274వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Jagan 274th Day PrajasankalpaYatra Begins | Sakshi
Sakshi News home page

Sep 30 2018 9:29 AM | Updated on Sep 30 2018 10:24 AM

YS Jagan 274th Day PrajasankalpaYatra Begins - Sakshi

సాక్షి, ఎస్‌.కోట/విజయనగరం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. ఆదివారం ఉదయం జననేత 274వ రోజు పాదయాత్రను గజపతినగరం నియోజకవర్గం జామి మండలంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి బలరాంపురం, కుమరాన్‌, కోరుకొండ, చిన్నాపురం జంక్షన్‌, కొరాడపేట, చాకలిపేట, జొన్నవలస క్రాస్‌ మీదుగా నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. 

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర మొదలైంది. నైట్‌క్యాంప్‌ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.

(ఆ ఘనత రాజశేఖరరెడ్డిదే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement