బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

Published Thu, Sep 21 2017 1:57 PM

Tight security arrangements at Tirumala Brahmotsavams

తిరుమల: శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు 2,700 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి తెలిపారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. గరుడసేవకు అదనంగా మరో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నాం. వేడుకల్లో తప్పిపోయిన వారి కోసం ట్యాగింగ్‌ సిస్టమ్‌, దొంగలకు చెక్‌ పెట్టేందుకు పిన్స్‌ సిస్టమ్‌లను వాడునున్నాం. వేడుకలను కంట్రోల్‌ రూం నుంచి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తాం. గరుడ సేవనాడు ఘాట్‌ రోడ్డులో ద్విచక్రవాహనాలను అనుమతించమని ఎస్పీ తెలిపారు. 
 

Advertisement
Advertisement