ఊహించినట్టుగానే జీఎస్‌టీ తగ్గింపు | GST on EVs slashed to  5 Percent  from 12 Percent  | Sakshi
Sakshi News home page

ఊహించినట్టుగానే జీఎస్‌టీ తగ్గింపు

Jul 27 2019 1:00 PM | Updated on Jul 27 2019 1:06 PM

GST on EVs slashed to  5 Percent  from 12 Percent  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఊహించినట్టుగానే  జీఎస్‌టీ కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఆధ్వర్యంలో భేటీ అయిన 36 వ జీఎస్టీ కౌన్సిల్  విద్యుత్తు వాహనాలు, ఈ వాహనాల చార్జీలపై  జీఎస్టీ తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది.  ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నర్ణయించింది.  ఈవీ చార్జర్లపై  జీఎస్‌టీనీ 18 నుంచి తగ్గించి  5 శాతంగా ఉంచింది.  

అలాగే స్థానిక అధికారులకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై జీఎస్‌టీ నుంచి మినహాయింపునివ్వడానికి  కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త పన్ను రేట్లు ఆగస్టు 1 వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే రానున్న  సమావేశాలోల​ బీఎస్‌- 6వాహనాలపై  చర్చించనుంది. అయితే ఇ-వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపు నిర్ణయాన్ని  ఢిల్లీ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రతినిధులు పూర్తిగా సమర్ధించలేదు.  బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలి జీఎస్టీ మండలి భేటీ ఇదే కావడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement