నేడు వరద ప్రాంతాల్లో వైఎస్ విజయమ్మ పర్యటన | Today YS Vijayamma visits flood affected areas | Sakshi
Sakshi News home page

నేడు వరద ప్రాంతాల్లో వైఎస్ విజయమ్మ పర్యటన

Oct 27 2013 10:43 AM | Updated on Aug 1 2018 3:55 PM

నేడు వరద ప్రాంతాల్లో వైఎస్ విజయమ్మ పర్యటన - Sakshi

నేడు వరద ప్రాంతాల్లో వైఎస్ విజయమ్మ పర్యటన

రాష్ట్రంలో భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు.

గత ఆరురోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది. దాంతో వివిధ జిల్లాలలో వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేటి నుంచి మూడు రోజుల పాటు కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ క్రమంలో ఆదివారం వైఎస్ విజయమ్మ కృష్ణా జిల్లాలో వర్షాలు, వరదలకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు.

 

వరద బాధితులతో ఆమె స్వయంగా మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. 28 వ తేదీన  పశ్చిమ గోదావరి, 29వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలలో వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. అయితే వరద బాధితులకు అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినప్పటికి, హైదరాబాద్ నగరం విడిచి వెళ్లరాదని కోర్టు షరతులు విధించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటించలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం ఆదివారం హైదరాబాద్లో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement