్ చేయాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం జూలై–అక్టోబర్ మధ్య వ్యవధి జీఎస్టీఆర్–1ను డిసెంబర్ 31లోగా, నవంబర్కు సంబంధించిన దాన్ని జనవరి 10లోగా, డిసెంబర్ది ఫిబ్రవరి 10లోగా సమర్పించాల్సి ఉంది. -
జీఎస్టీకి లైన్ క్లియర్...ఆ ఒక్కటి తప్ప
న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కార్ ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్టీకి దాదాపు లైన్ క్లియర్ అయింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో15 వ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రులు హాజరైన సమావేశంలో ట్రాన్సిషన్ అండ్ రిటర్న్ సహా పెండింగ్ లో ఉన్న ఇతర అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. జులై 1 నుంచి ఒకే దేశం ఒకే పన్ను (జీఎస్టీ) అమలుకు ఆమోదం లభించింది. దీంతో అన్ని రాష్ట్రాలు జీఎస్టీ డెడ్ లైన్ రడీ అయిపోయినట్టే. అయితే బంగారంపై పన్ను రేటుపై మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది. 5శాతం పన్ను ఖరారు కావచ్చేనే అంచనాలు మాత్రం జోరుగా నెలకొన్నాయి. ఉదయం సెషన్ ముగిసింది. తిరిగి మధ్నాహ్నం 3. గంటలకు తిరిగి కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ భేటీలో బంగారంపై పన్ను రేటు ఖరారు కానుంది. మరికొద్ది సేపట్లో అత్యంతకీలకమైన బంగారంపై జీఎస్టీ పన్నురేటు తేలనుంది. కాగా గత నెలలో జరిగిన కౌన్సిల్ 5, 12, 18, 28 శాతం నాలుగు పన్ను పరిధులను నిర్ణయించిన సంగతి తెలిసిందే. , Delhi: 15th GST council underway at Vigyan Bhawan. Rates of commodities like gold, footwear, textiles, agriculture equipment to be decided. pic.twitter.com/OqDrQxmLBQ — ANI (@ANI_news) June 3, 2017 -
షాకింగ్: పన్నులు ఎగవేస్తున్న 8-9లక్షల కంపెనీలు
న్యూఢిల్లీ: రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా సంచలన విషయాలను వెల్లడించారు. దాదాపు 8-9 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు పన్నులు చెల్లించడంలేదని శనివారం ప్రకటించారు. ప్రభుత్వానికి పన్నుచెల్లించకుండా బడా కంపెనీలు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయని లక్షల రిజిస్టర్డ్ కంపెనీలను గుర్తించి నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. ఎన్ఫెర్స్మెంట్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అధియా ఈ విషయాలను వెల్లడించారు. దీనిపై ప్రధానిమంత్రిత్వవర్గ కార్యాలయం పరిశీలిస్తోందని తెలిపారు. పీఎంవో ఆధ్వర్యంలో ఎంసీఏ కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే టాస్క్ ఫోర్స్ ప్రతి 15 రోజులకు ఈ కంపెనీలను మానిటర్ చేస్తోందని చెప్పారు. మొత్తం 15 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు ఉండవగా, వాటిల్లో 8నుంచి 9 లక్షల కంపెనీలు తమ వార్షిక ఆదాయాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ) వద్ద దాఖలు చేయడంలేదని పేర్కొన్నారు. మనీలాండరింగ్ వ్యవహరాలతో ఇవి పెద్ద ప్రమాదకరమైనవిగా మారాయని చెప్పారు. వీటిలో కొన్నింటికి నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. రూ.6 వేలకోట్ల బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో చూసినట్లు ట్రేడ్ ఆధారిత నగదు లాండరింగ్ కూడా ఈ రోజుల్లో ప్రముఖంగా ఉందని అధియా చెప్పారు. కాగా దేశీయ షెల్ కంపెనీలపై భారీ అణిచివేత చర్యల్లో భాగంగా ఫిబ్రవరిలో ప్రభుత్వం "కఠిన చర్య" తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పన్నులు ఎగ్గొడుతున్న ఈ కంపెనీల బ్యాంకు ఖాతాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
బాబ్బాబు.. వెనక్కివ్వండి
ధర్మవరం : ‘నమస్తే అన్నా.. మీ ఊరికి తీసుకెళ్లిన రెయిన్గన్లు.. స్రింక్లర్ పైపులు నిన్ననే తీసుకువస్తామని చెప్పారన్నా.. ఇంకా గోడౌన్కు చేర్చలేదేమన్నా? పై అధికారులు ఫోన్మీద ఫోన్ చేస్తున్నారన్నా.. ఎలాగైనా.. ఈ రోజు సాయంత్రంలోపు మీ ఊరికి ఇచ్చిన సామాన్లన్నీ గోడౌన్కు చేర్పించన్నా.. మర్చి పోద్దన్నా..ప్లీజ్..’ ఇది ఓ వ్యవసాయాధికారి వేడుకోలు. ‘ఏమయ్యా ఏవో.. రెయిన్ గన్లు.. స్ప్రింక్లర్లు వెనక్కి తీసుకు రమ్మంటున్నావంటా.. ఉన్నీలే.. మావోల్లేలే! జిల్లాలో అన్ని చోట్లా వెనక్కి ఇచ్చినప్పుడు.. మావోళ్లూ తెచ్చిస్తారులే... లాస్ట్ వరకు చూడు... వాళ్లనేం బలవంత పెట్టొద్దు’ ఇది అదే వ్యవసాయాధికారికి ఓ ప్రజాప్రతినిధి జారీ చేసిన హుకుం! ఖరీఫ్ సీజన్లో సాౖVð న వేరుశనగ పంటను కాపాడేందుకు రక్షక తడులు అందించాలంటూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ వ్యవసాయాధికారుల ద్వారా రెయిన్గన్లు, స్రింక్లర్లు, హెచ్డీ పైపులు, డీజిల్ ఇంజన్లు అందజేసిన సంగతి తెలిసిందే. అవి ఏమేరకు పంటను రక్షించాయన్నమాట అటుంచితే. వాటిని అధికార పార్టీ నేతల నుంచి వెనక్కి తెప్పించేందుకు అధికారులకు తలప్రాణం తోకకొస్తోంది. ప్రస్తుతం కంది పంటకు కూడా రక్షక తడులు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ అయినే నేపథ్యంలో వాటిని రికవరీ చేయకపోతే అధికారుల నుంచి చీవాట్లు.. గట్టిగా ఒత్తిడి చేసి తీసుకురమ్మని చెబితే నేతల నుంచి ఒత్తిళ్లు.. అడకత్తెరలో పోకచక్కలా తయారైంది వ్యవసాయాధికారుల పరిస్థితి. టీడీపీ నేతల ఆధీనంలోనే జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో ఎండిపోతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు రక్షకతడులు అందజేసేందుకు గాను 4,621 రెయిన్గన్లు, 4,279 స్ప్రింక్లర్ సెట్లు, 2,859 డీజిల్ ఇంజన్లు, 1.28 లక్షల హెచ్డీ పైపులను ప్రభుత్వం సమకూర్చింది. అయితే రైతులకు ఉపయోగపడాల్సిన ఈ సామగ్రి... పంచాయతీల వారీగా జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పంచుకున్నారు. ఇళ్లలోనే సామగ్రి పంట పొలాల్లో రక్షక తడులు అందించాల్సిన రెయిన్గన్ల సామగ్రి నేతల ఇళ్లలోనే మూలుగుతున్నాయి. చాలా గ్రామాల్లో కనీసం ఒక్క ఎకరాకు రక్షక తడులు అందించేందుకు కూడా వినియోగించకుండా నేరుగా ఆయా గ్రామాల నాయకులు తమ ఇళ్లలో వాటిని భద్రంగా దాచిపెట్టారు. వీటిలో కొన్ని చోరీకి గురికాగా, మరికొన్ని శిథిలమైనట్లు తెలుస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలో పరిస్థితి ఇలా.. - బత్తలపల్లి మండలంలో 102 రెయిన్ గన్లు పంపిణీ చేయగా 25 రికవరీ అయ్యాయి. స్రింక్లర్లు 132గాను 35 మాత్రమే వెనక్కి తెచ్చిచారు. ఆయిల్ ఇంజిన్లు 87కు గాను 57 మాత్రమే వ్యవసాయాధికారుల వద్దకు తిరిగి చేరాయి. మొత్తం పరికరాల్లో 8,700గాను 3,700 మాత్రమే వెనక్కి వచ్చాయి. - తాడిమర్రి మండలంలో 103 రెయిన్ గన్లు, 96 ఆయిల్ ఇంజన్లు, 5,011 పైపులు, 60 స్ప్రింక్లర్ సెట్లకు గాను 55 ఆయిల్ ఇంజిన్లు, 60 స్ప్రింక్లర్లు మాత్రమే వ్యవసాయ కార్యాలయానికి చేరాయి. - ముదిగుబ్బ మండలంలో 124 రెయిన్గన్లు, 124 స్ప్రింక్లర్ సెట్లు, 118 ఆయిల్ ఇంజన్లు, 9,554 హెచ్డీ పైపులు పంపిణీ చేయగా వాటిలో 50 శాతం సామగ్రి మాత్రమే వెనక్కి చేరింది. - ధర్మవరం మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
మార్కెట్లది బలహీనబాటే!
చిన్న ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేయాలి... * లిక్విడిటీ క్రమంగా తగ్గే అవకాశం * ఫెడ్ రేటు, అమెరికా ఎన్నికల ప్రభావం * భారత్-పాక్ ఉద్రిక్తతలూ సమస్యే ఆర్థిక, ద్రవ్య సమాచారాలను బట్టే మార్కెట్ కదలికలుంటాయనేది కొత్త విషయమేమీ కాదు. అయితే ఇబ్బందల్లా ఒకదాని వెంట మరొకటి చోటుచేసుకునే పలు సంఘటనలు మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కదలికలు ఎటు వెళతాయో తెలియని అయోమయాన్నీ సృష్టిస్తాయి. గత పక్షం రోజుల్లో ఒకదానివెంట మరొకటి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా, జపాన్ కేంద్ర బ్యాంకుల సమావేశం- ఆర్థిక నిర్ణయాలు ఇందులో ప్రధానమైనవి. పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం(ఒపెక్) సమావేశం, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మొదటి విడతగా డెమోక్రటిక్, రిపబ్లిక్ అభ్యర్థులు- హిల్లరీ, ట్రంప్ చర్చ వీటిలో కీలకమైనవి. దేశీయంగా చూస్తే... పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ సైనికుల సర్జికల్ దాడులు కీలకం. ఇవన్నీ అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపేవే. ఈ ఏడాది ఫెడ్ ఫండ్ రేటు ప్రస్తుత 0.50 శాతం పైకి పెంచుతామని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలివ్వటం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తక్షణం కాకున్నా క్రమంగా గ్లోబల్ లిక్విడిటీ తగ్గే వీలుంది. ఇవన్నీ సమీప కాలంలో భారత్ మార్కెట్ బలహీనంగా ఉండొచ్చనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రత్యేకించి చిన్న పెట్టుబడిదారులు తమ కష్టార్జితంపై ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. లిక్విడిటీ తగ్గే చాన్స్... ప్రస్తుతానికైతే అమెరికా, జపాన్ ఉద్దీపనలకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదని మార్కెట్కు సంకేతాలందాయి. అయితే ఇవి గతంలో ఉన్నంత దూకుడుగా ఉండవన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. గడచిన పక్షం రోజుల్లో భారత్కు ఎఫ్ఐఐ పెట్టుబడుల ప్రవాహం తగ్గుతుండటాన్ని మనం గమనిస్తున్నాం. ఆగస్టులో దేశానికి 10,000 కోట్ల ఎఫ్ఐఐ పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్ చివరినాటికి ఈ మొత్తం రూ.5,000 కోట్లకు పడిపోయింది. జూలై అయితే ఈ మొత్తం ఏకంగా రూ.11,000 కోట్లుంది. మరో నాలుగు అంశాలు... * అమెరికా అధ్యక్ష అభ్యర్థుల చర్చల ప్రక్రియ నవంబర్ వరకూ కొనసాగుతుంది. ఇది మార్కెట్పై నిరంతరం ప్రభావితం చూపేదే. ఎన్నికల చర్చల నేపథ్యంలో గత వారం అంతర్జాతీయంగా పలు మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరకు హిల్లరీకి అనుకూలంగా వచ్చిన ఒపీనియన్ పోల్ ఫలితాలు ఒడిదుడుకులను కొద్దిగా తగ్గించాయి. అయితే మున్ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికలు మార్కెట్లకు చాలా కీలకం. * చమురు ఉత్పత్తిని తగ్గించాలని గత బుధవారం జరిగిన ఒపెక్ సమావేశం నిర్ణయించింది. ఎనిమిదేళ్లలో ఈ తరహా నిర్ణయం ఇదే తొలిసారి. అంతర్జాతీయ ఆర్థిక మందగమన పరిస్థితులు, ఈ నేపథ్యంలో చమురు ధరలు పడిపోకుండా చూసే దిశగా ఒపెక్ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సి ఉంది. * జర్మనీ డాయిష్ బ్యాంక్పై ఆందోళనలు మూడవ అంశం. తాజాగా ఈ షేర్ ధర ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది బ్యాంక్ విలువ 55 శాతం హరించుకుపోయింది. 2008 ఆర్థిక సంక్షోభానికి సంబంధించి అమెరికా న్యాయశాఖ విధించిన 14 బిలియన్ డాలర్ల జరిమానా బ్యాంకు పరిస్థితిని మరింత విషమింపజేసింది. పరిస్థితి ఎటువైపు దారితీస్తుందన్న అంశంపై జర్మనీతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థా ఆందోళన పడుతోంది. * దేశీయంగా చూస్తే... భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుండడం మనం ఇప్పటికే గమనిస్తున్నాం. భారత్ సైనికుల చర్య నేపథ్యంలో ఒక్కసారిగా సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పడిపోయింది. అసలే అంతర్జాతీయ పరిణామాల ప్రభావంలో ఉన్న భారత్ మార్కెట్లను తాజా పరిణామాలు ఏం చేస్తాయోనని ఆలోచనలో ఇన్వెస్టర్ ఉన్నాడు. లాభాల స్వీకరణకే మొగ్గు కనబడుతోంది. నిఫ్టీ కన్సాలిడేషన్..! మొత్తంగా ఆయా పరిణామాలు భారత్ మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే... నిఫ్టీ ఇటీవలి గరిష్టానికి (8,968, సెప్టెంబర్ 7) చేరటం కష్టమన్న అంచనాలున్నాయి. మార్కెట్ విలువ బాగా పెరిగిందన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. 8,900-9,000 మధ్య నిఫ్టీ కొంత బలహీన పరిస్థితిని ఎదుర్కొనడం కొనసాగుతుందన్నది నా అభిప్రాయం. డాలర్ రూపంలో చూస్తే గడచిన పక్షం రోజులుగా ఆసియా మార్కెట్లు 3 శాతంపైగా రిటర్న్స్ అందిస్తే, భారత్ మార్కెట్ రిటర్న్ మైనస్లో ఉంది. స్వల్పకాలంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నాం. పాక్తో ఉద్రిక్తతలు తగ్గడం, ఇండియా ఎకనమిక్ అవుట్లుక్ మరింత మెరుగుపడటం వంటి అంశాలతోనే మార్కెట్ తిరిగి పుంజుకునే వీలుంది. ఈ నెలలో విడుదల కానున్న అమెరికా జీడీపీ మూడవ త్రైమాసిక గణాంకాలు కూడా మార్కెట్పై ప్రభావాన్ని చూపిస్తాయి. -
వేసిన రిటర్నులో తప్పులున్నాయా?
* కంగారు పడకండి.. లోపాలు సవరించొచ్చు * 15 రోజులు గడువు; పట్టించుకోకుంటే రిటర్ను రద్దు కావచ్చు ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేసిన వాటిని అధికారులు పరిశీలిస్తారు. రిటర్నులో ఏమైనా లోపాలుంటే వాటిని లోపభూయిష్టమైన రిటర్నులు లేదా అసంపూర్తి రిటర్నులుగా పిలుస్తారు. ఈ విషయాన్ని రిటర్ను వేసిన వారికి అధికారులు తెలియజేస్తారు. ఇలా మనం వేసిన రిటర్నులు అసంపూర్తి రిటర్నులు అని తేలితే.. వాటిని 15 రోజుల్లోగా సవరించాలి. అవసరమైతే అదనపు వ్యవధి అడగవచ్చు. గడువు లోపల సవరించకపోతే మీరు వేసిన రిటర్ను చెల్లదు. రద్దవుతుంది. కానీ మీరు సవరిస్తే కాస్త అటూఇటూ అయినా కూడా అధికారులు సహకరిస్తారు. ఏ సందర్భాల్లో లోపాలు ఏర్పడవచ్చు.. * ఐటీ ఫారాలు 1 నుంచి 8 దాకా అమలులో ఉన్నాయి. ప్రతి ఫారంలో ఎన్నో అంశాలుంటాయి. ప్రతి దానికి ఎదురుగా జవాబు రాయాలి. వర్తించకపోతే స్పష్టంగా వర్తించదని.. నిల్ అయితే నిల్ అని.. రాయాలి. అంతేతప్ప ఏ కాలమ్ను ఖాళీగా ఉంచకూడదు. జవాబివ్వకపోవడమూ లోపమే అవుతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. * రిటర్నుతో పాటు కొన్ని స్టేట్మెంట్లు, రిపోర్టులు, ట్యాక్స్ చలానాలు జతపరచాలి. ఈ-ఫైలింగ్లో ఎటువంటి వాటిని జతపరచనవసరం లేదు. అయితే అసెసింగ్ అధికారులు అసెస్మెంట్ చేస్తున్నప్పుడు కాగితాలు అడుగుతారు. అన్నింటినీ భద్రపరచుకుంటే బాగుంటుంది. * లాభనష్టాలకు సంబంధించిన అంశాలను తెలపకపోతే రిటర్ను డిఫెక్ట్ అవుతుంది. * ఆస్తి, అప్పుల పట్టీకి సంబంధించి ఆస్తులు, అప్పుల వివరాలను సంపూర్ణంగా తెలియజేయాలి. అలా కానిపక్షంలో రిటర్నులను డిఫెక్ట్గా పరిగణిస్తారు. * భాగస్వామి విషయంలో వ్యక్తిగత అకౌంట్ అంటే వ్యాపారపు ఖాతా వివరాలు ఇవ్వకపోయినా.. ఆడిట్ వర్తించే కేసుల్లో ఆడిటర్ వివరాలు చూపకపోయినా.. బుక్స్ రాయనవసరం లేనప్పుడు నగదు నిల్వలు, రుణ దాత లు, రుణగ్రస్తులు, ముగింపు సరుకు వివరాలు తెలపకపోయినా.. ట్యాక్స్ చెల్లించకుండా చెల్లించినట్లు చూపించినా.. ఆ రిటర్నులను డిఫెక్ట్గా పరిగణిస్తారు. డిఫెక్ట్- ఇన్వాల్యూడ్... తేడా ఏంటి? డిఫెక్ట్ రిటర్నుని సవరించకపోతే ఇన్వాల్యూడ్ రిటర్ను అవుతుంది. అంటే అప్పుడు మనం రిటర్ను వేయనట్లే. అయితే సెక్షన్ 292 బి ప్రకారం తప్పు/లోపం/విడిచిపెట్టడం/మరచిపోవడం/తొలగించడం వంటి అంశాల వలన రిటర్ను రద్దు కాదు. కాని సెక్షన్ 149 (9)కి బలం ఎక్కువ. నిర్దేశించిన లోటుపాట్లు సవరించకపోతే డిఫెక్ట్ రిటర్ను రద్దవుతుంది. అంటే రిటర్ను దాఖలు చేయనట్లే. అప్పుడు రిటర్ను దాఖలు చేయకపోతే ఏ ఏ పెనాల్టీలు విధిస్తారో ఆ అన్నింటినీ వడ్డిస్తారు. అందుకే తగిన జాగ్రత్త వహించండి. -
రీ ఎంట్రీ కలిసొస్తుందా?
హీరోయిన్లకు వివాహానంతరం అవకాశాలు రావడమే గగనంగా మారింది. అలాంటిది ఒక వేళ వచ్చినా అవి ఏ అక్కో, అమ్మో పాత్రలుగా ఉంటాయి. దక్షిణాదిలో పెళ్లి అయిన తరువాత నటీమణులు కథానాయకిలుగా రాణించడం అన్నది అరుదే. ఇటీవల భర్త నుంచి విడాకులకు సిద్ధమైన అమలాపాల్కు కోలీవుడ్లో అవకాశాలు ఎండమావిగా మారుతున్నాయని చెప్పవచ్చు. అంతకు ముందు అవకాశాలిస్తామన్న వారు కూడా ఇప్పుడు ముఖ చాటేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నటి స్నేహ నాయకిగా రీఎంట్రీ అవుతున్నారు. ఈ భామ నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు పండంటి బిడ్డ కూడా ఉన్నారు. వివాహనంతరం ఒకటి రెండు తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన స్నేహ ఆ తరువాత హీరోయిన్ పాత్రలు అయితేనే చేస్తానని తేల్చి చెప్పారు. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ లలో అలాంటి అవకాశాలివ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు రాకపోయినా మాలీవుడ్ మాత్రం స్నేహ నటనా ప్రతిభను వాడుకోవడానికి ముందుకొచ్చింది. గ్రేట్ ఫాదర్ అనే మలయాళ చిత్రంలో మమ్ముట్టికి జంటగా నటించడానికి స్నేహ సిద్ధం అవుతున్నారు. తను ఇంతకు ముందు మమ్ముట్టితో రెండు చిత్రాలు చేశారన్నది గమనార్హం. అయితే వివాహానంతం నాయకిగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ఇందులో మమ్ముట్టికి విలన్గా నటుడు ఆర్య నటించనుండడం విశేషం. మలయాళం మాతృభాష అయిన ఆర్య ఇంతకు ముందు అక్కడ కొన్ని చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు. ఈ గ్రేట్ ఫాదర్ చిత్రంలో పవర్ఫుల్ విలన్గా నటించనున్నారట. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంతో తన రీఎంట్రీ ముడిపడి ఉందని అంటున్నారట నటి స్నేహ. ఇది విజయం సాధిస్తేనే తదుపరి నటించే విషయం గురించి నిర్ణయం తీసుకుంటానని స్నేహ అంటున్నట్లు సమాచారం. అయితే ఈ రీఎంట్రీ తనకు మళ్లీ స్టార్డమ్ను తీసుకొస్తుందనే నమ్మకంలో ఉన్నారట. చూద్దాం స్నేహ ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తారో. -
ఆదాయ పన్ను రిటర్న్లు ఇచ్చింది 5 కోట్ల మందే
ప్రిన్సిపల్ కమిషనర్ –2 ఓంకారేశ్వర్ చిదరా అనకాపల్లి టౌన్: భారతదేశంలో 20 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్న్లు ఇ వ్వాల్సి ఉండగా కేవలం ఐదుకోట్ల మంది మాత్రమే ఇస్తున్నట్టు ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కంట్యాక్స్ –2 ఓంకారేశ్వర్ చిదరా తెలిపారు. స్థానిక ఉప్పల చంద్రశేఖర్ కల్యాణమండపంలో చార్టెడ్అకౌంట్స్ బంగారుశెట్టి అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో చిదరా మాట్లాడారు. భారత ప్రభుత్వం ఇన్కాం డిక్లరైజేషన్ పథకం సెప్టెంబర్ 30 వరకు ఉందన్నారు. దీనిని పొడిగించేందుకు వీలు కాదని పార్లమెంట్లో తీర్మానం చేసినట్టు చెప్పారు. గతంలో కట్టాల్సిన ట్యాక్స్కి 30 నుంచి 40 శాతం పెంచిందన్నారు. రెండు, మూడేళ్లలో కట్టాల్సిన ట్యాక్స్ను వడ్డీలేకుండా మూడు విధాలుగా చెల్లించే విధంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. అనకాపల్లిలో ట్యాక్స్ల రూపంలో నగదు జమ అయ్యేదని తెలిపారు. ప్రస్తుతం ఎందువల్లో తగ్గిందన్నారు. ఇప్పటి వరకు 25 కోట్లు మందికి పాన్కార్డులు, వందకోట్ల మందికి ఆధార్కార్డులు ఉన్నందున ఈ రెండింటినీ అనుసంధానం చేయడంతో ట్యాక్స్ పరిధిలోకి ఎంత మంది వస్తారో తెలుస్తుందని తెలిపారు. ఒకరోజు దాడులు చేయడం వల్ల ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయ లు ట్యాక్స్ వసూలైనట్టు వివరించారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కంట్యాక్స్ కాకినాడ రేంజ్ ఎస్.రవిశంకర్నారాయణ మాట్లాడుతూ ఆస్తుల డేటాలు కంప్యూటర్లో నమోదు కావడం వల్ల ట్యాక్స్ పరిధిలోకి ఎవరు వస్తున్నదీ గమనించినట్టు తెలిపారు. అనంతరం చదరాను చార్టెడ్ అకౌంటెంట్లు ఘనంగా సన్మానించారు. వర్తక సంఘం కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణ, అధ్యక్షులు కోరుకొండ శరత్బాబు, వివిధ వర్గాలకు చెందిన వర్తకులు పాల్గొన్నారు. -
నేడు స్వదేశానికి రానున్న ఉపరాష్ట్ర్రపతి
న్యూఢిల్లీ: మంగోలియా రాజధాని ఉలన్బాటర్లో జరుగుతున్న 11వ ఆసియా-యూరోప్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ఉపరాష్ట్ర్రపతి హమిద్ అన్సారీ ఈరోజు ఇండియాకు తిరిగిరానున్నారు. బ్రిగ్జిట్ తర్వాత విశ్వవ్యాప్తంగా ఏర్పడ్డ ఆర్థిక మందగమనంపై వివిధ దేశాధినేతలు ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్, స్విట్జర్లాండ్,ఎస్టోనియా దేశాధినేతలతో అన్సారీ ప్రత్యేకంగా సమామేశమై భారత ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. -
రిటర్నులు ఎందుకు వేయాలి?
చాలా మంది రిటర్నులు ఎందుకు వేయాలని అడుగుతారు. పాన్ ఉంటే వేయాలా.. ఆదాయం లేకపోయినా వేయాలా.. బంగారం కొనుగోలు చేస్తే వేయాలా.. ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు వేసినా ఒకే ఒక సమాధానం. రిటర్నులు దాఖలు చేయండి. ఎందుకంటే.... మీ వయసును బట్టి బేసిక్ లిమిట్ ఉంటుంది. బేసిక్ లిమిట్కు మించి మీ నికర ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాలి. ఈ విషయంలో ఎప్పుడూ చట్ట ప్రకారమే నడుచుకోండి. రిటర్నులు దాఖలుతో ఇతరత్రా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చట్టాన్ని గౌరవించండి! చట్టాన్ని అనుసరించడం మన బాధ్యత. కంపెనీలలో డెరైక్టర్లు రిటర్నులు దాఖలు చేయాలి. భాగస్వామ్య సంస్థలలో భాగస్వాములు కూడా రిటర్నులు వేయాలి. కొత్త నిబంధనల ప్రకారం మీకు విదేశాలలో బ్యాంకు అకౌంట్ ఉన్నా రిటర్నులు దాఖలు తప్పనిసరి. అలాగే విదేశాల్లో ఆస్తులు ఉన్నా, విదేశీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినా రిటర్నులు వేయండి. ట్యాక్సబుల్ ఇన్కమ్ లేకపోయినా విదేశాలలో ఉన్న అంశాలను రిటర్నులలో పొందుపరచాలి. రిఫండ్ పొందాలంటే.. ప్రతిచెల్లింపులు చేసేవారు టీడీఎస్ చేస్తున్నారు. అంటే మూలంలోనే కోత. కొంత మందికి ట్యాక్సబుల్ ఇన్కమ్ దాటకపోయినా కోత తప్పటం లేదు. అధికారులకు భయం ఎక్కువగా ఉండటం వలన కోతలను అమలు పరుస్తున్నారు. కోత పడిందంటే పన్ను ఖజానాలో జమయ్యినట్లే. ఇలాంటి సందర్భంలో రిటర్నులు దాఖలు చేస్తే కాని రిఫండ్ మీకు రాదు. కాబట్టి రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతే కాదు రిఫండ్ ఉంది అంటే ఆన్లైన్లో దాఖలు చేయాలి సుమా. డిడక్షన్ల క్లెయిమ్ ఎలా? అందరికీ సెక్షన్ 80 కింద డిడక్షన్లు ఉంటాయి. 80 సీ, 80 డీ, 80 డీడీ, 80 ఈ.. ఇలా ఎన్నో. వీటి అన్నింటికీ కాగితాలు ఉండాలి. రిటర్నులతోపాటు జతపరచకపోయినప్పటికీ భద్రపరచుకోవాలి. స్థూల ఆదాయం లో నుంచి వీటిని మినహాయిస్తారు. క్లెయిమ్ మార దు. కానీ స్థూల ఆదాయం మారొచ్చు. అందుకని డిడక్షన్లు సరిగ్గా క్లెయిమ్ చేస్తూ రిటర్నులు వేశారంటే.. మీరు మీ డిడక్షన్లన్నింటినీ డిక్లేర్ చేసినట్లు. ఉదాహరణకు మీ స్థూల ఆదాయం 3 లక్షలు. 80 సీ కింద రూ. 1,50,000 చెల్లించారు. ట్యాక్సబుల్ ఇన్కమ్ రూ.1,50,000. పన్ను భారం లేదు. ఇటువంటి సందర్భాల్లో ఏదేని కారణం వల్ల ఆదాయం రూ.1,00,000 పెరిగిందనుకోండి. అప్పుడు గతంలో మీరు చేసిన క్లెయిమ్ ఇప్పుడు మీ పన్ను భారాన్ని తగ్గిస్తుంది. షేర్లు అమ్ముతున్నారా.. షేర్ల లావాదేవీలలో నష్టం రావచ్చు. లాభాలు పొందొచ్చు. చాలా మంది ఇటువంటి లావాదేవీలను డిక్లేర్ చేయడం లేదు. బేసిక్ లిమిట్ దాటకపోతే.. అస్సలు పట్టించుకోవడం లేదు. ఇన్కమ్ సరే.. లావాదేవీల్లో నష్టం రావొచ్చు. ఈ నష్టాన్ని డిక్లేర్ చేయడం వలన మీకొచ్చే షేర్ల మీద ఆదాయం పడిపోవచ్చు. తద్వారా పన్ను భారం తగ్గుతుంది. అలా సర్దుబాటు కాకపోయినా రాబోయే సంవత్సరాల్లో సర్దుబాటు చేయవచ్చు. అందుకే కచ్చితంగా ఈ లావాదేవీలను చూపిస్తూ రిటర్నులు దాఖలు చేయండి. అమెరికా నుంచి అబ్బాయి డబ్బు పంపిస్తే! విదేశాల నుంచి అబ్బాయి/అమ్మాయి/ఇతరులు మీకు డబ్బు పంపుతున్నారా? భయపడనక్కర్లేదు. అక్కడ పన్ను చెల్లించిన ఆదాయం మీ అకౌంట్లో పడింది. ఇక్కడ పన్ను పడదు. కానీ మీరు చూపించాలి. అలాగే గ్రాట్యుటీ, జీవిత బీమా వంటి పన్నుకు గురికాని ఆదాయాలనూ డిక్లేర్ చేస్తూ రిటర్నులు దాఖలు చేయాలి. మరిన్ని ప్రయోజనాలు.. వీసా అధికారులు, బ్యాంక్ ఆఫీసర్లు, మీకు రుణమిచ్చే వారు, క్రెడిట్ కార్డు సంస్థలు, కొన్ని క్లబ్బులు, సంస్థలు... ఇలా ఎందరో ఆదిలోనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు అడుగుతున్నారు. పన్ను భారం లేకపోయినా.. బేసిక్ లిమిట్ దాటకపోయినా.. వీటి విలువ అపారం. అందరూ వీటిని విశ్వసిస్తున్నారు. వీటి మీద ఆధారపడే మీకు ఎన్నో పనులు జరుగుతాయి. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు. రిటర్నులు వేయడానికి ఉపక్రమించండి. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
జెట్ ఎయిర్ వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్
బెంగళూరుః కర్నాటక రాజధాని బెంగళూరు విమానాశ్రయంనుంచీ ఉదయం బయల్దేరిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో పొగలు రావడంతో.. విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు బెంగళూరు ఎయిర్ పోర్టులో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. మంగుళూరుకు చెందిన 9W 2839 జెట్ ఎయిర్ వేస్ విమానం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టునుంచి టేకాఫ్ అయ్యింది. ఆకాశంలోకి ఎగిరిన కొద్దిసేపటికే ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ లో పొగలు రావడాన్ని సిబ్బంది గమనించి, అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని వెనక్కు రప్పించారు. 9W 2839 జెట్ ఎయిర్ వేస్ విమానం లో సాంకేతిక లోపాలు ఏర్పడటంతో బెంగళూరు ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నట్లు జెట్ ఎయిర్ వేస్ అధికారులు తెలిపారు. -
రిటర్నులు ఎందుకు..?
చాలామంది రిటర్నులు ఎందుకు వెయ్యాలి అని అడుగుతారు. పాన్ ఉంటే వెయ్యాలి.. పాన్ లేకపోతే మంచిదే కదా.. మనం అస్సలు రిటర్ను వేయనక్కర్లేదు కదా.. మాకు ఆదాయం లేదు.. అయినా వెయ్యాలా? బంగారం ఉంటే.. కొంటే వెయ్యాలా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు .. ఎన్ని ప్రశ్నలు వేసినా ఒకే ఒక్క జవాబు.. రిటర్నులు దాఖలు చేయండి. ఎందుకంటే.. మీ వయస్సును బట్టి బేసిక్ లిమిట్ ఉంటుంది. బేసిక్ లిమిట్ దాటి మీ నికర ఆదాయం ఉంటే రిటర్ను దాఖలు చేయాలి. నికర ఆదాయాన్ని లెక్కించండి. ఇదంతా చట్టాల కోసమేనని ఆలోచించకండి. దీనివల్ల ఇతరత్రా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. చట్టాన్ని గౌరవించండి.. పైన చెప్పిన విధంగా చట్టప్రకారం మీ గురుతరబాధ్యత నిర్వర్తించండి. కంపెనీల్లో డెరైక్టర్లూ రిటర్నులు దాఖలు చేయాలి.. భాగస్వామ్య సంస్థల్లో భాగస్వాములూ వేయాలి. కొత్త నిబంధనల ప్రకారం మీకు విదేశాలలో బ్యాంకు అకౌంటున్నా.. రిటర్నులు వేయాలి. విదేశాల్లో ఆస్తులున్నాయి.. రిటర్నులు వేయాలండి. అంతే కాకుండా విదేశీ సంస్థల్లో పెట్టుబడులుంటే రిటర్నులు దాఖలు చేయాలి. ట్యాక్సబుల్ ఇన్కం లేకపోయినా విదేశాల్లో ఉన్న అంశాలను రిటర్నుల్లో పొందుపర్చాలి. రీఫండ్లు పొందాలంటే,, చెల్లింపులు చేసే ప్రతివారు టీడీయస్ చేస్తున్నారు. అంటే మూలాల్లోనే కోత. కొంతమందికి ట్యాక్సబుల్ ఇన్కం దాటకపోయినా కోత తప్పటం లేదు. అధికారులకు భయం ఎక్కువవటం వలన కోత అమలు పరుస్తున్నారు. కోత పడిందంటే పన్ను ఖజానాకు జమయినట్లే. ఇలాంటి సందర్భంలో రిటర్నులు దాఖలు చేస్తే కానీ రీఫండ్ మీకు రాదు. కాబట్టి రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతే కాదు. రీఫండ్ ఉంది అంటే.. ఆన్లైన్లో దాఖలు చేయాలి సుమా. డిడక్షన్లు క్లెయిమ్ చేయాలంటే.. అందరికీ సెక్షన్ 80 కింద డిడక్షన్లు ఉంటాయి. 80సీ, 80డీ, 80డీడీ, 80ఈ .. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి అన్నింటికి కాగితాలు ఉండాలి. రిటర్నులతో బాటు జతపర్చకపోయినా భద్రపర్చుకోవాలి. క్లెయిం కోసం స్థూల ఆదాయం లోంచి వీటిని మినహాయిస్తారు. కానీ స్థూల ఆదాయం మారవచ్చు.. ఉద్యోగస్తులకు ఎరియర్స్ రావొచ్చు.. ఇతరులకు గత ఆదాయం ఇప్పుడు రావొచ్చు. అందుకని డిడక్షన్లు సరిగ్గా క్లెయిమ్ చేస్తూ రిటర్నులు వేశారంటే మీరు మీ డిడక్షన్లన్నింటినీ డిక్లేర్ చేసినట్లే. ఉదాహరణకు.. మీ స్థూల ఆదాయం రూ. 3 లక్షల యితే.. 80సీ కింద రూ. 1,50,000 చెల్లించారనుకోండి.. ట్యాక్సబుల్ ఇన్కం రూ. 1,50,000 అవుతుంది.. పన్ను భారం ఏదు. ఇటువంటి సందర్భంలో ఏదైనా కారణం వలన ఆదాయం రూ. 1,00,000 పెరిగిందనుకోండి.. గతంలో మీరు చేసిన క్లెయిమ్ ఇప్పుడు మీ పన్ను భారం తగ్గిస్తుంది. షేర్లు అమ్ముతున్నారా.. షేర్ల లావాదేవీలలో.. నష్టం రావొచ్చు.. లాభం రావొచ్చు. చాలా మంది ఇటువంటి లావాదేవీలను డిక్లేర్ చేయడం లేదు. బేసిక్ లిమిట్ దాటకపోతే అస్సలు పట్టించుకోవడం లేదు. ఇన్కం సరే, లావాదేవీల్లో నష్టం రావచ్చు. ఈ నష్టాన్ని డిక్లేర్ చేయడం వలన మీకొచ్చే షేర్ల మీద వచ్చే ఆదాయం తగ్గుతుంది. తద్వారా పన్ను భారం తగ్గుతుంది. అలా సర్దుబాటు కాకపోయినా.. రాబోయే 8 సం.లు సర్దవచ్చు. అందువలన ఖచ్చితంగా ఈ లావాదేవీలను చూపించుతూ రిటర్నులు దాఖలు చేయండి. అమెరికా నుంచి అబ్బాయి పంపిస్తే.. విదేశాల నుంచి మీ అబ్బాయి/అమ్మాయి లేదా దగ్గర బంధువులు డబ్బులు పంపుతున్నారా. భయపడక్కర్లేదు. అక్కడ పన్ను చెల్లించిన ఆదాయం, మీ అకౌంటులో పడింది. ఇక్కడ పన్ను పడదు. కానీ మీరు చూపించాలి. అలాగే ఎన్నో ఆదాయాలు పన్నుకి గురికానివి ఉన్నాయి. గ్రాట్యుటీ, జీవిత బీమా మొదలైనవి ఆ కోవకి చెందినవే. ఇవన్నీ డిక్లేర్ చేస్తూ రిటర్నులు వేయండి. డిపార్ట్మెంట్ వారు అడిగినప్పుడు వివరణలు ఇవ్వవచ్చు. మరెన్నో ప్రయోజనాలు.. వీసా అధికారులు, బ్యాంకు అధికారులు, మీకు అప్పు ఇచ్చే వాళ్లు, క్రెడిట్ కార్డు సంస్థలు, కొన్ని క్లబ్బులు, కొన్ని సంస్థలు.. ఇలా ఎందరో ఆదిలోనే అడుగుతున్నారు మీ ఇన్కం ట్యాక్స్ రిటర్నులు. పన్ను భారం లేకపోయినా.. బేసిక్ లిమిట్ దాటకపోయినా వీటి విలువ అపారం. అందరూ వీటిని విశ్వసిస్తున్నారు. వీటి మీద ఆధారపడే మీకు ఎన్నో పనులు జరుగుతాయి. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు.. రిటర్నులు వేయడానికి ఉపక్రమించండి. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్లావణ్య -
ఆన్లైన్లో రిటర్న్ వేస్తున్నారా!
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్లు దాఖలు చేయాల్సిన సమయం వచ్చింది. ఏ వ్యక్తయినా రిటర్న్ వేసే ముందు తనకు సంబంధించిన ఆదాయ వివరాల పట్టికను తయారు చేసుకోవాలి. అంటే తనకు వచ్చిన ఆదాయం, వివరాలు దానికి సంబంధించిన ఎగ్జంప్షన్లు, డిడక్షన్ల వివరాలన్నీ తీసుకుని తనకు వచ్చిన మొత్తం ఆదాయం ఎంత? అందులో ఎంత మొత్తానికి పన్ను వర్తిస్తుంది? ఎంత పన్ను చెల్లించాల్సి ఉంది? అనే విషయాలు పొందుపరచాలి. ఇలా ఒక అవగాహనకు వచ్చాక రిటర్న్ దాఖలు చేయొచ్చు. కొన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో తప్ప రిటర్న్ ఆన్లైన్లో, భౌతికంగా రెండు విధాలుగా వేయొచ్చు. కానీ ఆన్లైన్లో వేయటం శ్రేయస్కరం. ఆన్లైన్లో దాఖలు చేసేదిలా... అసెస్సీ తన ఆదాయ, పన్ను వివరాలను ఒక పట్టికలో పొందుపరిచాక ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈఫైలింగ్.జీవోవీ.ఇన్ అనే వెబ్సైట్ ద్వారా తనకు సంబంధించిన ఐటీఆర్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే వేతనదారులకు ఐటీఆర్-1, వ్యాపారం ద్వారా ఆదాయం ఉన్న వారికి ఐటీఆర్-4 తదితరాలు. ప్రస్తుతం ఐటీఆర్ ఎక్సెల్ , జావా యుటిలిటీ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఆసెసిలు ఈ రెండింటిలో ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేశాక దాన్ని మీ సిస్టంలో సేవ్ చేయాలి. తరవాత ఐటీఆర్ ఫారంలో వివరాలను పొందుపరచాలి. ప్రతి ఐటీఆర్ ఫారంలో మీ పేరు, చిరునామా, పాన్ నంబరు, అడ్రస్, బ్యాంకు ఖాతా వివరాల వంటివి పొందుపరచాలి. తరువాత మీ ఆదాయ వివరాలను రాయాలి. మీకు వర్తించే డిడక్షన్లు ఏమైనా ఉంటే వాటి వివరాలు కూడా తెలియ చేయాలి. మీకు సంబంధించిన టీడీఎస్ , సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్సు వివరాలను కూడా పొందుపరచాలి. మీరు తయారు చేసుకున్న పట్టిక ఆధారంగా పై వివరాలు తెలియజేయాలి. రిప్రజెంటేటివ్ ద్వారా రిటర్న్ దాఖలు చేసేట్లయితే వారి వివరాలు కూడా తెలపాలి. ఆఖర్లో మీకు వర్తించే ట్యాక్సు లేదా రిఫండ్ మొత్తాన్ని సరి చూసుకోవాల్సి ఉంటుంది. కంపెనీలైతే రిటర్న్ సబ్మిట్ చేసేముందు డిజిటల్ సిగ్నేచర్ చేయాలి. మిగిలిన వారు జావా యుటిలిటిలో ఐటీఆర్ నింపి... ఐటీఆర్లోనే సబ్మిట్ చేయొచ్చు. ఆదాయపు పన్ను శాఖ వారు కొత్తగా ఆధార్ నంబరుతో లింక్ చేస్తున్నారు. ఆధార్తో లింక్ అయిన ఆసెిస్సీలు ఓటీపీ ద్వారా తమ రిటర్న్ని ఈ వెరిఫై చేసుకోవచ్చు. లేకపోతే ఐటీఆర్- అనే అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని, దానిపై సంతకం చేసి, దాని కింది భాగంలో పేర్కొన్న ‘సీపీసీ బెంగళూరు’ చిరునామాకి పోస్టు ద్వారా పంపాలి. పైన తెలిపిన రెండు పద్ధతులు కాకుండా నెట్బ్యాంకింగ్ లాగిన్ ద్వారా ఈ వెరిఫై చేయవచ్చు. ఒకవేళ సీపీసీ బెంగళూరుకు పంపితే రిటర్న్ ఫైల్ చేసిన 120 రోజుల లోపు పంపించాలి. - కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
ముంబైకి చేరిన బ్రస్సెల్స్ దాడి బాధితురాలు
ముంబైః బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో జరిగిన టెర్రర్ దాడిలో గాయపడ్డ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగిని నిధి ఛాపేకర్ ముంబై చేరుకున్నారు. గాయాలనుంచి కొంతశాతం కోలుకోవడంతో ఆమె శుక్రవారం ఉదయం ముంబైకి తిరిగి వచ్చారు. చీలమండ విరిగి, 15 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన నిధి.. స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్స చేయించుకున్నారు. ఆమెతోపాటు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది అమిత మోత్వానీ ఇంకా బ్రస్సెల్స్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మార్చి నెలలో బ్రసెల్స్ విమానాశ్రయంలో జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి, అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందిన జెట్ ఎయిర్ వేస్ క్రూ మెంబర్ నిధి ఛాపేకర్ ముంబై చేరుకున్నారు. 42 ఏళ్ళ నిధి ఇంకా కొంతశాతం గాయాలనుంచీ కోలుకోవాల్సిన అవసరం ఉండటంతో పారిస్ నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో ముంబై చేరగానే, ఎయిర్ పోర్టునుంచే ఆమెను ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ఆమె కొంత రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇంకా కొన్ని రోజులు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉండటం మంచిదని డాక్టర్లు తెలిపారు. 1996 ఆగస్టు నుంచి జెట్ ఎయిర్ వేస్ లో పనిచేస్తున్న నిధి ఛాపేకర్... మార్చి 22న బ్రసెల్స్ ఎయిర్ పోర్టునుంచి జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో న్యూయార్క్ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో జరిగిన దాడితో ఆమె శరీరానికి 15 శాతం గాయాలు అవ్వడంతోపాటు, చీలమండ విరిగిపోయింది. అప్పట్నుంచీ బ్రసెల్స్ కు దగ్గరలోని గ్రాండె హాస్పిటల్ డి చెలేరియోలో 25 రోజులపాటు చికిత్స పొందిన ఆమె... గురువారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యి, అక్కడినుంచి పారిస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం పారిస్ నుంచి ముంబైకి చేరారు. నిధి.. ఇప్పటికీ వీల్ ఛైర్ ఆధారంగానే కదలాల్సిన పరిస్థితి ఉండటంతో ఆమె భర్త రూపేష్ ఛాపేకర్, అతని సోదరుడు నీలేష్ ఛాపేకర్ ఎయిర్ పోర్టునుంచి, ఎయిర్ లైన్స్ సిబ్బంది, వైద్యాధికారుల సహాయంతో బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి చేర్చారు. -
అధికాదాయ వర్గాలు.. సంపదను వెల్లడించాలి
♦ రిటర్న్స్లో భూమి, భవనం, ఆభరణాల వివరాలు ఇవ్వాల్సిందే ♦ సీబీడీటీ తాజా ఆదేశాలు... న్యూఢిల్లీ: అధిక ఆదాయ వ్యక్తులు అంటే వార్షిక ఆదాయం రూ.50 లక్షలపైబడినవారు 2016-17 అసెస్మెంట్ ఇయర్కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్లో భూమి, భవనం, ఆభరణాలు, దుస్తులు, గృహోపకరణాల వంటి తమ విలువైన కొనుగోళ్ల వివరాలు అన్నింటినీ తెలియజేయాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొత్త ఐటీఆర్ ఫామ్కు సంబంధించి సూచనలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం విలువైన బహుమతులు ఎవరినుంచైనా పొందినా... ఆ వివరాలు సైతం తెలియజేయాల్సి ఉంటుంది. ఇంతక్రితం దాఖలు చేసిన సంపద పన్ను రిటర్న్స్లో ప్రస్తుతం పేర్కొంటున్న ఆస్తులు లేదా ఆభరణాల వివరాలు తెలియజేయడం జరిగిందా? లేదా అన్న అంశాన్ని కూడా అసెస్సీ స్పష్టం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్లో కొత్త ఐటీఆర్ ఫామ్స్ను నోటిఫై చేసింది. వార్షిక ఆదాయం రూ.50 లక్షలు దాటిన వారికి వర్తించే విధంగా ‘అసెట్ అండ్ లయబిలిటీ యట్ ది యండ్ ఆఫ్ ది ఇయర్’ పేరుతో ఐటీఆర్-1, ఐటీఆర్-2, 2ఏల్లో తాజా రిపోర్టింగ్ కాలమ్స్ను చేర్చింది. భారత్లో రూ.50 లక్షలు పైబడిన వార్షిక ఆదాయం కలిగిన వారు కేవలం 1.5 లక్షల మంది ఉన్నట్లు అంచనా. -
పన్ను చెల్లింపులు 4 శాతమే!
న్యూ ఢిల్లీః పన్ను ఎగవేతదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారన్న విషయం ప్రభుత్వ తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది. దేశ జనాభా వంద కోట్లకు పైగా ఉన్నా... వారిలో ఆదాయ పన్ను చెల్లించేవారి సంఖ్య కేవలం మూడున్నర కోట్లు కూడ మించడం లేదన్న విషయం ఇటీవలి ప్రభుత్వ గణాంకాలు వివరిస్తున్నాయి. పెద్దమొత్తంలో సంపాదించే వారు కూడ ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోవడంతో పన్ను చెల్లింపులు ఏమాత్రం పెరగడం లేనట్లు లెక్కలు చెప్తున్నాయి. నెలసరి ఆదాయం 21 వేల రూపాయలు దాటితే ఆ వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లింపు పరిథిలోకి వస్తాడు. దేశంలో సంవత్సరానికి కోటి రూపాయలు మించి ఆదాయం ఉన్నవారు అధికంగానే ఉన్నా చెల్లింపులు మాత్రం నాలుగు శాతానికి మించడం లేదని ప్రభుత్వ లెక్కలు సూచిస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో టాక్స్ చెల్లింపులు ధాఖలు చేసిన భారతీయులు కేవలం 4 శాతమే ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వార్షిక ఆదాయం పది లక్షలకు మించి ఉన్నవారు అధికంగానే ఉన్నా... పన్ను చెల్లింపుల విషయంలో మాత్రం పది లక్షల మంది కూడ కనిపించడం లేనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం మించి ఉన్నవారిలో... పన్ను చెల్లింపులు దాఖలు చేసినవారు 20,000 కు లోపుగానే ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. కేవలం 3.1 కోట్ల చెల్లింపులు మాత్రమే ఆ సంవత్సరంలో దాఖలయ్యాయి. 2000-01 నుంచి 2014-15 వరకు విశ్లేషణాత్మక గణాంకాలను ఇటీవల ఆదాయ పన్ను శాఖ విడుదల చేసింది. అయితే ఈ గణాంకాల విడుదల ఓ మైలు రాయిగా చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. పన్ను చెల్లింపులపై పారదర్శకతను తెలియజేయడానికి ఇదో మంచి విధానం అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. -
ఉద్యోగులూ!! రిటర్న్లు వేద్దామా?
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతనదారులు తమ సంపాదనపై రిటర్న్లు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి వేతనదారులు ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 ఫారమ్లను వినియోగించాల్సి ఉంటుంది. కేవలం వేతనం మాత్రమే ఆదాయంగా ఉన్నా, దీంతో పాటు ఇంటి మీద అద్దెల రూపంలో ఆదాయం ఉన్నా ఐటీఆర్-1ను వినియోగించాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఇళ్లపై ఆదాయం ఉన్నవారు ఐటీఆర్-2 వినియోగించవచ్చు. ఈ ఐటీఆర్ ఫారంలను ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే రిటర్న్లను ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా వేసుకోవచ్చు. ఈ రిటర్న్లు దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగం చేసి ఉంటే వారు కూడా ఐటీఆర్-1 దాఖలు చేయొచ్చు. వేతనంతో పాటు వడ్డీ ఆదాయం అంటే బ్యాంకు డిపాజిట్లు లేదా సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీ ఆదాయం ఉన్నా వీటిని ఐటీఆర్-1లోనే చూపించొచ్చు. ఇలా నింపండి.. ముందుగా మీ ఆదాయ వివరాలను బట్టి ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2ను డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మొదట మీ వ్యక్తిగత వివరాలైన ఫోన్ నంబర్, ఈ మెయిల్తో సహా అన్నీ నింపండి. మీరు వేస్తున్న రిటర్న్ ఒరిజనలా లేక రివైజ్డా అనేది స్పష్టంగా తెలియజేయాలి. అలాగే మీరు రెసిడెంటా? లేక నాన్ రెసిడెంటా?, ప్రభుత్వ ఉద్యోగా లేక ప్రైవేటు ఉద్యోగా? అనేది తెలియజేయటంతో పాటు ఆధార్ నంబర్ ఇవ్వాలి. వీటితో పాటు మీ ట్యాక్స్ స్టేటస్ కూడా తెలియచేయాలి. వీటి తర్వాత మీ ఆదాయ వివరాలు... అంటే వేతనం మరియు ఇంటి అద్దె వంటి ఇతర ఆదాయ వివరాలను తెలియచేయాలి. ఆ తరువాత చాప్టర్ ఆరు ఏ కింద ఏమైనా డిడక్షన్స్ ఉంటే వాటి వివరాలు తెలియజేయండి. గడువు తేదీలోగా రిటర్నులు దాఖలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ఒక వేళ మీ పన్ను భారం రూ. 10,000కు మించి ఉంటే సెక్షన్ 234ఏ, 234 బీ, 234 సీ వల్ల పడే వడ్డీ కట్టవలసిన అవసరం ఉండదు. మీ మొత్తం ఆదాయం (వేతనం + ఇతర ఆదాయాలు) రూ. 5 లక్షలు మించకుండా ఉంటే సెక్షన్ 87ఏ కింద పన్ను భారంలో రూ. 2,000 రిబేటు పొందవచ్చు. ఒకవేళ మీ ఆదాయం రూ.5 లక్షలు దాటితే మాత్రం తప్పనిసరిగా ఆన్లైన్లోనే ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయిదు లక్షల లోపు ఉంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీ వీలును బట్టి రిటర్న్లు దాఖలు చేసుకోవచ్చు. పన్ను భారంపై 3 శాతం సెస్ చెల్లించాల్సి ఉందన్న విషయం మర్చిపోవద్దు. పన్ను వివరాలు... మీరు పనిచేస్తున్న కంపెనీ ఇచ్చే ఫారం-16 ద్వారా టీడీఎస్ రూపంలో ఎంత పన్ను రికవరీ చేశారో తెలుసుకోవచ్చు. కాబట్టి కంపెనీ నుంచి ఫారం-16 తీసుకోవడం మర్చిపోవద్దు. వేతనం కాకుండా ఇతర ఆదాయాలపై టీడీఎస్ రికవరీ చేస్తే దానికి సంబంధించి ఫారం 16ఏ తప్పనిసరిగా తీసుకోవాలి. అలా కాకుండా మీకు టీడీఎస్ రికవరీ చేయని పక్షంలో సొంతంగా పన్ను భారం చెల్లించాల్సి వస్తే సెల్ఫ్ అసెస్మెంట్ టాక్స్గా చెల్లించాలి. అలా చెల్లించగా వచ్చిన చలానా వివరాలను ఐటీఆర్ ఫారంలో పొందుపర్చాలి. ఫారం-16, ఫారం-16ఏలో ‘ట్యాన్’ మరియు యజమాని వివరాలను సరైన పద్ధతిలో పొందుపర్చాలి. చివరగా.. మీ పన్ను భారం, చెల్లించిన పన్ను వివరాలు అన్నీ సరిగా ఉన్నాయా లేదా సరిచూసుకోండి. అలాగే మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల వివరాలు (ఒకటి అంతకంటే ఎక్కువ) తెలియచేయాలి. వీటితో పాటు ఏదైనా సంస్థకు గాని, ట్రస్ట్కు గాని విరాళం ఇచ్చినచో వాటి వివరాలను 80జీ కాలమ్లో పొందుపర్చాలి. విరాళం ఇచ్చిన వారి పాన్ నంబర్, మరియు చిరునామా తప్పకుండా పొందుపర్చాలి. ఇలా విరాళం ఇచ్చి ఉంటే పన్ను భారం తగ్గుతుంది. గడువు తేదీలోగా రిటర్న్ దాఖలు చేయండి నిశ్చింతగా ఉండండి. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి,కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
నగరం..పల్లె'టూర్'
-
నగరం..పల్లె'టూర్'
సొంతూళ్లకు వెళ్లిన 16 లక్షల మందికి పైగా ప్రజలు * అరకొర రైళ్లు, బస్సులతో జనం ఇక్కట్లు * అదనపు చార్జీలు వసూలు చేసినా సరిపడా బస్సులు నడపని ఆర్టీసీ * కిందటేడాది కంటే తగ్గిన రైళ్లు, బస్సులు * రోడ్డెక్కిన వెయ్యి ప్రైవేటు బస్సులు..అడ్డగోలు చార్జీలతో దోపిడీ సాక్షి, హైదరాబాద్: మహానగరం సంక్రాంతికి తరలివెళ్లింది. నగరవాసులు భారీ సంఖ్యలో సొంతూళ్లకు పయనమయ్యారు. స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వరుసగా సెలవులు రావడంతో బస్సులు, రైళ్లు, సొంత వాహనాల్లో సుమారు 16 లక్షల మందికిపైగా పల్లెలకు తరలివెళ్లారు. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ మధ్య సమన్వయ లోపం కారణంగా రద్దీకి అనుగుణంగా బస్సులను నడపలేకపోయారు. రెండు ఆర్టీసీ సంస్థలు పండుగ సందర్భంగా స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసినా... అరకొర బస్సులే నడపడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రైవేట్ బస్సులు రెట్టింపు చార్జీలు గుంజుతూ ప్రయాణికుల జేబుల్ని గుల్ల చేశాయి. మూడు, నాలుగు రోజులుగా రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడటంతో చాలామంది ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు, టాటా ఏసీలు, సొంత కార్ల వైపు మొగ్గుచూపారు. రైళ్లల్లో రిజర్వేషన్లు లభించకపోవడంతో చాలా మంది ప్యాసింజర్ రైళ్లల్లో బయల్దేరారు. జనరల్ బోగీల్లో నిలుచునేందుకు కూడా చోటు లభించక గంటల తరబడి నరకం చవిచూశారు. పిల్లలు, పెద్దలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలకు ప్రజలు పెద్దఎత్తున తరలి వెళ్లారు. గతేడాది కంటే తగ్గిన రైళ్లు, బస్సులు రోజువారీగా బయల్దేరే 80 ఎక్స్ప్రెస్ రైళ్లు కాకుండా, వివిధ ప్రాంతాల మధ్య సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 27 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. గత సంవత్సరం సుమారు 50 రైళ్లను అదనంగా నడపగా ఈ సారి వాటి సంఖ్యను తగ్గించారు. రద్దీ మార్గాల్లో పలు ప్రధాన రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చే సి చేతులు దులుపుకున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయనగరం,శ్రీకాకుళం, వైజాగ్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వ చ్చింది. హైదరాబాద్ నుంచి వైజాగ్, శ్రీకాకుళం వైపు ప్రత్యేక రైళ్లు నడపడంలో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల మధ్య సమన్వయం కొరవడడంతో అదనపు రైళ్లు అందుబాటులోకి రాలేదు. రెండు ఆర్టీసీ సంస్థల మధ్య సమన్వయ లేమి వల్ల కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. గత సంవత్సరం సుమారు 5 వేల ప్రత్యేక బస్సులను నడిపితే ఈ ఏడాది రెండు ఆర్టీసీ సంస్థలు కలిపి 4 వేల బస్సులను కూడా నడపలేకపోయాయి. దీంతో సుమారు వెయ్యి ప్రైవేట్ బస్సులు రోడ్లెక్కాయి. ఇదీ లెక్క.. ఈ నెల 11, 12, 13 తేదీల్లో ప్రజలు తరలి వెళ్లారిలా.. - మూడ్రోజుల్లో రైళ్లలో రోజుకు 2 లక్షల చొప్పున 6 లక్షల మంది బయల్దేరారు - ఆర్టీసీ బస్సుల్లో సుమారు 4 లక్షల మంది వెళ్లారు - వెయ్యి ప్రైవేట్ బస్సుల్లో రోజుకు 40 వేల మంది చొప్పున మూడ్రోజుల్లో 1.2 లక్షల మంది వెళ్లారు - ఇవి కాకుండా సుమారు లక్ష వరకు కార్లు, ఇతర వాహనాల్లో దాదాపు 5 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లి ఉంటారని అంచనా - మొత్తంగా సుమారు 16 లక్షల మందికి పైగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి వెళ్లినట్లు అంచనా -
ఆదాయం అదిరింది...
గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే రూ. 279 కోట్ల రాబడి ప్రభుత్వం భూముల విలువ పెంచినా జోరు తగ్గని రిజిస్ట్రేషన్లు రాజధాని నేపథ్యంలో భూక్రయ విక్రయాల్లో అదే ఊపు ముందుచూపుతో వాలిపోతున్న రియల్టర్లు, బిల్డర్లు, వ్యాపారసంస్థలు గుంటూరు : జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండుతోంది. అంచనాలు మించి ఆదాయం వచ్చి పడుతోంది. కోట్లలో విధించుకున్న రాబడి లక్ష్యాలను అవలీలగా దాటేందుకు ఉరకలు పెడుతోంది. ఇంతకాలం నిర్దేశించిన లక్ష్యాన్ని సైతం చేరుకోవడానికి ఆపసోపాలు పడ్డ ఈ శాఖ ఇప్పుడు రాజధాని అమరావతి పుణ్యమా అని లెక్కకుమిక్కిలి భూ క్రయవిక్రయాలతో దూసుకు పోతోంది. 2015-2016 ఆర్థిక సంవత్సరానికి ఈ శాఖకు ప్రభుత్వం రూ.675 కోట్ల రాబడి లక్ష్యం విధిస్తే, సెప్టెంబర్తో ముగిసిన ఆరునెలల కాలానికి ఏకంగా రూ.279 కోట్లను ఆర్జించింది. రానున్న ఆరునెలల్లోనూ నూరుశాతం లక్ష్యాన్ని చేరుకునే దిశగా పరుగులు తీస్తోంది. వాస్తవానికి రాజధాని ప్రకటనతర్వాత జిల్లా పరిధిలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం భూముల విలువను నూరు శాతం పెంచినా రిజిస్ట్రేషన్ల జోరు తగ్గకపోవడం విశేషం. పిసరంతైనా భూమి చాలు.. అమరావతి కేంద్రంగా ప్రభుత్వం రాజధానిని ప్రకటించడంతో గుంటూరు జిల్లాలో ప్రస్తుతం భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చి భారీగా ఇప్పుడు ఆస్తులను కొనుగోలు చేస్తున్నాయి. రాజధాని శంకుస్థాపన తరువాత ఆస్తుల విలువ అమాంతం పెరిగే అవకాశాలు ఉంటాయనే భావనతో చాలామంది వ్యాపారులు, బడా వ్యక్తులు ముందుగానే భూములను కొనుగోలు చేస్తున్నారు. సొంతంగా ల్యాండ్బ్యాంకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ధనికులు సైతం రాజధానిలో స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ కారణాలన్నింటితో ఇప్పుడు భూముల క్రయవిక్రయాలు జిల్లాలో బాగా పెరిగాయి. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా 2015-2016 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు ప్రభుత్వం రూ.675 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా విధించగా, సెప్టెంబర్ నాటికి రూ.279 కోట్ల ఆదాయం రావడంతో అధికారులే ఆశ్చర్యపోతున్నారు. గుంటూరు రిజిస్ట్రార్ పరిధికి రూ.371.99కోట్ల వార్షిక ఆదాయ లక్ష్యం విధిస్తే ఆరు నెలల్లోనే రూ.139.69 కోట్ల రాబడి వచ్చింది. నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో రూ.214 కోట్ల లక్ష్యానికి రూ.99.55కోట్లు జమైంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ఆదాయం రూ.67.55 కోట్లు మాత్రమే. తెనాలి రిజిస్ట్రార్ కార్యాలయ పరిధికి రూ.89 కోట్ల లక్ష్యానికి రూ. 38.95 కోట్లు వచ్చింది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ఆదాయం రూ.32.41 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. మున్ముందు ఇంకా... జిల్లాలో భూ క్రయవిక్రయాలు రెట్టింపవుతాయని ముందే ఊహించిన ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి వందశాతం మార్కెట్ విలువను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనివల్ల రిజిస్ట్రేషన్ల ఫీజు భారీగా పెరిగి క్రయవిక్రయాలు కొంతవరకు తగ్గుతాయని అధికారులు అంచనావేశారు. కాని రాజధాని ప్రాంతం కావడంతో ఇవేం లెక్కచేయకుండా క్రయవిక్రయదారులు ఊపులో ఉండడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పరుగులు తీస్తోంది. ఫలితంగా జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకు వద్దన్నా ఆదాయం వచ్చి పడుతోంది. ముఖ్యంగా సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాలకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసింది. ఈ 29 గ్రామాల్లో ఎటువంటి క్రయవిక్రయాలు జరిగినా, వెబ్సైట్ వివరాలను ఆధారంగా చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖను కొద్దిరోజుల కిందట ఆదేశించింది. ఈనేపథ్యంలో మున్ముందు రిజిస్ట్రేషన్లు మరింత ఊపందుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. -
హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్
హైదరాబాద్: చైనా పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బృందం బుధవారం హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఏయిర్ పోర్టులో కేసీఆర్కు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు. పెట్టుబడులే లక్షంగా పది రోజుల పాటు చైనాలో పర్యటించారు. ప్రపంచ ఆర్దిక సదస్సు వేదికగా తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు. ఈ పర్యటనతో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమన్న సంకేతాలిచ్చారు. -
గణనీయంగా పెరిగిన ఈ-ఫైలింగ్ రిటర్న్లు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖకు ఈ-ఫైలింగ్ పోర్టల్పై సెప్టెంబర్ 7 నాటికి 2.06 కోట్ల రిటర్న్స్ అందాయి. వ్యక్తుల ఈ-రిటర్న్స్ ఫైలింగ్కు ఈ నెల 7వ తేదీ తుది గడువు. కాగా గత ఏడాది ఈ-ఫైలింగ్ రిటర్న్స్ సంఖ్య 1.63 కోట్లు. పెరుగుదల రేటు 26.12%. ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో ఈ అంశాలను తెలిపింది. 2015-16 అసెస్మెంట్ ఇయర్కు సంబంధించి సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) సెప్టెంబర్ 7వ తేదీ నాటికి 45.18 లక్షల రిటర్న్స్ ప్రాసెస్ చేసి, 22.14 లక్షల మందికి రిఫండ్స్ జారీ చేసింది. ఐటీ శాఖ తన పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ విధానంలో దాదాపు 32.95 లక్షల ఈ-రిటర్న్స్ను పరిశీలించింది. -
నువ్వు నటించడానికే పుట్టావు!
ముంబై: హహ్హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన జెనీలియా దేశ్ముఖ్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తోంది. మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ''చాలా సంతోషంగా ఉంది. త్వరలో షూటింగ్ మొదలు.. మూడేళ్ల తర్వాత మళ్లీ నటిస్తున్నా'' అని జెనీలియా ట్వీట్ చేసింది. జెనీలియా భర్త, నటుడు రితేష్ దేశ్ముఖ్ దాన్ని రీట్వీట్ చేశాడు. ఇది చాలా మంచి రోజు... నువ్వు నటించడానికే పుట్టావు అంటూ సతీమణికి రిప్లై కూడా ఇచ్చాడు. కాగా తెలుగులో సై, శశిరేఖా పరిణయం, బొమ్మరిల్లు, బాలీవుడ్లో జానే తూ జానే న, తేరే నాల్ లవ్ హో గయా లాంటి సినిమాలలో హీరోయిన్గా మెప్పించిన జెనీలియా బాలీవుడ్కు చెందిన రితేష్ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు గత ఏడాది నవంబర్లో ఒక కొడుకు కూడా పుట్టాడు. దీంతో మూడేళ్ల పాటు నటనకు దూరంగా ఉన్న ఈ బొమ్మరిల్లు భామ, తన సెకండ్ ఇన్సింగ్స్ గ్రాండ్గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. On my way to shoot..excited as hell.. Been 3yrs since I last shot but I have a feeling it's going to be a Good Good Day.. — Genelia Deshmukh (@geneliad) August 12, 2015 It's going to be a Greattttt Dayyy - you were born for this. https://t.co/VjWqA8fa9t — Riteish Deshmukh (@Riteishd) August 12, 2015 -
ఆఫ్రికాలో రాబడి ఎక్కువే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపార వాణిజ్య అవకాశాలున్న ఆఫ్రికాలో పెట్టుబడులపై రాబడులు అధికంగా ఉంటాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) అంటోంది. రాబడులతోపాటు ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో రిస్క్ కూడా ఉందని ఎఫ్ఐఈవో దక్షిణ ప్రాంత చైర్మన్ వాల్టర్ డిసౌజా అన్నారు. కెన్యాలో వ్యాపార అవకాశాలపై శుక్రవారమిక్కడ జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మా, ఆటోమొబైల్, విడిభాగాలు, మౌలిక రంగం, టెలికం, ఐటీ, ఆరోగ్య రంగాల్లో అవకాశాలు పుష్కలమని తెలిపారు. కెన్యా, ఇథియోపియా, టాంజానియా, ఐవరీకోస్ట్, ఘనా, బెనిన్, జాంబియా దేశాలు వ్యాపారానికి అనుకూలమని చెప్పారు. నైరోబీలో మార్చి 27-29 తేదీల్లో ఇండియా ఎక్స్పో జరుగుతోందని వివరించారు. భారత్ నుంచి సుమారు 100 కంపెనీలు ఎక్స్పోలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ఆఫ్రికా-భారత్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2013-14లో 75 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆఫ్రికాలో రూ.180 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలున్నాయని కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా అన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
పన్ను చెల్లింపుదారులకు మరింత మర్యాద
న్యూఢిల్లీ: పన్ను చెలింపుదారులతో మరింత అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా ఐటీ శాఖ అధికారులు పన్ను చెల్లింపుదారులు/అసెస్సీలతో భేటీ సందర్భంగా వారిని అనవసరంగా వేచిచూసేలా చేయొద్దని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అసెస్సీలందరికీ ఒకేసారి సమయం ఇవ్వడం, వారిని గంటలతరబడి వెయిటింగ్ చేయిండం వంటివి లేకుండా చేయడమే ఈ చర్యల ఉద్దేశమని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చెలింపుదారుల ఫిర్యాదుల వినడం లేదంటే రిటర్నుల పరిశీలన ఏదైనా సరే ముందుగానే సమయాన్ని నిర్ధేశించాలని.. అదేవిధంగా భేటీల మధ్య తగిన వ్యవధి ఉండేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో సుమారు 3.7 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. అయితే, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఇందులో 1% పన్ను రిటర్నులను(అంటే సుమారు 3-3.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులవి) మాత్రమే తనిఖీ చేస్తున్నట్లు అంచనా. ప్రత్యక్ష పన్నుల రూపేణా ఈ ఏడాది ప్రభుత్వం రూ.7.36 లక్షల కోట్లను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఈ వసూళ్లు రూ.6.36 లక్షల కోట్లు. -
రుణ మాఫీ చేసితీరుతాం: అయ్యన్న
మండలానికి 5 పంచాయతీల్లో మినరల్ వాటర్ పథకం ఉత్తరాంధ్రలో మూడు పంచాయతీలకొక డంపింగ్యార్డు ‘ఉపాధి హామీ’ పథకం వ్యవసాయంతో అనుసంధానిస్తాం కోటవురట్ల : తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి తీరుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. జల్లూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆదివారం హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణ మాఫీ కోసం విధివిధానాలను రూపొందిస్తున్నామని, మాఫీ జరగదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మినరల్ వాటర్ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మొదటగా రాష్ట్రంలో 5 వేల పంచాయతీల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. మండలానికి ఐదు పంచాయతీల చొప్పున అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఇందుకు ప్రధాని మోడీ సెంట్రల్ పవర్స్టేషన్ నుంచి విద్యుత్ అందించడానికి అంగీకరించారని చెప్పారు. పారిశుధ్యం కోసం రాష్ట్రానికి రూ. 1,800 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని, దీంతో ఉత్తరాంధ్రలో ప్రతీ మూడు పంచాయతీలకు కలిపి ఐదెకరాల విస్తీర్ణంలో ఒక డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తామని వివరించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తయారు చేయడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయనున్నట్టు చెప్పా రు. దీని ద్వారా ఏటా రైతులకు రూ. 6 వేలు ల బ్ధి చేకూరుతుందన్నారు. సామాజిక తనిఖీల్లో అవినీతి అక్రమాలు రుజువైన వీఆర్పీలను తొలగించి, కొత్తవారిని తీసుకుం టామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, నాయకులు లాలం కాశీనాయుడు, పినపాత్రు ని బాబ్జీ, లాలం కొండబాబు, జనార్ధన్ పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ... పాయకరావుపేట : గ్రామ పంచాయతీల్లో పరిపాలన పూర్తిస్థాయిలో జరిగేందుకు వీలుగా కార్యదర్శి పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2వేల కోట్లు స్థానిక సంస్థలకు విడుదలవుతున్నాయని చెప్పారు. నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆయన తుని రైల్వే స్టేషన్లో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు రూ. 200 కోట్లతో నీటివనరులను మెరుగుపర్చుతామని చెప్పారు.