మలి విడత కౌన్సెలింగ్‌పై.. ‘సుప్రీం’కు విద్యార్థులు అనుమతించాలని కోరుతూ | The next installment of the counseling | Sakshi
Sakshi News home page

మలి విడత కౌన్సెలింగ్‌పై.. ‘సుప్రీం’కు విద్యార్థులు అనుమతించాలని కోరుతూ

Sep 15 2014 12:05 AM | Updated on Sep 2 2017 1:22 PM

మలి విడత కౌన్సెలింగ్‌పై.. ‘సుప్రీం’కు విద్యార్థులు  అనుమతించాలని కోరుతూ

మలి విడత కౌన్సెలింగ్‌పై.. ‘సుప్రీం’కు విద్యార్థులు అనుమతించాలని కోరుతూ

ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి మలివిడత కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఎంసెట్‌

నేడు పిటిషన్ దాఖలు

హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి మలివిడత కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఎంసెట్‌లో ర్యాంకులు సాధించి న విద్యార్థులు, కొన్ని కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ మేరకు వారు వేర్వేరుగా సోమవారం సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేయనున్నారు. మలివిడత కౌన్సెలింగ్‌కు అనుమతించి తమను ఆదుకోవాలని వారు కోర్టుకు విన్నవించాలని నిర్ణయించారు.

కాగా, ఇదే విషయమై ఏపీ ఉన్నత విద్యామండలి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీం ఆదే శాలతో తాము నష్టపోతామని చెబుతున్న వేలాది మంది విద్యార్థులు తిరిగి అదే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. అదేవిధంగా మలి విడత కౌన్సెలింగ్ జరగని పక్షంలో తమ కళాశాలలను మూసివేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటూ కొన్ని కళాశాలల యాజమాన్యాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement