సాక్షి, ఒంగోలు: చాలా కాలం తర్వాత మున్సిపల్, నగర పంచాయతీలకు పూర్తి పాలకవర్గాలు ఏర్పాటవుతున్నాయి. వార్డు సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఇప్పటికే పూర్తవగా, ఆయా మున్సిపాలిటీల చైర్మన్లను గురువారం వార్డుసభ్యులు ఎన్నుకోనున్నారు. చైర్మన్ల ఎన్నిక అనంతరం ఆయన ప్రతిపాదించిన నేత వైస్చైర్మన్గా నియామకం కానున్నారు.
జిల్లాలో మొత్తం 6 చోట్ల మున్సిపల్ ఎన్నికలు మార్చినెలలో జరిగాయి. ఇందులో చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు కాగా, అద్దంకి, గిద్దలూరు, చీమకుర్తి, కనిగిరి నగర పంచాయతీలు. అన్నిచోట్ల కలిపి మొత్తం 145 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ 69 చోట్ల, వైఎస్సార్ కాంగ్రెస్ 57 స్థానాల్లో గెలుపొందింది. బీఎస్పీ 9, సీపీఐ, సీపీఎం చెరో ఒకటి వార్డుపదవిని కైవసం చేసుకోగా... స్వతంత్రులు 8 చోట్ల విజయం సాధించారు. గిద్దలూరులో బీఎస్పీ, చీరాలలో అత్యధికంగా స్వతంత్రులు, మార్కాపురం మున్సిపాలిటీలో సీపీఎం, సీపీఐ సభ్యులున్నారు.
- ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు.. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులుగా ఉన్న వారే ప్రిసైడింగ్ అధికారులుగా చైర్మన్ ఎన్నికలను నిర్వహిస్తారు.
- ఉదయం తొలుత చైర్మన్ అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించిన అనంతరం... కౌన్సిల్ను సమావేశపరిచి వార్డుసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత చైర్మన్ నామినేషన్లను పరిశీలించి, బహిరంగ ఓటింగ్ పెడతారు. వార్డుసభ్యులు చేతులెత్తి తమ మద్దతును తెలియపరచనున్నారు.
- మెజార్టీ మద్దతు లభించిన వారిని చైర్మన్గా ప్రకటిస్తారు. అయితే, చైర్మన్ ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్అఫిషియో సభ్యుల హోదాలో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మెజార్టీకి వార్డుసభ్యుల మద్దతుతో పాటు ఎక్స్అఫిషియో సభ్యుల ఓటింగ్ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక తతంగం పూర్తయ్యే నాటికి మధ్యాహ్నం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోపు కోఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకొనే అవకాశం ఉంది.
మున్సిపాలిటీల వారీగా బలాబలాలివి..
- చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులున్నాయి. చైర్మన్ పదవి ఓసీ జనరల్కు కేటాయించారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ 15 వార్డుల్లో, టీడీపీ 12 చోట్ల గెలుపొందింది. ఆరుగురు స్వతంత్రులు కాగా.. వీరంతా స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గంగా ఉన్నారు. టీడీపీ ఎంపీ పులివర్తి మాల్యాద్రి ఇక్కడ ఓటేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేతో పాటు స్వతంత్రులు వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపే అవకాశమున్నందున... చైర్మన్ పదవి టీడీపీకి దక్కదనే సంకేతాలున్నాయి.
- మార్కాపురం మున్సిపాలిటీలో 32 వార్డులున్నాయి. చైర్మన్ రిజర్వేషన్ ఓసీ మహిళ కాగా, వైస్సార్సీపీ 10, టీడీపీ 19 స్థానాల్లో గెలిచింది. సీపీఐ ఒకటి, సీపీఎం ఒకటి గెలుచుకోగా.. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ బలం 22 కనిపిస్తోండగా.. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ వైఎస్సార్సీపీకి చెందిన వారైనందున ఆ పార్టీకి రెండు ఓట్లు పడనున్నాయి. అయితే, ఇక్కడ టీడీపీ వైస్చైర్మన్గా ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారిని నియమిస్తామని గతంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కందుల నారాయణరెడ్డి ప్రకటించారు. తాజాగా, ఆయన మాట మార్చడంతో టీడీపీలో వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. ఈనేపథ్యంలో కొందరు టీడీపీ సభ్యులు వైఎస్సార్సీపీకి బలానివ్వచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- చీమకుర్తిలో 20 వార్డులుండగా, చైర్మన్ పదవి బీసీ జనరల్కు కేటాయించారు. వైఎస్సార్సీపీ 8చోట్ల, టీడీపీ 12 చోట్ల గెలుపొందింది. అయితే, టీడీపీ అభ్యర్థి ఒకరు బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ కాగా.. ఎంపీ టీడీపీ వైపు ఉన్నారు. ఇక్కడ చైర్మన్ ఎంపిక ఉత్కంఠగా జరగవచ్చని అధికారులు చెబుతున్నారు.
- కనిగిరిలో 20 వార్డులుండగా, చైర్మన్ పదవి బీసీ జనరల్ అయ్యింది. వైఎస్సార్సీపీ 8 స్థానాల్లో, టీడీపీ 11 చోట్ల గెలుపొందింది. ఒకరు స్వతంత్ర అభ్యర్థి. ఎమ్మెల్యే టీడీపీ కాగా.. ఎంపీ వైఎస్సార్సీపీ వైపు ఉన్నారు.
- అద్దంకిలో 20 వార్డులుండగా, ఎస్సీ మహిళకు చైర్మన్ పదవి రిజర్వుఅయ్యింది. ఇక్కడ 15 స్థానాల్లో టీడీపీ ఆధిక్యత చూపగా, వైఎస్సార్సీపీ మాత్రం 5 స్థానాల్లోనే గెలిచింది. ఇక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండగా.. ఎంపీ టీడీపీ తరఫున ఉన్నారు.
- గిద్దలూరులో 20 వార్డులుండగా, 11 స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందగా,.. టీడీపీ ఒక్క వార్డునూ కైవసం చేసుకోలేకపోయింది. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వర్గంగా బీఎస్పీ తరఫున 9 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా వైఎస్సార్సీపీనే కావడంతో చైర్మన్ పదవి వైఎస్సార్సీపీకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
‘పుర’చైర్మన్ ఎన్నికలు నేడు
Published Thu, Jul 3 2014 2:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement