
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం ఫ్లాట్గా మారాయి. సెన్సెక్స్, నిఫ్టీ తిరిగి పుంజుకుంటూ లాభనష్టాల మధ్య ఊగిస లాడుతున్నాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మ , బ్యాకింగ్ సెక్టార్లు లాభపడుతున్నాయి. ఎయిర్టెల్, భారతి ఇన్ఫ్రాటెల్, ఎస్ బ్యాంకు, వేదాంతా టాప్ లూజర్స్గా నమోదవుతున్నాయి. ఎస్బీఐ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, పీఎన్బీ, జీ ఎంటర్టైన్మెంట్, ఎం అండ్ ఎండ్ , హీరో మోటా లాభపడుతున్నాయి.
మరోవైపు రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానంపై మూడు రోజులు సమీక్ష సమావేశం నేటినుంచి ప్రారంభం కానుంది.