
రూ.259లకే 10 జీబీ డేటా
దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తాజాగా రూ.259లకే 10 జీబీ డేటా ఆఫర్ను ప్రకటించింది.
ఎయిర్టెల్ నయా ఆఫర్
న్యూఢిల్లీ: దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తాజాగా రూ.259లకే 10 జీబీ డేటా ఆఫర్ను ప్రకటించింది. ఇది కొత్త 4జీ మొబైల్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. రూ.259లో రీచార్జ్ చేసుకున్న తర్వాత యూజర్ అకౌంట్కు వెంటనే 1 జీబీ డేటా వస్తుంది. వినియోగదారుడు మిగిలిన 9 జీబీ డేటాను మైఎయిర్టెల్ యాప్ ద్వారా వినియోగించుకోవాలి. డేటా వాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఒక కస్టమర్ 90 రోజుల్లో గరిష్టంగా మూడుసార్లు మాత్రమే ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది.