శ్రీవారి భక్తులకు తీపి కబురు | TTD Announced Vikunta Dharsanam To Devotees In Tirupati | Sakshi
Sakshi News home page

శ్రీవారి భక్తులకు తీపి కబురు

Nov 27 2019 11:37 AM | Updated on Nov 27 2019 12:42 PM

TTD Announced Vikunta Dharsanam To Devotees In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి : శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. వైకుంఠ ద్వారాలను 10 రోజుల పాటు తెరిచి ఉంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) భావిస్తుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే సిద్దం చేసింది. ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తులను ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వారం గుండా అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో ద్వారాలను తెరవాలని టీటీడీ భావిస్తోంది. ఈ సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా భక్తులను అనుమతించేందుకు ఆగమ సలహా మండలి అంగీకరించింది. ఒకవేళ పాలకమండలి ఆమోదం పొందితే ఈ ఏడాది నుంచే నూతన విధానం అమల్లోకి రానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement