♦ రూ.58,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు
♦ జాబితాలో ఎస్బీఐ, బీవోబీ, ఐడీబీఐ బ్యాంకులు
♦ బాసెల్–3 అవసరాల నేపథ్యంలో తప్పనిసరి
న్యూఢిల్లీ: బాసెల్–3 నిబంధనలకు అనుగుణంగా మూలధన అవసరాలను చేరుకునేందుకు, తమ ఖాతాల ప్రక్షాళనకు వీలుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీలు)... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాజా ఈక్విటీ జారీ ద్వారా భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేయనున్నాయి. ఎస్బీఐ, బీవోబీ, ఐడీబీఐ బ్యాంకు సహా పలు బ్యాంకులు ఈ దిశగా సన్నాహాలను ప్రారంభించాయి. ముఖ్యంగా ఎస్బీఐ ఒక్కటే రూ.15,000 కోట్ల సమీకరణ యత్నాల్లో ఉంది. అర్హత సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ (క్యూఐపీ) ద్వారా నిధులను సేకరించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది చివరికి పూర్తికావచ్చు. ఇక, బీవోబీ రూ.6,000 కోట్లు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.16,500 కోట్లను సమీకరించనున్నాయి. ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, ఐడీబీఐ బ్యాంకులు ఒక్కోటీ రూ.5,000 కోట్ల సమీకరణకు గాను ఇప్పటికే బ్యాంకు బోర్డుల ఆమోదాన్ని తీసుకున్నాయి.
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.4,950 కోట్లను సమీకరించనుంది. అలాగే, కార్పొరేషన్ బ్యాంకు, సిండికేట్బ్యాంకు రూ.3,500 కోట్ల చొప్పున, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర రూ.2,000 కోట్ల సమీకరణ ప్రణాళికలతో ఉన్నాయి. కేంద్రం రూపొందించిన ఇంద్రధనుష్ క్యాక్రమంలో భాగంగా పీఎస్బీలు మార్కెట్ల నుంచి రూ.1.10 లక్షల కోట్లను సమీకరించాల్సి ఉంది. 2019 మార్చి నుంచి అమల్లోకి రానున్న బాసెల్–3 ప్రమాణాలను అందుకునేందు గాను నిధుల సమీకరణ అవసరం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం సైతం రూ.70,000 కోట్లను తనవంతు సాయంగా అందించనుంది.
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.50,000 కోట్లను సమకూర్చగా, 2018–19 నాటికి మిగిలిన నిధులను అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10,000కోట్లను ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించడం తెలిసిందే. మరోవైపు, పీఎస్బీల ఎన్పీఏలు రూ.6లక్షల కోట్లకు చేరినందున ఖాతాల ప్రక్షాళన అవసరం కూడా ఏర్పడింది.
నిధుల వేటలో ప్రభుత్వ రంగ బ్యాంకులు
Published Mon, Jun 5 2017 1:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement