► రాస్తారోకోకు దిగిన గ్రామస్తులు
► 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలి
► లేకుంటే ఆమరణ దీక్ష ఎమ్మెల్యే గోపిరెడ్డి
నరసరావుపేట రూరల్ : ఉప్పలపాడు ప్రధాన సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో విగ్రహం చేయి పూర్తిగా విరిగిపోగా, ముఖంపై పగులగొట్టేందుకు ప్రయత్నించిన గుర్తులు కనిపించాయి. తెల్లవారుజామున గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించారు. పార్టీ మండల నాయకులు, వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దెబ్బతిన్న విగ్రహాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో కలసి ఆయన వినుకొండ-గుంటూరు రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గంటపాటు జరిగిన రాస్తారోకోతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
రూరల్ ఎస్సై సురేంద్రబాబు రాస్తారోకో వద్దకు చేరుకుని ఎమ్మెల్యేతో చర్చించారు. గతంలో ఒకసారి విగ్రహంపై దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు నిందితులను పోలీసులు గుర్తించలేదన్నారు. తాజా ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో నిందితులను గుర్తించకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామస్తులు వచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై వివరించారు. పోలీసుల హామీతో ఎమ్మెల్యే గోపిరెడ్డి రాస్తారోకోను విరమించారు.
దమ్ముంటే పగలు వచ్చి విగ్రహం మీద చేయి వేయండి
వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికిపంద చర్యని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ధైర్యం ఉంటే పగటి పూట విగ్రహం మీద చేయి వేయాలని సవాల్ విసిరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్న గ్రామంలో రెచ్చగొట్టేందుకే ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు కొమ్మనబొయిన శంకర్యాదవ్, పిల్లి ఒబుల్రెడ్డి, వల్లెపు నాగేశ్వరరావు, గాబ్రియెల్, గోగుల మనోహర్, చల్లా నారాపరెడ్డి, శివయ్య, నంద్యాల సత్యనారాయణరెడ్డి, శనివారపు బ్రహ్మారెడ్డి, కాసా ఆంజనేయులు, మూరే రవింద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉప్పలపాడులో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
Published Fri, Jun 24 2016 11:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement