పోలవరం మండలం కృష్ణారావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు.
పోలవరం మండలం కృష్ణారావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. తాళ్లపూడి నుంచి పోలవరం వైపు ద్విచక్రవాహనం పై వస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. మృతిచెందిన యువకుడు సింగనపల్లి గ్రామానికి చెందిన జారేపల్లి చిన్నారావు(27)గా గుర్తించారు.