ఎన్నికల చిత్రాలు..
సాక్షి నెట్వర్క్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం జిల్లాలో ఊపందుకుంది. ఒకపక్క కరి పండుగ.. మరో పక్క ఆదివారం.. అయినా పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు నిద్రలేచింది మొదలు.. పొద్దుపోయే వరకు క్షణం తీరిక లేకుండా గడిపారు. వీలైనంత మందిని కలిసి తమకే ఓటు వేయాలని కోరారు. ఒక్క సారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపుతామంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అభ్యర్థుల వెంట అనుచర, బంధు గణం రావడంతో ఆయా గ్రామాల వీధులు కిటకిటలాడాయి.