ఆథోని మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదస్థితిలో ఓ బాలుడు రైలు కిందపడి మృతిచెందాడు.
ఆథోని మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదస్థితిలో ఓ బాలుడు రైలు కిందపడి మృతిచెందాడు. మృతుడు ఆథోని మండలం ఇస్వి గ్రామానికి చెందిన రాఘవరెడ్డి(14)గా గుర్తించారు. మూడు రోజుల క్రితం ఇంట్లో అదృశ్యమైన బాలుడు రైల్వే ట్రాక్పై శవమై కనిపించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.