కారు ఆటో ఢీ.. ఇద్దరు మృతి | Two killed in car auto collided | Sakshi
Sakshi News home page

కారు ఆటో ఢీ.. ఇద్దరు మృతి

Sep 22 2015 1:32 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గిరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గిరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా నక్కపల్లి మండలం గుడిచర్ల వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. తుని నుంచి విశాఖ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దాడి జనార్థన్(38) మృతిచెందాడు. అతనితో పాటు వెంపాడు గ్రామానికి చెందిన మరో వ్యక్తి కూడా మృతిచెందాడు. ఆటో వెనక కూర్చొని ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement