UP bridegroom returns Rs 11 lakh cash dowry to parents-in-law goes Viral - Sakshi
Sakshi News home page

Viral News: కట్నంగా రూపాయి చాలు.. 11 లక్షలు, బంగారు ఆభరణాలు వెనక్కి

Dec 4 2022 6:11 AM | Updated on Dec 4 2022 11:41 AM

UP bridegroom returns Rs 11 lakh cash dowry to parents-in-law  - Sakshi

ముజఫర్‌నగర్‌: కట్నంగా ముట్టజెప్పిన రూ.11 లక్షలు, బంగారు ఆభరణాలను వద్దంటూ వెనక్కిచ్చి ఆదర్శంగా నిలిచాడో యువకుడు. కేవలం రూ.1 కట్నం తీసుకుని శెభాష్‌ అనిపించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో రెవెన్యూ అధికారిగా పనిచేసే సౌరభ్‌ చౌహాన్‌కు లఖాన్‌ గ్రామం ఓ మాజీ జవాను కూతురుతో శుక్రవారం పెళ్లయింది.

వరకట్నం కింద వధువు తల్లిదండ్రులు రూ.11 లక్షల కట్నం, ఆభరణాలు ఇవ్వగా కట్నం అక్కర్లేదంటూ తిరిగిచ్చేశాడు. ‘‘మీ దీవెనగా జ్ఞాపకం పెట్టుకుంటా’నంటూ వారినుంచి కేవలం ఒక్క రూపాయి తీసుకున్నాడు. దాంతో ఆహూ తులు సౌరభ్‌పై అక్షింతలతోపాటు ప్రశంస జల్లులు కూడా కురిపించారు. సమాజంలో మంచి మార్పు కోసం ముందడుగు వేశాడంటూ మెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement