రూ.646 కోట్ల ఫేస్బుక్ షేర్ల విక్రయం | Facebook may start flagging fake news posts, says Mark Zuckerberg | Sakshi
Sakshi News home page

రూ.646 కోట్ల ఫేస్బుక్ షేర్ల విక్రయం

Nov 23 2016 1:04 AM | Updated on Jul 26 2018 12:41 PM

రూ.646 కోట్ల ఫేస్బుక్ షేర్ల విక్రయం - Sakshi

రూ.646 కోట్ల ఫేస్బుక్ షేర్ల విక్రయం

ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ 9.5 కోట్ల డాలర్ల (రూ.646 కోట్లు)విలువైన ఫేస్‌బుక్ షేర్లను విక్రరుుంచారు.

దాతృత్వ కార్యక్రమాల కోసం...
న్యూయార్క్: ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ 9.5 కోట్ల డాలర్ల (రూ.646 కోట్లు)విలువైన ఫేస్‌బుక్ షేర్లను విక్రరుుంచారు. కంపెనీ వాటాలో 99 శాతం షేర్లను దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించాలన్న నిర్ణయంలో భాగంగా ఈ వాటా షేర్ల విక్రయం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 19 కోట్ల డాలర్లు, అక్టోబర్‌లో కూడా ఇదే స్థారుులో ఫేస్‌బుక్ షేర్లను దాతృత్వ కార్యక్రమాల కోసం విక్రరుుంచారు. జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్‌లు దాతృత్వ కార్యకలాపాల కోసం గత ఏడాది రెండు సంస్థలను- ది చాన్ జుకర్‌బర్గ్ ఫౌండేషన్,  సీజడ్‌ఐ హోల్డింగ్‌‌స ఎల్‌ఎల్‌సీలను ఏర్పాటు చేశారు. కంపెనీ వాటాలో 99 శాతం వాటాను దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వనున్నామని గత ఏడాది డిసెంబర్‌లో జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement