ఆస్తి తగాదాలతో మహిళ ఆత్మహత్యాయత్నం | women suicide attempt in srikakulam district | Sakshi
Sakshi News home page

ఆస్తి తగాదాలతో మహిళ ఆత్మహత్యాయత్నం

Dec 24 2015 10:49 AM | Updated on Sep 3 2017 2:31 PM

అన్నదమ్ముల ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ మహిళ కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది.

సాలూరు: అన్నదమ్ముల ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ మహిళ కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది. విజయనగరం జిల్లా సాలూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సాలూరు తెలగ వీధికి చెందిన కూనుశెట్టి రాంబాబుకు తోబుట్టువులతో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు బుధవారం కోర్టు నోటీసులు అందాయి.
 
దీనిపై బుధవారం రాత్రి అన్నదమ్ములతో వాగ్వాదం చోటు చేసుకుంది. వీటన్నిటితో మనస్తాపం చెందిన రాంబాబు భార్య వరలక్ష్మి(45) గురువారం ఉదయం ఆ వీధిలో అందరూ చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి రక్షించేందుకు ప్రయత్నించినా అప్పటికే 90 శాతం కాలిన గాయాలయ్యాయి. ఆమెను సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement