జగ్జీవన్‌రామ్‌కు వైఎస్సార్‌ సీపీ నివాళి

YSRCP Leaders Pays Tribute To Babu Jagjivan Ram - Sakshi

సాక్షి, విజయవాడ:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ్లాల్లో బాబు జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నేతలు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కొలుసు పార్థసారధి, గౌతమ్‌ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యే రక్షణనిధి, అడపా శేషు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నివాళులు అర్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top