'లంచం ఇవ్వజూపి ఏపీ పరువు మంటగలిపారు' | vishweshwar reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

'లంచం ఇవ్వజూపి ఏపీ పరువు మంటగలిపారు'

Jun 17 2015 5:49 PM | Updated on Jul 28 2018 3:23 PM

'లంచం ఇవ్వజూపి ఏపీ పరువు మంటగలిపారు' - Sakshi

'లంచం ఇవ్వజూపి ఏపీ పరువు మంటగలిపారు'

ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు

అనంతపురం: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వజూపి, దానిని కప్పిపుచ్చుకునేందుకు కుట్రలకు పాల్పడున్నారని, అసలు ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రయోజనాల అంశం ఎక్కడుందని నిలదీశారు.

బాబు కుటిల చర్యలు ఏపీ పరువును మంటగలపడంతోపాటు  ప్రయోజనాలకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని విమర్శించారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని తెలుగు ప్రజల మధ్య ఉద్రక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్నా 'ఆడియో టేపుల్లో వాయిస్ నాది కాదు' అని చంద్రబాబు చెప్పలేకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement