పదో రోజు పాదయాత్ర ఇలా.. | ys jagan mohan reddy 10th day padayatra schedule released | Sakshi
Sakshi News home page

పదో రోజు పాదయాత్ర ఇలా..

Nov 15 2017 7:27 PM | Updated on Jul 25 2018 4:53 PM

ys jagan mohan reddy 10th day padayatra schedule released - Sakshi

సాక్షి, కర్నూలు‌ : ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతున్న జననేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర పదో రోజు (గురువారం) షెడ్యూల్‌ విడుదలైంది. ఇందులో భాగంగా ఆళ్లగడ్డలో ఉదయం 8గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 8.30లకు పెద్ద చింతకుంట చేరుకుంటారు. అక్కడ నుంచి దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్‌ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది.

మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజనం విరామం తీసుకుంటారు. అనంతరం 3 గంటలకు కొండాపురంలో పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటలకు దొర్నపాడు మండల కేంద్రం చేరుకొని పార్టీ జెండా ఎగురవేస్తారు. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ బస చేస్తారు. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ తలశిల రఘురాం విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement