ముంబై-న్యూయార్క్‌ విమానాలు నిలిపివేత | Air India stops flights from Mumbai to New York | Sakshi
Sakshi News home page

ముంబై-న్యూయార్క్‌ విమానాలు నిలిపివేత

May 20 2019 11:02 AM | Updated on May 20 2019 11:16 AM

Air India stops flights from Mumbai to New York - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ  విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నుంచి న్యూయార్క్‌  విమాన సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మార్గంలో తగినంత డిమాండ్‌ లేకపోవడంతో ఎయిరిండియా నష్టాల పాలైంది.  దీంతో  ఈ మార‍్గంలో తన విమాన సేవలను నిలిపిస్తోంది.

డిసెంబర్ 2018 లో న్యూయార్క్‌లోని  జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం నుంచి ముంబై-న్యూయార్క్‌ డైరెక్ట్‌ విమాన సేవలను ప్రారంభించిన సంస్థ డిమాండ్‌ తక్కువగా ఉండటంతో ఇకపై ఈ సర్వీసులను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది.  

ముంబై-న్యూయార్క్ మధ్య వారానికి మూడుసార్లు విమాన సర్వీసులను నడిపిస్తున్న ఎయిరిండియా పాకిస్తాన్ ఎయిర్‌ స్పేస్‌ మూసివేత కారణంగా ఫిబ్రవరిలో తాత్కాలికంగా సర్వీసులను నిలిపివేసింది. అయితే జూన్‌లో పునఃప్రారంభించాలని భావించినా.. ఇకపై ఈ సర్వీసులను కొనసాగించలేమని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే వింటర్‌కు సంబంధించి అ‍క్టోబర్‌ మూడవవారం నుంచి మార్చి రెండో వారం వరకు అందించే ఎయిరిండియా విమాన సేవలు ఇందులో భాగం కాదని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement