స్వామివారిని దర్శించుకునే ముందు స్నానం చేయడానికి చెరువులో దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు.
ద్వారకా తిరుమల (పశ్చిమ గోదావరి) : స్వామివారిని దర్శించుకునే ముందు స్నానం చేయడానికి చెరువులో దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని మాధవానికుంట చెరువులో శనివారం చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దూళ్ల గ్రామానికి చెందిన పచ్చిపులుసు స్వామి(24) భవానీ మాల వేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి ద్వారకా తిరుమలకు వెళ్లాడు. స్నానం చేయడానికి చెరువులో దిగి మునిగిపోయాడు. ఇది గమనించిన స్థానికులు కాపాడటానికి ప్రయత్నించినా అప్పటికే మృతిచెందాడు.