పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు భౌతికకాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు.
నెల్లూరు: పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు భౌతికకాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ తదితరులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మల్లి మస్తాన్ బాబు పేరు చిరస్థాయిగా నిలిచేలా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. మరోవైపు మల్లి మస్తాన్ బాబు అంతిమయాత్ర కొనసాగుతోంది. అధికార లాంఛనాలతో ప్రభుత్వం మస్తాన్ బాబు అంత్యక్రియలు నిర్వహించనుంది.