ఏటీఎం ధ్వంసం చేసిన దుండగులు | Sakshi
Sakshi News home page

ఏటీఎం ధ్వంసం చేసిన దుండగులు

Published Thu, Aug 13 2015 7:11 AM

thieves attack the atm machine in tadipatri

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మండల కేంద్రంలో ఓ ఏటీఎం కేంద్రాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని యల్లనూరు రోడ్డులో గల ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు రెండు మిషన్‌లు పూర్తిగా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే దుండగులు ఎంత నగదును ఎత్తుకెళ్లారనేది ఇంకా తెలియరాలేదు.

Advertisement
Advertisement