మల్లి మస్తాన్ బాబుకు ప్రముఖుల నివాళి | venkaiah naidu pays tributes malli masthan babu | Sakshi
Sakshi News home page

మల్లి మస్తాన్ బాబుకు ప్రముఖుల నివాళి

Apr 25 2015 8:38 AM | Updated on Sep 3 2017 12:52 AM

పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు భౌతికకాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు.

నెల్లూరు: పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు భౌతికకాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ తదితరులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మల్లి మస్తాన్ బాబు పేరు చిరస్థాయిగా నిలిచేలా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.  మరోవైపు మల్లి మస్తాన్ బాబు అంతిమయాత్ర కొనసాగుతోంది. అధికార లాంఛనాలతో ప్రభుత్వం మస్తాన్ బాబు అంత్యక్రియలు నిర్వహించనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement