ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Oct 29th European lawmakers visit Kashmir | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Oct 29 2019 8:30 PM | Updated on Oct 29 2019 8:48 PM

Today Telugu News Oct 29th European lawmakers visit Kashmir - Sakshi

ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్ బుధవారం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం  అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్టీఐ కమిషనర్‌గా పనిచేసిన కె .సుధాకర్‌రావు మందమర్రి కన్నుమూశారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారంతో 25వ రోజుకు చేరుకుంది. ఐరోపా సమాఖ్యకు చెందిన 27 మంది పార్లమెంట్​సభ్యుల బృందం మంగళవారం కశ్మీర్‌లో పర్యటించింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియోను క్లిక్‌ చేయండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement