చెరువులో మునిగి యువకుడు మృతి | Youth drowns in pond | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి యువకుడు మృతి

Oct 24 2015 5:33 PM | Updated on Sep 17 2018 8:02 PM

స్వామివారిని దర్శించుకునే ముందు స్నానం చేయడానికి చెరువులో దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు.

ద్వారకా తిరుమల (పశ్చిమ గోదావరి) : స్వామివారిని దర్శించుకునే ముందు స్నానం చేయడానికి చెరువులో దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని మాధవానికుంట చెరువులో శనివారం చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దూళ్ల గ్రామానికి చెందిన పచ్చిపులుసు స్వామి(24) భవానీ మాల వేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి ద్వారకా తిరుమలకు వెళ్లాడు. స్నానం చేయడానికి చెరువులో దిగి మునిగిపోయాడు. ఇది గమనించిన స్థానికులు కాపాడటానికి ప్రయత్నించినా అప్పటికే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement