బ్యాంకింగ్‌లో 15% వేతన పెంపు షురూ! | Banking In the Pay 15% hike! | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌లో 15% వేతన పెంపు షురూ!

May 26 2015 1:13 AM | Updated on Sep 3 2017 2:40 AM

ప్రభుత్వ రంగ బ్యాంకులుసహా 43 బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు 15 శాతం పెరగనున్నాయి.

ఐబీఏ-ఉద్యోగ సంఘాల సంతకాలు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులుసహా 43 బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు 15 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు ఒక వేతన ఒప్పందంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సంతకం చేసింది. ఐబీఏ, ఉద్యోగ సంఘాల, ఆఫీసర్స్ అసోసియేషన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రకారం, 2012 నవంబర్ 1వ తేదీ నుంచీ వర్తించే విధంగా ఈ తాజా వేతన సవరణ అమలవుతుంది. ఈ 15 శాతం వేతన పెంపు.. ఇంక్రిమెంటల్ వేతనం, అలవెన్సుల రూపంలో బ్యాంకులపై   ఏడాదికి రూ.4,725 కోట్ల అదనపు భారాన్ని మోపుతుంది.

పదవీ విరమణ వ్యయ భారాలను సైతం కలుపుకుంటే ఈ భారం రూ.8,370 కోట్లని ఐబీఏ చైర్మన్ టీఎం భాసిన్ సోమవారం నాడు ఇక్కడ విలేకరులకు తెలిపారు. సాధారణ ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించడం జరుగుతుందని అన్నారు. అధికారుల విషయంలో ఈ శ్రేణి 4 నుంచి 6 నెలల కాలమని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు త్వరలో రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలుగా ఉంటాయి. సెలవు దినాలకు సంబంధించి ఆర్‌బీఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందనీ, ప్రభుత్వ తుది ఆమోదం కోసం ఇప్పటికే లేఖ రాశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement