ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మృతి | Tractor crash to child death | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మృతి

Aug 24 2013 2:46 AM | Updated on Sep 29 2018 5:26 PM

టాక్టర్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొన్నాడు. శుక్రవారం మండలంలోని కొండాపూర్‌లో డ్రైవర్ సతీశ్ ట్రాక్టర్‌ను వేగంగా నడిపి గ్రామానికి చెందిన గంట సంధ్య(5)ను ఢీకొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది.

 చిగురుమామిడి, న్యూస్‌లైన్ : టాక్టర్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొన్నాడు. శుక్రవారం మండలంలోని కొండాపూర్‌లో  డ్రైవర్ సతీశ్ ట్రాక్టర్‌ను వేగంగా నడిపి గ్రామానికి చెందిన గంట సంధ్య(5)ను ఢీకొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. గంగిరెద్దులకాలనీలో ఆ చిన్నారి సాయంత్రం తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ట్రాక్టర్‌లో పెళ్లి బృందాన్ని అక్కడ దించిన సతీశ్ తిరిగి గ్రామానికి వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఆడుకుంటున్న సంధ్యను ఢీకొట్టాడు. ఆమె తల పగిలి అక్కడికక్కడే మరణింది. దీంతో పాప తల్లిదండ్రులు సమ్మవ్వ, వెంకటేశ్ వచ్చి చిన్నారి మృతదేహంపై పడి రోదించారు. డ్రైవర్ పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ దేవారెడ్డి తెలిపారు.
 
 ట్రాక్టర్‌పై నుంచి పడి...
 జగిత్యాల రూరల్ : ట్రాక్టర్‌పై నుంచి పడి ఓ వలస కూలీ దుర్మరణం చెందాడు. శుక్రవారం మండలంలోని మోరపల్లిలో మధ్యప్రదేశ్‌కు చెందిన దేవత్‌ఖాన్(30) ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌పై నుంచి కింద పడి మృతిచెందాడు. ఆరు నెలల క్రితం ఆయన  మోరపల్లికి వచ్చి ఇటుక బట్టీల్లో పనికి కుదిరాడు. పొద్దంతా పని చేయగా వచ్చే డబ్బులతో పొట్టపోసుకుంటున్నాడు. ఉదయమే ట్రాక్టర్‌లో ఇటుక నింపి గ్రామానికి తీసుకువస్తున్నాడు. మూల మలుపు వద్ద ట్రాక్టర్ వేగంగా తిరగడంతో డ్రైవర్ పక్కనే కూర్చున్న దేవత్‌ఖాన్ అదుపు తప్పి కింపడిపోయాడు. దీంతో ఆయనపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను స్థానికులు జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సరిలాల్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement