ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నార్కెట్పల్లి రహదారిపై ఆదివారం ఉదయం లారీ ఢీకొని పిచ్చయ్య(18) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
అద్దంకి (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నార్కెట్పల్లి రహదారిపై ఆదివారం ఉదయం లారీ ఢీకొని పిచ్చయ్య(18) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వేములకు చెందిన పిచ్చయ్య ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.