సివిల్‌ టాపర్‌ అనుదీప్‌కు ఎస్‌ జగన్‌ అభినందనలు

YS Jagan Mohan Reddy Congratulated To Civil Topper Durishetty Anudeep - Sakshi

సాక్షి, గన్నవరం : అఖిల భారత సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. శుక్రవారం సివిల్స్‌- 2017 ఫైనల్‌ ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటాడం ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ గర్వకారణం అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సివిల్‌ టాపర్స్‌ కూడా వైఎస్‌ జగన్‌ అభినందించారు. వారి కృషికి ఫలితం దక్కిందని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

గత సంవత్సరం జూన్‌ 18న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైన వారికి  యూపీఎస్సీ అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 వరకు సివిల్స్‌ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించింది. యూపీఎస్సీ మూడు స్టేజిల్లో సర్వీసెస్‌ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్‌, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది.   

     టాపర్లు (తెలుగు రాష్ట్రాలు)                      ర్యాంకు
  దురిశెట్టి అనుదీప్ (జగిత్యాల జిల్లా మెట్‌పల్లి)    1  
   శీలం సాయితేజ                                      43
   నారపురెడ్డి శౌర్య                                    100
   మాధురి                                              144
   వివేక్ జాన్సన్                                       195
   కృష్ణకాంత్‌ పటేల్‌                                    607
   వై అక్షయ్ కుమార్                                  624
 భార్గవ శేఖర్                                            816
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top