సిబ్బంది ఒత్తిళ్లు తట్టుకోలేక నాలుగో అంతస్తు నుంచి దూకి

Vijayawada Sri Chaitanya College Inter Student Commits Suicide - Sakshi

సాక్షి, విజయవాడ: కాలేజీ సిబ్బంది ఒత్తిళ్లు భరించలేక ఓ ఇంటర్‌ విద్యార్థిని నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. నవలూరు స్వప్న అనే విద్యార్థిని గంగూరు మైత్రి క్యాంపస్‌లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో కాలేజీ సిబ్బంది ఒత్తిళ్లతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన స్వప్నను తక్షణమే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్వప్న పరిస్థితి విషమంగా ఉందని ఐసీయూలో చేర్చామని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం పట్ల కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. తనకు న్యాయం చేయాలని స్వప్న తండ్రి వెంకటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top