పరుగులు పెడుతున్న పసిడి ధర | Gold price hits record high of Rs 32526; zooms by Rs 600 | Sakshi
Sakshi News home page

పరుగులు పెడుతున్న పసిడి ధర

Aug 27 2013 1:07 PM | Updated on Aug 2 2018 3:54 PM

పరుగులు పెడుతున్న పసిడి ధర - Sakshi

పరుగులు పెడుతున్న పసిడి ధర

రూపాయి దెబ్బకు బంగారం ధర పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెద్దగా పెరగకున్నా.. మన మార్కెట్లో మాత్రం ధర వేగంగా పెరుగుతోంది.

ముంబయి : రూపాయి దెబ్బకు బంగారం ధర పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెద్దగా పెరగకున్నా.. మన మార్కెట్లో మాత్రం ధర వేగంగా పెరుగుతోంది. గడిచిన నెల రోజులుగా 7 వేల రూపాయల దాకా పెరిగిన 10 గ్రాముల ధర మంగళవారం మరో 600 రూపాయల దాకా పెరిగింది.

ఎంసీక్స్లో ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర 32,500 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. కేజీ వెండి ధర 1150 రూపాయల దాకా లాభపడుతూ 55 వేల రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే బంగారం 35 వేలకు, వెండి 60 వేల రూపాయలకు త్వరలోనే చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement