గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండకు చెందిన యువకుడు మృతి చెందాడు.
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం మండాదిగోడు గ్రామ శివారులో సోమవారం జరిగింది.
మాచెర్ల వైపు వెళుతున్న టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న అటవీ శాఖ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనం పైన కూర్చొని ఉన్న యువకుడు మృతిచెందాడు. మృతుడు నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లికి చెందిన గాలి శ్రీహరి(22)గా గుర్తిచారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.