‘కృష్ణ చైతన్య మృతదేహాన్ని భారత్‌కు తీసుకొస్తాం’

Vanga Geetha: Krishna Chaitanya Dead Body Will Brought To India - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడకు చెందిన కృష్ణ చైతన్య స్వీడన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. నాలుగు రోజుల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. కరోనా ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయడంతో కృష్ణ చైతన్య మృతదేహం స్వీడన్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. శ్రీరామ్‌ నగర్లో నివాసం ఉంటున్న కృష్ణ చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీ విజయసాయి రెడ్డి సహకారంలో విదేశాంగ మంత్రి, భారత ఎంబసీతో మాట్లాడి కృష్ణ చైతన్య మృతదేహాన్ని భారత్‌కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని వంగా గీతా భరోసానిచ్చారు. (జనతా కర్ఫ్యూకు యంగ్‌ టైగర్‌ సైతం.. )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top