
విజయ పాల ధరలకు రెక్కలు
విజయ పాల ధర మళ్లీ పెరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి చొప్పున పెంచాలని కృష్ణా మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) నిర్ణయించింది.
లీటరుకు రూ.2 పెంపు
8 16 నుంచి అమల్లోకి నూతన ధర
8 ఐదు నెలల్లో రెండు సార్లు పెంపు
విజయవాడ : విజయ పాల ధర మళ్లీ పెరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి లీటరుకు రెండు రూపాయల చొప్పున పెంచాలని కృష్ణా మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) నిర్ణయించింది. 200 ఎం.ఎల్ ప్యాకెట్ మినహా అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చెప్పున పెంచారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో ఇప్పటికి ెండుసార్లు, గత రెండేళ్లలో ఐదుసార్లు విజయ డెయిరీ పాల ధరను పెంచారు. పెరిగిన ధరల వివరాలను కరపత్రాల ద్వారా కృష్ణా మిల్క్ యూనియన్ ప్రచారం చేస్తోంది. పెరిగిన ధరలు ఈ నెల 16 నుంచి అమల్లోకి వస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ బాబూరావు ‘సాక్షి’కి చెప్పారు. దీంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. పాల ధర పెంపును నిరసిస్తూ ప్రజాసంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
జిల్లా ప్రజలపై నెలకు రూ.1.50 కోట్ల భారం
విజయవాడ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా విజయ డెయిరీ ఆధ్వర్యాన 2,500 బూత్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ 2 లక్షల 50 వేల లీటర్ల పాలను విక్రయిస్తారు. ఈ లెక్కన జిల్లా ప్రజలపై రోజుకు రూ.5 లక్షలు, నెలకు కోటీ 50 లక్షల రూపాయల భారం పడనుంది. పాల ధర పెంచడం వల్ల కృష్ణా మిల్క్ యూనియన్కు ఏడాదికి రూ.18 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.
విజయ పాల అర లీటరు ప్యాకెట్ ధరలు
రకం ప్రస్తుత ధర పెరిగిన ధర
గోల్డ్ రూ.25 రూ.26
స్పెషల్ మిల్క్ రూ.24 రూ.25
ఎస్టీడీ ప్రీమియం రూ.21 రూ.22
ఎకానమీ రూ.19 రూ.20
ఆవుపాలు రూ.22 రూ.23