సుజనా, సీఎం రమేశ్‌లతో చంద్రబాబు లాబీయింగ్

YSRCP MP Vijayasai Reddy Tweets On Chandrababu - Sakshi

ట్విటర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: కొంచెం ఆలస్యమైనా కుట్రలు, దోపిడీలు చేసిన వారి పాపం పండుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ  విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. చిదంబరం 20 సార్లు ముందస్తు బెయిలుతో అరెస్టు తప్పించుకున్నా చివరకు కటకటాల పాలుకాక తప్పలేదని పేర్కొన్నారు. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు పరిస్థితి కూడా అంతే. వ్యవస్థలను మ్యానేజి చేయడం మునుపటంత సులువు కాదిప్పుడు అంటూ ట్వీట్‌ చేశారు.

గతంలో సోము వీర్రాజును రాష్ట్ర  బీజేపీ అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు కన్నాను కదిలించి తన విధేయుడిని అధ్యక్షుడిగా నియమించేందుకు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో పరిణామాల్ని వీళ్లిద్దరు ఎప్పటికప్పుడు తమ బాస్‌కు బ్రీఫ్ చేస్తుంటారని ట్వీట్‌ చేశారు. (చదవండి: అందుకే బాబు సైలెంట్‌ అయ్యారేమో!?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top