తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత మంత్రులతో భేటీ కానుంది.
హైదరాబాద్ : తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత మంత్రులతో భేటీ కానుంది. మినిస్టర్స్ క్వార్టర్స్లో ఈ సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిణమాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో గ్రామస్థాయి నుంచి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులు, పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.