మళ్లీ పసిడి మెరుపులు... | Gold prices flirt with $1290 as Brexit fears boost haven demand | Sakshi
Sakshi News home page

మళ్లీ పసిడి మెరుపులు...

Jun 14 2016 1:02 AM | Updated on Aug 2 2018 3:54 PM

మళ్లీ పసిడి మెరుపులు... - Sakshi

మళ్లీ పసిడి మెరుపులు...

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై అంచనాలు, అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపులో ఆలస్యం వంటి అంతర్జాతీయ ఆర్థిక

- నాలుగువారాల గరిష్టం
- అంతర్జాతీయ అంశాలు కారణం

న్యూయార్క్/న్యూఢిల్లీ: యూరోపియన్ యూని యన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై అంచనాలు, అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపులో ఆలస్యం వంటి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి అంశాలు పసిడికి బలంగా మారుతున్నాయి. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ధర వరుసగా నాల్గవ ట్రేడింగ్ సెషన్‌లోనూ పెరిగింది. క్రితం ముగింపుతో పోల్చితే కడపటి సమాచారం అందేసరికి చురుగ్గా ట్రేడవుతున్న ఆగస్టు డెలివరీ కాంట్రాక్ట్ ధర  ఔన్స్(31.1గ్రా)కు 10 డాలర్ల లాభంతో 1,286 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే 16 తరువాత ఈ స్థాయికి పసిడి ధర చేయడం ఇదే తొలిసారి.

 తిరిగి రూ. 30,000 పైకి
ఇక దేశీయంగానూ పసిడి పరుగులు తీసింది. కొనుగోళ్ల మద్దతుతో ముంబై ప్రధాన బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర ఒకేరోజు రూ.480 ఎగసింది. రూ.30,070కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే మొత్తం ఎగసి రూ.29,920కి ఎగసింది. వెండి ధర కేజీకి రూ.470 పెరిగి రూ.41,520 వద్దకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement