భర్త కిడ్నీని అమ్మేసుకున్న భార్య | wife sold husband kidney for money in chirala | Sakshi
Sakshi News home page

భర్త కిడ్నీని అమ్మేసుకున్న భార్య

Feb 17 2014 8:45 AM | Updated on Sep 2 2017 3:46 AM

భర్త కిడ్నీని అమ్మేసుకున్న భార్య

భర్త కిడ్నీని అమ్మేసుకున్న భార్య

‘అప్పులపాలయ్యాను... ఆదుకోండి’ అంటూ ఓ భార్య తన భర్తను నమ్మించింది. ఆయన కిడ్నీని దళారుల సాయంతో అమ్మించింది.

 చీరాల, న్యూస్‌లైన్: ‘అప్పులపాలయ్యాను... ఆదుకోండి’ అంటూ ఓ భార్య తన భర్తను నమ్మించింది. ఆయన కిడ్నీని దళారుల సాయంతో అమ్మించింది. చివరకు భర్తను వైద్యశాలలోనే వదిలివేసి ఉడాయించింది. ఈ సంఘటన గతేడాది అక్టోబర్‌లో జరిగింది. చివరకు మోసపోయిన భర్త  ఆదివారం మీడియాను ఆశ్రయించాడు.

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన ఆంధ్రా కృపారావుకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన గౌరీదేవికి పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ఎనిమిదేళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. గౌరీదేవి ప్రవర్తన బాగాలేదంటూ భర్త దూరమయ్యాడు. పిల్లలు తల్లి దగ్గరే ఉంటున్నారు.

కొంతకాలం దూరంగా ఉన్న గౌరీదేవి భర్తకు ఫోన్ చేసి తనకు రూ. 3 లక్షల అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చాలని ప్రాధేయపడింది. నీ కిడ్నీ అమ్మితే రూ. 5లక్షలు ఇస్తారని, దానితో సమస్యల నుంచి గట్టెక్కుతామని నమ్మబలికింది. పిల్లల కోసం కృపారావు కూడా సరేనన్నాడు. దీంతో అక్టోబర్‌లో వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీ అమ్మేసుకున్నాడు. వచ్చిన రూ.5లక్షలు తీసుకుని భర్తను అక్కడే వదిలేసి గౌరీదేవి, దళారి ఉడాయించారు.
 
  చివరకు వైద్యులు బయటకు గెంటేయడంతో కృపారావు ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రమోద్‌కుమార్‌కు పదిరోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు టూటౌన్ సీఐని కలవగా మాకు సంబంధం లేదని వైజాగ్‌లోనే కేసు పెట్టాలని చెప్పడంతో ఏం చేయాలో తెలియక చివరకు మీడియాను ఆశ్రయించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement