మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు భూమిపూజ | Three prestigious educational instotutions bhumipuja | Sakshi
Sakshi News home page

మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు భూమిపూజ

Mar 28 2015 5:48 PM | Updated on Jul 11 2019 5:24 PM

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మెర్లపాకలో మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు భూమిపూజ చేశారు.

హైదరాబాద్: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మెర్లపాకలో మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, స్మృతి ఇరానీ హాజరయ్యారు.

 

అక్కడ ఐఐటీ, ఐఐఎస్ఆర్, ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలకు భూమిపూజ చేశారు. ఏప్రిల్లో అనంతపురంలో సెంట్రల్ వర్సిటీకి శంకుస్థాపన చేస్తామని స్మృతి ఇరానీ ఈ సందర్భంగా తెలిపారు.  ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, వెనకబడిన జిల్లాలకు పన్నురాయితీ కల్పిస్తామని వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement