చిట్టీల పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ | Woman escapes with Rs 4 crores Chit Money in vijayawada | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ

Aug 24 2015 12:57 PM | Updated on Aug 21 2018 5:51 PM

చిత్తూరు జిల్లాలో వనజాక్షి ఘటన మరవక ముందే విజయవాడలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. చిట్టీ డబ్బులను సొంత అవసరాలకు వినియోగించుకు

విజయవాడ : చిత్తూరు జిల్లాలో వనజాక్షి ఘటన మరవక ముందే విజయవాడలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. చిట్టీ డబ్బులను సొంత అవసరాలకు వినియోగించుకుని సభ్యులకు ఎగనామం పెట్టింది. పటమటకు చెందిన రుక్మిణి అనే చిట్టీ నిర్వాహకురాలు సుమారు రూ.4 కోట్లు వసూలు చేసి, ఆనక బిచాణా ఎత్తేసింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు ...రుక్మిణి ఇంటిపై దాడి చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు.  బాధితుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement