నాల్కో వాటా విక్రయం | Govt to divest up to 10% stake in Nalco via OFS tomorrow, issue price set at Rs 67 | Sakshi
Sakshi News home page

నాల్కో వాటా విక్రయం

Apr 19 2017 1:41 AM | Updated on Sep 5 2017 9:05 AM

నాల్కో వాటా విక్రయం

నాల్కో వాటా విక్రయం

డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ అల్యూమినియం కంపెనీ(నాల్కో)లో 10 శాతం వరకూ వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించనుంది.

ఇష్యూ ధర రూ.67
నేడు నాన్‌ రిటైలర్లకు.. రేపు రిటైల్‌ ఇన్వెస్టర్లకు


ముంబై: డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ అల్యూమినియం కంపెనీ(నాల్కో)లో 10 శాతం వరకూ వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించనుంది.  నేడు నాన్‌–రిటైల్‌ ఇన్వెస్టర్లకు, రేపు(ఈ నెల 20న) రిటైల్‌ ఇన్వెస్టర్లకు వాటా విక్రయిస్తామని పేర్కొంది.  ఈ వాటా విక్రయానికి ఇష్యూధరగా రూ.67గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది(బీఎస్‌ఈలో మంగళవారం ఈ షేర్‌ రూ.73 వద్ద ముగిసింది). ఈ ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.1,350  కోట్లు వస్తాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేపడుతున్న తొలి ప్రభుత్వ వాటా విక్రయం ఇది.  నాల్కోలో ప్రభుత్వానికి 74.58 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం వార్త మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడింది.

Advertisement
 
Advertisement
Advertisement