ఊహించినట్టుగానే జీఎస్‌టీ తగ్గింపు

GST on EVs slashed to  5 Percent  from 12 Percent  - Sakshi

 విద్యుత్‌ వాహనాలకు  ప్రోత్సాహం  

ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు

సంబంధిత చార్జర్లపైనా జీఎస్టీ తగ్గింపు

సాక్షి, న్యూఢిల్లీ : ఊహించినట్టుగానే  జీఎస్‌టీ కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఆధ్వర్యంలో భేటీ అయిన 36 వ జీఎస్టీ కౌన్సిల్  విద్యుత్తు వాహనాలు, ఈ వాహనాల చార్జీలపై  జీఎస్టీ తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది.  ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నర్ణయించింది.  ఈవీ చార్జర్లపై  జీఎస్‌టీనీ 18 నుంచి తగ్గించి  5 శాతంగా ఉంచింది.  

అలాగే స్థానిక అధికారులకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై జీఎస్‌టీ నుంచి మినహాయింపునివ్వడానికి  కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త పన్ను రేట్లు ఆగస్టు 1 వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే రానున్న  సమావేశాలోల​ బీఎస్‌- 6వాహనాలపై  చర్చించనుంది. అయితే ఇ-వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపు నిర్ణయాన్ని  ఢిల్లీ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రతినిధులు పూర్తిగా సమర్ధించలేదు.  బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలి జీఎస్టీ మండలి భేటీ ఇదే కావడం విశేషం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top