నేడు జగన్ రాక | ys jagan mohan reddy comes to console miriyala family members | Sakshi
Sakshi News home page

నేడు జగన్ రాక

Nov 11 2014 12:44 AM | Updated on Jul 25 2018 4:07 PM

నేడు జగన్ రాక - Sakshi

నేడు జగన్ రాక

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నగరానికి రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.

మిరియాల కుటుంబ సభ్యులను పరామర్శించనున్న వైఎస్సార్‌సీపీ అధినేత
 
పెదవాల్తేరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నగరానికి రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు విమానంలో నగరానికి వస్తారని చెప్పారు. విమానాశ్రయం నుంచి చైతన్యనగర్‌లోని కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు నివాసానికి చేరుకుంటారు. మిరియాల వెంకటరావు ఆదివారం కన్నుమూసిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శిస్తారు. సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారని అమర్‌నాథ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement