⇒గతంలో కన్నా పెరిగిన క్రైం
⇒చోరీ అయిన సొత్తు రూ.6.41 కోట్లు
⇒రికవరీ అయింది రూ.2.7 కోట్లు
⇒అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి
తిరుపతి క్రైం : తిరుపతి అర్బన్ జిల్లాలో ఈ ఏడాది పలు సంచలన కేసులు ఛేదించామని అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్జట్టి తెలిపారు. 2014 ఏడాది మొత్తం జరిగిన వివిధ నేరాలకు సంబంధించి పోలీసులు తీసుకున్న చర్యలపై సోమవారం పోలీసు అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 14 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీయాక్ట్ నమోదు చేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టేందుకు నిత్యం అడవుల్లో కూంబింగ్ నిర్వహించామన్నారు. 2014లో 1404 మంది ఎర్రకూలీలను అరెస్టు చేశామన్నారు.
సుమారు 140 కేసుల్లో మొత్తం 65,019 కిలోల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామన్నారు. 169 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఇందులో 125 కేసులు నిరూపణ కావడంతో 76 వాహనాలను సీజ్ చేశామన్నారు. సెప్టెంబర్ 13న గాజులమండ్యం రోడ్డులో ‘సాక్షి’ ఉద్యోగిపై దాడిచేసి రూ.32,82,190 లాక్కెళ్లారని, ఆ కేసును నెల లోపే ఛేదించి 8 మందిని అదుపులోకి తీసుకుని రూ.20,14,000 రాబట్టామన్నారు.
డిసెంబర్ 12న యూనివర్సిటీ ఏఏవో భార్య సుధారాణి హత్య ఘటనలో నిందితుడు మురళీకృష్ణను 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నామన్నారు. తిరుచానూరులో చిన్నారి లక్ష్మీప్రియను కిడ్నాప్ చేసి హత్యచేసిన కేసులో నిందితుడిని కేవలం రెండుగంటల్లోనే అదుపులోకి తీసుకున్నామన్నారు. జూన్ 6వతేది బాబా పేరుతో ఎన్నో మోసాలకు పాల్పడిన శివ (అలియాస్) స్వామి, దాముకుమార్ను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.63,43,500 స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటితో పాటు పలు దొంగ తనం కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రికవరీ చేశామన్నారు.
తాగిన వారికి మత్తు వదిలించాం
తాగి వాహనాలు నడిపే వారిపై బ్రీత్ అన్లైజర్తో తనిఖీలు చేసి 61,300 కేసులు నమోదు చేశామన్నారు. దీని ద్వారా 1,40,99,660 రూపాయల అపరాధం వేశామన్నారు. 15,036 కేసులు కోర్టుకు వెళ్లగా, అపరాధ రూపంలో 47,87,600 రూపాయలను వసూలు చేశామన్నారు. 346 గ్యాంబ్లింగ్ కేసులు నమోదు చేసి 565 మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి 10,47,734 రూపాయలను సీజ్ చేశామని తెలిపారు.
2012లో 2,355 కేసులు, 2,013లో 2,475, 2014లో 3,459 కేసులు నమోదయ్యాయన్నారు. గడిచిన సంవత్సరాలతో పోల్చితే నేరాల సంఖ్య పెరిగిందన్నారు. మొత్తం ప్రాపర్టీ రూ.6,41,69,003 పోగా ఇందులో రూ.2,75,60,875 రికవరీ అయిందన్నారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీలు త్రిమూర్తులు, సుబ్బారెడ్డి, స్వామి, డీఎస్పీ కొండారెడ్డి, సీఐలు రామ్కిషోర్, రామకృష్ణ పాల్గొన్నారు.
సంచలన కేసులు ఛేదించాం
Published Tue, Dec 30 2014 3:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement