ఇంగ్లండ్ నుంచి వైఎస్ జగన్ రాక నేడు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంగ్లండ్ పర్యటనను ముగించుకుని గురువారం హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్కు వస్తున్నట్లు పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. తన కుమార్తె హర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేర్చడానికి వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన ఇంగ్లండ్కు వెళ్లిన విషయం తెలిసిందే.